తల్లి గొప్పదనం

1652. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం:-

“ఒక వ్యక్తి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వచ్చిధైవప్రవక్తా! నా సత్ప్రవర్తనకు ఎవరెక్కువ హక్కుదారులు?” అని అడిగాడు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “నీ తల్లి” అని చెప్పారు. “ఆ తరువాత ఎవరూ?” అంటే “నీ తల్లి” అనే చెప్పారు ఆయన. తిరిగి ఆ వ్యక్తి “ఆ తరువాత ఎవరు?” అని అడిగాడు. “నీ తల్లి” అనే చెప్పారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). అతను మళ్ళీ అడిగాడు:- “ఆ తరువాత ఎవరెక్కువ హక్కుదారులు?” అని. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “నీ తండ్రి” అని అన్నారు.

 (సహీహ్ బుఖారీ:- 78వ ప్రకరణం – అదబ్,  2వ అధ్యాయం – మన్ అహఖ్కున్నాసి బిహుస్నిస్సుహుబతి)

సామాజిక మర్యాదల ప్రకరణం
1వ అధ్యాయం – తల్లిదండ్రుల సేవే అన్నిటికంటే గొప్పసేవ
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ
తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

దొరికే ప్రతిఫలం వారి మనో సంకల్పం పైనే ఆధారపడి ఉంటుంది

ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు  మెంబర్ (మస్జిద్ లోని ప్రసంగ వేదిక) పై ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన ఈ ప్రకటనను తాను విన్నానని ఉల్లేఖించారు.

నిశ్చయంగా ఏ పనికైనా దొరికే ప్రతిఫలం తమ మనోసంకల్పం పైనే ఆధారపడి ఉంటుంది. అలాగే నిశ్చయంగా ఏ ఆజ్ఞకైనా. (దొరికే ప్రతిఫలం వారి మనో సంకల్పం పైనే ఆధారపడి ఉంటుంది) మరియు ఎవరైతే ప్రపంచం కోసం వలస వెళతారో వారికి అదే (ఆ ప్రపంచమే) లభిస్తుంది. ఇంకా ఎవరైతే ఒక స్త్రీని పెళ్ళాడటానికి వలస వెళతారో, వారి వలస ఆ పెళ్ళి కొరకే పరిగణింపబడుతుంది.

సహీ బుఖారి హదీథ్ గ్రంథం.