434. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:-
మహొన్నతుడు, శుభదాయకుడు అయిన మన ప్రభువు ప్రతిరోజు రాత్రి చివరి మూడోజామున మొదటి ఆకాశం పై అవతరించి (మానవుల్ని సంబోధిస్తూ)
“నన్ను మొర పెట్టుకునే వారెవరైనా ఉన్నారా? (ఈ సమయంలో) నేను వారి మొరలను ఆలకిస్తాను. నన్ను పిలిచే వారెవరైనా ఉన్నారా? నేను వారి పిలుపుకు సమాధానమిస్తాను. నన్ను క్షమాపణ కోరే వారెవరైనా ఉన్నారా? నేను వారిని క్షమిస్తాను”
అని అంటాడు.