1652. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం:-
“ఒక వ్యక్తి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వచ్చిధైవప్రవక్తా! నా సత్ప్రవర్తనకు ఎవరెక్కువ హక్కుదారులు?” అని అడిగాడు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “నీ తల్లి” అని చెప్పారు. “ఆ తరువాత ఎవరూ?” అంటే “నీ తల్లి” అనే చెప్పారు ఆయన. తిరిగి ఆ వ్యక్తి “ఆ తరువాత ఎవరు?” అని అడిగాడు. “నీ తల్లి” అనే చెప్పారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). అతను మళ్ళీ అడిగాడు:- “ఆ తరువాత ఎవరెక్కువ హక్కుదారులు?” అని. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “నీ తండ్రి” అని అన్నారు.