623. హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:-
మానవునికి సిరిసంపదలతో నిండిన ఓ పెద్ద అరణ్యం లభించినప్పటికీ, అలాంటి మరో అరణ్యం దొరికితే బాగుండునని భావిస్తాడు. అతని పేరాశ కడుపు (సమాధి) మట్టితో మాత్రమే నిండుతుంది. అయితే ప్రాపంచిక వ్యామోహం వదలి పశ్చాత్తాప హృదయంతో దేవుని వైపుకు మరలితే అలాంటి వ్యక్తిని దేవుడు మన్నిస్తాడు. అతని పశ్చాత్తాపాన్ని స్వీకరిస్తాడు (అతనికి ఆత్మ సంతృప్తి భాగ్యం ప్రసాదిస్తాడు).
[సహీహ్ బుఖారీ : 81 వ ప్రకరణం – రిఖాఖ్, 10 వ అధ్యాయం – మాయత్తఖా మిన్ ఫిత్నతిల్ మాల్]
Read English Version of this Hadeeth
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net