ప్రశాంతంగా రుకూ చేయటం తప్పనిసరి (వాజిబ్‌)

బిస్మిల్లాహ్

రుకూ

ఖుర్‌ఆన్‌ పఠనం పూర్తయిన తర్వాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కాసేపు అలాగే మౌనంగా [303] నిలబడి ఉండేవారు. ఆ తర్వాత ఇంతకు ముందు ‘తక్బీరే తహ్రీమా’ అంశం క్రింద వివరించినట్టుగా చేతులు పైకెత్తేవారు (రఫయదైన్‌ చేసేవారు).[304] తదుపరి “అల్లాహు అక్బర్” [305] అంటూ రుకూలోకి వెళ్ళిపోయేవారు. [306]

నమాజ్‌ను సరిగా నెరవేర్చని వ్యక్తి“కి ఈ రెండు విషయాల గురించి ఆజ్ఞాపిస్తూ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు:

“నమాజ్‌ చేసే వ్యక్తి ఎవరయినా ముందుగా అల్లాహ్‌ ఆదేశించినదాని ప్రకారం చక్కగా వుజూ చేసుకోవాలి. తర్వాత “అల్లాహు అక్బర్” అని చెబుతూ అల్లాహ్‌ను స్తుతించాలి, ఆయన పవిత్రతను కొనియాడాలి. ఆ తర్వాత ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ తనకు నేర్పించిన దానిలో, తనకు అనుమతి ప్రసాదించిన దానిలో తనకు వీలు కలిగినంత పఠనం చేయాలి. ఆ తర్వాత “అల్లాహు అక్బర్‌” అంటూ రుకూ చేయాలి. దేహంలోని కీళ్ళన్నీ వాటి వాటి స్థానాల్లో కుదుటపడి, ప్రశాంతతను పొందే విధంగా రుకూలో రెండు చెతుల్ని మోకాళ్ల చిప్పలపై ఉంచాలి. ….(సశేషం) ఈ విధంగా చేయని వారెవరైనా, వారి నమాజు సంపూర్ణమైనదిగా భావించబడజాలదు.”” [307]

రుకూ చేసే పద్దతి

“రుకూ స్థితిలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన అరచేతుల్నిమోకాళ్ల మీద ఉంచేవారు”,[308] “అలా చేయమని ఆయన ప్రజలకు సయితం ఆదేశించేవారు”.[309] ఈ విధంగా చేయమని ఆయన “నమాజ్‌ సరిగా నెరవేర్చని వ్యక్తి“కి కూడా ఆజ్ఞాపించి ఉన్నారు. కొన్ని వాక్యాల క్రితమే ఈ విషయం గడిచింది.

“రుకూలో ఆయన తన రెండు చేతులతో మోకాళ్లను పట్టుకొని ఉన్నట్లుగా వాటిని గట్టిగా అదిమి ఉంచేవారు”[310] “ఆ సమయంలో చేతివేళ్లను విశాలంగా ఉంచుతారు”. [311] “నమాజ్‌ను సరిగా నెరవేర్చని వ్యక్తి”కి ఇలా చేయమని ఆజ్ఞాపిస్తూ ఆయన “రుకూ చేసినప్పుడు నీ అరిచేతుల్ని మోకాళ్ల మీద పెట్టుకో. చేతివ్రేళ్లను వదులుగానూ, విశాలంగానూ ఉంచు. ప్రతి అవయవం తన స్థానంలోకి వెళ్ళిపోయే వరకు అదే స్థితిలో ఉండు” అని పురమాయించారు.[312] రుకూ స్థితిలో ఆయన తన మోచేతుల్ని ప్రక్కలకు ఎడంగా ఉంచేవారు.[313] రుకూలో వీపును విశాలంగా,[314] నీళ్లు పోసినా అటూ ఇటూ జారిపోనంత తిన్నగా ఉంచేవారు.[315]

“రుకూ స్థితిలో నీ అరచేతుల్ని మోకాళ్ళ మీద పెట్టుకో. వీపును పొడుగ్గా ఉంచు. రుకూ స్థితికి బలాన్నివ్వు” అని ఆయన “నమాజును సరిగా నెరవేర్చని వ్యక్తి“కి సూచించారు.[316] రుకూలో తలను ఆయన వంచిగాని, పైకెత్తిగాని ఉంచేవారు కాదు.[317] పైగా ఆయన (రుకూ స్థితిలో) తన తలను వీపుకు సమాంతరంగా ఉంచేవారు. [318]

ప్రశాంతంగా రుకూ చేయటం తప్పనిసరి (వాజిబ్‌)

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఎంతో ప్రశాంతంగా రుకూ చేసేవారు. అలా చేయమని ఆయన “నమాజును సరిగా నెరవేర్చని వ్యక్తి“కి కూడా ఆదేశించి ఉన్నారు. గత అంశం ప్రారంభంలో దీని ప్రస్తావన వచ్చింది.

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అంటుండేవారు: “మీరు రుకూ మరియు సజ్దాలు బాగా చేయండి. ఎవరి చేతిలో నా ప్రాణముందో ఆయన సాక్షిగా చెబుతున్నాను. మీరు రుకూ చేసినప్పుడు, సజ్దా చేసినప్పుడు నేను మిమ్మల్ని నా వెనుక వైపు నుంచి చూస్తూ ఉంటాను.” [319]

ఒకతను నమాజు చేస్తున్నాడు. కాని అతను రుకూ సరిగా చేయటం లేదు. సజ్దా కూడా చాలా తొందరతొందరగా చేస్తున్నాడు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అతన్ని చూసి, “ఒకవేళ ఇతనికి ఇదే స్థితిలో మరణం గనక వస్తే ఇతను ముహమ్మద్‌ ప్రవక్త ధర్మంపై మరణించినట్లు కాదు. (కాకి నెత్తురులో ముక్కు పొడిచినట్లు ఇతను చాలా వేగంగా నమాజ్‌ చేస్తున్నాడు). రుకూ సరిగ్గా నెరవేర్చకుండా సజ్దాలు కూడా సుడిగాలిలా చేసే వ్యక్తి బాగా ఆకలితో ఉండి, ఒకటి రెండు ఖర్జూర పండ్లు తిన్నప్పటికీ ఆకలి చల్లారని మనిషిలాంటివాడు” అని చెప్పారు. [320]

తన ముక్కును నేలకేసి పొడిచే కోడి లాగా నమాజులో తొందర చేయవద్దని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తనకు ఉపదేశించారనీ, నమాజులో నక్క లాగా కుడి ఎడమలు దిక్కులు చూడవద్దని తనను ఆదేశించారని, కోతి లాగా పిరుదుల్ని చేతులను నేలకు ఆనించి పెట్టి, పిక్కలను, తొడలను నిలబెట్టి కూర్చో రాదని కూడా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తనకు ఆదేశించారని అబూ హురైరా (రజిఅల్లాహు అన్హు)  తెలియజేశారు. [321]

“నమాజు నుండి దొంగిలించేవాడు అందరిలోకెల్లా చెడ్డ దొంగ” అని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అన్నారు. ఈ మాట విని ఆయన సహచరులు (ఆశ్చర్య పోయారు). “దైవవక్తా! అసలు ఎవరైనా నమాజులో నుండి ఎలా దొంగిలిస్తారు?” అని అడిగారు. దాని కాయన “అంటే అతను రుకూ, సజ్దాలు పూర్తిగా నెరవేర్చడు” అంటూ తన మాటకు అర్ధం చెప్పారు. [322]

ఒకతను నమాజు చేస్తూ రుకూ, సజ్దాల్లో వీపుని తిన్నగా ఉంచటం లేదు (దగ్గర్లో) నమాజు చేస్తున్న దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన క్రీగంట చూపులతో అతన్ని గమనించారు. నమాజు పూర్తయిన తర్వాత ఆయన అందర్ని ఉద్దేశించి “ముస్లింలారా! రుకూ, సజ్దాల్లో తమ వీపుల్ని తిన్నగా ఉంచని వారి నమాజు నెరవేరదు” అని హెచ్చరించారు. [323]

మరో హదీసు ప్రకారం ఆయన “రుకూ, సజ్దాల్లో వీపుని తిన్నగా ఉంచి చేయబడని నమాజు సరిపోదు” అని అన్నారు. [324]

 

హదీసు రెఫరెన్సులు:

[303]. అబూదావూద్‌, హాకిమ్‌ దీనిని సహీగా ఖరారు చేశారు, జహబీ దీనితో ఏకీభవించారు. ఈ మౌనం కేవలం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రశాంతంగా శ్వాస తీసుకోగలిగినంత పరిమాణంలో వుండేదని ఇబ్నె ఖయ్యూం (రహిమహుల్లాహ్‌) అభిప్రాయ పడ్డారు.

[304,305,306]. బుఖారీ, ముస్లిం.

ఈ రఫయదైన్‌ మరియు దీనితోపాటు రుకూ నుండి లేచేటప్పుడు చేసే రఫయదైన్‌ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ద్వారా ఎన్నో పరంపరలతో నిరూపించబడి ఉంది. ముగ్గురు ఇమాములు, ఎంతో మంది హదీసువేత్తలు. ధార్మికజ్ఞానుల అభిమతం కూడా ఇదే. తారీఖ్‌ ఇబ్నె అసాకిర్‌ (15/78/2) నందు ఇమామ్‌ మాలిక్‌ జీవితాంతం దీనిపై ఆచరించారని వుంది. కొందరు హనఫీ ఉలమాలు కూడా దీనిని యిష్టపడ్డారు. వీరిలో ఇమామ్‌ అబూ యూసుఫ్‌ శిష్యులు ఇసామ్‌ బిన్‌ యూసుఫ్‌ ఖల్‌బీ (మరణం 210 హి.) కూడా ఒకరు. ఆయన గురించి యిది వరకే వివరించబడింది.

అబ్బుల్లా ఇబ్నె అహ్మద్‌ తన ‘మసాయల్’  – 60వ పేజీలో తన తండ్రి ద్వారా యిలా ఉల్లేఖించారు: ఉఖ్బా బిన్‌ ఆమిర్‌ (రజి అల్లాహు అన్హు) ద్వారా నమాజులో రఫయదైన్‌ గురించి యిలా ఉల్లేఖించబడింది: ఒక్కో రఫయదైన్‌కు బదులుగా పదిపుణ్యాలు దొరుకుతాయి.

నేను చెప్పేదేమిటంటే – ఉఖ్బా బీన్‌ ఆమిర్‌ మాట – బుఖారీ, ముస్లింలోని ఎవరైనా ఏదైనా సత్మార్యం చేయాలని సంకల్పించుకొని, తదుపరి దానిని పూర్తి చేస్తే దానికి బదులుగా అతనికి 10 నుంది 700 పుణ్యాలు దొరుకుతాయి అన్న హదీసుకు అనుగుణంగా వుంది. మరిన్ని వివరాల కోసం ‘సహీ అత్తర్‌గీబ్‌- 16వ పేజీ చూడగలరు.

[307]. అబూదావూద్‌,నసాయి. హాకిమ్‌ దీనిని సహీగా ఖరారు చేశారు మరియు జహబీ దీనితో ఏకీభవించారు.

[308]. బుఖారీ, అబూదావూద్‌.

[309]. బుఖారీ, ముస్లిం.

[310]. బుఖారీ, అబూ దావూద్‌.

[311]. హాకిమ్‌ దీనిని సహీగా ఖరారు చేశారు, జహబీ కూడా దీనితో ఏకీభవించారు. అబూదావూద్‌, తయాలిసీ కూడా దీనిని ఉల్లేఖించారు. దీని తఖ్రీజ్‌ – సహీ అబూదావూద్‌: 809 నందు చేయబడింది.

[312]. సహీ ఇబ్నె ఖుజైమా, సహీ ఇబ్నె హిబ్బాన్‌.

[313]. తిర్మిజి, ఇబ్నె ఖుజైమా దీనిని సహీగా ఖరారు చేశారు.

[314]. బైహఖీ – సహీ బుఖారీ పరంపరతో.

[315]. తబ్రానీ – మోజమిల్‌ కబీర్‌ వ సగీర్‌, జవాయెద్‌ ముస్నద్‌ అబ్దుల్లా  బిన్‌ అహ్మద్‌,ఇబ్నెమాజా.

[316]. అహ్మద్‌, అబూదావూద్‌ – సహీ పరంపరతో.

[317]. అబూదావూద్‌, బుఖారీ – జుజ్‌ అల్‌ ఖీరా ఖలఫుల్‌ ఇమామ్‌ – సహీ పరంపరతో

[318]. ముస్లిం, అబూ ఆవాన

[319]. బుఖారీ, ముస్లిం. నేను చెప్పదేమిటంటే – ఇలా చూడగలగడం ఒక వాస్తవం. యిది ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) అద్భుతాలలో ఒకటి. అయితే ఇది నమాజు కొరకే ప్రత్యేకం. ఇతర సందర్భాలలో దీనికి సంబంధించిన ఆధారమేదీ లేదు.

[320]. మున్నద్‌ అబూ యాలా (340, 349/1), ఆజూరీ- అర్బయీన్‌, బైహఖీ,  తబ్రానీ (1/192/1), జియా – అల్‌ మున్తఖా (276/1), ఇబ్నె అసాకిర్‌ (2/226/2, 414/1, 8/14/1,76/2) – హసన్‌ పరంపరతో. ఇబ్నె ఖుజైమా దీనిని సహీగా ఖరారు చేశారు (1/82/1). ఇబ్నె బత్తా, మొదటి భాగంలోని అదనపు పదజాలం లేకుందా దీనిని బలపర్చే ఒక ముర్సల్‌ హదీసును “అల్‌ ఇబానా” (5/43/1) నందు ఉల్లేఖించారు.

[321]. తయాలిసీ, అహ్మద్‌, ఇబ్నె అబీషైబా. ఇది హసన్‌ హదీసు. ఈ విషయం నేను హాఫిజ్‌ అబ్దుల్  హఖ్‌ ఇష్‌బిలీ – అల్‌ అహ్‌కామ్‌ – హదీసు నెం. 1348 పాద సూచికలో వివరించాను.

[322]. ఇబ్నె అబీ షైబా (1/89/2), తబ్రానీ, హాకిమ్‌ దీనిని సహీగా ఖరారు చేశారు, జహబీ కూడా దీనితో ఏకీభవించారు.


ఇది దైవ ప్రవక్త నమాజు స్వరూపం – షేఖ్ అల్ అల్బానీ (రహిమహుల్లా) (పుస్తకం) నుండి తీసుకో బడింది. (150-154 పేజీలు)

ఇతర లింకులు: 

మీరు సుత్రా (తెర/అడ్డు) లేకుండా నమాజ్‌ చేయకండి

బిస్మిల్లాహ్

సుత్రా మరియు, దాన్ని పాటించటం విధి అన్న విషయం గురించి

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సుత్రాకు ఎంత దగ్గరగా నిలబడే వారంటే ఆయనకు-గోడ (సుత్రా)కు మధ్య మూడు చేతుల దూరం మాత్రమే ఉందేది.[38] ఆయన సజ్దా చేసే చోటికి – గోడ (సుత్రా)కు మధ్య ఒక మేక దూరి పోయేంత స్థలం మాత్రం ఉందేది. [39]

ఆయన ఇలా ప్రబోధించేవారు: “మీరు సుత్రా లేకుండా నమాజ్‌ చేయకండి.”

“మీ ముందు నుంచి ఎవర్నీ నడచి వెళ్ళనివ్వకండి. ఒకవేళ అతను అందుకు ఒప్పుకోక పోతే అతనితో తలపడండి. ఎందుకంటే అతనితోపాటు షైతాన్‌ ఉంటాడు.” [40]

ఆయన ఇంకా ఇలా అంటుండేవారు: “మీలో ఎవరైనా (ఎదుట) సుత్రా పెట్టుకుని నమాజ్‌ చేస్తున్నట్లయితే అతను దానికి దగ్గరగా ఉండాలి. షైతాన్‌ తన నమాజును చెడగొట్టకుండా ఉండాలంటే అతను అలా చెయ్యాలి మరి!”[41]

కొన్ని సార్లు ఆయన తన మస్జిద్ లోని  స్తంభం దగ్గర నమాజ్‌ చేయటానికి ప్రయత్నించేవారు. [42]

అడ్డు (సుత్రా)గా ఏ వస్తువూ లేనటవంటి విశాల మైదానంలో నమాజ్‌ చేయాలనుకున్నప్పుడల్లా ఆయన తన ఎదుట ఒక బరిసెను పాతుకునేవారు. దాని వైపు తిరిగి నమాజ్‌ చేసేవారు. ఆయన వెనుక జనం బారులు తీరేవారు. [43] అప్పుడప్పుడూ తన ఆడ ఒంటెను ఎదుట అడ్డంగా నిలబెట్టి దాని వైపు తిరిగి నమాజ్‌ చేసేవారు.[44] ఈ విధంగా నమాజ్‌ చేయటం అనేది ఒంటెల కొట్టంలో నమాజ్‌ చేయటం వంటిది కాదు. ఎందుకంటే ఆయన అసలు “ఆ ప్రదేశంలో నమాజ్‌ చేయటాన్నే వారించారు.”[45] కొన్నిసార్లు ఆయన ఒంటె అంబారీ నిటారుగా నిలబెట్టి దాని వెనుక భాగాన్ని అడ్డంగా ఉంచి నమాజ్‌ చేసేవారు [46] మరియు ఇలా అంటుండేవారు;

“మీలో ఎవరైనా తన ఎదుట ఒంటె అంబారీ వెనుక భాగపు కర్ర వంటిది ఏదయినా పెట్టుకొని నమాజ్‌ చేస్తున్నట్లయితే ఆ కర్రకు ఆవల నుంచి ఏ వస్తువు నడిచి వెళ్ళనా ఇక దాన్ని అతను పట్టించుకోవాల్సిన అవసరం లేదు” [48]

ఒకసారి ఆయన ఒక చెట్టు వైపు తిరిగి నమాజ్‌ చేశారు. (అంటే ఆ చెట్టుని సుత్రాగా పెట్టుకొని నమాజ్‌ చేశారు). [49] కొన్నిసార్లు ఆయన మంచానికి ఎదురుగా నిలబడి నమాజ్‌ చేసేవారు. ఆ సమయంలో ఆయేషా (రజిఅల్లాహు అన్హ) మంచం మీద తన దుప్పట్లో పడుకొని ఉండేవారు. [50]

తనకూ – తన సుత్రాకు మధ్య నుంచి ఏ వస్తువునీ వెళ్ళనిచ్ఛేవారు కాదు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం). ఒకసారి ఏమయిందంటే, ఆయన నమాజ్‌ చేస్తున్నారు. అప్పుడే ఒక మేక పరుగెత్తుకుంటూ వచ్చి ఆయన ముందు నుంచి వెళ్ళబోయింది. కాని ఆయన కూడా తొందరగా ముందుకుపోయి [51] ఉదరభాగంతో గోడకు ఆనుకున్నారు. దాంతో ఆ మేక పిల్ల ఆయన వెనుక నుంచి దాటి వెళ్ళిపోయింది. [52]

ఒకసారి ఆయన ఫర్జ్ నమాజ్‌ చేస్తున్నారు. (నమాజ్‌లోనే) పిడికిలి బిగించారు. నమాజ్‌ ముగిసిన తర్వాత ప్రజలు “దైవప్రవక్తా! నమాజులో ఏదైనా కొత్త విషయం జరిగిందా?” అని అడిగారు. అందుకాయన “కొత్త విషయం ఏమీ లేదుగాని షైతాన్‌ నా ముందు నుంచి దాటి వెళ్ళబోయాడు. దాంతో నేను వాడి గొంతు పిసికాను. అప్పుడు నా చేతికి వాడి నాలుక చల్లదనం కూడా తగిలింది. దైవంసాక్షి నా సోదరుడు సులైమాన్‌ నా కంటే ముందు ప్రార్ధన చేసి ఉండకపోతే ఆ పైతాను మస్జిద్ లోని ఏదో ఒక స్తంభానికి కట్టబడి ఉండేవాడు. మదీనా నగర పిల్లలు సయితం వాణ్ని చూసుండేవారు. (కనుక నేను చెప్పేది ఏమంటే) తనకూ-ఖిబ్లాకు మధ్య నుంచి ఎవర్నీ వెళ్ళకుండా ఆపగలిగే వీలున్నవాడు తప్పకుండా అలా చేయాలి. ” [53]

ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా చెబుతుండేవారు: “మీలో ఎవరైనా ఏదైనా వస్తువును అడ్డుగా పెట్టుకొని నమాజ్‌ చేస్తున్నప్పటికీ ఇంకెవరైనా అతని ముందు నుంచి వెళ్ళగోరితే వాణ్ణి గొంతుపట్టుకొని వెనక్కి నెట్టాలి. వీలైనంత వరకు వాణ్ణి ఆపటానికి ప్రయత్నం చేయాలి. (మరో ఉల్లేఖనంలో రెండోసారి కూడా వాణ్ణి ఆపాలి అని ఉంది. ) అప్పటికి వాడు వినకపోతే ఇక వాడితో తలపడాలి. ఎందుకంటే వాడు షైతాను” [54]

ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇంకా ఇలా అంటుండేవారు: “నమాజు చేస్తున్న వ్యక్తి ముందు నుంచి వెళ్ళటం ఎంత పాపమో తెలిస్తే ఆ వ్యక్తి నమాజ్‌ చేస్తున్న వాని ముందు నుంచి వెళ్లటం కంటే నలభై వరకు అక్కడే ఎదురుచూస్తూ ఉండిపోవటం తన కొరకు శ్రేయస్కరం అనుకుంటాడు.” (హదీసు ఉల్లేఖకులు అబూ నద్ర్‌ కథనం: నలభై అంటే దైవప్రవక్త రోజులు, నెలలు, సంవత్సరాలలో దేనిని సెలవిచ్చారో నాకు గుర్తులేదు. – అనువాదకులు) [55]

హదీసు రిఫరెన్సులు & అల్బానీ వ్యాఖ్యలు :

[38] బుఖారీ, అహ్మద్‌

[39] బుఖారీ, ముస్లిం

[40] సహీ ఇబ్నె ఖుజైమా (1/93/1) – మంచి పరంపరతో.

[41] అబూదావూద్‌, జవాయెద్‌ బజ్జార్‌ – 54 పేజీ, హాకిమ్‌ – తను దీనిని సహీగా ఖరారు చేశారు. జహబీ, నవవీ దీనితో ఏకీభవించారు.

[42] నేను చెప్పేదేమిటంటే – ఇమామ్‌ అయినా, ఒంటరిగా నమాజ్‌ చేసే వ్యక్తి అయినా, ఒకవేళ మస్జిద్ పరిమాణం పెద్దదైనప్పటికీ, అందరికోసం ‘సుత్రా’ తప్పనిసరి. ఇబ్నె హానీ తన గ్రంథం ‘మసాయల్‌ ఇమామ్‌ అహ్నద్‌”-1/66 నందు యిలా పేర్కొన్నారు: అబూ అబ్దుల్లా అంటే ఇమామ్‌ అహ్మద్‌ ఓ రోజు నన్ను, సుత్రా లేకుండా నమాజు చేయడం చూసి ‘దేనినయినా సుత్రాగా ఉపయోగించుకో‘ అని ఉపదేశించారు. తదుపరి నేను ఒక వ్యక్తిని సుత్రాగా ఉపయోగించుకున్నాను.

నేను చెప్పేదేమిటంటే – ఇమామ్‌ అహ్మద్‌ తన మాటల ద్వారా – మస్జిద్ పరిమాణం పెద్దదైనా, చిన్నదైనా – సుత్రా ఉపయోగించడంలో వ్యత్యాసం చూపకూడదు అన్న విషయం సూచించారు. ఇదే సత్యం కూడాను.

నేను సందర్శించిన దేశాలలో గమనించిందేమిటంటే – సాధారణంగా నమాజీలు – వారు ఇమాములైనా లేదా సాధారణ వ్యక్తులైనా, సుత్రా విషయంలో తగిన శ్రద్ధ వహించడం లేదు. ఈ దేశాల్లో సౌది అరేబియా కూడా చేరి ఉంది. అక్కడికి నేను 1410 హి. రజబ్‌ మాసంలో వెళ్లాను.

అందుకే, ఉలమాలపై వున్న బాధ్యత ఏమిటంటే – వారు ఈ విషయం గురించి ప్రజలకు హెచ్చరించాలి మరియు సుత్రాకు సంబంధించిన అన్ని వివరాలను వారికి తెలియజేయాలి. సుత్రా ఆజ్ఞల విషయంలో మస్జిదె హరాం మరియు మస్జిదె నబవి కూడా చేరి వున్నాయన్న విషయం వారికి బోధపరచాలి.

[43] బుఖారీ, ముస్లిం, ఇబ్నె మాజా

[44][45] బుఖారీ, అహ్మద్‌

[46] ముస్లిం, ఇబ్నె ఖుజైమా – 2/92, అహ్మద్‌

[47] అంబారీ వెనుకభాగంలో వుండే కర్రను ‘మోఖిరా’ అంటారు.

[48] ముస్లిం, అబూదావూద్‌

[49] నసాయి, అహ్మద్‌ – సహీ పరంపరతో

[50] బుఖారీ,ముస్లిం, అబూ యాలా – 3/107 – తఫ్సీర్ అల్‌ మక్తబతుల్‌ ఇస్లామీ 

[51] హదీసులో ‘సా ఆహా’ అన్న పదం వచ్చింది. అంటే “ఇతరులను మించిపోవడం” అన్నమాట.

[52] సహీ ఇబ్నె ఖుజైమా (1/95/1), తటబ్రానీ (3/140/3), హాకిమ్‌ దీనిని సహీగా ఖరారు చేశారు, జహబీ దీనితో ఏకీభవించారు.

[53] అహ్మద్‌, దారెఖు,త్నీ  తబ్రానీ – సహీ పరంపరతో.

ఈ అర్ధాన్ని స్ఫురించే ఉల్లేఖనాలు బుఖారీ, ముస్లింలలో వున్నాయి. అంతేకాక, సహాబాల ఒక సమూహం ద్వారా కూడా ఈ అర్ధంతో కూడుకున్న ఉల్లేఖనాలు ఇతర గ్రంథాల్లో వచ్చాయి.

ఖాదియానీలు తిరస్కరించే హదీసులలో ఇదొకటి. ఎందుకంటే ఖురాను, హదిసులలో వివరించబడ్డ జిన్నుల లోకాన్ని వారు విశ్వసించరు. షరీయత్తులోని స్పష్టమైన ఆధారాలను వారు తిరస్కరించడం అనేది ఎవరికీ తెలియని విషయం కాదు. ఒకవేళ ఆధారం ఖుర్‌ఆన్‌లో వుంటే – వారు దాని అర్ధాన్నే మార్చిస్తారు. ఉదాహరణకు : “ఓ ప్రవక్తా! జిన్నాతుల సమూహం ఒకటి (శ్రద్ధగా విని, ఆ తర్వాత …… (జిన్న్‌: 1) ఆయత్‌లో ‘జిన్నును మానవ జిన్న్‌గా తలపోన్తారు మరియు ‘జిన్న్’ పదాన్ని మానవమాత్రులుగా ఖరారు చేస్తారు.

యిలా, ఈ విషయంలో వారు నిఘంటువు మరియు షరియత్తుల నుండి దూరం వెళ్ళి పోయారు. ఒకవేళ ఆధారాలు గనక హదీసుల్లో ఉంటే-వీలయితే వాటి అసలు అర్ధాన్నే మార్చేస్తారు లేదా అతి తేలికగా వాటిని అసత్యమని ఖరారు చేశారు. ఇలా, హదీసువేత్తలు, వారి వెనుక మొత్తం అనుచర సమాజం వాటి ప్రామాణికతపై ఏకాభిప్రాయం కలిగి వున్నప్పటికీ వీరు వాటిని తిరస్కరిస్తారు. అల్లాహ్‌ వారికి సన్మార్గం ప్రసాదించుగాక!

54, బుఖారీ, ముస్లిం.

55. బుఖారీ, ముస్లిం. ఈ ఉల్లేఖనం ఇబ్నె ఖుజైమా (1/94/1)లో వుంది.


ఇది “దైవ ప్రవక్త నమాజు స్వరూపం – షేఖ్ అల్ అల్బానీ (రహిమహుల్లా)”  అనే పుస్తకం నుండి తీసుకోబడింది (పేజీలు: 100-104)

ఇతరములు: అజాన్ , నమాజు

సూర్య చంద్ర గ్రహణాలు – ఆచారాలు, దురాచారాలు – صلاة الخسوف [వీడియో]

బిస్మిల్లాహ్

సలాతుల్ కుసూఫ్-ఖుసూఫ్ (సూర్య-చంద్ర గ్రహణాల నమాజు)
సూర్య చంద్ర గ్రహణాలు – ఆచారాలు, దురాచారాలు

పెద్ద వీడియో [37 నిముషాలు]

సూర్య చంద్ర గ్రహణాలు – ఆచారాలు, దురాచారాలుపెద్ద వీడియో [37 నిముషాలు]
https://youtu.be/pGV_H8ASjFQ
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

చిన్న వీడియో [15నిముషాలు]
https://www.youtube.com/watch?v=Kv6ev0EqBTo

సూర్య గ్రహణము చంద్ర గ్రహణముల గురించి సైన్స్ మరియు  ఇస్లాం ఏం చెబుతుంది!

ముందుగా సూర్య చంద్రగ్రహణాల పేరిట జరిగే మూఢనమ్మకాలు తెలుసుకుందాం!

మన ప్రాంతాల్లో దురాచారాలు, మూడనమ్మకాలు గ్రహణ సమయ్యాల్లో ఎక్కవ పాటిస్తారు. మన దేశ ఎలక్ట్రానిక్ మిడియా పనికట్టుకొని ప్రత్యేకంగా పండితులను పిలిపించి దాని ప్రత్యేక సమయాన్ని వేచిస్తారు. ప్రజల అమాయకత్వమే తమ బలంగా సొమ్ము చేసుకోవటానికి ప్రయత్నిస్తుంటారు.

మన ప్రాంతాల్లో పాటించే కొన్ని మూఢనమ్మకాలు ఇలా వుంటాయి:

1) గర్భవతులు గ్రహణం చూడరాదనటం.
2)గ్రహణం పట్టే సమయంలో సూర్య చంద్రకాంతి పడేచోట కూర్చోకూడదనడం.
3) కూరగాయాలు తరగడం, పండ్లు కోయడం వంటివి చేయకూడదనడం. అలా చేస్తే పదార్థాలు విషం చేస్తాయని భావించటం.
4) గర్భిణులను గ్రహణ సమయాల్లో ఇంటికే పరిమితం చేయటం.
5) తమ నివాస స్థలాల్లో సూర్యకాంతులు పడకుండా చూడటం
6) గర్భవతి గ్రహణ సమయాల్లో చూస్తే పిల్లలు అంగవైకల్యాలుగా పుడతారని భావించడం.
7)ఫలానా రాశివారికి లాభం, ఫలాన రాశి వారికి కీడని నమ్మటం.
8)గ్రహణ సమయం అయిపోగానే ఇంటిని శుభ్రంగా కడగడం.
9)ఇంకా మూఢన్మకాలు, బహుదైవ కార్యకలపాలకు పాల్పడటం వంటివి చేయటం.

 నా సహోద సహోదరిమణులారా మూఢనమ్మకాలు పాటించకూడదు. లాభం నష్టం అనేది భూమ్యకాశాల సృష్టకర్త అయిన అల్లాహ్(దేవుడు) అధీనంలోనే ఉన్నాయి. అలాగే బహుధైవరాధనను అన్ని మత గ్రంధాలు ఖండిస్తున్నాయి. బహుధైవరాధన అనేది క్షమించరాని నేరం!!

సైన్స్ సూర్య చంద్రగ్రహణాల గురించి ఏం చెబుతుంది:

చంద్రగ్రణాల ద్వారా గర్బణిలకు ఎటువంటి ప్రమాదం లేదని, అలాగే తిను పదార్దాలు చెడిపోవటం అధిక ఉష్ణోగ్రతలు 35 – 40 వరకు ఉండటమేనని తేల్చింది. అలాగే గ్రహణాల ఏర్పాటు అనేది ఆకాశంలో భూమి, చంద్రుల నీడలాటే అని కూడా చెప్పింది. సూర్యుడు ఒక నక్షత్రం. సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతుంటాయి. అలాగే భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నది. భూమి చుట్టూ తిరిగే ఉపగ్రహం చంద్రుడు. ఇలా ఇవి ఒకదాని చుట్టూ ఒకటి పరిభ్రమించేటప్పుడు సూర్యునికి భూమికి మధ్యలో చంద్రుడు వస్తే.. చంద్రుని నీడ భూమిమీద పడుతుంది. సూర్యుడికి, చంద్రునికి మధ్యలో భూమి వస్తే భూమి నీడ చంద్రుని మీద పడుతుంది. ఈ నీడలు ఇలా పడడం వల్లనే గ్రహణాలు ఏర్పడుతాయి.

ఇలా మనకు గ్రహణాల సబబు తెలిసిందని నిర్భయంగా ఉండలేము. చీకట్లు క్రమ్ముకొని ఉన్న ప్రపంచాన్ని కాంతితో నింపే అంతటి శక్తి సూర్యునిలో అల్లాహ్ యే ఇచ్చాడు, తాను కోరినప్పుడు ఏదో సబబు కలుగజేసి ఆ కాంతిని తీసేసుకుంటున్నాడు, పగటి వేల చీకటిగా చేస్తున్నాడు, అలాగే చంద్రుణ్ణి కూడా అందుకే ఆ అల్లాహ్ తో భయపడాలి. ఈ గ్రహణాల సందర్భంలో ఏమి చేయాలని ఆదేశించాడో అవి చేయాలి. అప్పుడే మనం ఇహపరాల మోక్షం పొందుతాము.

ఇస్లాం సమాచారం: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ


527. హజ్రత్‌ అబూ మస్‌వూద్‌ (రది అల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:-

“సూర్యచంద్రగ్రహణాలు ఏ ఒక్కరి మరణం, పుట్టుకలకు కారణభూతం కాజాలవు. సూర్యచంద్రులు అల్లాహ్ నిదర్శనాలలో రెండు నిదర్శనాలు. అందువల్ల మీరు సూర్యగ్రహణం గాని, చంద్రగ్రహణం గాని పట్టడం చూస్తే లేచి నమాజు చేయండి.”

[సహీహ్‌ బుఖారీ : 16వ ప్రకరణం – కుసూఫ్‌, 1వ అధ్యాయం – అస్సలాతి ఫీ కుసూఫిష్నమ్స్‌]

528. హజ్రత్‌ అబూమూసా (రది అల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్ష(సల్లల్లాహు అలైహి వసల్లం) కాలంలో ఓసారి సూర్యగ్రహణం పట్టితే “ప్రళయం రాదు కదా’ అని ఆయన ఆందోళన చెందుతూ, మస్జిదుకు వెళ్ళి (కుసూఫ్‌) నమాజు చేశారు. అందులో ఖుర్‌ఆన్‌ పఠనం, రుకూ, సజ్దాలు నేనిదివరకెన్నడూ చూడనంత సుదీర్హంగా జరిగాయి. (తర్వాత) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రసంగించారు.

“ఇవి (సూర్యచంద్రగ్రహణాలు) అల్లాహ్ పంపుతున్న నిదర్శనాలు. అంతేగాని ఏ ఒక్కరి చావు పుట్టుకలకు కారణభూతం కాజాలవు. ఈ నిదర్శనాల ద్వారా అల్లాహ్ తన దాసులను భయపెడుతున్నాడు. అందువల్ల మీరు ఇలాంటి నిదర్శనాలేమైనా చూస్తే వెంటనే అల్లాహ్  స్మరణ (నమాజు) వైపుకు పరుగెత్తండి, ఆయన్ని వేడుకోండి, పాప మన్నింపు కోరండి.”

[సహీహ్‌ బుఖారీ : 16వ ప్రకరణం – కుసూఫ్‌, 14వ అధ్యాయం – అజ్జిక్రి ఫిల్‌కుసూఫ్‌]

సలాతుల్ కుసూఫ్ ప్రకరణం : హదీసులు :
అల్-లూలు-వల్-మర్జాన్ (మహా ప్రవక్త మహితోక్తులు)


గ్రహణ సమయాలలో నమాజ్ (సలాతుల్ కుసూఫ్) : హదీసులు 
[హదీసు మకరందం (బులూఘ్-అల్–మరామ్) (Bulugh-al-Maraam)]

మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కండి
https://teluguislam.net/whatsapp/

నమాజ్ ప్రాముఖ్యత, సామూహిక నమాజ్ ఘనత [వీడియో]

బిస్మిల్లాహ్

నమాజు యొక్క ప్రాముఖ్యత మరియు సామూహికంగా నమాజు చేసే ఘనత ఎంత గొప్పగా ఉందో చాలా సోదర సోదరీమనులకు తెలియకనే మస్జిదులకు దూరంగా ఉన్నారు, అయితే మీరు స్వయంగా ఈ వీడియో చూడండి, ఇతరులకు చూపించండి, నరక శిక్షల నుండి తమను, ఇతరులను కాపాడండి.

[సురక్షిత యూట్యూబ్ లింక్: https://safeYouTube.net/w/hS6r]
[33 నిమిషాల వీడియో]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) 
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia

మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కండి: https://teluguislam.net/whatsapp/

ఇతరములు: [నమాజు]

మస్జిదులో చేసే సామూహిక ఫజ్ర్ నమాజు ఘనత [వీడియో]

బిస్మిల్లాహ్

ఫజ్ర్ నమాజు సామూహికంగా చేయడంలోని ఘనత హదీసుల ఆధారంగా తెలుపబడింది.

[సురక్షిత యూట్యూబ్ లింక్: https://safeYouTube.net/w/Dytr]
[9 నిమిషాల వీడియో]
فضل صلاة الفجر مع الجماعة

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) 
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia

మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కండి: https://teluguislam.net/whatsapp/

ఇతరములు: [నమాజు]

నమాజు కొరకు మస్జిదుకు నడచి వెళ్ళే ఘనత (فضل المشي إلى الصلاة) [వీడియో]

బిస్మిల్లాహ్

మనలో ఎంతో మందికి నమాజు కొరకు నడచి వెళ్ళడంలో ఉన్న ఘనత తెలియదు గనక సామూహిక నమాజులో వెనక ఉండిపోతారు, అయితే ఈ వీడియో చూసి లాభాలు తెలుసుకొని మీరు స్వయంగా మస్జిద్ కు వెళ్తూ ఉండండి ఇతరులను తీసుకెళ్ళండి.

[సురక్షిత యూట్యూబ్ లింక్: https://safeYouTube.net/w/6utr]
[3 నిమిషాల వీడియో]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) 
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia

మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కండి: https://teluguislam.net/whatsapp/

ఇతరములు:

నమాజ్ చేయవలసిన మరియు చేయరాని సమయాలు [వీడియో]

బిస్మిల్లాహ్

[సురక్షిత యూట్యూబ్ లింక్: https://safeYouTube.net/w/gbir]
[ 30 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.

ఏ నమాజు యొక్క ఏ సమయం ఉంది, మరియు నమాజు చేయరాని సమయాలు ఏమిటి తెలుసుకోండి, ఇతరులకు తెలుపండి

నమాజు సమయాలు

عَنِ ابْنِ عَبَّاسٍ t قَالَ: قَالَ رَسُولُ اللهِ ﷺ: أَمَّنِي جِبْرِيلُ عَلَيْهِ السَّلَام عِنْدَ الْبَيْتِ مَرَّتَيْنِ، فَصَلَّى بِيَ الظُّهْرَ حِينَ زَالَتِ الشَّمْسُ وَكَانَتْ قَدْرَ الشِّرَاكِ، وَصَلَّى بِيَ الْعَصْرَ حِينَ كَانَ ظِلُّهُ مِثْلَهُ، وَصَلَّى بِيَ يَعْنِي الْمَغْرِبَ حِينَ أَفْطَرَ الصَّائِمُ، وَصَلَّى بِيَ الْعِشَاءَ حِينَ غَابَ الشَّفَقُ، وَصَلَّى بِيَ الْفَجْرَ حِينَ حَرُمَ الطَّعَامُ وَالشَّرَابُ عَلَى الصَّائِمِ، فَلَمَّا كَانَ الْغَدُ صَلَّى بِيَ الظُّهْرَ حِينَ كَانَ ظِلُّهُ مِثْلَهُ، وَصَلَّى بِي الْعَصْرَ حِينَ كَانَ ظِلُّهُ مِثْلَيْهِ، وَصَلَّى بِيَ الْمَغْرِبَ حِينَ أَفْطَرَ الصَّائِمُ، {وفي رواية أبي موسى: وَصَلَّى الْمَغْرِبَ قَبْلَ أَنْ يَغِيبَ الشَّفَقُ} وَصَلَّى بِيَ الْعِشَاءَ إِلَى ثُلُثِ اللَّيْلِ، وَصَلَّى بِيَ الْفَجْرَ فَأَسْفَرَ»

ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హు కథనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారుః జిబ్రీల్ అలైహిస్సలాం కాబా వద్ద రెండు సార్లు నాకు నమాజు చేయించారు;

  • పొద్దు వాలి, నీడ చెప్పు గూడంత ఉన్నప్పుడు నాకు జొహ్ర్ నమాజు చేయించారు,
  • ప్రతి వస్తువు నీడ దానంత అయినప్పుడు నాకు అస్ర్ నమాజు చేయించారు,
  • ఉపవాసమున్న వ్యక్తి ఉపవాసం విరమించే- టప్పుడు మగ్రిబ్ నమాజ్ చేయించారు,
  • ఎర్రని కాంతులు మరుగైన తర్వాత ఇషా నమాజ్ చేయించారు,
  • ఉపవాసముండే వ్యక్తిపై తినత్రాగడం నిషిద్ధం అయినప్పడు నాకు ఫజ్ర్ నమాజు చేయించారు.

మరుసటి రోజు;

  • ప్రతి వస్తువు నీడ దానంత అయినప్పుడు జొహ్ర్ నమాజ్ చేయించారు,
  • ప్రతి వస్తువు నీడ దాని రెండింతలు అయినప్పుడు అస్ర్ నమాజ్ చేయించారు,
  • ఉపవాసమున్న వ్యక్తి ఉపవాసం విరమించే- టప్పుడు మగ్రిబ్ నమాజ్ చేయించారు, [అబూ మూసా ఉల్లేఖనంలో ఉందిః ఎర్రని కాంతి మరుగుపడే ముందు మగ్రిబ్ నమాజ్ చేయించారు]
  • రాత్రి మూడవ భాగం గడిశాక ఇషా నమాజ్ చేయించారు,
  • తెలుపుగా ఉన్నప్పుడు ఫజ్ర్ నమాజు చేయించారు.  (అబూ దావూద్ 393, 395).

ప్రతి నమాజు తొలి సమయంలో చేయడం ఉత్తమం

عنْ أُمِّ فَرْوَةَ، قَالَتْ: سُئِلَ رَسُولُ اللهِ ﷺ أَيُّ الْأَعْمَالِ أَفْضَلُ؟ قَالَ: «الصَّلَاةُ فِي أَوَّلِ وَقْتِهَا»

ఉమ్మె ఫర్వా ఉల్లేఖనం ప్రకారం, కార్యాల్లో ఏదీ అతిఉత్తమమైనదని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రశ్నించబడినప్పుడు, నమాజు దాని తొలి సమయంలో చేయడం అని సమాధానం ఇచ్చారు. (అబూ దావూద్ 426).

తెలిసీ సమయం దాటనివ్వకూడదు

عَنْ أَبِي ذَرٍّ، قَالَ: قَالَ لِي رَسُولُ اللهِ ﷺ: «كَيْفَ أَنْتَ إِذَا كَانَتْ عَلَيْكَ أُمَرَاءُ يُؤَخِّرُونَ الصَّلَاةَ عَنْ وَقْتِهَا؟ – أَوْ – يُمِيتُونَ الصَّلَاةَ عَنْ وَقْتِهَا؟» قَالَ: قُلْتُ: فَمَا تَأْمُرُنِي؟ قَالَ: «صَلِّ الصَّلَاةَ لِوَقْتِهَا، فَإِنْ أَدْرَكْتَهَا مَعَهُمْ، فَصَلِّ، فَإِنَّهَا لَكَ نَافِلَةٌ»

హజ్రత్ అబూ జర్ర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: మీ నాయకులు నమాజులను ఆలస్యంగా చేసినప్పుడు నీ పరిస్థితి ఏముంటుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు, అలాంటప్పుడు నేనేమి చేయాలో మీరే ఆదేశించండి అని విన్నవించుకున్నాను, అప్పుడు ఆయన చెప్పారు: నీవు నమాజు దాని సమయంలో చేసుకో, వారితో కూడా నీకు అదే నమాజు మరోసారి చేయవలసి వచ్చినప్పుడు, వారితో కూడా చేయి, అది నీకు నఫిల్ అవుతుంది. (ముస్లిం 648).

ఇషా నమాజు ఆలస్యం చేయవచ్చును

عَنْ أَبِي هُرَيْرَةَ، قَالَ: قَالَ النَّبِيُّ ﷺ: «لَوْلَا أَنْ أَشُقَّ عَلَى أُمَّتِي لَأَمَرْتُهُمْ أَنْ يُؤَخِّرُوا العِشَاءَ إِلَى ثُلُثِ اللَّيْلِ أَوْ نِصْفِهِ»

ప్రవక్త సల్లల్ల్లాహు అలైహి వసల్లం చెప్పారని హజ్రత్ అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః నా అనుచర సంఘానికి కష్టతరంగా ఉంటుందన్న భయం నాకు లేకుంటే రాత్రి మూడవ భాగం లేదా అర్థ రాత్రి వరకు ఇషా నమాజును ఆలస్యంగా చేయండని ఆదేశించేవాడిని. (తిర్మిజి 167).

అయితే జమాఅతు (సామూహిక) నమాజు వదలి ఆలస్యం చేయకూడదు. ఏదైనా మస్జిదు వారందరూ ఏకమై ఆలస్యం చేస్తే అభ్యంతరం లేదు.

పడుకున్న లేదా మరచిపోయిన వ్యక్తి ఎప్పుడు నమాజు చేయాలి?

عَنْ أَنَسِ بْنِ مَالِكٍ t، قَالَ: قَالَ نَبِيُّ اللهِ ﷺ: «مَنْ نَسِيَ صَلَاةً، أَوْ نَامَ عَنْهَا، فَكَفَّارَتُهَا أَنْ يُصَلِّيَهَا إِذَا ذَكَرَهَا»

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించారని హజ్రత్ అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: ఎవరైనా ఏదైనా నమాజు మరచిపోతే లేదా ఆ నమాజు సమయంలో నిద్రిస్తూ ఉంటే దాని పరిహారం ఏమిటంటే గుర్తు వచ్చిన (లేదా మేల్కొన్న) వెంటనే ఆ నమాజు చేసుకోవాలి. (ముస్లిం 684).

నమాజు చేయరాని సమయాలు

عن عُقْبَةَ بْنِ عَامِرٍ الْجُهَنِيَّ t يَقُولُ: ثَلَاثُ سَاعَاتٍ كَانَ رَسُولُ اللهِ ﷺ يَنْهَانَا أَنْ نُصَلِّيَ فِيهِنَّ، أَوْ أَنْ نَقْبُرَ فِيهِنَّ مَوْتَانَا: «حِينَ تَطْلُعُ الشَّمْسُ بَازِغَةً حَتَّى تَرْتَفِعَ، وَحِينَ يَقُومُ قَائِمُ الظَّهِيرَةِ حَتَّى تَمِيلَ الشَّمْسُ، وَحِينَ تَضَيَّفُ الشَّمْسُ لِلْغُرُوبِ حَتَّى تَغْرُبَ» {مسلم 831}

హజ్రత్ ఉక్బా బిన్ ఆమిర్ అల్ జుహనీ రజియల్లాహు అన్హు కథనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మేము మూడు వేళల్లో నమాజు చేయడం మరియు శవాలను ఖననం చేయడం నుండి వారించేవారుః

  • సూర్యోదయం అయ్యే వేళ అది పైకెక్కే వరకూ,
  • నడి నెత్తిన మీది కొచ్చిన సూర్యుడు వాలే వరకూ,
  • సూర్యాస్తమయం అయ్యే వేళ పూర్తిగా ఆస్తమించే వరకు. (ముస్లిం 831).

عن أَبي سَعِيدٍ الخُدْرِيّ t يَقُولُ: سَمِعْتُ رَسُولَ اللهِ ﷺ يَقُولُ: «لاَ صَلاَةَ بَعْدَ الصُّبْحِ حَتَّى تَرْتَفِعَ الشَّمْسُ، وَلاَ صَلاَةَ بَعْدَ العَصْرِ حَتَّى تَغِيبَ الشَّمْسُ»

నేను ప్రవక్త ﷺ ఉద్బోధించగా విన్నాను అని హజ్రత్ అబూ సఈద్ ఖుద్రీ t ఉల్లేఖించారుః ఉదయం నమాజు నెరవేర్చిన తర్వాత సూర్యోదయం వరకూ మరే నమాజు లేదు. అలాగే అస్ర్ నమాజ్ నెరవేర్చిన తర్వాత సూర్యాస్తమయం వరకూ ఏ నమాజూ లేదు. (బుఖారి 586, ముస్లిం 827).

*  ఫజ్ర్ కు ముందు గల సున్నతులు ముందే చేయ లేక పోతే ఫజ్ర్ తర్వాత చేయవచ్చును (తిర్మిజి 422).

కూర్పు: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ

ఇతరములు:

ప్రళయ దినాన దాసునితో మొట్టమొదట ప్రశ్నించబడే ఆరాధన నమాజు

బిస్మిల్లాహ్

“(ఓ ప్రవక్తా!) నీ వైపునకు పంపబడిన (వహీ చేయబడిన) గ్రంథాన్ని పారాయణం చేస్తూ ఉండు. నమాజును నెలకొల్చు. నిశ్చయంగా నమాజ్‌ సిగ్గమాలినతనం నుంచి, చెడు విషయాల నుంచి ఆపుతుంది. నిశ్చయంగా అల్లాహ్‌ స్మరణ చాలా గొప్ప విషయం (అన్నసంగతిని మరువరాదు). మీరు చేసేదంతా అల్లాహ్‌కు తెలుసు.” (29, సూరతుల్‌ అన్‌కబూత్‌:45)

హజ్రత్ అబ్దుల్లాహ్‌ బిన్‌ జాబిర్‌ (రది అల్లాహు అన్హు) కథనం; ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “ఐదు పూటల నమాజు చేయటం మీలో ఒకరి ఇంటి ముందు నిండుగా ప్రవహిస్తున్న సెలయేటిలో (పతి రోజు ఐదుపూటల స్నానం చేయటం లాంటిది” (ముస్లిం).

ఒక వ్యక్తి జీవితమంతా ముస్లింగా ఉండాలంటే అతను ప్రతి రోజు ఐదు సమయాల నమాజు విధిగా ఆచరించాలి. నమాజును ఆచరించేవారి కొరకు ప్రళయ దినాన అది జ్యోతిగాను ధృవ పత్రముగాను ఉంటుంది. తద్వారా వారు ప్రళయ దినాన నరకం నుండి విముక్తి పొందుతారు. కనుక అల్లాహ్‌ ఇలా తెలియజేసాడు: “వారి తరువాత కొందరు అయోగ్యులు వారి స్థానంలో వచ్చారు. వారు నమాజును త్యజించారు. మనో వాంఛలను అనుసరించారు. కనుక వారు త్వరలోనే (ప్రళయ దినాన) గయ్ (అనే నరకం)లో పడవేయబడుతారు” (19, సూరతుల్‌ మర్యం:59).

నమాజు ఆచరించేవారి కొరకు స్వర్గం ప్రాప్తమవుతుందని అల్లాహ్‌ ఇలా తెలియజేసాడు: “తమ నమాజులను కాపాడుకునేవారు. ఇలాంటి వారు సగౌరవంగా స్వర్గవనాలలో ఉంటారు” (70, మఆరిజ్‌:34-35).

ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేసారు: “ప్రళయ దినాన దాసునితో మొట్టమొదట ప్రశ్నించబడే ఆరాధన నమాజు. ఆ నమాజును సరిగ్గా పాటించినట్లయితే సాఫల్యం పొందుతాడు. అదే గనుక సరిగ్గాలేదంటే అతను నష్టపోతాడు, విఫలుడవుతాడు” (తిర్మిజీ, సహీహ్‌ అల్‌ జామీ :2020).

నరకవాసుల పాపాల గురించి స్వర్గవాసులు ప్రశ్నించే విషయాన్ని అల్లాహ్‌ ఇలా తెలియజేసాడు: మీరు ఎందువల్ల నరకంలో పడ్డారు? (అప్పుడు వారు ఇలా సమాధానమిస్తారు). “మేము నమాజును స్థాపించలేదు. మేము పేదలకు అన్నదానం చేసేవారము కాము. మరియు మేము సత్యాన్ని తిరస్కరించే వారితో కలిసి సత్యాన్ని తిరస్కరిస్తూ ఉండేవారము. ప్రళయ దినాన్ని అబద్దంగా భావించాము, చివరికి మాకు మృత్యువు వచ్చేసింది” (74, సూరతుల్‌ ముద్దసిర్‌:42-47).

నమాజును ఉద్దేశ్యపూర్వకంగా వదిలినవారు ముస్లిములు కానేకారని ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా హెచ్చరించారు: “విశ్వాసిగల దాసునికి కుఫ్ర్ కు (తిరస్కారికి) మధ్య వ్యత్యాసం నమాజును పాటించకపోవడమే”” (ముస్లిం). ప్రవక్త ముహమ్మద్‌ మరొకచోట ఇలా ప్రవచించారు: “మన (విశ్వాసుల) మధ్య మరియు వారి (అవిశ్వాసుల) మధ్య ఉన్న ఒడంబడిక నమాజును పాటించడము. ఎవరైయితే దాన్ని (నమాజును) పాటించరో, వారు అవిశ్వాసానికి గురికాబడ్డారు” (అహ్మద్‌, తిర్మిజీ, ఇబ్నుమాజా). మరొక చోట ఇలా తెలియజేసారు: “ఇస్లామే అసలైన ధర్మం. నమాజు దీని స్తంభం, దీని అత్యుత్తమ విలువైన స్థానం “అల్‌ జిహాద్‌ ఫీ సబీలిల్లాహ్‌”’ (ముస్లిం).

ప్రియమైన సోదరులారా! నమాజును జీవితంలో ఒక భాగంగా భావించి తప్పక నెరవేర్చండి. అప్పుడే ఇహపరాల సాఫల్యం పొందగలరు. ఎవరయితే ఆత్మ పరిశీలన చేసుకుంటారో, మరణానంతర జీవితం కొరకు సదాచరణా చేసుకుంటారో వారే వివేకవంతులు. మరెవరయితే తన మనసును దాని కోరికల అనుసరణకై వదిలేస్తారో, తరువాత అల్లాహ్‌ అనుగ్రహంపట్ల ఆశలు పెంచుకుంటారో వారే అవివేకులు.


ఇది “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు విధానము” అనే పుస్తకం నుండి తీసుకోబడింది. కూర్పు: జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ (హఫిజ హుల్లాహ్)


ఈద్ (పండుగల) నమాజు

బిస్మిల్లాహ్

ఈద్ పండుగల నమాజు :

రమజాన్‌ మరియు బక్రీద్‌ పండుగల నమాజు విధిగా నిర్ణయించబడింది. నిశ్చయంగా ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రతి పండుగ రోజున నమాజు చేసేవారు. స్త్రీ పురుషులు ప్రతి ఒక్కరికీ  పండుగ నమాజు వాజిబు.

పండుగ రోజు స్నానం చేయడం మన శక్తిని బట్టి మంచి దుస్తులు ధరించడం సున్నతుగా భావించడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) తెల్ల దుస్తులు ధరించేవారు. తెల్ల దుస్తులంటే చాలా ఇష్టపడేవారు. మరియు సువాసనలో అన్నిటికంటే మంచి సువాసన పూసుకునేవారు. అలాగే యమని అబాయా తొడిగేవారు” (తబ్రాని).

రమజాన్‌ పండుగ నమాజుకు బయలుదేరక ముందు అల్పాహారం చేయడం సున్నతు. బక్రీద్‌ పండుగ నమాజు తరువాత అల్పాహారం చేయడం సున్నతు. (సహీహుల్‌ జామీ :4845, ఇబ్నుమాజా)

బక్రీద్‌ పండుగ నమాజుకు, రమజాన్‌ పండుగ నమాజుకు బయలు దేరేటప్పుడు బిగ్గరగా తక్బీర్ చెబుతూ ఈద్‌గాహ్‌ చేరుకోవాలి.

అరఫా రోజు ఫజర్‌ నమాజు నుండి అయ్యాముత్‌ తష్‌రీఖ్‌ (బక్రీద్‌ నెల 9,10,11,12,13) రోజుల్లో తక్బీర్ పదాలు పఠిస్తూ ఉండాలి.

అల్లాహు అక్బర్‌, అల్లాహు అక్బర్‌, అల్లాహు అక్బర్‌, లా ఇలాహ ఇల్లల్లాహు అల్లాహ్‌ అక్బర్‌, అల్లాహు అక్బర్‌ వ లిల్లాహిల్‌హమ్ద్”. అలాగే బక్రీద్‌ నాలుగు (10,11,12,139) రోజులలో ఖుర్చాని ఇవ్వవచ్చును.

(సహీహుల్‌ జామీ  :5004, ఇర్వావుల్‌ గలీల్‌:654).

బక్రీద్‌ పండుగ రోజు తరువాత మూడు రోజులు ఖుర్బానీ చెయ్యవచ్చును. కాని పండుగ (జుల్‌హజ్‌10వ) రోజు ఖుర్బానీ చెయ్యడం ఉత్తమమైనది.

అయ్యాముత్‌ తష్‌రిఖ్‌ అంటే జిల్‌హజ్‌ నెల 11,12,13, రోజులు ఖుర్బానీ రోజులే. జిల్‌హజ్‌ 13వ రోజు సూర్యాసమయం వరకూ ఖుర్బానీ చెయ్యవచ్చును.

ఖుర్చానీ ఇవ్వదలుచుకున్నవారు తమ చేతులతోనే ఖుర్బానీ జంతువును జబహ్‌ చెయ్యడం మంచిది. అలాగే స్త్రీలు కూడా తమ ఖుర్బానీ జంతువును జబహ్‌ చెయ్యవచ్చును. లేక ఇతరుల ద్వారా జబహ్‌ చెయ్యించడం కూడా ధర్మమే.

పండుగ నమాజు తరువాత ఒక మంచి ధారుగల కత్తిని తీసుకొని “ఖుర్బానీ దుఆ” పఠించి జంతువును జబహ్‌ చేయాలి. తరువాత ఆ మాంసాన్ని మూడు భాగాలుగా చేసి ఒక భాగాన్ని బీదవారికి, మరొక భాగాన్ని బంధువులకు పంచాలి. మూడవ భాగాన్ని తమ సొంతానికై ఉంచుకోవాలి.

ఖుర్బానీ దుఆ:

ఇన్నీ వజ్జహతు వజ్‌హియ లిల్లజీ ఫతరస్‌ సమావాతి వల్‌ అర్జ, హనీఫఃవ్‌ వమా అనా మినల్‌ ముష్‌రికీన్‌, ఇన్న సలాతి వ నుసుకీ వ మహ్‌యా వమమాతీ లిల్లాహి రబ్బిల్‌ ఆలమీన్‌, లా షరీక లహూ వ బిజాలిక ఉమిర్‌తు వ అన అవ్వలుల్‌ ముస్లీమీన్‌. అల్లాహుమ్మ మిన్‌క వ లక అన్‌ ……” ఖుర్బానీ ఎవరిపేరుతో ఇవ్వబడుతుందో వారి పేరు పేర్కొని “బిస్మిల్లాహి అల్లాహు అక్బర్‌” అని జబహ్‌ చెయ్యాలి.

రమజాన్‌ పండుగ నమాజుకు బయలదేరక ముందు ‘ఫిత్రా దానం చెల్లించాలి. బక్రీద్‌ పండుగ నమాజుకు తరువాత ఖుర్బానీ ఇవ్వాలి. (బుఖారి, ముస్లిం)

ఫిత్రా దానం చెల్లించే స్తోమత కలిగిన ప్రతి ముస్లిం విధిగా ఫిత్రా దానం చెల్లించాలి. ఇంట్లో ఉన్నవారి ప్రతి వ్యక్తికి బదులు ఒక ‘సా’ (2.500 కి.) హిజాజి ధాన్యాలు (బియ్యం లేక గోదుమలు లేదా మనం నిరంతరాయంగా వాడుకునే ధాన్యం) దానంగా ఇవ్వాలి. (అహ్మద్‌)

ముస్లిం సమాజానికి చెందిన బీదవారికి మాత్రమే ఫిత్రా దానం ఇవ్వాలి. అది ధాన్యం రూపంలో దానం చెయ్యడం ఉత్తమమైన ఆచారం.

హజ్రత్‌ అబూ సయీద్‌ ఖుద్రి;ఈ కథనం; ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు: “ప్రతి పండుగ నమాజు ఆచరించుటకై ఈద్‌గాహ్‌ వెళ్ళేవారు” (బుఖారి, ముస్లిం).

హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ ఉమర్‌ (రధి అల్లాహు అన్హు) ఉల్లేఖించారు: “ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) పండుగ నమాజుకు కాలి నడన వెళ్ళేవారు” (సహీహుల్‌ జామీ :4710).

ప్రవక్త ముహమ్మద్‌: ఈద్‌గాహ్‌కు చిన్నారి పాపలను, యువతులను, వయసు మీరిన స్త్రీలను మరియు ఎవరి దగ్గరనైతే దౌని (స్కార్ఫ్) లేదో, వారు తమ సహోదరి వద్దనుండి దౌని తీసుకొని ఈద్‌గాహ్‌ పోవాలని ఆజ్ఞాపించారు. దీని ఉద్దేశ్యం ఏమంటే, స్త్రీలుకూడా ముస్లిం సమూహంలో వారి దుఆ పొందగలరని. దీనికి ఆధారంగా ఒక హదిసులో ఉమ్మే అతియ్యా ఈ ఉల్లేఖించారు: “పురిటి స్త్రీలు, బహిష్టు స్త్రీలు, పరదాలో ఉన్న మహిళలు నమాజ్‌ నెరవేర్చుటకై ఈద్‌గాహ్‌ పోవాలని, ముస్లిం పురుషులతో పాటు దుఆలో పాల్గొనాలనీ మాకు ఆజ్ఞాపించారు. కాని బహిష్టు స్త్రీలు మాత్రం నమాజు నుండి తప్పుకోవాలనీ ఆదేశించారు” (బుఖారి, ముస్లిం).

పండుగ నమాజుకు ముందు ఎలాంటి నఫిల్‌ నమాజు నెరవేర్చకూడదు.హజ్రత్ అబూ సయీద్‌ ఖుద్రి (రధి అల్లాహు అన్హు) ఉల్లేఖించారు: ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) పండుగ నమాజుకు ముందు (నఫిల్‌) నమాజు నెరవేర్చలేదు. కాని పండుగ నమాజు తరువాత ఇంటికి వచ్చి రెండు రకాతులు (నఫిల్‌) చదివేవారు. (బుఖారి, ముస్లిం)

పండుగ నమాజాకై అజాన్‌ లేక ఇఖామత్‌ చెప్పకూడదు. హజత్‌ జాబిర్‌ బిన్‌ సముర (రధి అల్లాహు అన్హు) కథనం: “నేను ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారితో పండుగ నమాజు ఒకసారి రెండుసార్లు కాదు ఎన్నోసార్లు అజాన్‌ మరియు ఇఖామత్‌ లేకుండానే చదివాను.” (ముస్లిం)

పండుగల నమాజు సమయం: హజ్రత్‌ జున్దుబ్‌-ఈ కథనం ప్రకారం: “ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) సూర్యుడు ఉదయించిన తరువాత ఈటె నీడ దాని ఎత్తుకు రెండింతలు అయిన తరువాత రమజాన్‌ నమాజు చదివేవారు. మరియు సూర్యుడు ఉదయించిన తరువాత ఈటె నీడ దాని ఎత్తుకు సమానంగా అయిన తరువాత బక్రీద్‌ నమాజు చదివేవారు”

ఇమామ్‌ షౌకానీ (రహిమహుల్లాహ్ అలైహి) గారు ఇలా తెలియజేసారు. “ఈ హదీసు పండుగ నమాజు సమయాల హదిసులలో చాలా ప్రామాణికమైన హదీస్‌గా భావించారు” (ఫిఖ్‌హుస్‌ సున్నా:1/279).

[అరబ్‌ దేశాలలో ఈద్‌ నమాజ్‌ సున్నత్‌ సమయం ప్రకారం నెరవేర్చుచున్నారు. కాని మన దేశాలలో ఈద్‌ నమాజ్‌ చాలా ఆలస్యంగా నెరవేర్చే అలవాటుకు గురికాబడ్డారు. ఇది ఎంత మాత్రం సున్నత్‌ పద్దతి కాదు.]

పండుగ రోజు పిల్లలు దఫ్‌ వాయించి ధర్మ పద్దతిలో మంచి గీతాలు మరియు ఇతర ఆటలతో ఖుషీ చేయవచ్చును. (బుఖారీ)

పండుగల రోజు ఇతరులతో కలసినప్పుడు “తఖబ్బలల్లాహు మిన్నా వ మిన్కా” అని చెప్పవలెను. (మా పుణ్యాలు మీ పుణ్య కార్యాలను అల్లాహ్‌ స్వీకరించుగాక) (తమాముల్‌ మిన్నా లిల్‌ అల్బాని:1/ 356)

పండుగల నమాజ్‌ ఆచరించే విధానము:

1) కాబతుల్లాహ్‌ దిశకు తిరిగి నిలబడాలి.

2) నమాజు కొరకై నియ్యత్‌ మనసులో అనుకోవాలి.

3)తరువాత పంక్తుల్ని తిన్నగా ఉంచుకోవాలి. పోత పోసిన సీసపు గోడ మాదిరిగా కలిసి నిలబడాలి. (బుఖారి, ముస్లిం)

4) తక్సీర్‌ (అల్లాహు అక్బర్‌) చెప్పినప్పుడు చెవుల వరకు చేతులను ఎత్తాలి. (ముస్లిం) చెవులను తాకవలసిన అక్కర లేదు. ఆ తరువాత కుడి చేతితో ఎడమ చెయ్యి మణికట్టుని పట్టుకొని రెండు చేతులను రొమ్ముపై (ఛాతిఫై) ఉంచాలి. (నసాయి, సహీహ్‌ సిఫతుస్‌ సలాతున్‌ నబి, అల్‌ అల్పానీ రహిమహుల్లాహ్ | పేజీ: 88)

5) చూపులను సజ్డా స్థలంసై ఉంచాలి. (బైహఖి, సహీహ్‌ సిఫతుస్‌ సలాతున్‌ నబి, లిల్‌ అల్బానీ రహిమహుల్లాహ్ | పేజీ నెంబరు: 88)

6) తరువాత నమాజు ఆరంభానికై (సున్నతుగా) ఒక దుఆ చదవాలి.

సుబ్‌హాన కల్లాహుమ్మ వబిహమ్‌దిక వతబార కస్‌ముక, వతఆలా జద్దుక వలా ఇలాహ గైరుక”” (అబూదావూద్‌, సహీహ్‌ సిఫతుస్‌ సలాతున్‌ నబి, లిల్‌ అల్బానీ రహిమహుల్లాహ్ పేజీ నెంబరు: 93)

7) తరువాత 7 సార్లు తక్బీర్లు  (అల్లాహు అక్బర్‌ )నిదానంగా చెప్పాలి. (తిర్మిజి, అబూదావూద్‌)

ప్రతి తక్బీర్ కు చేతులను భూజాల వరకు లేక చెవుల వరకు ఎత్తాలి.

8) తరువాత ఇమామ్‌ బిగ్గరగా సూరతుల్‌ ఫాతిహా చదవాలి. ఇమామ్‌ వెనుక ఉన్నవారు (ముఖ్తదీలు) మెల్లగా చదవాలి. ఆ తరువాత ఇమామ్‌ వేరొక సూరా చదవాలి. ఇమామ్‌ వెనుక ఉన్నవారు నిశబ్దంగా వినాలి. సూరతుల్‌ ఫాతిహా మినహా ఇతర సూరాలు ముఖ్తదీలు చదవకూడదు.

9) తరువాత రుకూ సజ్దాలు చేసి రెండవ రకాతుకై అల్లాహు అక్బర్‌ అని నిలబడి సూరాలు పఠించక ముందు ఐదు సార్లు తక్బీర్లు  నిదానంగా చెప్పి ప్రతి తక్బీర్ కు చేతులను భుజాల వరకు లేక చెవుల వరకు ఎత్తి ఛాతిపై కట్టుకోవాలి. ( అబూదావూద్‌)

10) పండుగ నమాజు మొదటి రకాతులో ఫాతిహా సూరా చదివిన తరువాత “ఖాఫ్‌ వల్‌ ఖుర్‌ఆనిల్‌ మజీద్‌) సూరా మరియు రెండవ రకాతులో ఫాతిహా సూరా చదివిన తరువాత “ఇఖ్బరబతిస్‌ సాఅతు వన్‌ షఖ్బల్‌ ఖమర్‌” సూరా చదవాలి. (ముస్లిం)

లేక పండుగ నమాజు మొదటి రకాతులో ఫాతిహా సూరా చదివిన తరువాత “సబ్బిహిస్మ రబ్బికల్‌ ఆలా” సూరా మరియు రెండవ రకాతులో ఫాతిహా సూరా చదివిన తరువాత “హల్‌ అతాక హదిసుల్‌ గాషియా” సూరా చదవాలి. (ఇర్వావుల్‌ గలీల్‌: 644)

11) ఆ తరువాత ప్రసంగించడం సున్నతు. ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) హజ్రత్‌ అబూబకర్‌, మరియు హజ్రత్‌ ఉమర్‌ పండుగ నమాజు చేసిన తరువాత ప్రసంగించేవారు. (బుఖారీ, ముస్లిం)

12) పండుగ ప్రసంగం మింబర్ (వేదిక)పై  ఎక్కి ప్రసంగించకూడదు. (బుఖారి, ముస్లిం)

అంటే ఈద్‌గాహ్‌లో మింబర్ తీసుకొపోవడం లేక అక్కడ మింబర్ లా కట్టించి దానిపై ఎక్కి ప్రసంగం చేయకూడదు. మామూలుగా నిలబడి ప్రసంగించాలి.


ఇది “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు విధానము” అనే పుస్తకం నుండి తీసుకోబడింది. కూర్పు: జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ (హఫిజ హుల్లాహ్)


జుమా నమాజుకు త్వరగా వెళ్లడంలో ఘనత, దాన్ని కోల్పొవటం గురించి హెచ్చరిక [వీడియో]

బిస్మిల్లాహ్

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Video Courtesy: Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.

ఈ ఆడియో శుక్రవారం (జుమా) నమాజుకు త్వరగా హాజరు కావడం యొక్క ప్రాముఖ్యతను మరియు దానిని విడిచిపెట్టడం గురించిన తీవ్రమైన హెచ్చరికను వివరిస్తుంది. ఖురాన్ ఆయత్ (సూరా అల్-జుమా) మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హదీసుల ఆధారంగా ఈ విషయం స్పష్టం చేయబడింది. అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించిన హదీసు ప్రకారం, జుమా నమాజుకు వేర్వేరు సమయాలలో (గడియలలో) ముందుగా వచ్చిన వారికి గొప్ప పుణ్యాలు లభిస్తాయి. మొదటి గడియలో వచ్చినవారికి ఒంటెను, రెండవ గడియలో వచ్చినవారికి ఆవును, ఆ తర్వాత గొర్రె, కోడి, మరియు కోడిగుడ్డును బలిదానం చేసినంత పుణ్యం లభిస్తుందని వివరించబడింది. ఇమామ్ ఖుత్బా (ప్రసంగం) ఇవ్వడానికి మింబర్ పైకి వచ్చిన తర్వాత, హాజరైన వారి పేర్లను నమోదు చేసే దేవదూతలు తమ గ్రంథాలను మూసివేసి ప్రసంగాన్ని వింటారని, కాబట్టి ఆలస్యంగా వచ్చేవారు ఈ ప్రత్యేక పుణ్యాన్ని కోల్పోతారని నొక్కి చెప్పబడింది. మరో హదీసులో, జుమా నమాజును నిరంతరంగా వదిలివేసే వారి హృదయాలపై అల్లాహ్ ముద్ర వేస్తాడని, దానివల్ల వారు అశ్రద్ధపరులలో చేరిపోతారని తీవ్రంగా హెచ్చరించబడింది. ముగింపులో, జుమా యొక్క ఘనతను అర్థం చేసుకుని, అజాన్‌కు ముందే మస్జిద్‌కు చేరుకోవాలని, ఈ తప్పనిసరి ప్రార్థనను విడిచిపెట్టే ఘోర పాపానికి దూరంగా ఉండాలని వక్త ఉద్బోధించారు.

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహ్.సోదర మహాశయులారా, జుమా నమాజ్ కు త్వరగా హాజరవటంలోని ఘనత, దాన్ని కోల్పోవటం గురించి హెచ్చరిక, ఈ అంశానికి సంబంధించి ఒక ఆయత్ మరియు రెండు హదీసులు విందాము.

أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا نُودِيَ لِلصَّلَاةِ مِن يَوْمِ الْجُمُعَةِ فَاسْعَوْا إِلَىٰ ذِكْرِ اللَّهِ وَذَرُوا الْبَيْعَ ۚ ذَٰلِكُمْ خَيْرٌ لَّكُمْ إِن كُنتُمْ تَعْلَمُونَ.
ఓ విశ్వాసులారా! శుక్రవారం నాడు నమాజుకు గాను పిలవబడినప్పుడు మీరు అల్లాహ్ ధికర్ వైపునకు పరుగెత్తి రండి మరియు వ్యాపారం వదిలిపెట్టండి. మీరు తెలుసుకున్నట్లయితే ఇది మీకు చాలా మేలైనది.

అన్ అబీ హురైరత రదియల్లాహు అన్హు అన్న రసూలల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ ఖాల్

مَنِ اغْتَسَلَ يَوْمَ الْجُمُعَةِ غُسْلَ الْجَنَابَةِ ثُمَّ رَاحَ فَكَأَنَّمَا قَرَّبَ بَدَنَةً وَمَنْ رَاحَ فِي السَّاعَةِ الثَّانِيَةِ فَكَأَنَّمَا قَرَّبَ بَقَرَةً وَمَنْ رَاحَ فِي السَّاعَةِ الثَّالِثَةِ فَكَأَنَّمَا قَرَّبَ كَبْشًا أَقْرَنَ وَمَنْ رَاحَ فِي السَّاعَةِ الرَّابِعَةِ فَكَأَنَّمَا قَرَّبَ دَجَاجَةً وَمَنْ رَاحَ فِي السَّاعَةِ الْخَامِسَةِ فَكَأَنَّمَا قَرَّبَ بَيْضَةً فَإِذَا خَرَجَ الإِمَامُ حَضَرَتِ الْمَلاَئِكَةُ يَسْتَمِعُونَ الذِّكْرَ ‏”

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారని హజరత్ అబూ హురైరా రదియల్లాహు తలా అన్హు ఉల్లేఖించారు: “ఎవరైతే జుమా రోజు జనాబత్ కు చేసే గుసుల్ లాంటి గుసుల్ స్నానం, అంటే సంపూర్ణ విధంగా స్నానం చేసి మస్జిద్ కు అందరికంటే ముందు వెళ్తాడో అతనికి ఒక ఒంటె బలిదానం ఖుర్బానీ చేసినంత పుణ్యం లభిస్తుంది. రెండవ వేళలో వెళ్ళిన వ్యక్తికి ఆవును బలిదానం ఇచ్చినంత పుణ్యం లభిస్తుంది. మూడవ వేళలో వచ్చిన వారికి కొమ్ములు గల గొర్రెను బలిదానం చేసినంత పుణ్యం లభిస్తుంది మరియు నాలుగవ గడియలో వెళ్ళే వారికి ఒక కోడి అల్లాహ్ మార్గంలో బలిదానం చేసినంత పుణ్యం లభిస్తుంది. ఐదవ వేళలో వెళ్ళే వారికి అల్లాహ్ మార్గంలో ఒక కోడి గ్రుడ్డును దానం చేసినంత పుణ్యం లభిస్తుంది. ఆ తర్వాత ఎప్పుడైతే ఇమాం ఖుత్బా ఇవ్వడానికి మింబర్ పైకి వస్తాడో, దేవదూతలు కూడా ప్రసంగం ఖుత్బా వినడానికి హాజరవుతారు.”

అంటే ఏం తెలిసింది? ఈ ఐదు వేళలు ఏవైతే తెలుపబడ్డాయో, అవి కొందరు పండితుల అభిప్రాయం ప్రకారం ఫజర్ తర్వాత లేదా సూర్యోదయం తర్వాత నుండి ఇమాం మెంబర్ పైకి ఎక్కే వరకు. ఇక ఎవరైతే ఇమాం మెంబర్ పై ఎక్కిన తర్వాత మస్జిద్ లోకి ప్రవేశిస్తారో, ఈ దైవదూతలు ప్రత్యేకంగా జుమా కొరకు వచ్చే వారి గురించి తమ యొక్క దఫ్తర్ లలో, తమ యొక్క నోట్ బుక్స్ లలో ఏదైతే వారి పేర్లు రాసుకుంటూ ఉండడానికి వస్తారో వారి యొక్క జాబితాలోకి చేరకోరు. అంటే ఎంతో గొప్ప పుణ్యాన్ని, జుమాకు సంబంధించిన ప్రత్యేక ఘనతను వారు కోల్పోతున్నారు అని భావం.

మూడవ హదీస్, అన్ ఇబ్ని ఉమర రదియల్లాహు అన్హు అన్నహు సమిఅ రసూలల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ యఖూల్

لَيَنْتَهِيَنَّ أَقْوَامٌ عَنْ وَدْعِهِمُ الْجُمُعَاتِ أَوْ لَيَخْتِمَنَّ اللَّهُ عَلَى قُلُوبِهِمْ ثُمَّ لَيَكُونُنَّ مِنَ الْغَافِلِينَ
“జుమా నమాజు చేయని వారు, జుమా నమాజును వదిలేవారు, వారు తమ ఈ అలవాటును మానుకోకుంటే త్యజించుకుంటే అల్లాహ్ వారి హృదయాలను మూసివేస్తాడు. వారి హృదయాలపై ముద్ర వేస్తాడు. ఏం జరుగుతుంది? ఆ తర్వాత వారు అశ్రద్ధ వహుల్లోకి చేరిపోతారు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా తాను విన్నట్లు అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు తలా అన్హు ఉల్లేఖించారు.

అయితే సోదర మహాశయులారా, పై ఆయత్ మరియు హదీసుల నుండి మనకు తెలిసిన విషయాలు ఏమిటి? జుమా నమాజ్ అజాన్ కంటే ముందే మస్జిద్ లోకి వచ్చి హాజరయ్యే, ఖుత్బా శ్రద్ధగా వినే ప్రయత్నం చేయాలి. జుమా నమాజుకు త్వరగా పోవుటలో చాలా ఘనత ఉంది, ఐదు రకాలుగా దాని గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. జుమా నమాజ్ వదిలే వారికి భయంకరమైన హెచ్చరిక ఇవ్వబడింది. అలా చేయుట వల్ల వారి హృదయాలపై ముద్ర వేయడం జరుగుతుంది. మంచి విషయాలు, ధర్మ విషయాలు, అల్లాహ్ యొక్క బోధనలు అర్థం చేసుకోకుండా మూసివేయబడతాయి. అల్లాహు అక్బర్. ఇది ఎంత భయంకరమైన శిక్షనో గమనించండి. అల్లాహ్ తలా మనందరికీ జుమా యొక్క ఘనతను అర్థం చేసుకుని, దానిని పాటించేటువంటి సద్భాగ్యం ప్రసాదించు గాక.

వ ఆఖిరు దఅవానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్.

ఇతరములు: