1751. హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ (రధి అల్లాహు అన్హు) కధనం :-
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దగ్గరికి కొందరు ఖైదీలు వచ్చారు. వారిలో ఒక మహిళా ఖైదీ పాలిండ్లలో పాలు పొంగుతున్నాయి. ఆమె ఏ చంటి పిల్లవాడ్ని చూసినా గుండెలకు హత్తుకొని అతనికి పాలు పట్టేది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ స్త్రీని చూసి మాతో “ఈ స్త్రీ తన పిల్లవాడ్ని అగ్నిలో విసిరి వేస్తుందంటారా?” అని అడిగారు. దానికి మేము “విసిరివేయదు, తనకు నిరోధక శక్తి ఉన్నంతవరకు ఆమె తన పిల్లవాడ్ని అగ్నిలో ఎంతమాత్రం విసిరి వేయదు” అని అన్నాము. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “ఈ స్త్రీ పిల్లవాడి పట్ల ఎంత దయామయురాలో, అల్లాహ్ తన దాసుల పాలిట అంతకంటే ఎంతో ఎక్కువ దయామయుడు” అని అన్నారు.