664. హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ వూద్ (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-
తహజ్జుద్ నమాజ్ చేస్తూ ఉండేవాళ్ళు (భోజనానికి) వచ్చేందుకు, నిద్రిస్తున్న వాళ్ళు మేల్కొనేందుకు వీలుగా బిలాల్ (రధి అల్లాహు అన్హు) అజాన్ ఇస్తుంటారు. అందువల్ల ఆయన అజాన్ విని ఎవరూ సహరీ భోజనం తినడం మానివేయనవసరం లేదు. ఆయన ఇచ్చే అజాన్ విని ఉషోదయమయిందని గాని, లేక తెల్లవారిపోయిందని గాని ఏ ఒక్కరూ భావించకూడదు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా చెబుతూ తమ చేతివ్రేళ్ళతో సూచించారు. మొదటి వాటిని పైకి ఎత్తారు. తరువాత క్రిందికి దించారు. అంటే ఈ విధంగా (తెలుపు) వ్యాపించే వరకు అని అర్ధం.