పశ్చాత్తాపం (Repentance)

repentance-telugu-islam

పుస్తకం నుండికలామే హిక్మత్ – 1(వివేక వచనం)
రచన: సఫీ అహ్మద్ మదనీ
అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్
ప్రకాశకులు: జమీ అతే అహ్ లె హదీస్, ఆంధ్రప్రదేశ్

[ఇక్కడ PDF డౌన్ లోడ్ చేసుకోండి]

క్లుప్తంగా ఇమామ్ బుఖారీ & ఇమామ్ ముస్లిం గురుంచి | అల్-లూలు వల్ మర్జాన్

nature-bukhari-muslim

Brief Biography of Imam Bukhari & Imam Muslim

[ఇక్కడ చదవండి / PDF డౌన్లోడ్ చేసుకోండి]

రచయిత :సయ్యిద్ షబ్బీర్ అహ్మద్
మూలం:మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) గ్రంధ పరిచయం నుండి

కరుణామయుడు, కృపాసాగరుడయిన అల్లాహ్ పేరుతో

అల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదుల్ ముర్సలీన్, అలా ఆలిహీ వ అస్ హాబిహీ అజ్మయీన్. ఈ గ్రంథం అసలు పేరు అరబీ భాషలో “అల్ లూలు వల్ మర్జాన్”. ఇందులోని పదావళి దివ్యఖుర్ఆన్లో ఈ విధంగా ప్రస్తావించబడింది:

مَرَجَ الْبَحْرَيْنِ يَلْتَقِيَانِ بَيْنَهُمَا بَرْزَخٌ لَّا يَبْغِيَانِ فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ يَخْرُجُ مِنْهُمَا اللُّؤْلُؤُ وَالْمَرْجَانُ فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ

“ఆయన రెండు సముద్రాలను పరస్పరం కలిసిపోయేలా వదలి పెట్టాడు. అయినా వాటిమధ్య ఒక అడ్డుతెర ఉంది. దానివల్ల అవి ఒకదానిలోకొకటి చొచ్చుకుపోలేవు. కనుక (మానవులారా! జిన్నులారా!!) మీ ప్రభువు శక్తి పరిధిలోని ఏ మహిమను మీరు నిరాకరించగలరు? ఈ సముద్రాలలో ముత్యాలు, పగడాలు కూడా లభిస్తాయి. కనుక (మానవులారా! జిన్నులారా!!) మీ ప్రభువులోని ఏ ఔన్నత్యాన్ని మీరు కాదనగలరు?”(55:19-23)

ఈ గ్రంథంలో మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) సంప్రదాయాల (హదీసుల)కు సంబంధించిన సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లిం అనే రెండు హదీసు గ్రంథాలను రెండు సముద్రాలతో పోల్చడంజరిగింది. అయితే ప్రస్తుత సంకలన కర్త అల్లామా ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ హదీసుల మూలం (Text) ని బుఖారీ గ్రంథం నుండి గ్రహించి స్కంధాలు, అధ్యాయాల క్రమాన్ని, శీర్షికలపేర్లను మాత్రం ముస్లిం గ్రంథం నుండి స్వీకరించారు. అదీగాక పై రెండు గ్రంథాలలోనూ ఒకే ఉల్లేఖకుడు తెలిపిన ఉమ్మడి హదీసుల్ని మాత్రమే ఈ గ్రంథం కోసం ఎంచుకున్నారు. వీటిని “ముత్తఫఖున్ అలైహ్” (ఉభయోకీభవిత) హదీసులని అంటారు. వీటినే ఈ సంకలనకర్త ముత్యాలు,పగడాలుగా అభివర్ణించి, దాన్నే తన గ్రంథానికి నామకరణం చేశారు.

అంతిమ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి ప్రవచనాలు, ఆచార వ్యవహారాలు, ఆజ్ఞలు, అనుజ్ఞలు, అలవాట్లు, అభిరుచులు, కదలికలు, కథనాలు, సలహాలు, సూచనలు, స్వరూప స్వభావాలు -ఒక్కటేమిటి, ఆ మహనీయుని జీవితంలోని ప్రతి అంశానికి, ప్రతి కోణానికి సంబంధించిన హదీసుల్ని సేకరించి, సంకలనం చేసి పకడ్బందీగా భద్రపరిచారు హదీసు వేత్తలు. ఈ మహాకార్యం వెనుక వారి అవిరళ కృషి, అవిశ్రాంత శ్రమ, అసామాన్య సాహసం మనకు స్పష్టంగా గోచరిస్తాయి.

హదీసువేత్తలు ఉల్లేఖకుల నుండి హదీసుల్ని సేకరిస్తున్నప్పుడు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గౌరవోన్నతుల పై అణుమాత్రం కూడా మచ్చరాని విధంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ మహానాయకుని పట్ల విశ్వాసం, ప్రేమాభిమానాలు ఇసుమంత సడలినట్లనిపించినాసరే అలాంటి హదీసుల్ని వారసలు స్వీకరించనే లేదు. హదీసుల సేకరణ తరువాత వారా హదీసుల్ని పరి పరి విధాల పరిశీలించి, శల్యపరీక్ష చేసి, క్షుణ్ణంగా వడపోసి వాటి నుండి పూర్తిగా నమ్మకమయినవని, నిజమయినవని ధృవీకరించుకున్న హదీసుల్ని మాత్రమే ఎంచుకొని సంకలనం చేశారు. హదీసులు ప్రామాణికత విషయంలో వారి దైవభీతి పరాయణత, నిజాయితీ, విశ్వసనీయలతో పాటు, హదీసుల ప్రామాణికతను పరిశీలించడానికి వారు నిర్దేశించిన కొలమానాలు యావత్తు ముస్లిం జగత్తులో ఎంతో గుర్తింపు పొందాయి. ఇలా సంకలనం చేసిన గ్రంథాలలో సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లిం, తిర్మిజి, అబూదావూద్, నసాయి. ఇబ్ను మాజా, ఇమాం మాలిక్ గారి మువత్తా, ఇమాం ముహమ్మద్ గారి మువత్తా, ముస్నద్ అహ్మద్, దార్మి, దారెఖత్ని, బైహఖీ మొదలైనవెన్నో ఉన్నాయి. వీటిలో హదీసుల ఆరోగ్యస్థితి, ప్రామాణికతల రీత్యా మొదటి ఆరు గ్రంథాలు అత్యున్నత స్థాయికి చెందిన గ్రంథాలుగా ఖ్యాతి చెందాయి. ఈ ఆరు గ్రంథాలను “సహీ సిత్తా” (షడ్నీజాలు) అంటారు.

వీటిలో మన సంకలనకర్త తన గ్రంథం కోసం ఎంచుకున్న రెండు గ్రంథాలు సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లింలను గురించి, వాటిని సంకలనం చేసిన ప్రముఖ హదీసు వేత్తలు ఇమాం బుఖారీ (రహిమహుల్లాహ్), ఇమాం ముస్లిం (రహిమహుల్లాహ్) గార్ల జీవిత చరిత్రలను గురించి ఇక్కడ సంక్షిప్తంగానయినా తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

సహీహ్ బుఖారీ గ్రంథాన్ని సంకలనం చేసిన ఇమామ్ అబూ అబ్దుల్లా ముహమ్మద్ బిన్ ఇస్మాయీల్ బిన్ ఇబ్రాహీమ్ అల్ బుఖారీ (రహిమహుల్లాహ్) హిజ్రీ శకం 194, షవ్వాల్ మాసం 13వ తేదీ శుక్రవారం నాడు బుఖారాలో ఒక పేద కుటుంబంలో జన్మించారు. ఆయన పదేళ్ళ ప్రాయంలో విద్యాభ్యాసం ప్రారంభించారు. స్వగ్రామంలో ప్రాథమిక విద్యనభ్యసించిన తరువాత ఉన్నత విద్యకోసం ముస్లిం జగత్తులోని యావత్తు ప్రధాన విద్యా కేంద్రాలన్నీ పర్యటించారు. ఈ సుదీర్ఘ పర్యటనలో ఆయన 1080 మంది ధర్మవేత్తల నుండి హదీసు విద్య నేర్చుకున్నారు. పదేళ్ళ ప్రాయంలోనే ఆయన బుఖారాలో ఆనాటి హదీసు విద్యాపారంగతులు ఇమామ్ దాఖలీ (రహిమహుల్లాహ్) గారి పాఠశాలలో చేరారు.

ఒక రోజు ఇమామ్ దాఖలీ (రహిమహుల్లాహ్) ఒక హదీసు ప్రమాణాన్ని పేర్కొంటూ “సుఫ్యాన్ అన్ అబీజుబైర్ అన్ ఇబ్రాహీం” అని అన్నారు. అప్పుడు ఇమాం బుఖారీ (రహిమహుల్లాహ్) కల్పించుకొని “ఈ హదీసు ప్రమాణం ఈ విధంగా లేదండీ! అబూజుబైర్ ఈ హదీసుని ఇబ్రాహీం నుండి ఉల్లేఖించ లేదు”అని అన్నారు.

అతి పిన్న వయస్సులో ఉన్న ఒక శిష్యుడు తనను ఇలా తప్పుబట్టడంతో గురువు గారుఉలిక్కిపడ్డారు. ఆయన కోపంతో కొర కొర చూశారు. ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) గురువు గారి పట్లఎంతో వినయ విధేయతలతో వ్యవహరిస్తూ “మీ దగ్గర అసలు గ్రంథం ఉంటే అందులో ఓసారిచూసుకోండి” అని ప్రశాంతంగా అన్నారు.

ఇమామ్ దాఖలీ (రహిమహుల్లాహ్) ఇంటికి వెళ్ళి అసలు గ్రంథాన్ని పరిశీలించి ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) చేసిన విమర్శ సహేతుకమయినదేనని గ్రహించారు. ఆయన తిరిగి వచ్చి “అయితే సరయిన ప్రమాణం ఏమంటావు?” అని అడిగారు. ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) తక్షణమే సమాధానమిస్తూ “సుఫ్యాన్ అనిజ్జుబైరి వహు వన్బు అదియ్యి అన్ ఇబ్రాహీం (ఇబ్రాహీం నుండి జుబైర్ బిన్ అదీ రహిమహుల్లాహ్-ఉల్లేఖించారు; అబూజుబైర్ అనడం సరికాదు)” అని అన్నారు.

అప్పటికి ఇమామ్ బుఖారీ వయస్సు పదకొండేండ్లు కూడా నిండలేదు. పదహారు సంవత్సరాలవయస్సులో ఆయన హజ్రత్ అబ్దుల్లా బిన్ ముబారక్ (రహిమహుల్లాహ్), ఇమామ్ వకీ (రహిమహుల్లాహ్)లు సేకరించిన హదీసులన్నీ కంఠస్తం చేశారు. 18వ యేట చరిత్ర గ్రంథాన్ని రచించ నారంభించారు. ఇందులో సహాబీలు (ప్రవక్త ప్రత్యక్ష అనుచరులు), తాబయీల (ఆ తరువాతి అనుచరుల) జీవిత చరిత్ర, వారుచెప్పిన మాటలు, చేసిన నిర్ణయాలన్నీ సమీకరించబడ్డాయి. ఈ గ్రంథాన్ని ఆయన దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సమాధి దగ్గర కూర్చొని వెన్నెల రాత్రులలో రాశారు.

ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) అసామాన్య జ్ఞాపకశక్తి గల మేధా సంపన్నులు. ఎంత పెద్ద హదీసయినాసరే ఒక్కసారి చదివితే లేక వింటే చాలు కంఠస్తమయిపోయేది.

ఇమాం బుఖారీ (రహిమహుల్లాహ్) గారి సమకాలిక హదీసువేత్త హామిద్ బిన్ ఇస్మాయీల్ ఇలాతెలియజేస్తున్నారు: “ఇమామ్ బుఖారీ బస్రాలో మాతో పాటు హదీసు తరగతులకు హాజరవుతూ ఉండేవారు. అయితే ఆయన కేవలం వినేవారు. ఒక్క అక్షరం కూడా వ్రాసుకునేవారు కాదు. ఈవిధంగా 16 రోజులు గడిచిపోయాయి. చివరికి ఓ రోజు నేను, హదీసులు వ్రాసుకోకపోవడం పట్ల ఆయన్ని విమర్శించాను. దానికాయన సమాధానమిస్తూ “ఈ పదహారు రోజుల కాలంలో నీవు వ్రాసుకున్న విషయాలన్నీ తీసుకురా. వాటన్నిటినీ నేను చూడకుండా చదువుతాను విను” అని అన్నారు. ఆ విధంగా ఆయన పదిహేను వందలకు పైగా హదీసుల్ని ఒక్క పొల్లు పోకుండా ఉన్నది ఉన్నట్లు మాకు వినిపించారు. స్వయంగా మేము అనేక చోట్ల మా రాతల్లో దొర్లిన తప్పులను ఆయన నోట విని సవరించుకోవలసి వచ్చింది”.

ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) గారి జ్ఞాపకశక్తి గాధలు దశ దిశలా వ్యాపించిపోయాయి. ఆయనఏ ప్రాంతానికి బయలుదేరినా, ఆయనకు ముందే ఆ ప్రాంతానికి ఆయన పేరు ప్రఖ్యాతులు చేరుకునేవి. ప్రజలు వివిధ రకాలుగా ఆయన జ్ఞాపకశక్తిని పరీక్షించేవారు. చివరికి వారు ఆయన అసాధారణ జ్ఞాపకశక్తికి ఆశ్చర్యచకితులయి ఎంతో అభినందించేవారు. ఆ కాలంలోనే షేఖ్ అబూ జరఆ (రహిమహుల్లాహ్), అబూ హాతిం (రహిమహుల్లాహ్), ముహమ్మద్ బిన్ నస్ర్ (రహిమహుల్లాహ్), ఇబ్ను ఖుజైమా (రహిమహుల్లాహ్), ఇమామ్ తిర్మిజి (రహిమహుల్లాహ్), ఇమామ్ ముస్లిం (రహిమహుల్లాహ్)లు ఆయనకు శిష్యులయిపోయారు.

ఇమాం బుఖారీ (రహిమహుల్లాహ్) ని ప్రశంసిస్తూ కొందరు ప్రముఖులు వెలిబుచ్చిన అభిప్రాయాలు వినండి:

“బుఖారీ (రహిమహుల్లాహ్) హదీసు విద్యలో నాకంటే ఎక్కువ వివేకం, దూరదృష్టి కల వ్యక్తి. ఆయన దైవదాసుల్లోకెల్లా ఎక్కువ వివేచనాపరుడు. నిజం చెప్పాలంటే బుఖారీని మించిన వారే లేరు.”- ఇమామ్ దార్మి (రహిమహుల్లాహ్)

“ఖురాసాన్ భూభాగంలో ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) లాంటి మహోన్నత వ్యక్తి మరొకరుజన్మించ లేదు.”-ఇమామ్ అహ్మద్ (రహిమహుల్లాహ్)

“స్వయంగా ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) కూడా తన లాంటి వ్యక్తిని చూడలేదు.”- ఇబ్నుల్ మదీనీ (రహిమహుల్లాహ్)

“ఇమామ్ ముస్లిం బిన్ అల్ హిజాజ్ (రహిమహుల్లాహ్) ఓ సారి ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) సన్నిధికివెళ్ళి ఆయన రెండు కళ్ళ మధ్య (నుదుటిని) ముద్దాడుతుండగా నేను కళ్ళారా చూశాను. ఆ తరువాతఆయన ‘గురువులకు గురువూ! హదీసువేత్తల నాయకా! మీ పాదాలు చుంబించడానికి నాకు అనుమతి ఇవ్వండి’ అని అన్నారు.’- అహ్మద్ బిన్ హమ్డాన్ (రహిమహుల్లాహ్)

“ఆకాశం క్రింద ఈ ధరిత్రిపై ముహమ్మద్ బిన్ ఇస్మాయీల్ బుఖారీ (రహిమహుల్లాహ్)ని మించిన హదీసు పండితుడు, పారంగతుడు మరొకరు లేరు.” – ఇబ్నె ఖుజైమా (రహిమహుల్లాహ్)

ఇమామ్ జీవిత విశేషాల్లో ముఖ్యంగా చెప్పుకోదగిన ఒక విశేషం ఉంది. ఆయన తనజీవితంలో ఏనాడూ ఎవరినీ నిందించలేదు, దూషించలేదు, బాధించనూలేదు. ఆయన స్వయంగా ఈవిషయాన్ని ప్రస్తావిస్తూ “పరలోక విచారణ దినాన పరోక్ష నిందను గురించి నన్ను ప్రశ్నించడం జరగదనినేను ఆశిస్తున్నాను” అని అప్పుడప్పుడు అంటుండేవారు.

ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) ఎంతో ఆత్మాభిమానం గల వ్యక్తి. దీన్ని గురించి ఉమర్ బిన్ హఫ్స్(రహిమహుల్లాహ్) ఇలా తెలియజేస్తున్నారు: “బస్రాలోని హదీసు పాఠశాలలో నేను, ఇమామ్ బుఖారీ సహవిద్యార్థులంగా ఉండేవాళ్ళం. ఒక రోజు ఇమామ్ పాఠశాలకు రాలేదు. విచారిస్తే ఆ రోజు ఇమామ్ బుఖారీ దగ్గర ధరించి బయటికి రావడానికి సరిపడ్డ బట్టలు కూడా లేవని తెలిసింది. ఈ విషయం ఇతరుల ముందు బహిర్గతం కావడం ఆయనకు ఏ మాత్రం ఇష్టంలేదు. అందువల్ల ఆయన ఆ రోజు ఇంటి నుంచి బయటికే రాలేదు. ఆ తరువాత మేము ఆయన కోసం బట్టలు సంపాదించి తీసికెళ్ళి ఇచ్చాము. దాంతో ఆయన మరునాటి నుంచి పాఠశాలకు రావడం ప్రారంభించారు.

ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) రాజులకు, పాలకులకు ఎల్లప్పుడూ దూరంగా ఉండేవారు.అయితే ఓ రోజు బుఖారా గవర్నర్, తన దర్బారుకు వచ్చి తనకు హదీసులు వినిపించవలసిందిగా ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్)కి విజ్ఞప్తి చేశాడు. దాంతో పాటు, ఇతరులెవరూ పాల్గొనకుండా ఉండే ఓ ప్రత్యేక సమావేశంలో తన పిల్లలకు హదీసు విద్య నేర్పవలసిందిగా కూడా అతను ఇమామ్ని కోరాడు.ఇమామ్ ఈ రెండు కోర్కెలను తిరస్కరిస్తూ “విద్యను గురువు దగ్గరకెళ్ళి నేర్చుకోవలసి ఉంటుంది.నా సమావేశంలో ధనికుడు-పేద అనే తారతమ్యం లేదు. ఇక్కడికొచ్చి హదీసు విద్య నేర్చుకోవడానికిప్రతి ఒక్కరికీ హక్కుంది” అని సమాధానమిచ్చారు.

ఈ సమాధానం విని బుఖారా గవర్నర్ ఆగ్రహోదగ్రుడయ్యాడు. ఆ తరువాత వారిద్దరి మధ్య దూరం మరింత పెరిగిపోయింది. గవర్నర్ ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) మీద పగబూని బుసలు కొట్టడం ప్రారంభించాడు. దాంతో ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) బుఖారా పట్నం వదలి ఖర్తుంగ్ అనే ప్రాంతానికివెళ్ళి తలదాచుకోవలసి వచ్చింది. అక్కడకు వెళ్ళిన తరువాత ఆయన వ్యాధిగ్రస్తులయ్యారు. చివరికి హిజ్రి శకం 256లో ఈదుల్ ఫిత్ర్ నాడు 62 సంవత్సరాల వయస్సులో ఆయన తనువు చాలించారు. -రహ్మతుల్లా అలై-

ఇది ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) జీవితాంతం శ్రమించి, అనేక ప్రాంతాలు పర్యటించి సంకలనం చేసిన హదీసు గ్రంథం. ఆయన వివిధ ప్రాంతాల నుండి మొత్తం ఆరు లక్షల హదీసులు సేకరించి, వాటిలో ఈ గ్రంథం కోసం అత్యంత ప్రామాణికమైన 7,397 హదీసుల్ని ఎంపిక చేసి సంకలనం చేశారు. ఈ 7,397 హదీసుల్లో నుండి పునరావృత్త హదీసుల్ని తీసివేస్తే 2,602 హదీసులు మాత్రమే మిగిలి ఉంటాయి. ఇవన్నీ పటిష్ఠమైన ఆధారాలు గల నిజమైన హదీసులు. వీటిని ఆయన వివిధ శీర్షికల క్రింద ప్రకరణలుగా, అధ్యాయాలుగా విభజించి ఒక క్రమ పద్ధతిలో సంకలనం చేశారు.

ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) ఈ మహాకార్యాన్ని నిరంతరాయంగా 16 సంవత్సరాల పాటు అహోరాత్రులు చెమట ధారపోసి పూర్తి చేశారు. ఆయన ప్రతి హదీసు గ్రంథస్తం చేయడానికి ముందుగా స్నానం చేసి, రెండు రకాతులు నఫిల్ నమాజ్ చేసేవారు. ఆ తరువాతనే ఆ హదీసు రాయడానికి ఉపక్రమించేవారు. ఈ విధంగా ఆయన మొత్తం హదీసుల్ని పూర్తి పరిశుద్ధావస్థలో, ఎంతో భక్తిభావంతో గ్రంధస్తం చేశారు.

ప్రసిద్ధి చెందిన వందలాది మంది హదీసువేత్తలు ఈ గ్రంథం ప్రామాణికతను పరీక్షించడానికివివిధ రకాలుగా ప్రయత్నించారు. కాని ఏ ఒక్కరూ ఇందులోని ఏ ఒక్క హదీసు ప్రామాణికతతో కూడా విభేదించలేకపోయారు. కనీసం దానిపట్ల సందేహం కూడా వెలిబుచ్చలేకపోయారు. చివరికి వారంతా దివ్యఖుర్ఆన్ తరువాత పటిష్ఠమైన ప్రామాణికతతో కూడిన నిజగ్రంథం ఏదయినా ఉందంటే అది సహీహ్ బుఖారీ మాత్రమేనని తీర్మానించారు. ఈ విధంగా ఇస్లామీయ గ్రంథాలలో సహీహ్ బుఖారీ ద్వితీయ స్థానం పొందగలిగింది.

ఈ గ్రంథ ప్రాశస్త్యం, ప్రత్యేకతలను గురించి చెప్పాలంటే ఎన్నో విషయాలున్నాయి. ఇక్కడరెండు విషయాలను మాత్రం ప్రస్తావిస్తున్నాం. ఇందులోని హదీసుల్ని స్వయంగా ఇమామ్ బుఖారీ(రహిమహుల్లాహ్) నోట తొంభై వేల మంది హదీసువేత్తలు విన్నారు. ఈ గ్రంథానికి 53 వివరణ గ్రంథాలువెలువడ్డాయి. వాటిలో కొన్ని వివరణ గ్రంథాలు పద్నాలుగేసి సంపుటాలలో వెలువడ్డాయి. దీన్ని బట్టిసహీహ్ బుఖారీ ఎంత జనాదరణ పొందిన గ్రంథమో ఊహించవచ్చు.

సహీహ్ ముస్లిం గ్రంధాన్ని సంకలనం చేసిన ఇమామ్ అబుల్ హుసైన్ ముస్లిం బిన్ హిజాజ్(రహిమహుల్లాహ్) హిజ్ర శకం 204లో నీషాపూర్లో జన్మించారు. బాల్యం నుండే హదీసు విద్యార్జనలో నిమగ్నులయిపోయారు. హదీసుల అన్వేషణ కోసం ఆయన ఇరాఖ్, హిజాజ్, ఈజిప్టు దేశాలు పర్యటించి, అక్కడి పండితుల దగ్గర హదీసులు నేర్చుకున్నారు. అలాంటి పండితులలో ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) గారి గురువులు కూడా ఉన్నారు. చివరికి ఆయన నీషాపూర్లో ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్)ని కలుసుకొని, ఆయన దగ్గర కూడా శిష్యరికం చేశారు.

ఆ కాలంలో గొప్ప గొప్ప హదీసువేత్తలు సయితం తరచుగా ఇమామ్ ముస్లిం (రహిమహుల్లాహ్) దగ్గరకొచ్చి హదీసులు వినిపోతుండేవారు. వారిలో అబూ హాతిం రాజి (రహిమహుల్లాహ్), మూసాబిన్ హారూన్(రహిమహుల్లాహ్), అహ్మద్ బిన్ సల్మ (రహిమహుల్లాహ్), ఇమామ్ తిర్మిజీ (రహిమహుల్లాహ్) ప్రభృతులు కూడా ఉన్నారు.ఆయన బాల్యం నుండి అంతిమ శ్వాస వరకు ఎంతో దైవభీతి, ధర్మపరాయణతలతో కూడిన పవిత్ర జీవితం గడిపారు. ఆయన ఏనాడూ ఒకరిని నిందించడం గాని, బాధించడం గాని చేయలేదు.

ఇమామ్ ముస్లిం మరణ సంఘటన చాలా విచిత్రంగా జరిగింది. ఒక సారి ఓ పండిత గోష్ఠిలో ఒక వ్యక్తి ఏదో హదీసుని గురించి సమాచారం అడిగాడు. అయితే ఆ సమయంలో ఇమామ్ గారికి ఆ హదీసు గురించిన సరయిన వివరాలు తెలియకపోవడం వల్ల సమాధానం ఇవ్వలేకపోయారు.తరువాత ఆయన ఇంటికి వెళ్ళి ఆ హదీసుని అన్వేషించడం ప్రారంభించారు. గ్రంథ పుటలను తిరగేస్తూ ప్రక్కనే ఉన్న ఖర్జూరపండ్ల బుట్టలో నుంచి ఒక్కొక్క ఖర్జూరాన్ని తీసి తింటూ పోయారు.హదీసు అన్వేషణలో తానెన్ని ఖర్జూర పండ్లు తిన్నానన్న సంగతిని కూడా గమనించలేదు. చివరికి అన్వేషిస్తున్న హదీసు లభించిన తరువాత బుట్ట వైపు చూస్తే అది దాదాపు ఖాళీ అయిపోయింది.అప్పుడర్ధమైంది ఆయనకు తాను బుట్టలోని పండ్లన్నీ తిన్నానని. కాని ఇక చేసేదేమీ లేదు; జరగవలసింది జరిగిపోయింది. ఎక్కువ పండ్లు తినడం వల్ల ఆయన వ్యాధిగ్రస్తులయ్యారు. ఆ వ్యాధితోనే ఆయన హిజ్రీ శకం 261, రజబ్ నెల 24వ తేదీ ఆదివారం నాడు సాయంత్రం శాశ్వతంగా ఇహలోకం వీడిపోయారు. చనిపోయే నాటికి ఆయన వయస్సు 55 సంవత్సరాలు మాత్రమే. స్వగ్రామమైన నీషాపూర్లోనే ఆయన్ని ఖననం చేశారు.

అబూహాతిం (రహిమహుల్లాహ్) ఇలా తెలియజేస్తున్నారు: “ఇమామ్ ముస్లిం (రహిమహుల్లాహ్) చనిపోయిన తరువాత ఓ రాత్రి నేను ఆయన్ని కలలో చూశాను. ఆయన దగ్గరికెళ్ళి మీ పరిస్థితి ఎలా ఉందని అడిగాను. దానికి ఇమామ్ ముస్లిం (రహిమహుల్లాహ్) అల్లాహ్ తనకు మంచి స్థితి కల్పించాడని, స్వర్గంలో తాను కోరుకున్న ప్రదేశానికి వెళ్ళే, కోరుకున్న చోట ఉండే అనుమతినిచ్చాడ’ని అన్నారు.”

ఈ గ్రంథం కూడా హదీసుల ప్రామాణికత రీత్యా, వాటి ఆరోగ్యస్థితి రీత్యా సహీహ్ బుఖారీకిఏ మాత్రం తీసిపోదు. సహీహ్ ముస్లిం కూడా సహీహ్ బుఖారీతో సమానమైన విలువ గల గ్రంథమన్న విషయంతో ధర్మవేత్తలంతా ఏకీభవించారు.

ఇమామ్ ముస్లిం (రహిమహుల్లాహ్) ఈ గ్రంథాన్ని ఎంతో నేర్పుతో, వివేకంతో సంకలనం చేశారు.అందువల్ల దీన్ని చాలా సులభంగా అధ్యయనం చేయడానికి, అర్థం చేసుకోవడానికి అవకాశం కలిగింది. ఇమామ్ ముస్లిం (రహిమహుల్లాహ్) ఈ గ్రంథంలో ఇంచుమించు ఒకే భావం గల హదీసులన్నీ ఒకచోట చేర్చారు. దాంతో పాటు హదీసుల ప్రమాణ పద్ధతుల్ని, వాటి పదజాలాల్లోని వ్యత్యాసాలను కూడా సంక్షిప్త వాక్యాలలో కడు జాగ్రత్తగా తెలియజేశారు.

ఇమామ్ ముస్లిం (రహిమహుల్లాహ్) యావత్తు ముస్లిం జగత్తులో జరిపిన తన సుదీర్ఘ పర్యటన సందర్భంగా నాలుగు లక్షల హదీసుల్ని సేకరించారు. మొదట వాటిలో ఒక లక్ష పునరావృత హదీసుల్ని ఏరివేసి మూడు లక్షల హదీసుల్ని సంకలనం చేశారు. ఆ తరువాత ఓ సుదీర్ఘ కాలం పాటు వాటిని నిశితంగా పరిశీలించి చివరికి అన్ని విధాల నమ్మకమైనవని, ప్రామాణికమైనవని, భావించినహదీసుల్ని మాత్రమే ఆయన ఈ గ్రంథానికి ఎంచుకున్నారు. ఇలా మూడు లక్షల హదీసుల్లో 7,275హదీసులు మాత్రమే గ్రంథస్తం చేయబడ్డాయి. అయితే వాటిలోనూ పునరావృత హదీసుల్ని తొలగిస్తే నాలుగు వేల హదీసులు మాత్రమే మిగులుతాయి.

ఇమామ్ ముస్లిం (రహిమహుల్లాహ్) స్వయంగా తన గ్రంథం గురించి ఇలా అన్నారు: “నేనీ గ్రంథంలోఏ హదీసుని గ్రంథస్తం చేసినా క్షుణ్ణంగా ఆలోచించిన మీదట తగిన ఆధారాలతోనే దాన్ని గ్రంథస్థం చేశాను. అలాగే ఈ గ్రంథంలో నుంచి ఏ హదీసుని తొలగించినా క్షుణ్ణంగా ఆలోచించిన తరువాత తగిన ఆధారాలతోనే దాన్ని తొలగించాను. అందువల్ల ప్రపంచంలోని జనమంతా రెండొందల యేండ్లపాటు హదీసుల్ని పరిశీలించి రాసినా, చివరికి వారి నమ్మకం ఈ గ్రంథం మీదే ఉంటుంది.”

సహీహ్ ముస్లిం, సహీహ్ బుఖారీ గ్రంథాలలో ప్రామాణికత తదితర విషయాల రీత్యా ఏదిగొప్ప అనే విషయంలో ధర్మవేత్తల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. సహీహ్ బుఖారీ అన్నిటికంటేఉన్నతమైనదని కొందరు అభిప్రాయపడితే, సహీహ్ ముస్లిం అన్నటికంటే ఉన్నతమైన గ్రంథమని,మరి కొందరు అభిప్రాయపడ్డారు. ఈ రెండు అభిప్రాయాలకు భిన్నంగా ఇంకొందరు, కొన్ని విషయాలరీత్యా సహీహ్ బుఖారీ ఉన్నతమైనది, మరికొన్ని విషయాల రీత్యా సహీహ్ ముస్లిం ఉన్నతమైనదనిఅభిప్రాయపడ్డారు.

ఏమయినప్పటికీ ఈ గ్రంథకర్తలిద్దరూ గొప్ప ధర్మపరాయణులు, దైవభీతిపరులు, నిజాయితీపరులన్న విషయంలో మాత్రం ఎవరి మధ్యా ఎలాంటి భేదాభిప్రాయం లేదు. అలాంటి మహనీయులు సంకలనం చేసిన బుఖారీ, ముస్లిం గ్రంథాలలోని ఏకీభవిత (ముత్తఫఖుల్అలై) హదీసుల సంగతి ఇక చెప్పేదేముంది? పటిష్ఠమైన ప్రామాణిక గ్రంథాలలోని ఈ ‘ఏకీభవిత’ హదీసులు మరెంత ప్రామాణికమైనవో ప్రత్యేకంగా వివరించనవసరం లేదు.

సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లింలను రెండు సముద్రాలుగా, వాటిలో ఉన్న హదీసుల్నిముత్యాలు, పగడాలుగా ప్రస్తుత సంకలన కర్త ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ అభివర్ణించిన సంగతిప్రారంభంలో నేను ప్రస్తావించాను. అంటే ఒక సముద్రంలో ముత్యాలు ఉంటే, మరో సముద్రంలోపగడాలు ఉన్నాయన్నమాట. ఈ రెండు సముద్రాలలోని ముత్యాలు, పగడాలను ఏరి కూర్చిన హారం ఇంకెంత విలువైనదో ఊహించండి. ఆ అమూల్యమైన హారమే మీ ముందున్న ఈ గ్రంథం!

ఇందులో మొత్తం 1906 హదీసులున్నాయి. సహీహ్ బుఖారీలో పునరావృత హదీసులుతీసివేయగా 2602 హదీసులు ఉన్నాయి. అంటే ఈ గ్రంథంలో సహీహ్ బుఖారీలోని 696 హదీసులుతగ్గిపోయాయి. మరో మాటలో చెప్పాలంటే ఇమామ్ ముస్లిం (రహిమహుల్లాహ్) గారి గ్రంథంలో లేని 696 హదీసులు ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) గారి గ్రంథంలో చోటు చేసుకున్నాయన్నమాట. వేరొక రకంగాచెప్పాలంటే ఈ 696 హదీసుల విషయంలో ఇరువురు ఇమాముల మధ్య పూర్తిగా ఏకీభావం లేదన్నమాట.

దీన్ని బట్టి మన ముందున్న ఈ గ్రంథంలో ఆ ఇరువురు ఇమాములు పూర్తిగా ఏకీభవించినహదీసులే ఉన్నాయని అర్థమవుతుంది. ఇలాంటి హదీసులున్న గ్రంథం వెలకట్టలేని వినూత్న ఉద్గ్రంధం అనడంలో ఇక సందేహమేముంది? కనుక దీన్ని పాఠకులు ఆదరిస్తారని ఆశిస్తూ ఈ గ్రంథం అనువాదంలో నాకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

-సయ్యిద్ షబ్బీర్ అహ్మద్(ఉర్దూ అనువాదకుడు, లాహోర్)

రెండు ఉత్తమ వచనాలు (సుబహానల్లహి వబిహందిహీ, సుబహనల్లహిల్ అజీం)

subahanallahరెండు ఉత్తమ వచనాలు (సుబహానల్లహి వబిహందిహీ, సుబహనల్లహిల్ అజీం)
పుస్తకం నుండి:  కలామే హిక్మత్ – 1(వివేక వచనం)
రచన: సఫీ అహ్మద్ మదనీ
అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్
ప్రకాశకులు: జమీ అతే అహ్ లె హదీస్, ఆంధ్రప్రదేశ్

[ఇక్కడ చదవండి / డౌన్ లోడ్ చేసుకోండి]

ఫిక్రే ఆఖిరత్ (పరలోక చింత) మాసపత్రిక (Fikre-Akhirat Monthly Magazine)

fikhre_aakhira-imageఫిక్రే ఆఖిరత్ (పరలోక చింత) మాసపత్రిక  (Fikre-Akhirath Telugu Monthly )
సంకలనం : మౌలాన అబ్దుస్సలాం ఉమ్రీ
అనువాదం : మౌలానా ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ
ప్రకాశకులు :ఐదార ఫిక్రే ఆఖిరత్
చీఫ్ ఎడిటర్ : ముహమ్మద్ హారూన్ అన్సారీ గారు
Masjid-e-Farooqiyah, Hakeempet, Toli Chowki,Hyderabad

పరలోక చింత మాసపత్రిక – సంచిక 1 – [Download PDF]
క్లుప్త వివరణ: దేవుడు ఒక్కడే, ఇస్లాం, ఏకదైవారాధన గొప్పతనం, ఆరాధన, లాయిలాహ ఇల్లల్లాహ్, సజ్దా (సాష్టాంగం) కేవలం అల్లాహ్ కొరకే సమ్మతం, సహాయం కొరకు అల్లాహ్ నే అర్థించాలి, అగోచర జ్ఞానం, జిన్నాతులకు అగోచర జ్ఞానం లేదు, దైవదూతలకు అగోచర జ్ఞానం లేదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కు అగోచర జ్ఞానం ఉండేది కాదు, మరణం ప్రతి ఒక్కరికీ ఉంది, అల్లాహ్ ఒక్కడే సర్వశక్తిమంతుడు, అల్లాహ్ పై నమ్మకం, అల్లాహ్ యే సర్వాధికారి అనటానికి సాక్ష్యం, బహుదైవారాధన

పరలోక చింత మాసపత్రిక – జులై 2007 – [Download PDF]
క్లుప్త వివరణ: ఖుర్ఆన్ వెలుగులో సున్నత్, సున్నత్ విశిష్ఠత, ప్రవక్త సహచరుల దృష్టిలో సున్నత్, సున్నత్ ప్రాధాన్యత, ఇమాముల దృష్టిలో సున్నత్ ప్రాముఖ్యత, సున్నత్ పాటించటం తప్పనిసరి విధి, సున్నత్ ఉండగా సొంత అభిప్రాయం అనవసరం

పరలోక చింత మాసపత్రిక – సంచిక 3 ఆగష్టు 2007 – [Download PDF]
క్లుప్త వివరణ: ఖర్ఆన్ లోని మొట్ట మొదటి అధ్యాయమైన సూరతుల్ ఫాతిహా యొక్క శుభాలు, ప్రత్యేకతలు, మరియు షఅబాన్ నెలలోని కల్పితాచారాలు.

పరలోక చింత మాసపత్రిక – సంచిక 4 సెప్టెంబరు 2007 – [Download PDF]
క్లుప్త వివరణ: రోజా (విధి ఉపవాసాలు), ఉపవాసాల ప్రాముఖ్యత, ఉపవాసం ఖుర్ఆన్ వెలుగులో, రమజాన్ నెలవంక చూచే నియమాలు, సంకల్పము, సహ్ రీ మరియు ఇఫ్తారీ (ఉపవాస విరమణ) నియమాలు, తరావీహ్ నమాజు సిద్ధాంతాలు, ఉపవాసాలు వదిలే సందర్భాలు, తప్పిపోయిన రోజాలను పూర్తి చేసుకునే సిద్ధాంతాలు, ఉపవాస స్థితిలో చేయగల పనులు, లైలతుల్ ఖదర్ (మహా శుభరాత్రి) ప్రత్యేకతలు, సమస్యలు, ఫిత్రా దానధర్మాలు, ఈద్ పండుగ నమాజుల సిద్ధాంతాలు, పండుగల తక్బీర్లు, ఉపవాసకులు చేయకూడని పనులు, ఉపవాసాన్ని భంగం చేసే పనులు, ఉపవాసం పాటించకూడని దినములు, అదనపు ఉపవాసాలు.

పరలోక చింత మాసపత్రిక – అక్టోబర్ నవంబర్ 2007 – [Download PDF]
క్లుప్త వివరణ: హజ్ మరియు ఉమ్రా వివరాలు

పరలోక చింత మాసపత్రిక – డిసెంబరు 2007 – [Download PDF]
క్లుప్త వివరణ: జుల్ హిజ్జహ్ మాస శుభాలు ప్రత్యేకతలు, ఖుర్ బానీ వివరాలు, హదీసు వెలుగులో పండుగ నమాజు పద్ధతి

పరలోక చింత మాసపత్రిక – జనవరి 2008 – [Download PDF]
క్లుప్త వివరణ: ముహర్రం నెల మరియు దాని శుభాలు మరియు దాని గురించిన మూఢనమ్మకాలు

పరలోక చింత మాసపత్రిక – ఫిబ్రవరీ 2008[Download PDF]
క్లుప్త వివరణ: సఫర్ నెల మరియు దాని గురించిన మూఢనమ్మకాలు

పరలోక చింత మాసపత్రిక – మార్చి 2008 – [Download PDF]
క్లుప్త వివరణ: రబీఉల్ అవ్వల్ మాస ప్రత్యేకత, ఈదె మీలాద్ వాస్తవికత

పరలోక చింత మాసపత్రిక – ఏప్రిల్ 2008 – [Download PDF]
క్లుప్త వివరణ: షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ మరియు గ్యారవీ గురించిన వాస్తవాలు

రాజస రాబిన్స్ సత్యాన్వేషణ వృత్తాంతం (Rajasa Robbins Story of her reversion to Islam)

women-accepting-islamఅనువాదకులు : ముహమ్మద్ కరీముల్లాహ్
క్లుప్త వివరణ: ఒక నాస్తికురాలైన మహారాష్ట్ర మహిళ, అమెరికన్ క్రైస్తవుడిని పెళ్ళి చేసుకుని, అమెరికాలో స్థిరపడి, ఆ తర్వాత సత్యాన్వేషణలో ఇస్లాం ధర్మం గురించి పరిశోధించి, దానిలోని స్వచ్ఛతను గ్రహించారు. ఆ తర్వాత కుటుంబసమేతంగా ఇస్లాం ధర్మం స్వీకరించి, ఆనందంగా అమెరికాలో జీవితం గడపుతున్నారు. తన జీవిత ప్రయాణం గురించి ఆవిడ వివరంగా ఈ తన స్వీయకథలో తెలిపారు.

[ఇక్కడ చదవండి / డౌన్లోడ్ చేసుకోండి]

Rajasa Robbins Story of her reversion to Islam

దివ్యఖుర్ఆన్ పరిచయం – ముహమ్మద్ తఖీయుద్దీన్

దివ్యఖుర్ఆన్ పరిచయం - Introduction to the Noble Qur'anరచయిత : ముహమ్మద్ తఖీయుద్దీన్
అనువాదకులు : ముహమ్మద్ అజీజుర్రహ్మాన్

బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం
అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో

మానవాళికి విశ్వప్రభువు లెక్కించలేనన్నిశుభాలను ప్రసాదించాడు. ఆయన మనిషి జీవితానికి అవసరమయ్యే అన్న పానీయాలను ఇవ్వటమే గాక, మనోభావాల్ని ప్రకటించే శక్తియుక్తులను కూడా ప్రసాదించాడు. జీవించే ఉపాయాలను ప్రసాదించాడు. ఇంకా మనిషి సంస్కృతీ నాగరికతలకు దోహదపడే సామగ్రిని భూమండలంలో పుష్కలంగా పొందుపరచాడు.

సృష్టికర్త ఇచ్చిన ఈ భౌతికానుగ్రహాలన్నీ ఒక ఎత్తయితే, అధ్యాత్మికంగా మానవాళికి మార్గదర్శకత్వం వహించటం ఇంకో ఎత్తు. సర్వవిధాల మానవత్వం పై దయదలచిన సృష్టికర్త, మానవులకు సన్మార్గం చూపే ఏర్పాటు కూడా చేశాడు. దాని ద్వారా ప్రపంచంలో శాంతి స్థాపన, అల్లకల్లోల నిర్మాలన, మంచి, మానవత్వం, నీతి నియమాలతో కూడిన సమాజ నిర్మాణ ప్రయత్నాలు యుగయుగాలుగా జరుగుతున్నవి.  మానవ సమాజాల్లో అశాంతి, అరాచకం ప్రబలిపోవడాన్ని సృష్టికర్త ఎంతమాత్రం ఇష్టపడడు. వాస్తవమేమిటంటే తన దాసులయిన మానవులంటే ఆయనకు అమితమైన  ప్రేమ. అందుకే అసంఖ్యాకమైన తన వరాలను వారిపై కురిపించడంతో పాటు వారి ఇహపర సాఫల్యాల కోసం మార్గదర్శక ఏర్పాటు కూడా చేశాడు. తన ప్రవక్తల ద్వారా సమస్త మానవజాతికి మార్గ దర్శక నియమావళిని ప్రసాదించాడు. దైవ ప్రవక్తలందరికీ ఆయా కాలాలను, అవసరాలను బట్టి దివ్యగ్రంథాలను, ప్రవర్తనా నియమావళుల (సహీఫాల) ను ఇచ్చాడు. వాటి ఆధారంగా ప్రవక్తలు మానవ సంస్కరణా కార్యానికి పూనుకునేవారు. ప్రజల జీవితాలను తీర్చిదిద్దేవారు. దైవభీతి, పరలోక చింతన ప్రాతిపదికగా మానవసమాజాల్లో నైతిక విప్లవం తెచ్చేవారు.

ఈ మార్గదర్శక గ్రంథాలలో చిట్టచివరిదే దివ్యఖుర్ఆన్. దీనికి పూర్వం దివ్యగ్రంథాలెన్నో అవతరించాయి. ఉదాహరణకు తౌరాత్, జబూర్, ఇంజీల్ కూడా మానవాళి మార్గదర్శకత్వం కోసం సృష్టికర్త పంపిన దివ్యగ్రంథాలే. కాని ఆ పవిత్ర గ్రంథాల పట్ల ప్రదర్శించిన నిర్లక్ష్యం, ఆయా మతాధిపతులు, స్వప్రయోజనాల కోసం చేసిన మార్పుల వల్ల, అవి తమ స్వచ్ఛతను, ప్రామీణికతను, అసలు స్థితిని కోల్పోయి కలుషితమైపోయాయి. క్రమంగా దివ్యసందేశంలో మానవ కల్పితాలు చోటు చేసుకున్నాయి. సత్యమార్గాన్ని పెడత్రోవ పట్టించారు. మానవజాతి ఇలా అపమార్గానికి లోనైనప్పుడల్లా సృష్టికర్త మరో ప్రవక్తను, మరో జీవన విధానాన్ని పంపి, మరచిపోయిన దైవాజ్ఞలను తిరిగి జ్ఞాపకం చేసుకునేటట్లు ఏర్పాటు చేశాడు. ఆటువంటి దివ్యమైన మార్గదర్శక పరంపరలో చిట్టచివరి దైవగ్రంథమే, ఈ దివ్యఖుర్ఆన్.

దివ్యఖుర్ఆన్ మానవజాతి పట్ల ఓ గొప్ప అనుగ్రహం. ప్రపంచంలోని మరే అనుగ్రహమూ దీనితో సరితూగలేదు. మనిషి ఇహపర సాఫల్యాలు, సభ్యతా సంస్కారాలు, గౌరవోన్నతులు, నీతి నడవడికలు – అన్నీ ఈ దివ్యగ్రంథంలో ఇమిడి ఉన్నాయి. ఇది ఒక మహా సాగరం. దీనిని ఎంత శోధించినా తనివి తీరదు.  దీని లోతుల్లోకి పోయిన కొద్దీ విలువైన ముత్యాలు దొరుకుతూనే ఉంటాయి. క్రొత్త క్రొత్త విషయాలు ముందుకు వస్తూనే ఉంటాయి. దీని అధ్యయనం వలన హృదయం జ్యోతిర్మయమవుతుంది అంటే జ్ఞానకాంతితో నిండిపోతుంది.

విజ్ఞానం పేరుతో నేడు ఆకాశాలలో స్వైరవిహారం చేస్తున్న మనిషికి నేలపై నిలిచి సాటి మనిషులతో సహజీవనం చేయడం చేతకావడం లేదు. కమ్యూనికేషన్ల ప్రగతి వలన వివిధ దేశాల మధ్య దూరం తరిగిపోయి ప్రపంచం కుంచించుకు పోతున్నా, మనుషుల మనసులు మాత్రం ఒక్కటి కావటం లేదు. జాతి, రంగు పేరిట నేటికీ ప్రపంచంలో విద్వేషం పెరిగి రక్తం చిందుతూనే ఉన్నది. ఒక్కమాటలో చెప్పాలంటే నేడు ప్రపంచమంతా రోగగ్రస్తమై ఉన్నది. దానికి చికిత్స చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖుర్ఆన్ ఒక దివ్య ఔషధం! అది సర్వరోగ నివారిణి! అది మానవులందరికీ మార్గదర్శిని! హృదయానికి హత్తుకుని, దానిని అనుసరించేవారికి అది మోక్షం పొందే మార్గాన్ని సూచిస్తుంది. మొత్తం మానవజాతి కోసం పంపబడిన అటువంటి దివ్యఔషధాన్ని మనం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాం?  మనకు తెలిసిన భాషలో అందుబాటులో ఉన్న దాని భావాన్ని కనీసం ఒక్కసారైనా చదవటానికి, అర్థం చేసుకోవటానికి ఎందుకు ప్రయత్నించటం లేదు? దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దు కోవాలనే సామెతను మరచిపోయారా? ఈ జీవితకాలంలో దానిని చదవక, మరణించగానే ఎదురయ్యే కఠినాతి కఠినమైన నరకశిక్ష అనుభవిస్తూ, పశ్చాత్తాపం పడటంలో ఏమైనా వివకమున్నదా? సృష్టికర్త ప్రసాదించిన అద్భుతమైన, అపూర్వమైన మన తెలివితేటలను ప్రపంచ మాయాజాలం నుండి కనీసం ఒక్కసారైనా తప్పించి, ఇహపరలోకాల సాఫల్యానికి దారి చూపించగలిగే ఏకైక, స్వచ్ఛమైన, సత్యమైన అంతిమ దివ్యగ్రంథాన్ని నేటి నుండే చదవటానికి దయచేసి ప్రయత్నించండి. మరణం ఏ క్షణంలోనైనా సంభవించవచ్చు. లేదా హఠాత్తుగా మన పంచేంద్రియాలు పనిచేయటం మానివేయవచ్చు. లేదా కోలుకోలేని దీర్ఘకాల అనారోగ్యానికి గురికావచ్చు. ‘ఇన్నేళ్ళపాటు మనం సురక్షితంగా, క్షేమంగా జీవిస్తామని’ చెప్పగలిగే స్థితికి సైన్సు పరిజ్ఞానం ఏనాడూ చేరలేదు. ఆ జ్ఞానం కేవలం సర్వలోక సృష్టికర్త వద్దనే ఉన్నది. కాబట్టి మన తెలివితేటలు సరిగ్గా పనిచేస్తున్నప్పుడే, మన పంచేంద్రియాలు సరైన స్థితిలో ఉన్నప్పుడే అంటే సరిగ్గా గ్రహిస్తున్నప్పుడే మరియు ఆరోగ్యంగా ఉన్న ఈ వయస్సులోనే ప్రతిరోజు దివ్యఖుర్ఆన్ లోని కొంతభాగాన్నైనా చదివి, అర్థం చేసుకోవటానకి ప్రయత్నించవలెను. ఈ ప్రయత్నంలోని నిజాయితీ పైనే సృష్టికర్త తోడ్పాడు ఆధారపడి ఉంటుందనేది మరచిపోవవద్దు. ఖుర్ఆన్ ద్వారా సరైన మార్గదర్శకత్వం పొందగలిగితే లాభపడేది మీరే. అలాగే ఖుర్ఆన్ ను నిర్లక్ష్యం చేసి, ఇహపరలోకాల సాఫల్యపు స్వచ్ఛమైన, సత్యమైన మార్గాన్ని తెలుసుకోలేకపోతే నష్టపోయేది కూడా మీరే. ఇది మరణించగానే ప్రతి ఒక్కరి ముందుకు రాబోయే ఒక నగ్నసత్యం. అన్ని మతాలు, ధర్మాలు మంచివైపుకే పిలుస్తున్నాయని, దైవాన్ని ఏ రూపంలోనైనా ఆరాధించవచ్చని, తాము అనుసరిస్తున్న అంధవిశ్వాసాల, ప్రాచీన గ్రంథాల ద్వారా కూడా ముక్తి పొందవచ్చని చాలా మంది అపోహలు పడుతున్నారు. కొంతకాలం ఆ భ్రమలను ప్రక్కన పెట్టి, అంతిమ దైవసందేశమైన దివ్య ఖుర్ఆన్ చదివితే కలిగే నష్టమేమిటి? వారు భ్రష్టపడిపోతారా? తమ మతం, ధర్మం నుండి వెలివేయబడతారా? ప్రతి ధర్మం సత్యాన్వేషణను ప్రోత్సహిస్తుందే తప్ప నిరుత్సాహపరచదు. కాబట్టి నిజాయితీగా చూసినట్లయితే, కేవలం మనలోని అహంభావం, నిర్లక్ష్యం, ప్రస్తుత జీవన విధానం పై హద్దుమీరిన విశ్వాసం, ఇతర ధర్మాలపై ముఖ్యంగా ఇస్లాం ధర్మం పై అపనమ్మకం మొదలైన కారణాల వలన మాత్రమే మన ముందున్న అత్యున్నతమైన అంతిమ దివ్యగ్రంథం పట్ల మనకు ఆసక్తి, కుతూహలం కలగటం లేదు.

“ఓ మనిషీ! ప్రతి వైద్యుడూ నీ రోగాన్ని మరింత తీవ్రతరమే చేశాడు. నువ్వు నా వైపుకు రా!  నీ రోగాన్ని నేను నయం చేస్తాను” అని పిలుస్తోంది ఖుర్ఆన్. కనుక మనం ఖుర్ఆన్ వైపుకు మరలాలి. దాన్ని లోతుగా అధ్యయనం చేయాలి. మనకు అత్యవసరమైన మోక్షానికి, ఇహపర సాఫల్యాలకు ఈ గ్రంథమార్గదర్శకత్వం తప్పని సరి.

జమ్ జమ్ నీటి పవిత్రత మరియు ప్రాముఖ్యత (Zamzam Water)

well-of-zam-zam

[ఇక్కడ చదవండి / డౌన్లోడ్ చేసుకోండి]

చరిత్ర

హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం తన జేష్ఠ పుత్రుడైన ఇస్మాయీల్ ను, సతీమణి అయిన హజ్రత్ హాజిరా అలైహస్సలాం ను కాబా ఎగువ భాగాన వదలివెళ్లిన తర్వాత ఉన్న ఆ కాసిన్ని ఖర్జూరాలు, నీళ్ళూ అయిపోయాయి. ఏ ప్రాణి నివసించని ఆ రాతి నేలలో తీవ్రమయిన దాహంతో నాలుక పీక్కుపోయింది. చివరికి పసికందుని తాపించేందుకు పాలు కూడా లేకుండా ఇంకిపోయాయి. ఏం చేయాలో, ఎలా దాహం తీర్చుకోవాలో, ఏ విధంగా బాలుడ్ని రక్షించుకోవాలో తోచని అయోమయ స్థితిలో పడిఉన్నారు హజ్రత్ హాజిరా అలైహస్సలాం.

అయినా తాను నిరాశ చెందలేదు. నిస్పృహకు లోనవ్వలేదు. తమ వంతు కృషి ప్రారంభించారు. ఒకసారి సఫా కొండపైకి ఎక్కి చూస్తే, మరోసారి మర్వా కొండపైకెక్కి ‘నీళ్ళు లభించే మార్గం దొరక్కపోతుందా!’ అని ఎదురు చూపులు చూస్తున్నారు. ఇలా సఫా నుండి మర్వా వరకు, మర్వా నుండి సఫా వరకు ఏడు సార్లు దౌడు తీశారు హజ్రత్ హాజిరా అలైహస్సలాం చివరికి మర్వా కొండపై ఉండగా ఏదో అలికిడి …! ఏమై ఉంటుందా…!! అని బాల ఇస్మాయీల్ వద్దకు చేరుకున్నారు. పసికందు మండుటెండల్లో భరించలేని ఆకలితో అల్లాడిపోతున్నాడు పాపం! అప్పుడే దైవదూత ప్రత్యక్షమై తన రెక్కలతో నేలలో రాజేయంగా చుక్క నీరు కూడా లభ్యం కాని ఆ నల్లరాతి నేల నుండి జలనిధి పెల్లుబికింది. హజ్రత్ హాజిరా అలైహస్సలాం గారు ముందు బాల ఇస్మాయీల్ దాహాన్ని తీర్చి తర్వాత తానూ దాహం తీర్చుకున్నారు. తన అన్వేషణ ఫలించినందుకు, తన శ్రమకు మించిన వరాన్ని అల్లాహ్ అనుగ్రహించినందుకు దైవానికి మనసారా కృతజ్ఞతాభివందనలు తెలుపుకున్నారు.

జమ్ జమ్ పేరు ఎలా పడింది?

ఆ పిదప పారే ఆ జలనిధిని చూసి “ఇది ఇలానే పారుతూ ఉంటే అతి తొందరగా అంతమైపోతుంద”ని భావించి, దాని చుట్టూ మట్టితో గట్టు వేస్తూ ఈ జలనిధిని ఎలాగైనా కాపాడుకోవాలన్న తీవ్ర తపనతో ఆమె నోట అప్రయత్నంగా వెలువడిన అమృత వాక్కు ‘జమ్ జమ్’ (అంటే అప్పటి భాషలో ఆగిపో, ఆగిపో అని అర్ధం). ఆ చిన్నపాటి గట్టులో ఆ మహత్తర జలనిధిని ఆపే శక్తి లేకపోయినా ఆమె నోట అపూర్వ విశ్వాసంతో వెలువడిన పలుకు మహిమతో ఆ జలం జలనిధిగా ఓ చోట నిలిచిపోయింది. అదే జమ్ జమ్ బావిగా ప్రసిద్ధి చెందింది.

ఓ సందర్భాన దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “అల్లాహ్ ఇస్మాయీల్ తల్లిని కరుణించుగాక! ఆమె గనక ఈ జలనిధికి గట్టు వేసి ఆపి ఉండకపోతే ప్రళయం వరకూ జమ్ జమ్ జలం పారే సెలయేరయ్యేది.”

జమ్ జమ్ జల నిధి

జమ్ జమ్ బావి స్వర్గపు సెలయేర్లలోని ఓ సెలయేరు. ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం మక్కా కోసం చేసిన దుఆ తర్వాత అల్లాహ్ అనుగ్రహించి ప్రసాదించిన తొలి బహుమతి ఈ జలం. మక్కా అంతటి పవిత్ర నగరం ఉనికిలోకి రావడానికి, జనవాహినితో, దైవదాసుల రాకపోకలతో అలరారడానికి కారణమయ్యింది ఈ మహత్తర జలం. కొన్ని వేల సంవత్సరాలుగా లభ్యమవుతున్న అల్లాహ్ మహిమ ఈ జలం. ఇహలోకంలో దైవ సూచనల్లోని ఓ సూచన ఈ జలం. ఇక్కడికి వచ్చే ప్రతీ యాచకుడు, ప్రతీ బాటసారి తనివితీరా సేవించే అద్భుత ద్రవం ఈ జలం. ఇంతటి మధురమైన నీరు లోకంలో మరో చోట లేదు. ఈ నీటిలో గొప్ప శుభం ఉంది. అది త్రాగే ప్రతీ వారికి ప్రాప్తమవుతుంది. పరిశుద్ధాత్మ అయిన దైవదూత జిబ్రయీల్ అలైహిస్సలాం ద్వారా ఉనికిలోకి వచ్చిన అనంత జల సంపద ఈ జమ్ జమ్. ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హృదయం పలుమార్లు ఈ పవిత్ర జలంతో కడగబడింది. ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం కాలం నుండి అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం వరకు వచ్చిన ప్రవక్తలందరూ త్రాగాలని తహతహలాడిన జలం జమ్ జమ్. ఏ జలానికీ లేని ప్రత్యేకత ఈ జలానికి ఏమిటంటే – ఇది ఆకలి గొన్న వ్యక్తి ఆకలిని తీరుస్తుంది, రోగాన్ని నయం చేస్తుంది, తలనొప్పి, కడుపునొప్పికి ఇది దివ్య ఔషధం. ఈ జలం వల్ల కoటి చూపు మెరుగవుతుంది. అందుకే దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా ప్రవచించారు: “మావు జమ్ జమ్ లిమా షరిబ లహూ” (ఏ సదుద్దేశంతో జమ్ జమ్ త్రాగుతారో వారి ఆ ఉద్దేశం సిద్ధిస్తుంది).

జమ్ జమ్ విశేషాలు

ఈ జలాన్ని కడుపు నిండా త్రాగటం విశ్వాసానికి చిహ్నం. కాపట్యానికి విరుగుడు. ఇది పుణ్యాత్ముల కోసం మహోన్నత పానీయం. బంధు మిత్రుల కోసం గొప్ప బహుమానం. అతిథుల అతిథ్యం కోసం అద్వితీయ ద్రవ పదార్థం. శరీరానికి శక్తినీ, హాయినీ ఇచ్చే అద్భుత వరప్రసాదం. ఎంత వాడినా అది తరగదు. దాదాపు నాలుగు వేల సంవత్సరాల నుండి ఈ జలం ఇలానే నిర్విరామంగా పెల్లుబుకుతూనే ఉంది. ప్రస్తుతం యావత్ ప్రపంచంలో అతి ప్రాచీనమైన బావి ఇదేనన్న నానుడీ ఉంది.

జమ్ జమ్ సేవించే సున్నత్ విధానం

జమ్ జమ్ జలాన్ని సేవించే సున్నత్ విధానం; ఈ జలాన్ని కుడి చేత్తో బిస్మిల్లాహ్ అని త్రాగాలి. ఈ శుభప్రదమైన జలాన్ని నిలబడి త్రాగటం ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం వారి సంప్రదాయం. తనివితీరా ఈ జలాన్ని త్రాగాలి. త్రాగే ముందు మంచి సంకల్పం చేసుకొని మరీ త్రాగాలి. త్రాగిన తరువాత కృతజ్ఞతగా ‘అల్ హందులిల్లాహ్’ అనాలి. ఈ జలాన్ని కనీసం మూడు శ్వాసల్లో త్రాగాలి. ఈ జలాన్ని సేవించిన పిదప ఇహపరాల సాఫల్యం, సౌభాగ్యం, శుభం కోసం దుఆ చేయాలి. ఆ సమయంలో చేసే ఏ మంచి దుఆ అయినా స్వికరించబడుతుంది.

జమ్ జమ్ జలం త్రాగే ఓ సౌభాగ్యవంతుడా!

శుభాకాంక్షలు!!

అల్లాహ్ అర్ష్ నీడలో.. (In the Shade of Allah’s Throne)

shade-of-allah

దైవ సింహాసనపు నీడలో..
పుస్తకం నుండి:  కలామే హిక్మత్ – 1(వివేక వచనం)
రచన: సఫీ అహ్మద్ మదనీ,
అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్
ప్రకాశకులు: జమీ అతే అహ్ లె హదీస్, ఆంధ్రప్రదేశ్

[ఇక్కడ చదవండి / డౌన్ లోడ్ చేసుకోండి]

English version of this hadeeth:

The Prophet said: “There are seven whom Allah will shade in His Shade on the Day when there is no shade except His Shade: a just ruler; a youth who grew up in the worship of Allah, the Mighty and Majestic; a man whose heart is attached to the mosques; two men who love each other for Allah’s sake, meeting for that and parting upon that; a man who is called by a woman of beauty and position [for illegal intercourse], but be says: ‘I fear Allah’, a man who gives in charity and hides it, such that his left hand does not know what his right hand gives in charity; and a man who remembered Allah in private and so his eyes shed tears.”

Narrated by Abu Hurairah & collected in Saheeh al-Bukhari (english trans.) vol.1, p.356, no.629 & Saheeh Muslim (english trans.) vol.2, p.493, no.2248

దైవ నామ స్మరణ – Zikr and Remembrance of Allah

do-not-forget-remember-Allah

ప్రవక్త మహనీయులు (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారని హజ్రత్‌ అబూహురైర (రధి అల్లాహు అన్హు) ఉల్లేఖించారు :

దైవదూతలు కొందరు దైవనామాన్ని స్మరించే వారిని వెదుకుతూ దార్లలో తిరుగుతుంటారు. దైవ స్మరణలో నిమగ్నులై ఉన్నవారిని చూడగానే వారు, “మా అవసరార్థం ఇటు మరలిరండి’ అని పరస్పరం పిలుచుకుంటారు. దైవనామ స్మరణలో ఉన్నవారిని ఎందరు దూతలు తమ బాహువులతో ఆక్రమిస్తారంటే, వారి వరస మొదటి ఆకాశం వరకు చేరుకుంటుంది.

వారిని వారి ప్రభువు, అంతా తెలిసి కూడా అడుగుతాడు : “నా దాసులు ఏమంటున్నారు?” దైవదూతలు సమాధాన మిస్తారు – ‘వారు నీ పవిత్రతను కొనియాడుతున్నారు. ఇంకా, నీ గొప్పతనాన్ని కొనియాడుతున్నారు. ఇంకా, నీ ఔన్నత్యాన్ని శ్లాఘిస్తున్నారు. ఇంకా, నిన్ను స్తుతిస్తున్నారు. నీ పెద్దరికాన్ని వర్ణిస్తున్నారు. అల్లాహ్‌ అడుగుతాడు : ‘వారు నన్ను చూశారా?” “లేదు. అల్లాహ్‌ సాక్షి! వారు నిన్ను చూడలేదు’ అని దూతలు సమాధానమిస్తారు. అల్లాహ్‌ అడుగుతాడు : ‘ఒకవేళ వారు నన్ను చూస్తే అప్పుడు వారి  స్థితి ఎలా ఉంటుంది?” దూతలు అంటారు – ‘వారు గనక నిన్ను చూసినట్లయితే నిన్ను మరింత ఎక్కువగా సేవిస్తారు. నిన్ను ఇంకా ఎక్కువగా జ్ఞాపకం చేస్తారు. ఇంకా ఎక్కువగా నీ పవిత్రతను కొనియాడతారు.’

ఆయన అంటాడు : ‘వారు నా నుండి ఏం కోరుతున్నారు?” దూతలు అంటారు – ‘వారు మీతో స్వర్గం కోరుతున్నారు. ఆయన అంటాడు : ‘ఒకవేళ వారు నన్ను చూస్తే అప్పుడు వారి స్థితి ఎలా ఉంటుంది?” దూతలు అంటారు – వారు గనక నిన్ను చూసినట్లయితే నిన్ను మరింత ఎక్కువగా సేవిస్తారు. నిన్ను ఇంకా ఎక్కువగా జ్ఞాపకం చేస్తారు. ఇంకా ఎక్కువగా నీ పవిత్రతను కొనియాడుతారు. ఆయన అంటాడు : ‘వారు నా నుండి ఏం కోరుతున్నారు?” దూతలు అంటారు – ‘వారు మీతో స్వర్గం కోరుతున్నారు.’ ఆయన అంటాడు : ఒకవేళ ధాన్ని చూస్తే వారి పరిస్థితి ఎట్లా ఉంటుంది?’ దూతలు బదులిస్తారు – “వారు గనక దాన్ని చూస్తే ఇంకా అధికంగా దాన్ని ఆశిస్తారు. దాని కోసం ఎంతగానో గాలిస్తారు. దాని వైపునకు మరింత ఎక్కువగా మళ్ళుతారు.’

ఆయన అడుగుతాడు : “వారు దేన్నుండి శరణువేడుతున్నారు?’ దూతలు సమాధానమిస్తారు – “(నరకాగ్ని నుండి.’ ఆయన అంటాడు : ‘వారు ఆ అగ్నిని చూశారా?’ దూతలంటారు – “లేదు, అల్లాహ్‌ సాక్షిగా! ఓ ప్రభూ! వారు దాన్ని చూడలేదు.’ ఆయన అంటాడు : “ఒకవేళ వారు దాన్ని చూసి ఉంటే అప్పుడు వారి స్ధితి ఏమౌను?’ వారు సమాధానమిస్తారు – ‘ఒకవేళ వారు దాన్ని చూస్తే దాన్నుండి మరింత ,దూరం పారిపోతారు. దానిపట్ల ఇంకా ఎక్కువగా భయపడతారు.’ అల్లాహ్‌ సెలవిస్తాడు : ‘నేను మిమ్మల్ని సాక్ష్యంగా పెట్టి చెబుతున్నాను – నేను వారిని క్షమించి వేస్తాను.’ అప్పుడు ఒక దూత అంటాడు – ‘ఫలానా మనిషి స్మరణ చేసిన వారిలో లేడు. అతను మరో పని మీద అక్కడకు వచ్చేశాడు.” అల్లాహ్‌ అంటాడు : ‘వారు (దైవస్మరణ చేసేవారు) ఎటువంటి వారంటే వారితోపాటు కూర్చున్న వ్యక్తి కూడా (ఆ భాగ్యాన్ని) కోల్పోడు.” (బుఖారి)

ఈ హదీసులో “జిక్ర్‌” వాస్తవికతను, “జిక్ర్‌” చేసే వారి ఘనతను, ఇంకా జిక్ర్‌ చేసే వారితోపాటు కూర్చునే వారి భాగ్యాన్ని గురించి వివరించటం జరిగింది.

ఇక్కడ ‘జిక్ర్‌ అంటే అర్ధం ఇతర హదీసులలో పలుసార్లు నొక్కి చెప్పబడిన పవిత్ర వాక్కులను వల్లించడం. ఉదాహరణకు, ‘సుబ్‌హానల్లాహ్‌’”, ‘అల్‌హమ్‌దు లిల్లాహ్‌”, “లా ఇలాహ ఇల్లల్లాహ్‌”, “అల్లాహు అక్బర్‌. ఇంకా అదేవిధంగా ‘లాహౌల వలా ఖువ్వత ఇల్లా బిల్హాహ్‌’, ‘“బిస్మిల్లాహ్‌’, ‘హస్బునల్లాహ వ నీమల్‌ వకీల్ , “అస్తగ్‌ఫిరుల్లాహ్‌’ మొదలగు వాక్యాలను పలుకుతూ ఉండటం, ఇంకా ఇహపర శ్రేయాలను దైవం నుండి కోరటం కూడా జిక్ర్‌ కోవలోకే వస్తాయి. వాజిబ్‌ మరియు ముస్తహబ్‌ ఆచరణలను చేయటం కూడా కొన్ని సమయాలలో ‘జిక్ర్‌’ (దైవస్మరణ) గానే పరిగణించబడుతుంది. ఉదాహరణకు ఖుర్‌ఆన్‌ పారాయణం, హదీసు అధ్యయనం, జ్ఞాన సదనం, నఫిల్‌ నమాజులు.

దైవ నామ స్మరణ చేసే వ్యక్తికి తాను పలికే పదాల భావం తెలిస్తేనే పుణ్యఫలం లభిస్తుందన్న నియమం లేదు. అయితే ఆయా పదాలకు వ్యతిరేక భావం మాత్రం అతని మనసులో ఉండకూడదన్నది షరతు. పలికే పదాలకు అర్థం కూడా తెలిసి ఉంటే ఆ స్మరణ పరిపూర్ణతను సంతరించుకుంటుంది. అల్లాహ్‌ ఔన్నత్యం, ఆయన అన్ని లోపాలకు, బలహీనతలకు అతీతుడు అనే భావం మనసులో గనక సతతం మెదలుతూ ఉన్నట్లయితే అప్పుడు ఆ స్మరణ మరింత అర్థవంతం అవుతుంది. దైవమార్గంలో కృషి సలుపుతూ, ఆయన మనపై విధిగా చేసిన వాటిని తు.చ, తప్పకుండా పాటిస్తూ గనక ‘జిక్ర్‌’ చేస్తే అది ఇంకా సమగ్రతను సంతరించుకుంటుంది. సంస్కర్త గనక ఏకాగ్ర చిత్తంతో దైవం వైపునకు మరలి, సంకల్పశుద్దితో దైవాన్ని స్మరిస్తే అది మరింతగా ప్రభావవంతం అవుతుంది.

హజ్రత్‌ అబ్బుల్లా బిన్‌ బసర్‌ (రజిఅన్‌) ఉల్లేఖించిన హదీసులో దైవ నామ స్మరణ యొక్క ప్రాముఖ్యత మరోవిధంగా చెప్పబడింది. ఒక వ్యక్తి మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వచ్చి, “ఓ దైవప్రవక్తా! ఇస్లాం ఆదేశాలెన్నో ఉన్నాయి. మీరు నాకు ఏదో ఒక దాన్ని గురించి చెప్పండి, దాన్ని నేను అంటిపెట్టుకుని ఉంటాను” అని అన్నాడు. అప్పుడు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రబోధించారు – “నీ నోరు (నాలుక) సతతం అల్లాహ్‌ నామస్మరణలో ఉండాలి.” (తిర్మిజి)

వివిధ ఉల్లేఖనాల ద్వారా స్పష్టమయ్యేదేమంటే, దేవుని పవిత్రతను, ఆయన ఘనతను కొనియాడటం, ఆయన స్తోత్రం చేయటం, ఆయన గ్రంథాన్ని పారాయణం చేయటం, స్వర్గ నరకాలను ప్రస్తావించటం, దైవానుగ్రహాలపై కృతజ్ఞతలు వ్యక్తపరచటం వంటివి “జిక్ర్‌ సదనాలు’ అనిపించుకుంటాయి.

“అంతా తెలిసి ఉండి కూడా వారిని వారి ప్రభువు అడుగుతాడు.” సర్వజ్ఞాని అయిన్న అల్లాహ్హ్‌ తన దూతలతో తన దాసుల గురించి అలా ప్రశ్నించాడంటే, దాసుల విధేయతను వారికి తెలియపరచటానికే అలా చేసి ఉండవచ్చు. ఎందుకంటే, అల్లాహ్‌ ఆదంను సృష్టించదలచినపుడు దైవదూతలు పలికిన పలుకులను దృష్టిలో ఉంచుకుని అల్లాహ్హ్‌ ఈ విధంగా ప్రశ్నిస్తాడని కొందరు ఇస్లామీయ విద్వాంసులు వ్యాఖ్యానించారు. ధరణిలో ఒక ఖలీఫా (ప్రతినిధి) ని సృష్టించబోతున్నానని అల్లాహ్‌ అన్నప్పుడు దైవదూతలు,

“ప్రభూ! అవనిలో కల్లోలం రేకెత్తించే, రక్తపాతం సృష్టించేవాడిని నువ్వు సృష్టిస్తున్నావా?! నీ స్తోత్రంతో పాటు నీ పవిత్రతను కొనియాడటానికి మేమున్నాముగా” అని విన్నవించుకున్నారు. ఆయన సెలవిచ్చాడు : “ఏదైతే నాకు తెలుసో అది మీకు తెలియదు.” (అల్‌ బఖర : 20)

“ఆనాడు నేను ఆదంను సృష్టిస్తుంటే మీరలా అన్నారు, చూడండి ఇప్పుడు ఆదం సంతతి ఏ విధంగా షైతానీ ప్రేరణలను ఎదిరించి, నా స్తోత్రం చేస్తున్నారో అని అల్లాహ్‌ తన దూతలకు పరోక్షంగా చెప్పదలిచాడు.

ఈ హదీసుపై మరికొంతమంది విద్వాంసుల వ్యాఖ్యానం ఇలా ఉంది : ఆదం బిడ్డలు చేసే ‘జిక్ర్‌ (దైవస్మరణ) దైవదూతలు చేసే స్మరణకన్నా శ్రేష్ఠమైనది. ఎందుకంటే మనిషి తన దైనందిన వ్యాపకాలను నిర్వర్తిస్తూ అనేక సమస్యల్ని ఎదుర్కొంటూ, సైతాన్‌ ఎత్తులను ఎప్పటికప్పుడు చిత్తుచేస్తూ దైవ నామస్మరణకు పూనుకుంటాడు, కాని దైవ దూతలకు ఈ ఇబ్బందులు లేవు.

“ఒకవేళ వారు నన్ను చూస్తే అప్పుడు వారి పరిస్థితి ఎలా ఉంటుంద”ని ప్రశ్న.

దీనిద్వారా తెలిసిందేమంటే ఐహిక జీవితంలో అల్లాహ్‌ను చూడటం సాధ్యపడదు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచనాన్ని ఇమామ్‌ ముస్లింగారూ అబూ అమామ ద్వారా ఉటంకించారు – ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు : “మీరు మీ ప్రభువును మీరు మరణించే వరకు చూడలేరని తెలుసుకోండి.” దైవచిత్తమయితే విశ్వాసులు తీర్పుదినంనాడు సర్వలోకాల ప్రభువును చూస్తారు. అయితే అల్లాహ్‌ను కళ్ళారా చూడకుండానే ఆయనకు భయపడటం, ఆయన వైపునకు మరలటమే సాఫల్యానికి నిదర్శనం.

“వారెటువంటి వారంటే వారితో పాటు కూర్చున్న వ్యక్తి కూడా (భాగ్యానికి) నోచుకోక పోడు.”

సుబ్‌హానల్లాహ్‌! వారితో కలసి కూర్చున్న వ్యక్తి సయితం అదృష్టవంతుడై పోయాడంబే దైవ నామస్మరణ చేసేవారు ఎంతటి శుభప్రదమైనవారు!

ఈ హదీసులో పేర్కొనబడిన “జిక్ర్‌ సమావేశాలు” అంటే భావం విశ్వాస భావంతో దైవ నామాన్ని, స్మరించే సమావేశాలలో విశ్వాసులను సహజమైన రీతిలో కలుసు కోవటం అని మహాప్రవక్త మరియు ఆయన సహచరుల హయాంలో అటువంటి సదనాలు సమావేశాలు జరిగేవి. విశ్వాసులు పరస్పరం కలుసుకునేవారు, పరామర్శలు జరిపేవారు. అల్లాహ్‌ను స్మరించేవారు. ఒండొకరిని మంచి వైపునకు ఆహ్వానించేవారు. చెడుల సంస్కరణకై నిర్మొహమాటంగా చెప్పేవారు. అల్లాహ్‌కు విధేయులై మెలగాలని, ఆయన ధర్మంపై స్థిరత్వం కలిగి ఉండాలని తాకీదు చేసేవారు.

ఈ హదీసు ద్వారా జిక్ర్‌ మరియు దానికోసం సమావేశమువటం యొక్క మహత్మ్యం తెలిసి వస్తోంది. ఆఖరికి సద్వర్హ్తనులతో కలిసి కూర్చునే వ్యక్తి కూడా కారుణ్య భాగ్యానికై అర్హుడైపోతాడు. “దైవనామ స్మరణ’ దైవదూతలకు ఆహారం వంటిదని వారు దానికోసం తిరుగుతూ ఉంటారని కూడా ఈ హదీసువల్ల తెలుస్తోంది. అల్లాహ్‌చే నిర్మితమైన స్వర్గం మేలైన వస్తువులతో నిండి ఉంది. దాన్ని ఆశించే వ్యక్తికై అల్లాహ్‌ మార్గం సుగమం చేస్తాడు. దానికి భిన్నంగా నరకం కష్టాలతో యాతనలతో నిండి ఉంది. ఎవరయితే నరకాగ్నిని కోరుకుని, దానికి ఆహుతి అయ్యేవనులు చేయాలనుకుంటారో అటువంటి వారికై కూడా అల్లాహ్‌ మార్గాలు తెరుస్తాడు.

పుస్తకం నుండికలామే హిక్మత్ – 1(వివేక వచనం)
రచన: సఫీ అహ్మద్ మదనీ,
అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్
ప్రకాశకులు: జమీ అతే అహ్ లె హదీస్, ఆంధ్రప్రదేశ్

[డౌన్లోడ్ PDF]


1447. Abu Hurairah (May Allah be pleased with him) reported: The Messenger of Allah (sallallaahu ’alayhi wa sallam) said, “Allah, the Exalted, has teams of angels who go about on the roads seeking those who remember Allah. When they find some people remembering Allah they call to one another and say, `Come to what you are looking for;’ and they surround them with their wings till the space between them and the lowest sky is fully covered. Allah, the Exalted and Glorious, asks them (although He is best informed about every thing): `What are my slave saying?’ They say: `They are glorifying Your Tasbih, Tahmid, Takbir, Tamjid, (i.e., they were declaring Your Perfectness, praising, remembering the Greatness and Majesty of Allah).’ He asks: `Have they seen Me?’ They reply, `No, indeed, they have not seen You.’ He asks: `How would they act if they were to see Me?’ Thereupon they reply: `If they were to see You, they would engage more earnestly in worshipping and glorifying You and would extol You more.’ He would say: `What do they beg of Me?’ They say, `They beg You for Your Jannah.’ Allah says, `Have they seen My Jannah?’ They say, `No, our Rubb.’ He says: `How would they act if they were to see My Jannah?’ They reply, `Were they to see it, they would more intensely eager for it.’ They (the angels) say, `They seek Your Protection.’ He asks, `Against what do they seek My Protection?’ They (the angels) say, `Our Rubb, from the fire of Hell.’ (He, the Rubb) says, `Have they seen the fire of Hell?’ They say, `No. By Your Honour, they have not seen it.’ He says: `How would they act if they were to see My Fire?’ They say: `If they were to see it, they would more earnest in being away from it and fearing it. They beg of Your forgiveness.’ He says: `I call you to witness that I hereby grant pardon to them and confer upon them what they ask for; and grant them protection against what they seek protection from.’ One of the angels says: `Our Rubb, there is amongst them such and such slave who does not belong to the assembly of those who are participating in Your remembrance. He passed by them and sat down with them.’ He says: `I also grant him pardon because they are the people by virtue of whom their associates will not be unfortunate‘.”
[Al-Bukhari and Muslim].

(The narration in Muslim is also the same with minor changes in wordings).

Commentary: What kind of circles and gatherings of remembrance of Allah are referred to here? Obviously not those in which Allah is remembered in the ways invented by the participants themselves, i.e., repetition of the slogans “Allah-Hu”, “Haq-Allah”,  etc.,which have not been mentioned in any Hadith. The repetition of any specific word, in a specific manner and in a peculiar surrounding (such as by putting the lights off) – this manner of conducting the remembrance of Allah is also not evident from the practice of the Prophet (sallallaahu ’alayhi wa sallam) and his Companions. The circles and gatherings mentioned in this Hadith are those in which, the Prophet’s Sunnah is fully observed. The words such as Subhan-Allah, Al-hamdu lillah, La ilaha illallah, Allahu Akbar etc., are recited and Praise and Glorification of Allah are done after Salat. The groups are quietly engaged in the remembrance of Allah, and those who attend the sermons and speeches delivered in mosques on Friday also come in this category of meetings and gatherings as these are ordained in Islam. This Hadith also highlights the distinction of Muslims who are engaged in the remembrance of Allah and the Du`a they recite on the suggested times and occasions.

పరలోకపు బికారి (Bankrupt in Aakhirah)

అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో

ప్రవక్త మహనీయులు (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవచించారని హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: “దరిద్రుడు ఎవరో మీకు తెలుసా?” దానికి సహాబాలు, ‘ఎవరి వద్ద డబ్బు, సామగ్రి లేవో అతనే దరిద్రుడు’ అని మేము భావిస్తున్నాము’ అని అన్నారు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రబోధించారు :

“నా అనుచర సమాజం (ఉమ్మత్)లో దరిద్రుడు ఎవరంటే, అతను ప్రళయదినం నాడు నమాజులు, ఉపవాసాలు, జకాత్ లతో పాటు హాజరవుతాడు. (కాని అతను) ఒకప్పుడు ఇతన్ని తిట్టాడు, అతనిపై అపనింద వేశాడు. మరొకప్పుడు ఇతని సొమ్మును కాజేశాడు, వేరొకప్పుడు అతన్ని కొట్టాడు. అందుచేత అతని సత్కర్మలు వారికి (ఆ బాధితులకు) ఇచ్చివేయబడతాయి. ఒకవేళ అతని సత్కర్మలన్నీ అయిపోయి అతనింకా వారికి బాకీపడితే, వారి అపరాధాలు తీసి ఇతని లెక్కలో వేయబడతాయి. ఆపైన అతన్ని అగ్నిలోకి నెట్టివేయడం జరుగుతుంది.” (ముస్లిం) :

“దరిద్రుడెవరు?” అనేది హదీసులో ముఖ్యాంశం. సహాబాల మనుస్సుల్లో పరలోక చింతనను పెంపొందించడానికి మహాప్రవక్త పలు రీతుల్లో విషయాన్ని ప్రస్తావించేవారు. ఇహలోకంలోని పదాలను పరలోక పరమార్థంతో మేళవించేవారు. సహచరులు కూడా అదే రీతిలో ఆలోచించాలి, యోచించాలన్నదే దీని ఉద్దేశ్యం. ‘దరిద్రుడెవరు?’ అని ప్రశ్నించే రీతిలో అడిగారు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం). సహచరుల దృష్టిని కేంద్రీకరించే ఉద్దేశ్యంతో ఇలా అడగటం జరుగుతుంది. సహాబాలు తమకు తోచినంతవరకు ఉత్తమరీతిలోనే దరిద్రునికి నిర్వచనం చెప్పారు. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) పరలోక దరిద్రుని స్థితిని విశ్లేషించారు. ప్రపంచపు దారిద్య్రమైతే. తాత్కాలికమైనది. ఎంతో సంక్షిప్తమైన ప్రపంచ జీవితంతోపాటే అది కూడా అంతమైపోతుంది. చాలావరకు ప్రపంచంలోనే మనిషి లేమి తరువాత కలిమి కూడా పొందుతాడు. నిజమైన దరిద్రుడు, ప్రళయదినాన చేసుకున్న సత్కర్మలన్నీ కోల్పోయేవాడే. అప్పుడతని వద్ద సత్కర్మల నిధి ఉండదు. అతనికి రుణం కూడా ఎవరూ ఇవ్వరు. ఇంకా అతను, ఇతరుల వద్ద నుండి సత్కర్మల్ని ముట్టెత్తుకుని తన అవసరాన్ని నెరవేర్చుకోనూలేడు.

లోకంలో కొంతమంది పరిస్థితి ఏమంటే వారు ఒకవైపు నుండి సత్కార్యాలు చేస్తూ పోతుంటారు. కాని మరోవంక వారి దుష్కర్మల చిట్టా కూడా పెరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా తోటి మనుషులకు చేసే అన్యాయానికి సంబంధించిన అపరాధాల చిట్టా. తీర్పు దినంనాడు మనిషి, ఇతరుల నుండి తాను పొందవలసిన హక్కును అంత తేలిగ్గా వదలుకోడు. తప్పకుండా బదులును అపేక్షిస్తాడు. ఈ హదీసు ద్వారా బోధపడే ముఖ్యాంశం ఏమంటే మనిషి కొన్ని మంచి పనులు చేసుకున్నంత మాత్రాన సరిపోదు – అతను చెడుపనులు, అపరాధాలకు దూరంగా ఉండటం కూడా ఎంతో అవసరమే. ఒక వంక సత్కార్యాలు చేస్తూనే మరోవంక చెడు పనులు చేసే వ్యక్తి దృష్టాంతం ఎటువంటిదంటే, ఒక రోగి ఉన్నాడు – అతను, వ్యాధి నయం కావటానికి మందులూ వాడుతున్నాడు. ఇంకోవైపు పత్యం చేయకుండా ఏదిబడితే అది తినేస్తున్నాడు. దాని పర్యవసానం నష్టం తప్ప మరేం కాగలదు? ఏవో కొన్ని దానధర్మాలు చేసి నిశ్చింతగా ఉండిపోయి, ఇక తమకేమీ ఫరవాలేదనుకుని ఏ చెడుపనికయినా వడిగట్టే వారికి ప్రళయదినాన పట్టే దుర్గతిపై అందరూ ఆలోచించాలి.

ఈ హదీసును ఉల్లేఖించిన వారు హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు), వీరు ప్రవక్త సహచరులలో ఎక్కువ హదీసుల్ని ఉల్లేఖించినవారు. హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) యమన్లోని దోప్ తెగకు చెందినవారు. హిజ్రీ శకం 6వ ఏట వీరు మదీనాకు వచ్చి ఇస్లాం స్వీకరించారు. అప్పటి నుండి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) జీవించినంతకాలం ఆయనకు తోడుండేవారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) పలుకులన్నింటినీ ఆయన శ్రద్ధగా వినేవారు, ప్రవక్త ఆచరణను హృదయంలో పదిలపరచుకునేవారు. ఆయన ఇలా అన్నారు : “అన్సార్లు తమ తోటల్లో, ముహాజిర్లు వ్యాపార వ్యవహారాలలో నిమగ్నులై ఉండేవారు. నా చేయి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చేతిలో ఉండేది.”

ఒకసారి హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)తో, “ఓ దైవప్రవక్తా! నేను మీ పలుకులెన్నింటినో వింటున్నాను. (వాటిని) మరచిపోతానేమోనన్న భయం నాకుంది” అని విన్నవించుకున్నారు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) సెలవిచ్చారు – “మీ దుప్పటిని పరచండి”. హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) దుప్పటి పరిచారు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన చేతితో ఇన్ని నీళ్ళు దానిపై చల్లి, ఆ దుప్పటిని తుడుచుకొమ్మని చెప్పారు. తాను దుప్పటి తుడుచుకున్న తరువాత ఇక ఎన్నడూ మరుపు అనేదే రాలేదని హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) అన్నారు.. వీరు గౌరవప్రదులయిన సహాబాలలోని వారు. 69 ఏళ్ళ వయస్సులో (హిజ్రీ 57లో) మదీనాలో తనువు చాలించారు.

పరలోకపు బికారి (Bankrupt in Aakhirah)
పుస్తకం నుండి :కలామే హిక్మత్ – 1 (వివేక వచనం)
రచన:సఫీ అహ్మద్ మదనీ
అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్
ప్రకాశకులు:జమీ అతే అహ్ లె హదీస్,ఆంధ్రప్రదేశ్

[ఇక్కడ చదవండి / డౌన్ లోడ్ చేసుకోండి]

English Version of this Hadith:

Abu Hurayra (May Allah be pleased with him) narrated that the Messenger of Allah (Peace Be Upon Him) once asked his companions: “Do you know who is the bankrupt one?”

The companions replied: “A bankrupt person amongst us is the one who neither has a dirham nor any possessions.”

The Prophet (Peace Be Upon Him) said: “Rather, the bankrupt person from my Ummah is the one who will come on the Day of Resurrection with a good record of Salah (Prayers), Sawm (Fasts) and Zakah (Obligatory Charity); but he would have offended a person, slandered another, unlawfully consumed the wealth of another person, murdered someone and hit someone. Each one of these people would be given some of the wrong-doer’s good deeds. If his good deeds fall short of settling the account, then their sins will be taken from their account and entered into the wrong-doer’s account and he would be thrown in the Hell Fire. {Sahih Muslim, Book 32, Hadith Number 6251}