సమాధుల, దర్గాల వద్ద జంతుబలి ఇవ్వటం, కానుకలు సమర్పించుకోవటం, శ్రద్ధాంజలి ఘటించటం – డా. సాలెహ్ అల్ ఫౌజాన్

బిస్మిల్లాహ్
عقيدة التوحيد
అఖీదా-యే-తౌహీద్ (అల్లాహ్ ఏకత్వం) – మూడవ ప్రకరణం
సమాధుల, దర్గాల వద్ద జంతుబలి ఇవ్వటం. కానుకలు, నజరానాలు సమర్పించుకోవటం, శ్రద్ధాంజలి ఘటించటం

బహుదైవారాధన వైపు తీసుకుపోయే మార్గాలన్నింటినీ మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మూసివేశారు. ఆ మార్గాలకు దూరంగా ఉండవలసిందిగా సావధానపరిచారు. అలాంటి వాటిలో సమాధులు కూడా ఉన్నాయి. సమాధిపూజ, సమాధివారల పట్ల అతిశయిల్లటం మొదలగు విషయాలలో కట్టుదిట్టమయిన నిబంధనలను కూడా నిర్ధారించారు. వాటిలో కొన్ని ఇవి:

1. ఔలియాల, మహనీయుల, సత్పురుషుల యెడల అభిమానంలో మితిమీరి వ్యవహరించటాన్ని గురించి ఆయన హెచ్చరించారు. ఎందుకంటే ఈ మితిమీరటమే (అతివాదమే) క్రమక్రమంగా వారి ఆరాధన వైపు తీసుకుపోతుంది.

ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ఉపదేశించారు:

grave-worship-1

మీరు అభిమానంలో అతిశయిల్లకండి. ఎందుకంటే ఈ అతివాదమే (ఘులూ) మీ పూర్వీకులను అంతమొందించింది.” (అహ్మద్, తిర్మిజీ, ఇబ్నుమాజా-3029 సహీహ్)

వేరొక హదీసులో ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా తాకీదు చేశారు.

grave-worship-2

“క్రైస్తవులు మర్యమ్ కుమారుడగు ఈసా (ఏసుక్రీస్తు) అభిమానంలోఅతిశయిల్లి (ఆయన్ని అల్లాహ్ కుమారునిగా చేసి)నట్లుగా మీరు నా విషయంలో అతిశయిల్లకండి (నన్ను నా పరిమితులను దాటనివ్వకండి). నేను అల్లాహ్ దాసుడను. కనుక మీరు నన్ను అల్లాహ్ దాసుడని, ప్రవక్త అనీ అనండి.” (సహీహ్ బుఖారీ)

(2) సమాధులను పటిష్ఠపరచటాన్ని, వాటిపై కట్టడాలను కట్టడాన్ని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారించారు. అబుల్ హయాజ్ అల్ అసదీ గారి కథనం ద్వారా మనకు తెలిసేది ఇదే. అలీ బిన్ అబీ తాలిబ్ (రదియల్లాహు అన్హు) తనతో ఇలా చెప్పారని ఆయన తెలిపారు –

grave-worship-3

“దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నన్ను ఏ పనిపై పంపారో ఆ పనిపై నేను మిమ్మల్ని పంపనా? అదేమిటంటే ఏ విగ్రహం కనిపించినా మీరు దానిని పడగొట్టాలి. ఏ సమాధి ఎత్తుగా కనిపించినా మీరు దానిని సమం చేసివేయాలి.” (సహీహ్ ముస్లిం)

(3) సమాధులను పటిష్ఠపరచటాన్ని, వాటిపై నిర్మాణాలు చేయటాన్ని కూడా ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారించారు. జాబిర్ (రదియల్లాహు అన్హు) ఇలా అంటున్నారు :

“సమాధిని పక్కాగా నిర్మించటాన్ని, దానిపై కూర్చోవటాన్ని, దానిపై కట్టడం కట్టడాన్ని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారించారు.” (ముస్లిం)

(4) సమాధుల వద్ద నమాజ్ చేయటాన్ని కూడా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారించారు. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం ::

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు మరణ సూచనలు ప్రస్ఫుటం అయినపుడు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన ముఖంపై దుప్పటి కప్పుకోసాగారు. ఊపిరాడక పోవటంతో దుప్పటిని తొలగించారు.ఆ స్థితిలోనే ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు :

“యూదులపై, క్రైస్తవులపై అల్లాహ్ శాపం పడుగాక! వారు తమ ప్రవక్తల సమాధులనే సాష్టాంగ (సజ్జా) స్థలంగా చేసుకున్నారు.” వారి చర్య గురించి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) జనులను సావధానపరిచేవారు. ఈ వ్యవహారంలో ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇంత దృఢంగా ఉండకపోతే, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) సమాధిపట్ల కూడా అలాగే చేసేవారేమో!

ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇంకా ఇలా తాకీదు చేశారు :

grave-worship-5

“వినండి. మీకు పూర్వం గతించినవారు తమ ప్రవక్తల సమాధులను ఆరాధనా (సజ్దా) స్థలాలుగా చేసుకునేవారు. జాగ్రత్త! మీరు మాత్రం సమాధులను ఆరాధనా స్థలాలుగా చేసుకోకండి. నేను దీని నుండి మిమ్మల్ని వారిస్తున్నాను.” (సహీహ్ ముస్లిం)

సమాధులను ఆరాధనా స్థలాలుగా చేసుకోవటం అంటే భావం అక్కడ మస్జిద్ లేకపోయినప్పటికీ అక్కడ నమాజ్ చేయటం. నమాజ్ కోసం సంకల్పం చేసుకున్న ప్రతి స్థలం సాష్టాంగ ప్రణామ స్థలం – ఆరాధనా స్థలం – అవుతుంది. ఎందుకంటే మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధంగా ప్రవచించారు : –

grave-worship-6

“నా కొరకు భూమండలమంతా మస్జిద్ (సాష్టాంగ స్థలం)గా, పరిశుద్ధత పొందే స్థలంగా చేయబడింది.” (సహీహ్ బుఖారీ)

కాబట్టి సమాధిపై మస్జిద్ ని నిర్మిస్తే, వ్యవహారం చాలా సంక్లిష్టమైపోతుంది. కాని చాలామంది వారించబడిన ఈ విషయాలను ఉల్లంఘించారు. ఏ ఏ పనులు చేయరాదని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గట్టిగా తాకీదుచేశారో  వాటికి ఒడిగట్టారు. తత్కారణంగా వారు పెద్ద తరహా షిర్క్ కు పాల్పడిన వారయ్యారు. వారు సమాధులపై మస్జిదులను, విశ్రాంతి స్థలాలను నిర్మించారు. సమాధులను సందర్శనా క్షేత్రాలుగా తీర్చిదిద్దారు. పెద్ద తరహా షిర్క్ (షిర్కె అక్బర్) గా పరిగణించబడే పనులన్నీ అక్కడ యధేచ్ఛగా జరుగుతాయి. ఉదాహరణకు : జంతువులను బలి ఇవ్వటం, సమాధిలో ఉన్న మృతుల ముందు చేయిచాచి అర్థించటం, ఫిర్యాదులు చేసుకోవటం, మొక్కుకోవటం, మొక్కుబడులు చెల్లించటం, నజరానాలు సమర్పించటం ఇత్యాదివి.

అల్లామా ఇబ్నుల్ ఖయ్యిమ్ (రహిమహుల్లాహ్) ఇలా అంటున్నారు : “ఏ వ్యక్తి అయినా సమాధుల గురించి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారి విధానాన్ని, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆదేశాలను, నిషేధాజ్ఞలను, వాటికి ప్రవక్త సహచరులు (రదియల్లాహు అన్హుమ్) కట్టుబడిన తీరును అధ్యయనం చేసి, అదే సమయంలో నేటి ప్రజలలో చాలామంది (అంటే ఇబ్నుల్ ఖయ్యిమ్ గారి సమకాలికులు) అవలంబిస్తున్న పోకడల్ని పోల్చిచూసుకుంటే ఆ రెండు వర్గాల మధ్య ఉన్న వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. వారి మధ్య అసలు పొంతనే కనిపించదు. ఎందుకంటే మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సమాధుల వద్ద నమాజ్ చేయరాదని తాకీదు చేశారు. కాని వీళ్ళు అక్కడ నమాజ్ చేస్తున్నారు. సమాధులను ఆరాధనా స్థలాలుగా చేసుకోవటాన్ని మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారించారు. కాని వీళ్ళు సమాధిపై ఆరాధనా కట్టడం నిర్మిస్తున్నారు. దేవుని ఆరాధనా స్థలాలను పోలిన కట్టడాలను నిర్మించి వాటికి ‘దర్గాహ్’ అని నామకరణం చేస్తున్నారు. సమాధులపై దీపాలంకరణ చేయటాన్ని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారించగా, వీళ్ళేమో దీపాలు వెలిగిస్తూ ఉండటానికి ఆస్తులను వక్ఫ్ చేస్తున్నారు. సమాధులను ఉత్సవ స్థలాలుగా చేయరాదని మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తాకీదు చేశారు. కాని ఈ మహానుభావులు సమాధులను ఉత్సవాలకు, ఉరుసులకు, మేళాలకు ప్రత్యేకించుకుని సంబరాలు జరుపుకుంటున్నారు.

సమాధులను (నేలకు) సమంగా చేయమని మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆజ్ఞాపించి నట్లుగా ఇమామ్ ముస్లిం తన ప్రామాణిక గ్రంథంలో పొందుపరిచారు. అబుల్ హయాజుల్ అసదీ కథనం : అలీ బిన్ అలీ తాలిబ్ (రదియల్లాహు అన్హు)తనతో ఇలా అన్నట్లు ఆయన తెలిపారు:

grave-worship-7

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నన్ను ఏ పనిపై పంపారో, ఆ పనిపై నేను మిమ్మల్ని పంపనా!? అదేమంటే ఏ విగ్రహం కనిపించినా దానిని రూపుమాపాలి. ఏ సమాధి ఎత్తుగా ఉన్నట్లు కనిపించినా దానినినేలమట్టం చేయాలి.” (సహీహ్ ముస్లిం)

సహీహ్ ముస్లింలోనే సుమామ బిన్ షుఫా కథనం ఇలా ఉంది : “మేము ఫుజాలా బిన్ ఉబైద్ (రదియల్లాహు అన్హు) వెంట రోము రాజ్యంలో ‘రూడ్స్’ అనే ప్రదేశంలో ఉండగా మా సహవాసుల్లో ఒక వ్యక్తి మరణించాడు. ఆ వ్యక్తి సమాధిని భూమికి సమంగా చేయమని ఫుజాలా (రదియల్లాహు అన్హు) ఆజ్ఞాపిస్తూ ఇలా అన్నారు : “సమాధులను నేలకు సమంగా ఉంచమని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆజ్ఞాపించటం నేను స్వయంగా విన్నాను.”

కాని వీళ్లు ఈ రెండు హదీసులను వ్యతిరేకిస్తూ, అతిగా ప్రవర్తిస్తున్నారు. తమ నివాస గృహాల మాదిరిగా సమాధులను కూడా బాగా ఎత్తుగా నిర్మిస్తున్నారు. వాటిపై డోములు అమర్చుతున్నారు.

అల్లామా ఇబ్నుల్ ఖయ్యిమ్ (రహిమహుల్లాహ్) ఇంకా ఇలా అంటున్నారు : సమాధులకు సంబంధించి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఏఏ ఆదేశాలిచ్చారో, మరే నిషేధాజ్ఞలు జారీ చేశారో వాటి వెలుగులో చూస్తే, ఈ సమాధి పూజారులు కల్పించుకున్న విధానాలకు – ప్రవక్త విధానానికి చాలా వ్యత్యాసం ఉంది. వీళ్ల పోకడలో ఉన్న అరిష్టాలను లెక్కించటం మనిషి తరం కాదు.

తరువాత ఆయన ఈ అనర్థదాయక విషయాలను గురించి చెబుతూ ఇలా అన్నారు: సమాధుల సందర్శన సమయంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఏ ఏ విషయాలను అనుమతించారో కాస్త చూడాలి. సమాధుల సందర్శనలోని ముఖ్య ఉద్దేశం పరలోకాన్ని స్మరించుకోవటం! సమాధిలో ఉన్న మృతుని మన్నింపునకై దైవాన్ని వేడుకోవటం!! అతనిపై కరుణించమని, అతని యెడల ఉదారంగా వ్యవహరించమని ప్రార్థించటం!!! ఈ విధంగా గనక చేస్తే అటు మృతునికి మేలు చేసినట్లవుతుంది, ఇటు తన స్వయానికి కూడా మేలు చేకూర్చుకున్నట్లవుతుంది. కాని ఈ ముష్రికులు వ్యవహారాన్నంతటినీ తలక్రిందులు చేసేశారు. ధర్మాన్ని తలక్రిందులు చేసివేశారు. వీళ్ళ సమాధి సందర్శన ఉద్దేశం మృతుణ్ణి దైవానికి భాగస్వామిగా నిలబెట్టడమై ఉంటుంది. మృతుని ముందు వేడుకోవటం, మృతుని ద్వారా దైవాన్ని వేడుకోవటం, మృతుని వాస్తాతో శుభాలు కురిపించమని ప్రార్థించటం, శత్రువులకు వ్యతిరేకంగా తోడ్పడమని మృతుల ద్వారా విజ్ఞాపన చేసుకోవటం అయి ఉంటుంది. ఈ విధంగా వారు తమ ఆత్మకు అన్యాయం చేసుకోవటమే గాక, మృతునికి కూడా హాని కలిగించేందుకు ప్రయత్నించారు. ఇలా చేయటం వల్ల వారికి అసలుకే నష్టం కలుగుతుంది. మృతుని మన్నింపుకోసం, కారుణ్యం కోసం దుఆ చేయమని అల్లాహ్  సూచించాడు. ఈ సూచనను ఉల్లంఘించినందువల్ల కలగవలసిన శుభం కూడా కలగకుండా పోతుంది. (ఇఘ్ ఆసతుల్ లహ్ ఫాన్ : 1/414, 415, 417)

దీనిద్వారా స్పష్టమయ్యేదేమిటంటే దర్గాల వద్ద మొక్కుకోవటం, మొక్కుబడులు సమర్పించుకోవటం షిర్కె అక్బర్ (పెద్ద షిర్క్). ఎందుకంటే ఇది సమాధుల విషయంలో మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చేసిన ఆజ్ఞకు పూర్తిగా విరుద్ధం. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆదేశానుసారం సమాధుల వద్ద కట్టడం గానీ, మస్జిద్ గానీ నిర్మించకూడు. నిర్మాణాలు గనక జరిగితే, అజ్ఞానులు దానికి పవిత్రతను ఆపాదించే అవకాశముంటుంది. సమాధులలో ఉన్న మృతులకు, లాభనష్టాలు చేకూర్చే శక్తి ఉందని వారు ఊహిస్తారు. అక్కరలు తీరుస్తారని నమ్ముతారు. అందుకే వారు సమాధులను అలంకరించటం, దుప్పట్లను కప్పటం, మొక్కుబడులు సమర్పించటం మొదలెడతారు. ఆ విధంగానే ఆ సమాధులు విగ్రహారాధనా కేంద్రాలైనాయి. జనులు నిజదైవాన్ని వదలి విగ్రహపూజ చేయసాగారు. నిజానికి అంతిమ దైవప్రవక్త ఈ విషయమై ఎంతో ఆర్ద్రంగా  ఇలా వేడుకున్నారు : –

grave-worship-8

“అల్లాహ్! నా సమాధిని ప్రజలు పూజించే విగ్రహంగా మార్చకు.”
(మాలిక్-376, అహ్మద్-7054)

ముస్లిం సముదాయంలో సమాధుల పట్ల ఈ విధమైన వ్యవహారం జరగనున్నదని పసిగట్టి మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రార్థించారు. అనేక ముస్లిం దేశాలలో ఈ పరిస్థితి ఎదురయింది కూడా. కాని ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి ప్రార్థనా శుభం వల్ల అల్లాహ్ ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) సమాధిని ఇలాంటి అపచారాల నుండి సురక్షితంగా ఉంచాడు. కొంతమంది అజ్ఞానులు, అవివేకులు ఇప్పటికీ ఆయన మస్జిద్ (మస్జిదె నబవీ)లో ఆజ్ఞ ఉల్లంఘనకు పాల్పడుతూ ఉంటారు. కాని వారు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి సమాధి వరకూ చేరుకోలేరు. ఎందుకంటే ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) సమాధి మస్జిద్ లో లేదు, అది ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) స్వగృహంలో ఉంది. దానికి నలువైపులా ఎత్తయిన గోడలు నిర్మితమై ఉన్నాయి. ఆ విషయమే అల్లామా ఇబ్నుల్ ఖయ్యిమ్ (రహిమహుల్లాహ్) ఒక పద్యంలో ఇలా చెప్పారు :

grave-worship-9

“లోకేశ్వరుడు మీ మొరను ఆలకించాడు.
దానిని (మీ సమాధిని) మూడు గోడలతో దిగ్బంధం చేశాడు.”


ఇది అఖీదా-తౌహీద్ (దేవుని ఏకత్వం) – డా. సాలెహ్ అల్ ఫౌజాన్ [పుస్తకం] నుండి తీసుకోబడింది (పేజీలు 128 – 132)

నక్షత్ర బలంతో వర్షం కురిసింది అని నమ్ముట అవిశ్వాసం – ఇమామ్ అస్-సాదీ

బిస్మిల్లాహ్

30 వ అధ్యాయం
నక్షత్రబలంతో వర్షం కురిసింది అని నమ్ముట

ఏకత్వపు బాటకు సత్యమైన మాట (అల్ ఖౌలుస్ సదీద్ షర్హు కితాబిత్ తౌహీద్)
షేఖ్ అబ్దుర్ రహ్మాన్ అస్సఅదీ రహిమహుల్లాహ్
తెలుగు అనువాదం: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

The famous commentary of Shaykh as-Sa’di of the book Kitab at-Tawhid of Muhammad ibn Abdul Wahhab.


అల్లాహ్ ఆదేశం:

وَتَجْعَلُونَ رِزْقَكُمْ أَنَّكُمْ تُكَذِّبُونَ
“అల్లాహ్ మీకొసంగిన ఉపాధిని (వర్షాన్ని) ఆయన్ని తిరస్కరించుటకు ఉపయోగిస్తున్నారా?” (వాఖిఅ 56:82).

అబూ మాలిక్ అష్ అరి (రదియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సెలవిచ్చారు:

నా అనుచర సంఘంలోనివారు జాహిలియ్యత్ (అజ్ఞాన కాలాని)కి సంబంధించిన నాలుగు విషయాలను విడనాడరు.

  • (1) వంశంపై గర్వపడుట.
  • (2) ఇతర వంశాలను దూషించుట.
  • (3) నక్షత్రాల ప్రభావంతో వర్షం కురుస్తుందని తారాబలాన్ని నమ్ముట.
  • (4) శోకము చేయుట“.

ఇంకా ఇలా చెప్పారు: “శోకము చేయు స్త్రీ తౌబాచేయకుండా చనిపోతే ప్రళయదినాన లేపబడినప్పుడు ఆమెపై తార్ కోల్ (Tar coal) పైజామా, చిడుము (ఖారిష్) వ్యాధికి గురి చేసే కవచము ఉండును“.

జైద్ బిన్ ఖాలిద్ అల్ జుహ్నీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: హుదైబియ ప్రాంతములో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మాకు ఫజర్ నమాజ్ చదివించారు. ఆ గడిచిన రాత్రి వర్షం కురిసింది. నమాజ్ అయిన తరువాత ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) అనుచరుల వైపు తిరిగి “మీ ప్రభువు ఏం సెలవిచ్చాడో మీకు తెలుసా?” అని అడిగారు. ‘అల్లాహ్ కు, ఆయన ప్రవక్తకే బాగా తెలుసు, మాకు తెలియదు’ అని అన్నాము. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం), అల్లాహ్ ఇలా చెప్పాడని తెలిపారు: “ఈ రోజు ఉదయం నా దాసుల్లో  కొందరు విశ్వాసులయిపోయారు, మరికొందరు అవిశ్వాసులయ్యారు. అల్లాహ్ దయ వల్ల మనకు వర్షం కురిసింది” అన్నవారు తారాబలాన్ని నిరాకరించి, నన్ను విశ్వసించిన వారయ్యారు. దీనికి భిన్నంగా ఫలానా నక్షత్ర ప్రభావంతో వర్షం కురిసిందని అన్నవారు నక్షత్ర విశ్వాసులయి, నన్ను తిరస్కరించిన వారయ్యారు”. (బుఖారి, ముస్లిం).

ఇలాంటి హదీసు ఇబ్ను అబ్బాసు (రదియల్లాహు అన్హు) కూడా ఉల్లేఖించారు. అందులో ఇంకా ఈ విషయం ఉంది. అందులో కొందరున్నారు: ఫలాన, ఫలాన నక్షత్ర (ప్రభావం) నిజమయింది (అందుకే వర్షం కురిసింది). అప్పుడు అల్లాహ్ ఈ ఆయతులు అవతరింపజేసాడు;

فَلَا أُقْسِمُ بِمَوَاقِعِ النُّجُومِ  وَإِنَّهُ لَقَسَمٌ لَّوْ تَعْلَمُونَ عَظِيمٌ إِنَّهُ لَقُرْآنٌ كَرِيمٌ فِي كِتَابٍ مَّكْنُونٍ لَّا يَمَسُّهُ إِلَّا الْمُطَهَّرُونَ تَنزِيلٌ مِّن رَّبِّ الْعَالَمِينَ أَفَبِهَٰذَا الْحَدِيثِ أَنتُم مُّدْهِنُونَ وَتَجْعَلُونَ رِزْقَكُمْ أَنَّكُمْ تُكَذِّبُونَ

“నక్షత్రాల స్థానాలు సాక్షిగా చెబుతున్నాను: మీరు తెలుసుకుంటే, ఇది చాలా పెద్ద ప్రమాణం: ఇది ఒక మహోన్నతమైన ఖురాన్; ఒక సురక్షితమైన గ్రంథంలో వ్రాయబడి ఉంది. దానిని పరిశుద్ధులు తప్ప మరెవరూ తాకలేరు. ఇది సకల లోకాల ప్రభువు అవతరింపజేసినటు వంటిది. అయినా మీరు ఈ వాణిని తేలిక విషయంగా తీసుకుంటారా? అల్లాహ్ మీకొసంగిన ఉపాధిని, ఆయన్ని తిరస్కరించుటకు ఉపయోగిస్తు న్నారా?” (వాఖిఅ 56: 75-82).

ముఖ్యాంశాలు:

1. సూరె వాఖిల ఆయతు యొక్క భావం.
2. జాహిలియ్యత్ (అజ్ఞాన కాలం)కు సంబంధించిన నాలుగు విషయాల ప్రస్తావన.
3. అందులో కొన్ని అవిశ్వాసం, తిరస్కారమునకు సంబంధించినవి.
4. తిరస్కారంలో కొన్ని రకాలు ధర్మభ్రష్టతకు కారణము కావు.
5.”నా దాసుల్లో కొందరు నన్ను విశ్వసించువారు, మరికొందరు నన్ను తిరస్కరించువారయ్యారు” అన్నది అల్లాహ్ కారుణ్యమైన వర్షం కురిసినప్పటి సంగతి.
6. ఇక్కడ విశ్వాసం యొక్క వాస్తవికతను గమనించాలి. (అల్లాహ్ కరుణ, దయ వలన అని చెబితే విశ్వాసం).
7. అవిశ్వాసం యొక్క వాస్తవికతనూ గమనించాలి. (ఫలాన, ఫలాన నక్షత్ర ప్రభావం అని చెప్పితే అది అవిశ్వాసం).
8. నక్షత్రం నిజమయింది అనుట కూడా అవిశ్వాసం గనుక దానిని గమనించాలి.
9. శిష్యులకు విషయం బాగుగా అర్థం కావడానికి ప్రశ్నించి మరీ జవాబు చెప్పాలి అని “మీ ప్రభువు ఏమన్నాడో మీకు తెలుసా?” అన్న వాక్యంలో తెలుస్తుంది.
10. శోకము చేసేవారికి ప్రళయము నుండే శిక్ష మొదలవుతుంది.

తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ) :

అనుగ్రహించువాడు, కష్టాలు తొలగించువాడు అల్లాహ్ మాత్రమేనని మనసా వాచా విశ్వసించి, వాటిని ఆయన విధేయత కొరకే ఉపయోగించుట తౌహీద్ అయినప్పుడు, “ఫలాన నక్షత్రం వలన వర్షం కురిసింది” అనుట ఆ తౌహీద్ విశ్వాసానికి చాలా విరుద్ధం. వర్షమూ, ఇతర వరాలు అల్లాహ్ యే ఇచ్చువాడనుట తప్పనిసరి. ఆయనే వాటిని తన దాసులకు ప్రసాదించాడు కనుక.

వర్షం కురువటానికి నక్షత్రాలు ఏ విధంగానూ కారణం కాజాలవు. అల్లాహ్ యొక్క దయ, కరుణా కటాక్షముల వలన, మానవుల అవసరము, వారు తమ వాజ్మూలిక, స్థితి భాషలో తమ ప్రభువుతో వేడుకొనుట ద్వారా అల్లాహ్ వారి అవసరాలను బట్టి తన వివేకము, కరుణతో వర్షం కురిపిస్తాడు.

మానవుడు తనపై, సర్వ సృష్టిపై ఉన్న అల్లాహ్ యొక్క బాహ్యాంతర సర్వ వరాలను విశ్వసించనంత వరకు అతని తౌహీద్ సంపూర్ణం కాదు. అనుగ్రహాలన్నిటిని అల్లాహ్ కు అంకితం చేయాలి. ఆయన్ను ఆరాధిస్తున్నప్పుడు, స్మరిస్తున్నప్పుడు, కృతజ్ఞత తెలుపుతున్నప్పుడు వాటి సహాయము, ఆధారము తీసుకోవాలి.

ఇలాంటి సందర్భములలోనే తౌహీద్ వాస్తవికత తెలుస్తుంది. దీనితోనే విశ్వాసం యొక్క పరిపూర్ణత మరియు కొరతా తెలుస్తుంది.


నుండిఏకత్వపు బాటకు సత్యమైన మాట (అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్)  – ఇమామ్ అస్-సాదీ [పుస్తకం]. తెలుగు అనువాదం: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

తెలుగు ఇస్లామిక్ క్విజ్: పార్ట్ 31 [ఆడియో]

బిస్మిల్లాహ్

Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 31
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ప్రశ్నల పత్రం – 31

1) ఆలమే అర్వాహ్ (ఆత్మల లోకం) లో ఏ ఆచరణ గూర్చి ఒప్పందం తీసుకోబడింది?

A) హజ్
B) తౌహీద్
C) రిసాలత్
D) జకాత్

2) జ్యోతిష్యకుని వద్దకు వెళ్లి సమాచారం అడిగేవాని ఎన్ని రోజులు నమాజ్ స్వీకరించబడదు?

A) 7 రోజుల
B) 21 రోజుల
C) 40 రోజుల
D) 70 రోజుల

3) జనాజ నమాజ్ చేసి దానివెంట వెళ్లి ఖననం అయ్యేవరకు పాల్గొంటే ఎన్ని ఖిరాతుల పుణ్యం దొరుకుతుంది?

A) 01 ఖిరాతు
B) 03 ఖిరాతులు
C) 02 ఖిరాతులు
D) 05 ఖిరాతులు

[గమనిక : ఒక ఖిరాతు బరువు అనగా అల్లాహ్ వద్ద ఉన్న త్రాసులో ఉహద్ పర్వతం కంటే ఎక్కువ బరువు)

క్విజ్ 31: సమాధానాలు & వివరణ ఇక్కడ వినండి /డౌన్లోడ్ చేసుకోండి [14:19 నిమిషాలు]


1) ఆలమే అర్వాహ్ (ఆత్మల లోకం) లో ఏ ఆచరణ గూర్చి ఒప్పందం తీసుకోబడింది?

B) తౌహీద్

الأعراف: 7:172-174 وَإِذْ أَخَذَ رَبُّكَ مِن بَنِي آدَمَ مِن ظُهُورِهِمْ ذُرِّيَّتَهُمْ وَأَشْهَدَهُمْ عَلَىٰ أَنفُسِهِمْ أَلَسْتُ بِرَبِّكُمْ ۖ قَالُوا بَلَىٰ ۛ شَهِدْنَا ۛ أَن تَقُولُوا يَوْمَ الْقِيَامَةِ إِنَّا كُنَّا عَنْ هَٰذَا غَافِلِينَ * أَوْ تَقُولُوا إِنَّمَا أَشْرَكَ آبَاؤُنَا مِن قَبْلُ وَكُنَّا ذُرِّيَّةً مِّن بَعْدِهِمْ ۖ أَفَتُهْلِكُنَا بِمَا فَعَلَ الْمُبْطِلُونَ * وَكَذَٰلِكَ نُفَصِّلُ الْآيَاتِ وَلَعَلَّهُمْ يَرْجِعُونَ

నీ ప్రభువు ఆదం సంతతి వీపుల నుండి వారి సంతానాన్ని తీసి, స్వయంగా వారినే వారికి సాక్షులుగా పెట్టి, “నేను మీ ప్రభువును కానా?” అని అడిగినప్పుడు “ఎందుకు కావు? (నువ్వే మా ప్రభువువి). ఈ విషయానికి మేమంతా సాక్షులుగా ఉన్నాం” అని వారు చెప్పారు. ‘దీని గురించి మాకేమీ తెలియదు’ అని ప్రళయ దినాన మీరు అనకుండా ఉండటానికీ * లేదా “మొదట్లో మా పూర్వీకులు షిర్కుకు పాల్పడ్డారు. మేము వారి తరువాతివారి సంతతిలో పుట్టినవారము. ఆ దుర్జనులు చేసిన పాపానికి నువ్వు మమ్మల్ని వినాశానికి గురిచేస్తావా?!” అని మీరు అనకుండా ఉండటానికిగాను (మేము ముందే మీ నుండి ఈ విధంగా ఖరారు చేయించాము.) * వారు (బహుదైవారాధన నుండి ఏకదైవారాధన వైపుకు) మరలివస్తారేమోనని మేము ఈ విధంగా ఆయతులను విడమరచి చెబుతున్నాము.

صَحِيحِ مُسْلِمٍ 2865، عَنْ عِيَاضِ بْنِ حِمَارٍ قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: “يَقُولُ اللَّهُ [تَعَالَى) إِنِّي خَلَقْتُ عِبَادِي حُنَفَاءَ فَجَاءَتْهُمُ الشَّيَاطِينُ فَاجْتَالَتْهُمْ عَنْ دِينِهِمْ وَحَرَّمَتْ عَلَيْهِمْ مَا أَحْلَلْتُ لَهُمْ”

సహీ ముస్లిం 2865లో ఉంది, ఇయాజ్ బిన్ హిమార్ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు: అల్లాహ్ ఇలా తెలిపాడని: “నేను నా దాసులను ముస్లిములుగా, సత్యాన్ని స్వీకరించి బహుదైవత్వాలకు దూరంగా ఉండేవారిగా పుట్టించాను, కాని షైతానులు వారి వద్దకు వచ్చి వారిని సత్యధర్మం నుండి దూరం చేశారు, నేను వారి కొరకు హరాం (నిషిద్ధం) చేసిన దానిని హరాం చేశారు”.

))قال النووي: قَوْلُهُ تَعَالَى (وَإِنِّي خَلَقْتُ عِبَادِي حُنَفَاءَ كُلَّهُمْ) أَيْ مُسْلِمِينَ وَقِيلَ طَاهِرِينَ مِنَ الْمَعَاصِي وَقِيلَ مُسْتَقِيمِينَ مُنِيبِينَ لِقَبُولِ الْهِدَايَةِ وَقِيلَ الْمُرَادُ حِينَ أَخَذَ عَلَيْهِمُ الْعَهْدَ فِي الذَّرِّ وَقَالَ أَلَسْتُ بِرَبِّكُمْ قالوا بلى[[

البخاري 6557 ، مسلم 2805:- أَنَسَ بْنَ مَالِكٍ رَضِيَ اللَّهُ عَنْهُ، عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: ” يَقُولُ اللَّهُ تَعَالَى لِأَهْوَنِ أَهْلِ النَّارِ عَذَابًا يَوْمَ القِيَامَةِ: لَوْ أَنَّ لَكَ مَا فِي الأَرْضِ مِنْ شَيْءٍ أَكُنْتَ تَفْتَدِي بِهِ؟ فَيَقُولُ: نَعَمْ، فَيَقُولُ: أَرَدْتُ مِنْكَ أَهْوَنَ مِنْ هَذَا، وَأَنْتَ فِي صُلْبِ آدَمَ: أَنْ لاَ تُشْرِكَ بِي شَيْئًا، فَأَبَيْتَ إِلَّا أَنْ تُشْرِكَ بِي “

అనస్ బిన్ మాలిక్ ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు: “అల్లాహ్ ప్రళయదినాన అతితక్కువ నరక శిక్ష అనుభవిస్తున్న వ్యక్తిని అల్లాహ్ అడుగుతాడు: భూమిలో ఉన్న సమస్తం నీదై ఉంటే దానిని పరిహారంగా చెల్లించి నరకం నుండి రక్షణ పొందాలనుకుంటున్నావా? అతడు అవును అని అంటాడు, అప్పుడు అల్లాహ్ అంటాడు: నీవు ఆదం వీపులో ఉండగానే నేను నీతో దీనికంటే ఎంతో తేలికైన విషయం ఒకటి కోరాను: నీవు నాతో పాటు ఎవ్వరినీ భాగస్వామిగా చేయకు అని, కాని నీవు తిరస్కరించావు, నాకు భాగస్వాములకు నిలబెట్టావు”.

2) జ్యోతిష్యుని వద్దకు వెళ్లి సమాచారం అడిగేవాని ఎన్ని రోజుల నమాజ్ స్వీకరించబడదు?

C) 40 రోజుల

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారని సఫియ్య (రజియల్లాహు అన్హా) ప్రవక్తగారి ఒక భార్య ద్వారా ఉల్లేఖించారు:

مَنْ أَتَى عَرَّافًا فَسَأَلَهُ عَنْ شَيْءٍ، لَمْ تُقْبَلْ لَهُ صَلَاةٌ أَرْبَعِينَ لَيْلَةً

ఎవరైనా జ్యోతిష్యుని వద్దకు వచ్చి దేని గురించైనా అతన్ని ప్రశ్నిస్తే అతని నలబై రోజుల నమాజు స్వీకరించబడదు”. (ముస్లిం పదాలు 2230).

ఇది మనుషుల రూపంలో ఉన్నవారి వద్దకు వెళ్ళి అడగడం వరకే పరిమితం కాదు. ఈ రోజుల్లో కొందరు తమ జాతకలు తెలుసుకోడానికి టీవిలలో కొన్ని ప్రోగ్రామ్స్ ఫాలో అవుతుంటారు. మరి కొందరు స్మార్ట్ ఫోన్లో వచ్చిన ఆప్స్ లను ఫాలో అవుతారు

గుర్తుంచుకోండి:
వెబ్ సైట్లోకెల్లి జాతకం గురంచి వెతకడం కూడా ఈ హదీసులో వస్తుంది అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి

మరో ముఖ్య విషయం: 40 రోజుల నమాజు అంగీకరింపబడదని అంటే వాటి పుణ్యం లభించదని భావం, కాని చేయకుండా ఉంటే అది మరింత ఘోరమైన పాపం అవుతుంది.

3) జనాజ నమాజ్ చేసి దానివెంట వెళ్లి ఖననం అయ్యేవరకు పాల్గొంటే ఎన్ని ఖిరాతుల పుణ్యం దొరుకుతుంది?

C) 02 ఖిరాతులు

జనాజ వెంట వెళ్ళడం, జనాజ నమాజు చేయడం

గొప్ప పుణ్య కార్యాల్లో ఒకటి; జనాజ వెంట వెళ్ళడం, జనాజ నమాజు చేయడం, దానిపై లభించే పుణ్యం బరువు మానవుని త్రాసులో ఉహద్ పర్వతం కంటే అధికిమించి ఉంటుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని ఉబై బిన్ కఅబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః

مَنْ تَبِعَ جَنَازَةً حَتَّى يُصَلَّى عَلَيْهَا، وَيُفْرَغَ مِنْهَا، فَلَهُ قِيرَاطَانِ، وَمَنْ تَبِعَهَا حَتَّى يُصَلَّى عَلَيْهَا، فَلَهُ قِيرَاطٌ، وَالَّذِي نَفْسُ مُحَمَّدٍ بِيَدِهِ لَهُوَ أَثْقَلُ فِي مِيزَانِهِ مِنْ أُحُدٍ

“ఎవరు నమాజు మరియు (ఖననం) అయ్యే వరకు జానాజ వెంట ఉంటాడో అతనికి రెండు ఖీరాతులు, మరెవరయితే కేవలం నమాజు అయ్యే వరకు దాని వెంట ఉంటాడో అతనికి ఒక ఖీరాతు లభిస్తుంది. నా ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆయన (అంటే అల్లాహ్) సాక్షి! ఒక్క ఖీరాత్ బరువు అల్లాహ్ వద్ద ఉన్న త్రాసులో ఉహద్ పర్వతంకంటే ఎక్కువ ఉండును”. (అహ్మద్ 5/ 131 ఇది సహీ హదీస్).

ప్రవక్త ﷺ తెలిపారని, అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు;

مَنْ شَهِدَ الجَنَازَةَ حَتَّى يُصَلِّيَ، فَلَهُ قِيرَاطٌ، وَمَنْ شَهِدَ حَتَّى تُدْفَنَ كَانَ لَهُ قِيرَاطَانِ، قِيلَ: وَمَا القِيرَاطَانِ؟ قَالَ: مِثْلُ الجَبَلَيْنِ العَظِيمَيْنِ

“ఎవరు జనాజలో పాల్గొని నమాజు చేస్తాడో అతనికి ఒక ఖీరాత్, మరెవరయితే (నమాజు మరియు) ఖననం అయ్యే వరకు పాల్గొంటాడో అతనికి రెండు ఖీరాతులు లభించును”. రెండు ఖీరాతులంటే ఏమిటి? అని ప్రశ్న వచ్చినప్పుడు, ప్రవక్త చెప్పారు: “రెండు పెద్ద కొండల వంటివి”. (బుఖారి 1325, ముస్లిం 945, తిర్మిజి 1040, నిసాయి 1940, ఇబ్ను మాజ 1539, అహ్మద్ 2/ 401, ఇబ్ను హిబ్బాన్ 3080)

ముస్లింలో ఉంది; ఇబ్ను ఉమర్ (రజియల్లాహు అన్హు) జనాజ నమాజు చేసుకొని వెళ్ళేవారు, ఎప్పుడయితే వారికి అబూహురైరా (రజియల్లాహు అన్హు) గారి ఈ హదీసు చేరిందో ‘వాస్తవానికి మనం అనేక ఖీరాతులు పోగుట్టుకున్నాము’ అని బాధ పడ్డారు.

ఇతరములు :

తెలుగు ఇస్లామిక్ క్విజ్ (ఆడియో సిరీస్) మెయిన్ పేజీ :
https://teluguislam.net/others/telugu-islamic-quiz

ప్రవక్త వారి సంఘంలో కొందరు “ఔసాన్” (విగ్రహాలను) పూజిస్తారు – ఇమామ్ అస్-సాదీ

బిస్మిల్లాహ్

23 వ అధ్యాయం
ప్రవక్త వారి సంఘంలో కొందరు “ఔసాన్” (విగ్రహాలను) పూజిస్తారు

ఏకత్వపు బాటకు సత్యమైన మాట (అల్ ఖౌలుస్ సదీద్ షర్హు కితాబిత్ తౌహీద్)
షేఖ్ అబ్దుర్ రహ్మాన్ అస్సఅదీ రహిమహుల్లాహ్
తెలుగు అనువాదం: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

The famous commentary of Shaykh as-Sa’di of the book Kitab at-Tawhid of Muhammad ibn Abdul Wahhab.


أَلَمْ تَرَ إِلَى الَّذِينَ أُوتُوا نَصِيبًا مِّنَ الْكِتَابِ يُؤْمِنُونَ بِالْجِبْتِ وَالطَّاغُوتِ

అల్లాహ్ ఆదేశం: “గ్రంథజ్ఞానంలో కొంత భాగం ఇవ్వబడిన వారిని నీవు చూడలేదా? వారి పరిస్థితి ఎలా వుందంటే, వారు “జిబ్త్ “ను “తాగూత్” ను నమ్ముతారు.” (నిసా 4:51).

قُلْ هَلْ أُنَبِّئُكُم بِشَرٍّ مِّن ذَٰلِكَ مَثُوبَةً عِندَ اللَّهِ ۚ مَن لَّعَنَهُ اللَّهُ وَغَضِبَ عَلَيْهِ وَجَعَلَ مِنْهُمُ الْقِرَدَةَ وَالْخَنَازِيرَ وَعَبَدَ الطَّاغُوتَ

మరో ఆదేశం: “అల్లాహ్ వద్ద ఎవరి ముగింపు అవిధేయుల ముగింపు కంటే కూడా హీనతరంగా ఉంటుందో వారిని గురించి తెలియజేయనా? వారు అల్లాహ్ శాపగ్రస్తులు. వారిపై ఆయన ఆగ్రహం విరుచుకు పడింది. వారు కోతులుగా, పందులుగా చెయ్యబడ్డారు. వారు తాగూత్ దాస్యం చేశారు.” (మాఇద 5:60).

قَالَ الَّذِينَ غَلَبُوا عَلَىٰ أَمْرِهِمْ لَنَتَّخِذَنَّ عَلَيْهِم مَّسْجِدًا

మరో చోట: “కాని ఈ వ్యవహారంలో పై చేయిగా ఉన్నవారు, “మేము వారిమీద ఒక ఆరాధనా మందిరాన్ని నిర్మిస్తాము” అని అన్నారు.” (కహఫ్  18:21).

అబూ సయీద్  ఖుద్రీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  చెప్పారు:

“మీరు తప్పకుండా పూర్వీకుల (అంటే గత మతస్థుల) జీవన విధానాలను బాణం, బాణంకు సమానం ఉన్నట్లు అనుసరిస్తారు. చివరికి వారు ఉడుము కన్నంలోకి దూరితే, వారి వెంట మీరు కూడా అందులోకి దూరుతారు”. సహచరులు ఈ మాట విని దైవప్రవక్తా! “ఏమిటీ మేము యూదుల్ని, క్రైస్తవుల్ని అనుసరిస్తామా?” అని అడిగారు (ఆశ్చర్యంతో). దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం): “మరి ఎవరు అనుకుంటుకున్నారు?” అని అన్నారు. (బుఖారి, ముస్లిం).

సౌబాన్ (రదియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా తెలిపారు:

“అల్లాహ్ నా కొరకు భూమిని చుట్టి దగ్గరికి చేశాడు. నేను దాని తూర్పు పడమర అంతా చూశాను. నా ఎదుట చుట్టబడిన భూమి అంతటిలో నా అనుచర సంఘం చేరుకుంటుంది. నాకు ఎర్రని, తెల్లని రెండు ధన భండారాలు ఇవ్వబడినవి. నేను నా ప్రభువుతో ఇలా వేడుకున్నాను: “నా అనుచర సంఘాన్ని అనావృష్టి (ఖహత్) ద్వారా నశింపజేయకు. వారిపై గెలిచి, వారిని అణచివేసే ముస్లిమేతరులైన శత్రువులకు వారిపై విజయం ప్రసాదించకు”. అప్పుడు నా ప్రభువు అన్నాడు: “వారిని అనావృష్టితో నశింపజేయను. ముస్లిమేతరులైన శత్రవులకు వారిపై ఆధిపత్యం ఇవ్వను. వారంతా ఏకమై వచ్చినప్పటికీ. ఇది వారిలో ఒకడు మరొకడ్ని నాశనం జేసి, ఖైదీలుగా చేయకుండా అందరు ఏకమై ఉన్నంత వరకు”. (ముస్లిం).

ఇదే హదీసును బర్ ఖాని ఉల్లేఖించారు, అందులో ఇంకా ఇలా వుంది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పారు:

“నేను నా అనుచర సంఘం పట్ల వారిలోని దుర్మార్గులైన నాయకులు, పండితులతో భయపడుతున్నాను. వారిపై ఒకసారి కత్తి పడిందంటే ప్రళయం వరకు లేపబడదు. నా అనుచర సంఘంలోని ఒక చిన్న సమూహం ముష్రికులతో కలువని వరకు, మరొక సమూహం విగ్రహాలను పూజించని వరకు ప్రళయం సంభవించదు. నా అనుచర సంఘంలో 30 అసత్యవాదులు వస్తారు. వారిలో ప్రతి ఒక్కడు తనే ప్రవక్త అని అరోపణ చేస్తాడు. నేను చిట్టచివరి ప్రవక్తని. నా తరువాత ఏ ప్రవక్త రాడు. ఎల్లకాలం, ఎల్లవేళల్లో సత్యం, ధర్మంపై ఒక సంఘము ఉండే ఉంటుంది. వారికి దైవ సహాయం లభిస్తూనే ఉంటుంది. ఆ సంఘాన్ని వదలి వెళ్ళినవాడు దానిని ఏ మాత్రం హాని కలిగించలేడు. చివరికి ప్రళయం సంభవిస్తుంది”.

ముఖ్యాంశాలు:

1. సూరె నిసా ఆయతు భావం.

2. సూరె మాఇద ఆయతు భావం.

3. సూరె కహఫ్ ఆయతు భావం.

4. ఇది చాలా ముఖ్య విషయం : ఇందులో జిబ్త్, తాగూత్ పై విశ్వాసం అంటే ఏమిటి? అది హృదయాంతర విశ్వాసమా? లేక అది మిథ్యం , అసత్యం అని తెలిసి, దానితో ప్రేమ, ఇష్టం లేనప్పటికి కేవలం దాన్ని అనుసరించిన వారితో సంబంధమా?

5. అవిశ్వాసుల అవిశ్వాసం తెలిసి కూడా వారు విశ్వాసులకన్నా ఉత్తమమైన మార్గంపై ఉన్నారన్న యూదుల మాట కూడా తెలిసింది.

6. ఒక ముఖ్య విషయం అది ఈ అధ్యాయంలో ఉద్దేశించినది. అది అబూ సఈద్ హదీసులో వచ్చినది; ప్రవక్త అనుచర సంఘంలో కొంత మంది గత మతస్తులను అనుసరిస్తారు.

7. వీరిలో కొంత మంది విగ్రహ పూజారులు అవుతారు.

8. విచిత్రమైన విషయం : ప్రవక్తలు అని ప్రకటన చేసేవారు వస్తారు. ఉదా: ముఖ్తార్ అబూ ఉబైద్ సఖఫీ. అతడు “లా ఇలాహ ఇల్లల్లాహ్”ను చదివి, ప్రవక్త అనుచర సంఘంలోనివాడయి, ముహమ్మద్ ప్రవక్తను సత్యప్రవక్త, చివరి ప్రవక్త అని, ఖుర్ఆన్ సత్యం అని నమ్మి కూడా వాటికి వ్యెతిరేకించి తానే ప్రవక్త అని ప్రకటించుకున్నాడు. అతడు ప్రవక్త సహచరుల చివరి జీవితకాలంలో పుట్టినవాడు. అతన్ని చాలా మంది అనుసరించారు.

9. ఇంతకు ముందు కాలంలో జరిగినట్లు ఇస్లాం ధర్మం నశించిపోదు. ఎల్లప్పుడు దానిని అనుసరించేవారు కొందరు ఉంటారు అన్న శుభవార్త ఉంది.

10. వారు సంఖ్యలో అల్పులయినప్పటికీ వారిని విడనాడినవాడు, వ్యెతిరేకించినవాడు వారికి ఏ హానీ కలిగించలేడు అన్న గొప్ప సూచన ఉంది.

11. ఇది ప్రళయము వరకు ఉండును.

12. ఇందులో ఉన్న గొప్ప సూచనలు:

  • అల్లాహ్, ప్రవక్తకు తూర్పు, పడమర వరకు ఉన్న భూమిని దగ్గరికి చేశాడు. ప్రవక్త ఈ దాని గురించి తెలిపిన విషయం నిజమయింది. (అంటే తూర్పు, పడమరలో ఇస్లాం వ్యాపించింది). ఉత్తరం, దక్షిణం గురించి ఇలా ఏమి తెలుపలేదు.
  • రెండు ధనభండారాలు లభించాయి అని తెలిపారు.
  • ప్రవక్త చేసిన రెండు దుఆలు అల్లాహ్ స్వీకరించాడు.
  • పరస్పర యుద్ధాలకు, వినాశనాలకు గురికాకూడదు అన్న మూడవ దుఆ అల్లాహ్ స్వీకరించలేదు.
  • వారి పై కత్తి నడిచిందంటే అగదు అన్నది కూడా సత్యమైంది.
  • పరస్పరం హత్యయత్నాలు, ఖైదీలు చేయడం జరుగతుంది అన్న విషయం తెలిసింది.
  • అనుచర సంఘం పై భ్రష్టనాయకుల, పండితుల (మౌల్వీల) భయం ఉంది అని తెలిపారు.
  • వీరిలో తానే ప్రవక్త అని ఆరోపించేవారు వస్తారు అన్న సూచన ఉంది.
  • అల్లాహ్ సహాయం పొందే ఒక సమూహం ధర్మం వైపు ఎల్లప్పుడూ ఉంటుందన్న శుభవార్త ఇచ్చారు. ప్రవక్త తెలిపిన పై సూచనలు మన బుద్ధిజ్ఞానంతో ఆలోచిస్తే అసంభవం అని అంటామేమో, కాని అవి పూర్తిగా నిజమైనాయి.

13. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన అనుచర సంఘం పట్ల భయం మార్గభ్రష్టులైన పండితులతో మాత్రమే ఉంది అని తెలిపారు.

14. విగ్రహ పూజ యొక్క భావాన్ని వివరించారు. (అది అల్లాహ్ యేతరులకు రుకూ, సజా చేయడమే కాదు. వారు హలాల్ చేసినదాన్ని హలాల్, హరాం చేసినదాన్ని హరాంగా నమ్ముట కూడా).

తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ) :

ఈ అధ్యాయం యొక్క ఉద్దేశం ముస్లిం సంఘంలో సంభవించిన షిర్క్ నుండి హెచ్చరించడం. ఇది ముస్లిం సమాజంలో వ్యాపించింది. అదే విధంగా “లాఇలాహ ఇల్లల్లాహ్” నోటితో పలికి, తనకు తాను ముస్లిం అని చాటుకున్న వ్యక్తి, దానికి వ్యెతిరేకమున్న: సమాధిలో ఉన్నవారితో దుఆ, మొరపెట్టు కొనుట లాంటి పనులు చేసి, దానికి వసీల అన్న పేరు పెడితే అతని తౌహీద్ లో ఏలాంటి తేడా ఉండదు అని అన్నవారి ఖండన కూడా ఇందులో ఉంది.

“వసన్” అంటే: అల్లాహ్ తప్ప పూజింపబడే వారు. అందులో పూజింపబడే చెట్లు, రాళ్ళు (సమాధులపై ఉన్న) నిర్మాణాలు. ఇంకా ప్రవక్తలు, పుణ్యాత్ములు,దుష్టులు అన్నీ వస్తాయి. ఇబాదత్ కేవలం అల్లాహ్ హక్కు. అల్లాహ్ తప్ప ఇతరులతో దుఆ చేయువాడు, లేక వారిని ఆరాధించేవాడు, వారిని “వసన్” (విగ్రహంగా, ఆరాధ్యదైవంగా) చేసుకున్నవాడయ్యాడు. అందువల్ల అతను ఇస్లాం నుండి దూరమవుతాడు. తనకు తాను ముస్లిం అని చెప్పుకున్నా లాభం లేదు. తమను తాము ఇస్లాం వైపుకు అంకితం చేసుకున్న అవిశ్వాసులు, నాస్తికవాదులు, తిరస్కారులు, కపట విశ్వాసులు (మునాఫిఖులు) ఎంత మంది లేరు. వాస్తవ ధర్మంతోనే స్వఛ్చమైన విశ్వాసుడు అనబడును. కేవలం పేరుతో, పదాలతో కాదు.


నుండి:  ఏకత్వపు బాటకు సత్యమైన మాట (అల్ ఖౌలుస్ సదీద్ షర్హు కితాబిత్ తౌహీద్) – (షేఖ్ అబ్దుర్ రహ్మాన్ అస్సఅదీ రహిమహుల్లాహ్) [పుస్తకం]. తెలుగు అనువాదం: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

చివరకు దైవదూతల హృదయాల నుండి భయం తొలగి పోయినప్పుడు, వారు “మీ ప్రభువు ఏమని పలికాడు?” అని అడుగుతారు

బిస్మిల్లాహ్

16 వ అధ్యాయం
అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్ – ఇమామ్ అస్-సాదీ
The famous commentary of Shaykh as-Sa’di of the book Kitab at-Tawhid of Muhammad ibn Abdul Wahhab.


إِذَا فُزِّعَ عَن قُلُوبِهِمْ قَالُوا مَاذَا قَالَ رَبُّكُمْ ۖ قَالُوا الْحَقَّ ۖ وَهُوَ الْعَلِيُّ الْكَبِيرُ

అల్లాహ్ ఆదేశం: (చివరకు దైవదూతల హృదయాల నుండి భయం తొలగిపోయినపుడు, వారు “మీ ప్రభువు ఏమని పలికాడు?” అని అడుగుతారు. వారు, “సత్యం పలికాడు”, ఆయన మహిమాన్వితుడు, మహోన్నతుడు అని అంటారు). (సబా 34:23).

అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా చెప్పారు:

“అల్లాహ్ ఆకాశంలో ఒక ఆదేశం జారి చేసినప్పుడు, ఆయన ఆజ్ఞకు (విధేయులై) దైవదూతలు తమ రెక్కలు కొడుతారు. దాని శబ్దం కొండరాతిపై గొలుసుతో కొట్టినట్లు ఉంటుంది. ఆయన ఆదేశం వారి వరకు చేరుతుంది. చివరకు వారి హృదయాల నుండి భయం తొలగిపోయినప్పుడు, వారు “మీ ప్రభువు ఏమని పలికాడు?” అని అడుగుతారు. వారు, “సత్యం పలికాడు”, ఆయన మహెూన్నతుడు, మహిమాన్వితుడు అని చెబుతారు. ఈ మాటను దొంగలించడానికి షైతాన్ వింటూ ఉంటాడు. షైతానులు ఒకరిపై ఒకరు ఇలా ఉంటారు అని (ఈ హదీసు ఉల్లేఖించేవారిలో ఒకరు) సుఫ్యాన్ బిన్ ఉమయ్య నా తమ అరచేతిని వంచి వ్రేళ్ళ మధ్య వ్యత్యాసముంచి వివరించారు. ఆ షైతాన్ ఒక్క మాట విని, అతని క్రింద ఉన్న షైతాన్ కు ఇస్తాడు. ఇలా ప్రతి ఒకడు తన క్రిందివానికి ఇస్తూ చివరివాడు మాంత్రికునికి, లేక జ్యోతిష్యునికి ఇస్తాడు. ఒకప్పుడు ఆ మాట క్రిందికి చేరక ముందే (అల్లాహ్ ఆకాశంలో నియమించిన) అగ్ని జ్వాల అతడ్ని పట్టుకొని (కాల్చేస్తుంది). ఒకప్పుడు ఆ అగ్నిజ్వాల పట్టుకోక ముందే ఆ మాటను అతడు పంపేస్తాడు. ఆ ఒక్క మాటలో మాంత్రికుడు, లేక జ్యోతిష్యుడు వంద అబద్దాలు కలిపి (ప్రజలకు చెబుతాడు). అతడు చెప్పింది నిజమయేదుంటే, ప్రజలు అతను (మాంత్రికుడు, జ్యోతిష్యుడు) అలా, అలా చెప్పలేదా అని అనుకుంటారు. కాని అందులో నిజమయేది ఆ ఆకాశం నుండి విన్న ఒక్క మాటే”. (బుఖారి).

నవాసుబ్ను సమ్ ఆన్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు:

“అల్లాహ్ ఒక విషయం వహీ (దివ్య సందేశం) పంపాలని కోరినప్పుడు వహీ ద్వారా మాట్లాడుతాడు. అప్పుడు అల్లాహ్ భయంతో ఆకాశాలు కంపించిపోతాయి. ఆకాశవాసులు ఇది విన్నప్పుడు సొమ్మసిల్లి, సజ్దాలో పడిపోతారు. మొట్ట మొదట వారిలో జిబ్రీల్ తలెత్తుతారు. అల్లాహ్ తాను కోరింది వహీ ద్వారా అతనితో మాట్లాడుతాడు. తరువాత జిబ్రీల్ దైవదూతల ముందు వెళ్తారు. ప్రతీ ఆకాశం నుండి వెళ్తున్నప్పుడు ఆ ఆకాశ దైవదూతలు మీ ప్రభువు ఏమన్నాడు? అని అడుగుతారు. “సత్యం పలికాడు. ఆయన మహెన్నతుడు, మహిమాన్వితుడు” అని అతడంటాడు. వారందరు జిబ్రీల్ అన్నట్లు అంటారు. తరువాత జిబ్రీల్ ఆ విషయాన్ని ఎక్కడ చేరవేయాలని అల్లాహ్ చెప్పాడో అక్కడికి చేరవేస్తారు”.

ముఖ్యాంశాలు:

1. ఖుర్ ఆన్ ఆయతు యొక్క భావం (అల్లాహ్ వహీ చేసినప్పుడు దైవ దూతల భయ కంపనాల వివరణ ఉంది).

2. ఇందులో షిర్క్ కు విరుద్ధంగా బలమైన ఋజువు ఉంది. ప్రత్యేకంగా పుణ్యపురుషుల పేరు మీద జరిగే షిర్క్. ఈ ఆయత్ ఆంతర్యాల నుండి షిర్క్ పునాదులను బద్దలు చేస్తుంది అని అనబడింది.

3. “సత్యం పలికాడు, ఆయన మహిమాన్వితుడు, మహోన్నతుడూ” అన్న ఆయతు భావం.

4. వారు ప్రశ్నించింది ఎందుకు అన్నది కూడా తెలుస్తుంది. (అల్లాహ్ భయంతో).

5. ఆ తరువాత జిబ్రీల్ “అల్లాహ్ ఇలా ఇలా చెప్పాడు” అని వారికి బదులిస్తారు.

6. “మొదటిసారిగా తల ఎత్తేవారు జిబ్రీల్ ” అన్న ప్రస్తావన వచ్చింది.

7. ఆకాశవాసులందరు అడిగినందుకు జిబ్రీల్ వారందరికి సమాధానమిస్తారు.

8. ఆకాశవాసులందరూ సొమ్మసిల్లిపోతారు.

9. ఆకాశాలు కంపించేది అల్లాహ్ యొక్క వచనములతో.

10. అల్లాహ్ ఆదేశమిచ్చిన చోటకి వహీ తీసుకెళ్ళేవారు జిబ్రీలె.

11. షైతానులు మాటలను దొంగతనం చేసే ప్రయత్నాలు చేసేవారు.

12. షైతానులు ఒకరిపై ఒకరు ఎక్కుతారు, ఆకాశంలోని మాట అందుకోవటానికి.

13. వారిని తరిమి కొట్టడానికి అగ్నిజ్వాల పంపబడుతుంది.

14. ఒక్కప్పుడు అగ్నిజ్వాల అతన్ని అందుకొని కాల్చేస్తుంది. ఒకప్పుడు అతడు తప్పించుకొని ఆ మాట మాంత్రికుని, లేక జ్యోతిష్యునికి అందిస్తాడు.

15. ఒక్కోసారి మాంత్రికుని, జ్యోతిష్యుని మాట నిజమవుతుంది.

16. మాంత్రికుడు, జ్యోతిష్యుడు ఆ ఒక్క మాటకు వంద అబద్దాలు కలుపుతాడు.

17. అతని అసత్య మాటల్ని ప్రజలు నిజమనుకునేది ఆ ఒక్క ఆకాశ మాట నిజమయినందుకే.

18. అసత్యాన్ని, మిథ్యాన్ని మనుస్సు ఎంత తొందరగా ఒప్పుకుంటుందో చూడండి. ఒక్క మాటను చూస్తారు, కాని వంద అబద్దాలున్నాయని గమనించరు.

19. షైతానులు పరస్పరం ఆమాటను అందుకొని జ్ఞాపకముంచుకుంటారు. ఇతర మాటల్ని నిజమని భావింపజేసే ప్రయత్నం చేస్తారు.

20. ఇందులో అల్లాహ్ గుణవిశేషణాలు రుజువవుతున్నాయి. “అష అరియ్య, ముఅత్తిల” వర్గంవారు వాటిని తిరస్కరిస్తారు. (వాస్తవానికి తిరస్కరించ కూడదు).

21. కంపించుట, సొమ్మసిల్లుట అనేది అల్లాహ్ భయం వలన జరుగుతుంది.

22. దైవదూతలు అల్లాహ్ కు సజ్దా  చేస్తారు.

తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ) 

ఇందులో కూడా తౌహీద్ విధితం, షిర్క్ తుచ్ఛం అని చెప్పడానికి గొప్ప నిదర్శనం ఉంది. పై మూల వాక్యాల్లో అల్లాహ్ గొప్పతనం, ఔన్నత్యం ప్రస్తావించబడినది. ఆ గొప్పతనం, ఔన్నత్యం ముందు సర్వ సృష్టి యొక్క పెద్దరికాలు మట్టిలో కలిసిపోతాయి. అతని మాట వింటేనే భూమ్యాకాశాల్లో ఉన్న సర్వ దైవదూతల గుండెలు అదిరిపోతాయి. వారందరు ఆయన ఎదుట తల మోకరిల్లి, ఆయన గొప్పతనం, ఔన్నత్యాలను స్తుతిస్తారు. ఆయనతో భయపడుతారు. ఇలాంటి గొప్ప గుణం గల ప్రభువే, ఆరాధనకు అర్హుడు కాగలడు. ఆయన తప్ప మరెవ్వరూ ఆరాధనకు, పొగడ్తలకు, ప్రశంసలకు, కృతజ్ఞతకు అర్హులు కారు.


నుండిఏకత్వపు బాటకు సత్యమైన మాట (అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్)  – ఇమామ్ అస్-సాదీ [పుస్తకం]  

ప్రశ్న: భర్త నమాజు చదవడం లేదు. తావీజు ధరిస్తున్నాడు. షిర్క్ చేస్తున్నాడు. ఇటువంటి సమయంలో విశ్వాసురాలైన భార్య ఏం చేయాలి! [ఆడియో]

బిస్మిల్లాహ్

ప్రశ్న- భర్త నమాజు చదవడం లేదు. తావీజు ధరిస్తున్నాడు. షిర్క్ చేస్తున్నాడు. ఇటువంటి సమయంలో విశ్వాసురాలైన భార్య ఏం చేయాలి!

ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [7:00 నిముషాలు ]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

బాబాలతో మొరపెట్టుకొనుట పాపమా?? [వీడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

బాబాలతో మొరపెట్టుకొనుట పాపమా??
https://www.youtube.com/watch?v=Me4Hujjsn2A [4నిముషాలు ]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia

ఈ వీడియో ఇస్తిఘాసా (సహాయం కోసం అర్ధించడం, మొరపెట్టుకొనటం) అనే ఇస్లామీయ భావనను వివరిస్తుంది. ఇది రెండు రకాలుగా ఉంటుందని ప్రవక్త స్పష్టం చేశారు: అనుమతించబడినది మరియు నిషిద్ధమైనది. ఒక వ్యక్తి తన సామర్థ్యం పరిధిలో ఉన్న విషయాల కోసం జీవించి ఉన్న మరో వ్యక్తి సహాయం కోరడం అనుమతించబడినది. కానీ, కేవలం అల్లాహ్ మాత్రమే చేయగల విషయాల కోసం అల్లాహ్ ను కాకుండా ఇతరులను (ప్రవక్తలు, ఔలియాలు, బాబాలు) వేడుకోవడం నిషిద్ధం, మరియు ఇది షిర్క్ (బహుదైవారాధన) కిందకు వస్తుంది. ప్రసంగంలో ఈ రెండు అంశాలను సమర్థించడానికి ఖురాన్ నుండి నిదర్శనాలు కూడా ఉదహరించబడ్డాయి.

అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు. అల్ హందులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్. ప్రియమైన ప్రేక్షకులారా, అల్లాహ్ యేతరులతో, అల్లాహ్ ను కాకుండా ఔలియా అల్లాహ్ తో, బాబాలతో, ఇలాంటి వారితో మొరపెట్టుకొనుట పాపమా?

చూడండి, అరబీలో ఇస్తిఘాసా అని ఒక పదం ఉపయోగపడుతుంది. దానిని ఉర్దూలో ఫరియాద్ కర్నా అంటే సహాయానికై ఎవరినైనా అర్ధించటం, మొరపెట్టుకొనటం. కష్టంలో ఉన్నప్పుడు, మనిషి ఆపదలో ఉన్నప్పుడు మొరపెట్టుకొనుట దీనిని ఇస్తిఘాసా అంటారు.

అయితే ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి, కొన్ని కష్టాలు అవి దూరమగుటకు మనలాంటి మానవులు, మనకంటే మంచి వాళ్ళు, పుణ్యాత్ములు, బ్రతికి ఉన్నవారు మనకు సహాయం చేసి ఆ కష్టం దూరం అవ్వడంలో మనకు వారి యొక్క సహాయతను అందించగలుగుతారు. అలాంటి వాటిలో వారిని సహాయం గురించి మనం అర్ధించడం, మొరపెట్టుకొనటం తప్పులేదు.

ఇదే విషయాన్ని అల్లాహు త’ఆలా సూరతుల్ ఖసస్, సూరహ్ నంబర్ 28, ఆయత్ నంబర్ 15 లో తెలిపాడు. మూసా అలైహిస్సలాం వంశానికి సంబంధించిన ఒక వ్యక్తి అతనిపై ఈజిప్ట్ దేశానికి సంబంధించిన అక్కడి వాస్తవ్యుడు దౌర్జన్యం చేస్తున్నప్పుడు

فَاسْتَغَاثَهُ الَّذِي مِنْ شِيعَتِهِ
(ఫస్తగాసహుల్లజీ మిన్ షీ’అతిహి)
అప్పుడు అతని వర్గానికి చెందిన వ్యక్తి శత్రు వర్గానికి చెందిన వ్యక్తికి వ్యతిరేకంగా సహాయం కోసం అతనిని (మూసాను) పిలిచాడు.

మూసా అలైహిస్సలాం వంశానికి సంబంధించిన వ్యక్తి మూసా అలైహిస్సలాం తో ఇస్తిఘాసా చేశాడు. అంటే సహాయం కొరకు అతడు మొరపెట్టుకున్నాడు. మూసా అలైహిస్సలాం వెళ్ళి అతనికి సహాయపడ్డాడు.

కానీ మన జీవితంలో మనం చూస్తూ ఉంటాము, ఎన్నో సందర్భాలలో మనపై వచ్చే కొన్ని ఆపదలు, కష్టాలు ఎలా ఉంటాయి? అవి కేవలం అల్లాహ్ తప్ప మరెవరూ దానిని దూరం చేయలేరు. అలాంటి వాటిలో కేవలం అల్లాహ్ నే మొరపెట్టుకోవాలి. అల్లాహ్ నే అర్ధించాలి. అల్లాహ్ తో మాత్రమే సహాయం కోరాలి. ఆయన తప్ప ఇంకా వేరే ఏ ప్రవక్తను గానీ, ఏ అల్లాహ్ యొక్క వలీని గానీ, ఏ బాబాలను గానీ, ఏ పీర్ ముర్షిదులను గానీ మొరపెట్టుకోరాదు.

సూరతుల్ అన్ఫాల్ సూరహ్ నంబర్ 8, ఆయత్ నంబర్ 9 లో

إِذْ تَسْتَغِيثُونَ رَبَّكُمْ فَاسْتَجَابَ لَكُمْ
(ఇజ్ తస్తగీసూన రబ్బకుం ఫస్తజాబ లకుం)
మీరు మీ ప్రభువు సహాయం కోసం మొరపెట్టుకున్నప్పుడు, ఆయన మీకు సమాధానమిచ్చాడు.

ఆ సమయాన్ని, ఆ సందర్భాన్ని మీరు గుర్తు చేసుకోండి. ఎప్పుడైతే మీరు అల్లాహ్ తో మొరపెట్టుకుంటున్నారో అల్లాహ్ మీకు సమాధానం ఇచ్చాడు, మీకు సహాయం అందించాడు. మీరు ఆ యుద్ధంలో గెలుపొందడానికి, విజయం సాధించడానికి అన్ని రకాల మీకు సహాయపడ్డాడు.

చూసారా? స్వయంగా ఖురాన్ లో ఈ బోధన మనకు కనబడుతుంది. ఏ విషయంలోనైతే ఒకరు మనకు సిఫారసు చేయగలుగుతారో, ఒకరు మనకు సహాయం చేయగలుగుతారో వాటిలో మనం వారిని మొరపెట్టుకొనుట ఇది తప్పు కాదు.

కానీ ఈ రోజుల్లో ప్రజలలో అలవాటుగా అయిపోయింది. యా గౌస్, యా అలీ అల్-మదద్ ఇలాంటి మాటలు, ఇలాంటి పుకార్లు, ఇలాంటి సహాయం కొరకు అర్ధింపులు ఇవి ఏ మాత్రం యోగ్యం కావు, ధర్మసమ్మతం కావు. ఇవి హరాంలో లెక్కించబడతాయి, షిర్కులోకి వచ్చిస్తాయి.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/p=8811

దర్గాలు, సమాధులు, ఔలియాల వాస్తవికత:
https://teluguislam.net/graves-awliya/

యూట్యూబ్ ప్లే లిస్ట్:
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0IUeQVvT8sjlYDsK6O9rFF

ప్రదర్శనాబుద్ధి – ఇమామ్ అస్-సాదీ

బిస్మిల్లాహ్

36వ అధ్యాయం: ప్రదర్శనాబుద్ధి
అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్ – ఇమామ్ అస్-సాదీ
The famous commentary of Shaykh as-Sa’di of the book Kitab at-Tawhid of Muhammad ibn Abdul Wahhab.


قُلْ إِنَّمَا أَنَا بَشَرٌ مِّثْلُكُمْ يُوحَىٰ إِلَيَّ أَنَّمَا إِلَٰهُكُمْ إِلَٰهٌ وَاحِدٌ ۖ فَمَن كَانَ يَرْجُو لِقَاءَ رَبِّهِ فَلْيَعْمَلْ عَمَلًا صَالِحًا وَلَا يُشْرِكْ بِعِبَادَةِ رَبِّهِ أَحَدًا

(ప్రవక్తా! ఇలా చెప్పండి: “నేను మీలాంటి మానవమాత్రుణ్ణే, నాకు వహీ ద్వారా ఇలా తెలుపబడింది. ‘మీ ఆరాధనలకు అర్హుడు కేవలం ఒకే ఒక్కడు. కనుక తన ప్రభువును కలుసుకోవాలని ఆశించేవాడు సత్కార్యాలు చేయాలి, ఆరాధనలో తన ప్రభువుతో పాటు మరెవ్వరినీ చేర్చకూడదు”). (కహఫ్ 18:110).

అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు,అల్లాహ్ ఇలా తెలిపాడని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించారు: “నేను ఇతర సహవర్తులకంటే అధికంగా “షిర్క్” కు అతీతుణ్ణి. ఎవరు ఒక పని చేసి, అందులో నాతో ఇతరుల్ని సాటికల్పిస్తారో  నేను అతణ్ణీ, అతని  ఆ పనిని స్వీకరించను“. (ముస్లిం).

అబూ సఈద్‌ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: ఒకసారి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నేను మీకు మసీహుద్దజ్జాల్‌ కన్నా భయంకరమైన విషయము తెలపనా? అని ప్రశ్నిస్తే  ‘తప్పక తెలుపండని’ మేము విన్నవించుకోగా “గుప్తమైన షిర్క్‌, అదేమనగా: ఒక వ్యక్తి చూసినవారు నన్ను మెచ్చుకోవాలని అలంకరిస్తూ, ఎన్నలతో నమాజ్‌ చేస్తాడు”. (అలా స్తుతించబడటానికి, చూచిన వారు మెచ్చుకోవాలనే ఉద్దేశముతో చేయడం గుప్తమెన షిర్క్‌) అని చెప్పారు. (అహ్మద్‌,ఇబ్ను  మాజ: 4204).

ముఖ్యాంశాలు:

1. సూరయే కహఫ్ ఆయతు యొక్క వ్యాఖ్యానం. (ప్రతి పని సంకల్ప శుద్ది (ఇఖ్లాస్)తో కూడుకొని యుండాలని చెప్పడం జరిగింది).

2. ఒక గొప్ప విషయం: సత్కార్యంలో అల్లాహ్ యేతరుల ఏ కొంచెం ప్రవేశమున్న (ఆ క్రియలో, లేక సంకల్పంలో) అది రద్దు చేయబడుతుంది.

3. అల్లాహ్ సంపూర్ణంగా అతీతుడు కనుక (ప్రదర్శనాబుద్ధితో కలుషితమైన) కార్యాన్ని స్వీకరించడు, (దానికి ఫలితం ప్రసాదించడు).

4. దానికి మరో కారణం ఏమనగా  అల్లాహ్ అందరికన్నా ఘనతగలవాడు. (ఆయన్ని వదలి లేక ఆయనతో మరొకరిని సాటి కల్పించడం ఘోరమైన పాపం).

5. ప్రవక్త (సల్లల్లాహు అలైహివసల్లం) తమ అనుచరుల పట్ల ప్రదర్శనా బుద్ధి నుండి భయం చెంది (దాని నుండి దూరముండాలని తాకీదు చేసారు).

6. దాన్ని విశదీకరించి చెప్పారు: నమాజు చేసే వ్యక్తి, చూసేవారు మెచ్చుకోవాలని ఎంతో అందముగా చేసే ప్రయత్నం చేస్తాడు.

తాత్పర్యం:(అల్లామా అల్ సాదీ) 

అల్లాహ్ కొరకు నిర్దుష్టమైన భక్తి / ఏకాగ్ర చిత్తం కలిగియుండుట ధర్మం యొక్క పునాది. మరియు అదే తౌహీద్‌కు ప్రాణం. నిర్దుష్టమైన భక్తి / ఏకాగ్రచిత్తం (ఇఖ్లాస్) అంటే మానవుడు తను చేసే ప్రతి పని ఉద్దేశం అల్లాహ్ సంతృప్తి, ఆయన నుండి పుణ్యం, ప్రళయమున సాఫల్యం పొందుట కొరకే ఉండాలి. ఇదే అసలైన  తౌహీద్‌.

దీనికి బద్ద  విరుద్ధం ప్రదర్శనాబుద్ధి. చూసినవారు మెచ్చుకోవాలని, పొగడాలని, హోదా, ప్రాపంచిక లాభం పొందుట దాని ఉద్దేశం ఉండకూడదు.

ప్రదర్శనా బుద్ది  గురించి కొంచెం వివరంగా తెలుసుకోవాలి:-

ఒక వ్యక్తి ఏదైనా సత్కార్యం చేయునప్పుడు, దాని ఉద్దేశం ప్రజలు చూడాలి అని మనుసులో వచ్చినప్పుడు, ఆ ఆలోచనను దూరం చేయకుండా అలాగే ఉండిపోతే దాని వలన ఆ సత్కార్యం వృథా అవుతుంది (ఫలితం లభించదు). అది చిన్న షిర్క్‌ అవుతుంది. అలాగే పెద్ద షిర్క్‌కు కారణం అవుతుందను భయం కూడా ఉంటుంది.

సత్కార్యం చేసే ఉద్దేశం అల్లాహ్ సంతృప్తితో పాటు ప్రజలు చూడాలి అని కూడా మనుస్సులో వచ్చినప్పుడు, అతని ఆ సత్కార్యంలో ప్రదర్శనాబుద్ది ప్రవేశించింది కనుక అది కూడా వృథా అవుతుందని నిదర్శనాలున్నాయి. సత్కార్యం చేసే ఉద్దేశం కేవలం అల్లాహ్ సంతృప్తి అయినప్పటికీ, మధ్యలో ప్రదర్శనాబుద్ది ఉద్దేశం ప్రవేశించి, అతను దాన్ని తొలగించి ఏకాగ్రచిత్తం (ఇఖ్లాసు) పాటిస్తే అతనికి ఏలాంటి నష్టం ఉండదు. ఆ దురుద్దేశాన్ని అతను తొలగించకుంటే, ఎంత శాతం ప్రదర్శనాబుద్ధి ఉందో, అంతే ఆ సత్కార్యంలో కొరత ఏర్పడుతుంది.విశ్వాసం, ఇఖ్లాస్లలో బలహీనత వస్తుంది.

ప్రదర్శనాబుద్ధి మహాగండం. దానికి చికిత్స చాలా అవసరం. మనసుకు ఇఖ్లాసు యొక్క మంచి శిక్షణ ఇవ్వాలి. ప్రదర్శనాబుద్ధిని, నష్టం కలిగించే మనోవాంఛల్ని తొలగించుటకు తగిన ప్రయత్నం చేయాలి. అందుకు అల్లాహ్ సహాయం కోరాలి. అల్లాహ్ తన దయ మరియు కరుణతో ఇఖ్లాస్ భాగ్యం ప్రసాదించి, తౌహీద్‌ వాస్తవికత యొక్క జ్ఞానం కలిగిస్తాడు.

ప్రాపంచిక లాభం, మనోవాంఛల కొరకు సత్కార్యం చేయుట:

అల్లాహ్ సంతృప్తి ఉద్దేశం ఏ మాత్రం లేకుండా, కేవలం పై ఉద్దేశమే ఉంటే, అతనికి దానికి బదులు ఏ లాభమూ ఉండదు. ఇలా ఒక విశ్వాసి  ప్రవర్తించుట సమంజసం కాదు. విశ్వాసి అతని విశ్వాసం ఎంత బలహీనంగా ఉన్నప్పటికి అతను అల్లాహ్ సంతృప్తి, పరలోక లాభం కోరుటయే చాలా అవసరం.

ఎవరు అల్లాహ్ సంతృప్తి, ప్రాపంచిక లాభం రెండు ఉద్దేశాలతో  చేసినప్పుడు, రెండు ఉద్దేశాలు ఒకే పరిమాణంలో ఉంటే, అతను విశ్వాసి అయి ఉంటే, వాస్తవానికి అతని విశ్వాసంలో, ఇఖ్లాస్లో కొరత ఉన్నట్లే. ఇఖ్లాసులో కొరత ఉన్నప్పుడు అతని కార్యం కూడా సంపూర్ణం కాదు. (ఫలితం సంపూర్ణంగా ఉండదు).

ఎవరు కేవలం అల్లాహ్ సంతృప్తి కొరకు, సంపూర్ణ ఇఖ్లాస్ తో చేస్తారో, కాని అతను దానిపై వేతనము లేక బహుమానము పొందుతాడు. దానితో అతను తన పని, ధర్మంలో సహాయం తీసుకుంటాడు. ఉదా: ఎవరైనా ఒకమంచి పని, పుణ్యకార్యం చేసినందుకు ఏదైనా బత్తెం దొరికినట్టు. ముజాహిద్  జిహాద్‌ చేయుటకు వెళ్ళినప్పుడు యుద్ధఫలం (గనీమత్‌)పొందినట్లు. మస్జిద్, మద్‌రసా మరియు ధర్మకార్యాలు నిర్వహించే వారికి వక్ఫ్ బోర్డు ఇచ్చే వేతనాలు. ఇలాంటివి తీసుకొనుట వలన విశ్వాసం, తౌహీద్‌లో ఏలాంటి కొరత, నష్టం వాటిల్లదు.ఎందుకనగా అతని ఆ సత్కార్యం చేయు ఉద్దేశం ఉంటుంది. అతను పొందునది అతలధర్మం పై నిలకడ కొరకు సహాయము చేయును. అందుకే జకాత్‌ మరియు మాలె పై (యుధ్ధ ఫలం లాంటిది) లాంటి ధనంలో, ధార్మిక మరియు లాభదాయకమైన ప్రాపంచిక కార్యాలు నిర్వహించువారికి హక్కు ఉంది.


నుండిఏకత్వపు బాటకు సత్యమైన మాట (అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్)  – ఇమామ్ అస్-సాదీ [పుస్తకం]  

హస్తాన్ని పరిశీలించి లేదా తారాబలాన్ని చూసి అగోచర  జ్ఞానం ఉందని చెప్పటం – డా. సాలెహ్ అల్ ఫౌజాన్

బిస్మిల్లాహ్

అగోచరం అంటే .. :

భూత భవిష్యత్ కాలాలకు చెందిన ఏ విషయాలైతే  జనుల దృష్టికి రావో – కంటికి కానరావో – వాటిని అగోచరాలని అంటారు.

అగోచర జ్ఞానాన్ని అల్లాహ్‌ తన కొరకు ప్రత్యేకించుకున్నాడు. ఆయన ఇలా సెలవిచ్చాడు :

قُل لَّا يَعْلَمُ مَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ الْغَيْبَ إِلَّا اللَّهُ

“అల్లాహ్  తప్ప ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్న వారెవరికీ అగోచర జ్ఞానం లేదు.” (అన్‌ నమ్ల్‌ 27: 65)

అల్లాహ్ కొన్ని సందర్భాలలో దైవప్రవక్తలలో కొందరికి, కొన్ని పరమార్థాల దృష్ట్యా తన అగోచర జ్ఞానంలోని కొన్ని విషయాలను తెలియజేస్తాడు. ఆ విషయాన్నే ఇక్కడ ప్రస్తావించటం జరిగింది.

عَالِمُ الْغَيْبِ فَلَا يُظْهِرُ عَلَىٰ غَيْبِهِ أَحَدًا إِلَّا مَنِ ارْتَضَىٰ مِن رَّسُولٍ

“ఆయన అగోచర జ్ఞానం కలవాడు. తన అగోచర విషయాలను ఆయన ఎవరికీ తెలుపడు – తాను ఇష్టపడిన ప్రవక్తకు తప్ప!” (అల్‌ జిన్న్‌ : 26, 27)

అంటే, అల్లాహ్ తనకు స్వంతమైన అగోచర జ్ఞానంలోని కొంత భాగాన్ని తన ప్రవక్తలలో తాను కోరిన వారికి, కొన్ని పరమార్థాల దృష్ట్వా తెలియపరచటం సంభవమే. ఎందుకంటే అతను (ఆ ప్రవక్త) ఆ అద్భుతాలను తన దైవదౌత్యానికి నిదర్శనంగా చూపుతాడు. ఇలాంటి అద్భుతాలలో, అగోచర విషయాలను (భవిష్యవాణి) తెలుపటం కూడా ఒకటి. ఈ అగోచర జ్ఞానంలో మానవ సందేశహరునికి, దైవదూతల సందేశవాహకునికి మాత్రమే ప్రమేయం ఉంటుంది. మూడో వ్యక్తికి ఇందులో ఎలాంటి దఖలు ఉండదు. ఎందుకంటే అల్లాహ్ అగోచర జ్ఞానాన్ని వారిరువురికే పరిమితం చేశాడు. కాబట్టి అల్లాహ్‌ దృష్టిలో మినహాయింపుకు నోచుకున్న ఆ సందేశహరులు తప్ప వేరెవరయినా తనకు అగోచర జ్ఞానం ఉందని అంటే అతను అసత్యవాది, అవిశ్వాసానికి ఒడిగట్టిన వాడవుతాడు. అతను హస్త సాముద్రికం ఆధారంగా చెప్పినా, తారాబలం చూసి చెప్పినా, క్షుద్రవిద్యలను ఆశ్రయించినా, జ్యోతిష్కం ద్వారా చెప్పినా, మరే వనరుల ఆధారంగా చెప్పినా అతను అబద్ధీకుడే. ఈ యుగంలో కూడా ఇలాంటి నయవంచకులు, మోసగాళ్లకు కొదువలేదు. వారు తమ వాక్చాతుర్యంతో, మాయమాటలతో అమాయక జనులను బుట్టలో వేసుకుని పోగొట్టుకున్న వస్తువుల ఆచూకీ తెలుపుతామని, రోగ కారణాలను తెలుపుతామని అంటుంటారు. ఫలానా వ్యక్తి నీకేదో చేసేశాడని, అందుకే నీవు ఈ విధంగా మంచాన పడ్డావని చెబుతుంటారు. ఈ విషయాలను వారు జిన్నాతుల నుండి, షైతానుల నుండి సేకరిస్తారు. అందుకోసం వారు ఆ పైశాచిక శక్తులను ప్రసన్నుల్ని చేస్తుంటారు. ఎవరయినా మీ వద్దకు క్షుద్రవిద్యను పొందిన మాటలంటే ఖచ్చితంగా వారు మాయలమారులని, మోసగాళ్లని గ్రహించాలి.

షేఖుల్‌ ఇస్లాం ఇబ్నె తైమియ (రహిమహుల్లాహ్) ఇలా అంటున్నారు : “భవిష్యవాణి (సోదె) చెప్పేవారి పరిస్థితి ఎటువంటిదంటే, వారి వద్ద షైతాన్‌ సహచరుడు ఉంటాడు. ఆకాశాలలో దొంగచాటుగా. విన్న విషయాలను వాడు వారికి తెలియజేస్తుంటాడు. వాటిలో వారు మరికొన్ని అబద్ధాలను (మిర్చిమసాలాను) జోడించి వివరిస్తారు.”

ఆయన ఇంకా ఇలా అంటున్నారు : “ఈ సోదె చెప్పటంలో కొందరు ఆరితేరిన వారుండేవారు. వారి దగ్గరకు షైతానులు తినే త్రాగే పదార్థాలను కూడా తెచ్చేవారు. ఆ ప్రదేశాలలో లభ్యంకాని పండ్లను, మిఠాయిలను కూడా తెచ్చేవారు. వాటిలో కొన్నింటిని జిన్ను మక్కా లేదా బైతుల్‌ మఖ్దిస్ లేదా వేరే ఇతర స్థలాలకు తరలించేవాడు.” (మజ్మూ అత్ తౌహీద్ – పేజీ : 797, 801)

అగోచరాలకు సంబంధించి వారు జ్యోతిష్యశాస్త్రం ద్వారా కొన్ని విషయాలు అందజేస్తుంటారు. నక్షత్రాలను, రాసులను చూసి వారు భూమండలంపై సంభవించబోయే దానిని సూచిస్తుంటారు. గాలులు ఎంతవేగంగా వీస్తాయి, వర్షం ఎప్పుడు ఎక్కడ కురుస్తుంది తదితర విషయాలను అంచనా వేస్తారు. నక్షత్రాలు తమ తమ కక్ష్యల్లో చేసే పరిభ్రమణం, వాటి కలయిక, విడిపోవటాలను బట్టి జరిగే సంఘటనలను నిర్ధారిస్తారు. వారిలా అంటారు: ఇతను గనక ఫలానా నక్షత్రం సంచరించే సమయంలో వివాహమాడితే అతనికి ఈ ఈ సమస్యలు ఎదురవుతాయి. అతను గనక ఫలానా నక్షత్రం పొడసూపినపుడు ప్రయాణం చేస్తే ఫలానా ఫలానా గండాలను ఎదుర్కోవలసి ఉంటుంది. అతను ఫలానా నక్షత్రం సమయంలో పుట్టాడు కనుక ఫలానా భాగ్యం వరిస్తుంది లేదా ఫలానా దరిద్రం చుట్టుకుంటుంది. ప్రస్తుతం కొన్ని చవుకబారు పత్రికలు సయితం ఇలాంటి రాశి ఫలాలను ముద్రించి మనుషుల జీవితాలలో సంభవించబోయే వాటిని గురించి విచ్చలవిడి రాతలు రాస్తున్నాయి.

కొంతమంది అజ్ఞానులు, బలహీన విశ్వాసులు జ్యోతిష్కుల వద్దకు వెళుతుంటారు. వారు తమ జీవితాలలో యెదురు కానున్న సంఘటనలను గురించి, ముఖ్యంగా వివాహాది శుభకార్యాల గురించి దర్యాప్తు చేస్తుంటారు.

ఎవడయితే తనకు అగోచర జ్ఞానముందని అంటాడో, మరెవరయితే అలాంటి వారిని సత్యవంతులని ధృవీకరిస్తాడో అతను ముష్రిక్కు, కాఫిర్‌ అవుతాడు. ఎందుకంటే వాడు అల్లాహ్  యొక్క ప్రత్యేక గుణాలలో తనకు భాగస్వామ్యం ఉందని దావా చేస్తున్నాడు. నిజానికి నక్షత్రాలు అల్లాహ్ కు సంపూర్ణ విధేయతను ప్రకటించే సృష్టితాలు. వాటి అధీనంలో ఏ శక్తీ లేదు. ఒకరి భాగ్యాన్నిగానీ, దరిద్రాన్ని గానీ శాసించే అధికారం వాటికి లేదు. జీవన్మరణాలతో కూడా వాటికి ఎలాంటి సంబంధం లేదు. ఇవన్నీ పైశాచిక చేష్టలు. ఆకాశాలలో దొంగచాటుగా విన్న విషయాలను అవి చేరవేస్తుంటాయి.


ఇది అఖీదా-తౌహీద్ (దేవుని ఏకత్వం) – డా. సాలెహ్ అల్ ఫౌజాన్ [పుస్తకం] నుండి తీసుకోబడింది (పేజీలు 120 – 121)

మృతులు (చనిపోయిన వారు) వింటారా? [ఆడియో & టెక్స్ట్]

మృతులు (చనిపోయిన వారు) వింటారా?
https://www.youtube.com/watch?v=96plKtzzef4 (51 నిముషాలు)
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, సమాధులను సందర్శించే ప్రజలు చేసే షిర్క్ గురించి వివరించబడింది. గత ప్రసంగంలో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలోని ముష్రికులు మరియు నేటి సమాధులను సందర్శించే ముస్లింల మధ్య నమ్మకాల పోలికను చర్చించారు. రెండు వర్గాలు అల్లాహ్‌ను ఏకైక సృష్టికర్తగా నమ్మినప్పటికీ, మధ్యవర్తుల ద్వారా ఆయనను చేరుకోవాలని ప్రయత్నించారు, దీనిని ఖుర్ఆన్ షిర్క్‌గా పరిగణిస్తుంది. మృతులు వినగలరనే నమ్మకం కూడా షిర్క్‌కు దారితీస్తుందని, దీనికి సరైన ఆధారం లేదని వక్త తెలిపారు. బద్ర్ యుద్ధం తర్వాత ప్రవక్త మృతులతో మాట్లాడటం మరియు సమాధిలోని వ్యక్తి పాదాల శబ్దాన్ని వినడం వంటి హదీసులు ప్రత్యేక సందర్భాలని, సాధారణ నియమం కాదని స్పష్టం చేశారు. మృతులు వినలేరని, వారికి సహాయం చేసే శక్తి లేదని ఖుర్ఆన్ ఆయతుల ద్వారా నిరూపించారు. ప్రళయ దినాన, ఈసా (అలైహిస్సలాం) మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా తమ అనుచరులు తమ తర్వాత ఏమి చేశారో తమకు తెలియదని చెప్పడం, మృతులకు ప్రపంచ విషయాలతో సంబంధం ఉండదనేదానికి నిదర్శనం. ప్రజలు ఖుర్ఆన్ మరియు సహీ హదీసులను చదివి, షిర్క్ నుండి తమను తాము రక్షించుకోవాలని వక్త పిలుపునిచ్చారు.

اَلْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعَالَمِيْنَ، وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْمُرْسَلِيْنَ، نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَصَحْبِهِ أَجْمَعِيْنَ، أَمَّا بَعْدُ.
సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌కే సర్వ స్తోత్రములు. ప్రవక్తల నాయకుడైన మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబంపై మరియు వారి అనుచరులందరిపై శాంతి మరియు శుభాలు వర్షించుగాక. ఆ తర్వాత.

సోదరులారా, గత పాఠంలో మనం సామాన్యంగా ప్రజలు సమాధుల వద్దకు ఎందుకు వెళ్తారు అనే దాని గురించి కొన్ని కారణాలు తెలుసుకున్నాము. వాటికి ఆధారంగా, నిదర్శనంగా, దలీల్‌గా వారు కొన్ని విషయాలు ఏదైతే ప్రస్తావిస్తారో వాటి యొక్క వాస్తవికత ఖుర్ఆన్ హదీసుల వెలుగులో తెలుసుకున్నాము.

సంక్షిప్తంగా మరోసారి మనం చెప్పుకోవాలంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలం నాటి ముష్రికులు ఏకైక అల్లాహ్‌ను సృష్టికర్తగా, ఉపాధి ప్రధాతగా, సర్వ జగత్తుకు నిర్వాహకారునిగా నమ్మినప్పటికీ, కొందరు వలీలను, ఔలియాలను, బాబాలను నిర్ణయించుకుని, అల్లాహ్‌కు చేయనటువంటి ఆరాధనలు వారికి చేసేవారు. ఎందుకు చేసేవారు? మేము చాలా పాపాత్ములం, డైరెక్ట్ అల్లాహ్ వద్ద వెళ్లడానికి మాకు ముఖం లేదు. ఈ బాబాలు, పీర్లు, ఈ ముర్షదులు, ఈ వలీలు, ఔలియాలు వీరి సాధనంగా, వీరి ఆధారంగా, వీరి యొక్క మధ్యవర్తిత్వం వసీలాతో మేము అల్లాహ్ వద్ద చేరుకుంటాము, వారు మా గురించి అల్లాహ్ వద్ద సిఫారసు చేస్తారు. వారి యొక్క ఈ సాకు ఏదైతే ఉండినదో, ఈ రోజుల్లో సామాన్యంగా మన ముస్లింలు ఎవరైతే సమాధుల వద్దకు వెళ్తున్నారో, బాబాల వద్దకు వెళ్తున్నారో వారి యొక్క సాకు, వారి యొక్క కారణం కూడా అదే. మేము పాపాత్ములం, డైరెక్ట్ అల్లాహ్ వద్ద వెళ్లడానికి మా దగ్గర ముఖం లేదు. అల్లాహ్ యొక్క ఈ పుణ్యాత్ములు, ఔలియాలు వారి యొక్క మధ్యవర్తిత్వంతోనే మనం పోగలుగుతాము. వారి యొక్క సిఫారసుతోనే మనం అల్లాహ్‌కు సన్నిహితులుగా కాగలుగుతాము.

అయితే, సూరె యూనుస్ ఆయత్ నెంబర్ 18, సూరె జుమర్ ఆయత్ నెంబర్ 3 వీటి ఆధారంగా ఇదే అసలైన షిర్క్. ఇలాంటి షిర్క్‌ను ఖండించడానికే ప్రతీ కాలంలో అల్లాహు త’ఆలా ప్రవక్తలను పంపాడు అని మనం తెలుసుకున్నాము.

అంతేకాకుండా ఈ ఆయతులు, ప్రత్యేకంగా సూరె జుమర్ మరియు సూరె యూనుస్‌లో తెలుపబడిన ఈ ఆయతులను మనం చదివినప్పుడు సామాన్యంగా ఈనాటి ముస్లింలు కొందరు ఏమంటారు, ఈ ఆయతులు మాలాంటి వారి గురించి కాదు అవతరించినవి. ఆ కాలంలో విగ్రహాలను పూజించేవారు. ఆ విగ్రహాలకు వ్యతిరేకంగా ఈ ఆయతులు అవతరించాయి. అయితే మనం ఇందులో మరికొన్ని ఆధారాలు తెలిపి ఉన్నాము. ఉదాహరణకు, సూరె ఆరాఫ్ లోని ఈ ఆయతులో అల్లాహు త’ఆలా చాలా స్పష్టంగా చెప్పాడు,

عِبَادٌ أَمْثَالُكُمْ
(ఇబాదున్ అమ్సాలుకుమ్)
మీలాంటి దాసులు మాత్రమే.

అల్లాహ్‌ను కాకుండా మీరు ఎవరైతే ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారు మీలాంటి మానవులు మాత్రమే. మీలాంటి దాసులు మాత్రమే. అల్లాహు త’ఆలా చాలా స్పష్టంగా చెప్పారు, మీలాంటి దాసులు, మీలాంటి మానవులు. అంటే మక్కా యొక్క ముష్రికులు ఎవరినైతే వారికి మరియు అల్లాహ్‌కు మధ్య మధ్యవర్తిత్వంగా, సిఫారసుగా నిర్ణయించుకున్నారో వారు కేవలం విగ్రహాలు మాత్రమే కాదు. రాళ్లతో, చెట్లతో, లేక వేరే వాటితో చేసిన కేవలం మూర్తులు మాత్రమే కాదు. సమాధిలో ఉన్న కొందరు పుణ్యాత్ములు, ఔలియాలు వారిని ప్రవక్తల కాలం యొక్క ముష్రికులు పూజించేవారు.

ఉదాహరణకు, హజ్రత్ ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హు గారి యొక్క హదీస్ కూడా వినిపించడం జరిగింది. తాయిఫ్ నుండి తాయిఫ్‌కు దగ్గర మక్కా మార్గంలో ‘లాత్’ అనే ఒక పుణ్యాత్ముడు హజ్ కు వచ్చే వాళ్లకు సత్తువ ఇట్లా తాగించి తినిపించేవాడు. అతను చనిపోయిన తర్వాత అతను చనిపోయిన స్థలంలోనే అతన్ని సమాధి చేసి అక్కడే కొందరు ముజావర్గా కూర్చొని కొద్ది రోజుల తర్వాత వారిని అదే పూజించడం మొదలుపెట్టారు. ఇది సహీ హదీసులో ఉంది.

అంతేకాకుండా, హజ్రత్ నూహ్ అలైహిస్సలాం కాలంలో ఐదుగురు పుణ్యాత్ములు ఏదైతే చనిపోయారో, వద్, సువా, యగూస్, యఊక్, నసర్, వీరి గురించి హజ్రత్ ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హు ఏం చెప్పారు? నూహ్ అలైహిస్సలాం కాలంలో వీరు పుణ్యాత్ములు. నూహ్ అలైహిస్సలాం కాలంలో ఉన్నటువంటి ముష్రికులు వీరిని పూజించేవారు. అయితే తర్వాత నూహ్ అలైహిస్సలాం కాలంలో వచ్చిన ఏదైతే తూఫాన్ ఉందో ఆ తూఫాన్ తర్వాత ఈ ఐదు పుణ్యాత్ముల విగ్రహాలు ఏదైతే తయారు చేసి పెట్టుకున్నారో అవి ఎక్కడో దాగిపోయి ఉన్నాయి. కానీ షైతాన్ వాడు అమర్ బిన్ లుహై అనే ఒక నాయకుడు మక్కాలో అతనికి ఏదో రకంగా తెలిపి జిద్దా ఒడ్డున, జిద్దాలో సముద్రం ఉంది కదా, సముద్ర తీరాన ఎక్కడో పాతి ఉన్న ఆ విగ్రహాలను తీసి మళ్లీ మక్కాలో తీసుకొచ్చి వాటి విగ్రహారాధన మరోసారి మొదలుపెట్టారు. అయితే అక్కడ వారు పూజించేది కేవలం విగ్రహం అనే కాదు. వీరు పుణ్యాత్ములు. పుణ్యాత్ముల ఒక ఆకారం, ఒక వారి రూపాన్ని మేము పూజిస్తున్నాము. వీరు మాకు ప్రళయ దినాన సిఫారసు చేస్తారు. అటువంటి నమ్మకాలు వారు ఉంచుకునేవారు.

ఇంతవరకు మనం గత పాఠంలో ఏదైతే కొన్ని విషయాలు తెలుసుకున్నామో వాటి సంక్షిప్త విషయాలు ఇప్పుడు మరోసారి చెప్పడం జరిగింది. ఈరోజు పాఠంలో నేను మరో విషయం మీకు తెలుపబోతున్నాను. దానిని మీరు చాలా శ్రద్ధగా వినాలని ఆశిస్తున్నాను. అదేమిటి, చాలా ముఖ్యమైన విషయం. అనేకమంది ప్రజలు సమాధుల వద్దకు వెళ్ళడానికి ఇది కూడా ఒక కారణం. అదేమిటి, సమాధిలో ఉన్న వాళ్ళు మా యొక్క మొరలను వింటున్నారు. మేము ఏదైనా దుఆ చేస్తే మా దుఆలను వారు ఆలకిస్తారు అని వారి నమ్మకం ఉంది. అయితే వాస్తవానికి చనిపోయిన వారు, మృతులు, సమాధిలో ఉన్న వారు మనం బ్రతికి ఉన్న వాళ్ళు వీరి యొక్క మాటలను వింటారా? ఒకవేళ సమాధి వద్దకు వెళ్లి ఏదైనా మొరపెట్టుకుంటే, ఏదైనా దుఆలు చేస్తే, ఏదైనా అరిస్తే వారికి వినే శక్తి ఉందా? ఈ విషయం ఖుర్ఆన్ హదీస్ ఆధారంగా తెలుసుకుందాం.

అయితే, ఎవరైతే సమాధుల వద్దకు వెళ్తున్నారో వారి యొక్క గట్టి నమ్మకం, విశ్వాసం ఏంటి? సమాధిలో ఉన్న వాళ్ళందరూ వింటూ ఉంటారు. ప్రత్యేకంగా ఔలియా అల్లాహ్ ఈ బాబాలు వాళ్ళు మా యొక్క కష్టసుఖాలను మేము ఏదైతే చెప్పుకుంటామో, మొరపెట్టుకుంటామో వాటిని వింటారు అన్నటువంటి నమ్మకం ఉంది. వారి ఆ నమ్మకానికి ఖుర్ఆన్‌లో హదీసులో ఎక్కడైనా ఏదైనా ఆధారం ఉందా? అయితే హదీసు నుండి ఒక ఆధారం, ఒక దలీల్ వారు చూపిస్తారు. అదేమిటి, సహీ బుఖారీలో హదీస్ ఉంది.

ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా వలస పోయి వచ్చిన తర్వాత రెండవ హిజ్రీలో, అంటే వలస పోయి వచ్చిన తర్వాత రెండవ సంవత్సరం, మక్కా యొక్క ముష్రికులతో ఒక యుద్ధం జరిగింది. దాని పేరు బద్ర్ యుద్ధం. గజ్వతె బద్ర్. ఆ యుద్ధంలో అల్హందులిల్లాహ్ అల్లాహ్ యొక్క దయ వల్ల ముస్లింలు జయించారు. ముష్రికులు ఓడిపోయారు. ముష్రికుల వైపు నుండి 70 మంది హతమయ్యారు. మరో 70 మంది ఖైదీలు అయ్యారు. అయితే ఆ బద్ర్ ప్రాంతంలో ఒక చిన్న సంఘటన జరిగింది. అదేంటి, ఆ మృతులను, ఎవరైతే ముష్రికులు హతులయ్యారో, చంపబడ్డారో వారిని పెద్ద పెద్ద గోతులు తవ్వి అందులో వారిని పడేయడం జరిగింది. అలాంటి సందర్భంలో ఒకసారి అబూ జహల్ ఇంకా పెద్ద పెద్ద కొందరు నాయకులను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక బావి లాంటిది లోతుగా కొంచెం తవ్వి అందులో వారిని వేసినప్పుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడ నిలబడి ‘హల్ వజద్తుమ్ మా వఅద రబ్బుకుమ్ హక్కా’. ఏమిటి, అల్లాహ్ మీతో మీ ప్రభువు మీతో చేసిన వాగ్దానాన్ని మీరు పొందారా? అని వారిని అడిగారు. ఎవరిని అడుగుతున్నారు ప్రవక్త గారు అప్పుడు? ఆ చనిపోయిన వాళ్ళను. ఆ యుద్ధంలో ఎవరినైతే చంపడం జరిగిందో ముష్రికులను, వారిని ఒక బావిలో వేస్తున్నారు. అయితే వారిని వేసిన తర్వాత దాని ఒడ్డున మీద నిలబడి ప్రవక్త వారితో సంబోధిస్తూ, వారిని ఉద్దేశించి ఈ మాట అడుగుతున్నారు. అల్లాహు త’ఆలా, మీ యొక్క ప్రభువు మీతో ఏ వాగ్దానం అయితే చేశాడో దానిని మీరు పొందారా? అయితే కొందరు సహాబాలు అన్నారు, ప్రవక్తా వారు మృతులు కదా మీ మాటలను ఎలా వినగలుగుతారు? అప్పుడు ప్రవక్త అన్నారు,

إِنَّهُمْ الْآنَ يَسْمَعُونَ مَا أَقُولُ
(ఇన్నహుముల్ ఆన యస్మఊన మా అఖూల్)
నిశ్చయంగా వారు ఇప్పుడు నేను చెప్పేది వింటున్నారు.

నేను ఏ మాటనైతే అంటున్నానో ఆ మాటను వారు ఇప్పుడు వింటున్నారు అని ప్రవక్త చెప్పారు కదా. ఈ యొక్క హదీసు తోని ఈనాటి ఆ ముస్లింలు దలీల్ ఆధారం తీసుకుంటారు చూడండి. మృతులు వినరు అని మీరు అంటారు. ఇక్కడ ప్రవక్త స్వయంగా వారికి వినిపిస్తున్నారు. సహాబాలకు అనుమానం కలిగింది. అయితే ప్రవక్త వారికి సమాధానం చెప్పారు వింటున్నారు అని. అందుగురించి మృతులు వింటారు.

వారు సహీ బుఖారీలో ఉన్న హదీస్ మరొకటి వినిపిస్తారు. అదేమిటి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు,

اَلْعَبْدُ إِذَا وُضِعَ فِي قَبْرِهِ، وَتُوُلِّيَ وَذَهَبَ أَصْحَابُهُ حَتَّى إِنَّهُ لَيَسْمَعُ قَرْعَ نِعَالِهِمْ، أَتَاهُ مَلَكَانِ فَأَقْعَدَاهُ
మనిషి చనిపోయిన తర్వాత అతన్ని సమాధిలో పెట్టి తిరిగిపోతున్న సందర్భంలో, ఎప్పుడైతే వారి బంధుమిత్రులందరూ వెళ్లిపోతూ ఉంటారో వారి చెప్పుల శబ్దాన్ని అతడు సమాధిలో ఉండి అతడు వింటాడు. అప్పుడే ఇద్దరు దేవదూతలు వచ్చి అతన్ని కూర్చోబెట్టి ప్రశ్న అడుగుతారు. 

ఇక్కడ ఏముంది హదీసులో, సమాధిలో ఉన్న ఆ వ్యక్తి అతని యొక్క బంధుమిత్రులు ఎవరైతే వెళ్తున్నారో వారి యొక్క చెప్పుల శబ్దాన్ని వింటారు అని హదీసులో స్పష్టంగా ఉంది. యస్మఉ ఖర్అ నిఆలిహిమ్. వారి చెప్పుల శబ్దాన్ని అతను వింటాడు. అందుగురించే ఈ మన సోదరులు ఎవరైతే సమాధుల వద్దకు వెళ్తూ ఉంటారో, సమాధిలో ఉన్న వాళ్ళు ఔలియాలు బాబాలు వింటారు, అందుగురించి ఈ హదీసులో ఆధారం అని చూపిస్తారు.

కానీ వాస్తవానికి ఈనాటి కాలంలో ఉన్న సమాధులలో లేక సామాన్యంగా ఎవరైనా మృతులు, చనిపోయిన వారు వింటారు అనడానికి ఈ రెండు హదీసులు దలీల్ ఏ మాత్రం కావు. ఎందుకు? మొదటి హదీస్ ఏదైతే ఉందో, ఈ హదీస్ సహీ బుఖారీలో ఇమామ్ బుఖారీ రహమతుల్లాహ్ అలైహ్ నాలుగు చోట్ల ప్రస్తావించారు. అంటే నాలుగుసార్లు వేరే వేరే స్థానాల్లో ఈ హదీసును ప్రస్తావించారు. ఒకటి కితాబుల్ జనాఇజ్‌లో, జనాజా అంతక్రియలకు సంబంధించిన చాప్టర్ ఏదైతే ఉంటుందో అక్కడ, ఇంకా మిగతా మూడుసార్లు కితాబుల్ మగాజి, యుద్ధాల విషయానికి సంబంధించిన హదీసులను ప్రస్తావించాడు ఎక్కడైతే అక్కడ.

అయితే మొదటిసారి కితాబుల్ జనాఇజ్ బాబు అజాబిల్ ఖబ్ర్ హదీస్ నెంబర్ 1370 లో ఎక్కడైతే ఈ హదీస్ వచ్చి ఉందో, ప్రవక్త ఎప్పుడైతే అన్నారో మీరు మీ ప్రభువు చేసిన వాగ్దానాన్ని మీరు పొందారా అని అప్పుడు సహాబాలు అన్నారు, తద్ఊ అమ్వాతన్? మీరు మృతులను పిలుస్తున్నారా? మృతులను సంబోధిస్తున్నారా? దాని యొక్క సమాధానంలో ప్రవక్త ఏం చెప్పారు, ‘మా అన్తుమ్ బి అస్మఅ మిన్హుమ్ వలాకిన్ లా యుజీబూన్’. మీరు వారి కంటే ఎక్కువ ఇప్పుడు వినడం లేదు. అంటే వారు మీ కంటే ఎక్కువ ఇప్పుడు వింటున్నారు. కానీ వారు సమాధానం ఇవ్వలేరు.

ఇదే హదీస్ మరోచోట ఉంది, అక్కడ హదీస్ నెంబర్ అది 4026. అక్కడ సహాబాలు అడిగారు, యా రసూలల్లాహ్ తునాది నాసన్ అమ్వాతా? ఓ ప్రవక్తా, మీరు చనిపోయిన వారిని మృతులను పిలుస్తున్నారా? అయితే ప్రవక్త చెప్పారు, ‘మా అన్తుమ్ బి అస్మఅ లిమా ఖుల్తు మిన్హుమ్’. నేను వారికి చెప్పే విషయం ఏదైతే ఉందో దానిని మీరు వారి కంటే ఎక్కువ వినడం లేదు. అంటే వారు మీ కంటే ఎక్కువ వింటున్నారు.

మూడోచోట హజ్రత్ ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హు అడిగారు అని ఉంది. హజ్రత్ ఉమర్ రదియల్లాహు అన్హు, యా రసూలల్లాహ్ మా తుకల్లిము మిన్ అజ్సాదిన్ లా అర్వాహ లహా. ఆత్మలు లేని ఈ శరీరం వాటితో మీరు సంబోధిస్తున్నారా? వాటికి మీరు వాటితో మీరు వారిని పిలుస్తున్నారా? వారితో మాట్లాడుతున్నారా? అప్పుడు ప్రవక్త ఏమన్నారు, ‘వల్లది నఫ్సు ముహమ్మదిన్ బియదిహ్’. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రాణం ఎవరి చేతిలో ఉందో అతని సాక్షి ‘మా అన్తుమ్ బి అస్మఅ లిమా అఖూలు మిన్హుమ్’. నేను ఇప్పుడు చెప్పే మాటలు మీరు వారి కంటే ఎక్కువ వినలేరు.

అయితే ఇక్కడ ఒక విషయం మనం ఈ హదీస్ ను ఈ ఒక్క హదీస్ నాలుగు చోట్ల నాలుగు స్థానాల్లో ఏదైతే వచ్చి ఉందో అందులో ఏ ఏ పదాలతో విషయం చర్చించబడిందో వాటిని ఒకవేళ మనం శ్రద్ధ వహిస్తే, సహాబాలు ఏదైతే అడుగుతున్నారో, ఓ ప్రవక్తా మీరు మృతులను సంబోధిస్తున్నారా? ప్రాణం ఏమాత్రం లేని ఈ శవాలను, ప్రాణం లేని ఈ శరీరాలతో మీరు మాట్లాడుతున్నారా? అని ఈ అడగడం ద్వారా మనకు ఏం తెలుస్తుంది? అప్పటివరకు సహాబాల విశ్వాసం ఏమిటి? మృతులు వినరు. చనిపోయిన వాళ్ళు వినరు అన్న విశ్వాసమే ప్రబలి ఉండింది. ఇదే మాట అందరికీ తెలిసి ఉండింది. అందుగురించే ఎప్పుడైతే ప్రవక్త మృతులతో మాట్లాడుతున్నారో, ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అని ఆశ్చర్యంగా వారు అడిగారు.

రెండో విషయం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు? ఇప్పుడు వీరు మీ కంటే ఎక్కువ వింటున్నారు.

اِنَّهُمُ الْآنَ
(ఇన్నహుముల్ ఆన్)
నిశ్చయంగా వారు ఇప్పుడు

అల్ ఆన్ అన్న పదం ఉన్నది అక్కడ. ఇప్పుడు వారు మీ కంటే ఎక్కువ వింటున్నారు. అయితే ఇప్పుడు వారు మీ కంటే ఎక్కువ వింటున్నారు అన్న ఈ పదంలోనే ఇది ఒక ప్రత్యేక సందర్భం అంతే మాత్రం గానీ చనిపోయిన ఏ వ్యక్తి కూడా బ్రతికి ఉన్న వారి, జీవరాశుల మాటలను వినరు అని స్పష్టం అవుతుంది. ఇది ఒక ప్రత్యేక సందర్భం.

మరి ఇదే హదీస్ గురించి హజ్రత్ ఆయిషా రదియల్లాహు త’ఆలా అన్హా గారు ఏం చెప్పారో ఒకసారి వినండి. దాని ద్వారా కూడా సహాబాల యొక్క విశ్వాసం మృతులు వింటారా లేదా అనే విషయం సహాబాలకు ఎలా ఉండింది అది కూడా మనకు తెలుస్తుంది. ఈ హదీస్ హజ్రత్ ఆయిషా రదియల్లాహు త’ఆలా అన్హా వద్దకు వచ్చినప్పుడు, హజ్రత్ ఆయిషా రదియల్లాహు అన్హా గారు చెప్పారు, “ప్రవక్త యొక్క ఉద్దేశం ఇక్కడ ఏమిటంటే వారి యొక్క జీవితాల్లో నేను మాటిమాటికి ఏదైతే చెప్పేవాడినో, మీరు అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించండి, అల్లాహ్‌కు ఏ మాత్రం సాటి కల్పించకండి, షిర్క్ చేయకండి అని మాటిమాటికి ఏదైతే నేను చెప్పేవాడినో, ఒకవేళ మీరు నా మాటను వినేది ఉంటే అల్లాహ్ స్వర్గం యొక్క వాగ్దానం మీకు చేస్తున్నాడు, మీరు నన్ను తిరస్కరించేది ఉంటే మీరు నరకంలో వెళ్తారు, ఇలాంటి వారి జీవితంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ ఏ మాటలైతే చెప్పేవారో అవి సత్యం అని ఇప్పుడు వారికి తెలుస్తుంది. ‘హల్ వజద్తుమ్ మా వఅద రబ్బుకుమ్ హక్కా’. మీ ప్రభువు మీతో చేసిన వాగ్దానం ఏదైతే ఉందో అది నిజం అని మీకు ఇప్పుడు తెలిసిందా? దాన్ని మీరు పొందారా? అది సత్యమే అన్న విషయం ఇప్పుడు తెలిసిందా?”

ఇదే సంఘటన కాకుండా వేరే కొన్ని ఆయతులు ఖుర్ఆన్‌లో ఉన్నాయి. మనిషి చనిపోయినప్పుడు, ఓ దేవా నాకు కొంచెం అవకాశం ఇవ్వు, ఇప్పుడు నాకు తెలిసింది, నాకు కొంచెం అవకాశం దొరికిన గానీ నేను నా ధనాన్ని నీ మార్గంలో ఖర్చు పెడతాను అని కూడా కోరుకుంటారు కొందరు.

ఫిర్ఔన్ చనిపోయేటప్పుడు కూడా ఏమన్నాడు? ఆ, మూసా చెప్పిన మాటలన్నీ కూడా నిజమే. ఇప్పుడు నేను విశ్వాసం మార్గాన్ని అవలంబిస్తాను.

అయితే ఇలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వారికి ఆ సందర్భంలో గుర్తు చేస్తున్నారు. అయితే అప్పుడు అల్లాహు త’ఆలా వారికి ప్రవక్త యొక్క మాట వినిపించారు. అదేంటి, ప్రత్యేక సందర్భం. ఈ ప్రత్యేక సందర్భాన్ని మనం ప్రతీ శవం గురించి, ప్రతీ చనిపోయిన వారి గురించి, ప్రత్యేకంగా ఔలియాల గురించి, అంబియాల గురించి ఇంకా వేరే వారి గురించి ఈ మాటలు అక్కడ అతికించవద్దు. ఈ మాటతోని, ఈ యొక్క హదీసుతోని “అందరూ వింటారు” అన్నటువంటి దలీల్ పట్టుకోవడం, దీనిని ఒక ఆధారంగా తీసుకోవడం ఎంత మాత్రం నిజమైనది కాదు. అందుగురించి ఇదే హదీస్ సహీ బుఖారీలో 3976వ హదీస్ లో హజ్రత్ ఖతాదా రహమతుల్లాహ్ అలైహ్ ఏం చెప్తున్నారు,

أَحْيَاهُمُ اللَّهُ حَتَّى أَسْمَعَهُمْ
(అహ్యాహుముల్లాహు హత్తా అస్మఅహుమ్)
వారిని వినిపించేంత వరకు అల్లాహ్ వారికి జీవం పోసాడు

అల్లాహ్ వారిని ఆ సందర్భంలో వారికి జీవం పోసాడు. హత్తా అస్మఅహుమ్, ప్రవక్త యొక్క మాటను వారికి వినిపించాడు. తౌబీఖన్ వ తస్గీరన్ వ నఖీమతన్ వ హసరతన్ వ నదామతన్. ఎందుకు, వారికి ఆ సందర్భంలో బాధ, అయ్యో ప్రవక్త మాటను మేము వినలేదు కదా అన్నటువంటి ఒక బాధ, ఎంతో ఒక షర్మిందాపన్, పశ్చాత్తాపం లాంటిది కలగాలి, ఇంకింత వారికి ఆ ఆవేశం అనేది వారి యొక్క అఫ్సోస్ అనేది పెరిగిపోవాలి అన్న ఉద్దేశంతో ఆ సందర్భంలో అల్లాహు త’ఆలా వారిని మరోసారి లేపి ప్రవక్త యొక్క మాటను వినిపించాడు. అది అంత మటుకు మాత్రమే.

అందుగురించి, ఇప్పుడు నేను కొన్ని ఖుర్ఆన్ ఆయతులు వినిపిస్తాను వాటిని శ్రద్ధగా వినండి. ఖుర్ఆన్ ద్వారా మనకు ఏం తెలుస్తుంది అంటే సామాన్యంగా మృతులు, చనిపోయిన వారు బ్రతికి ఉన్న వారి ఏ మాటను వినలేరు. సూరె నమల్ ఆయత్ నెంబర్ 80లో అల్లాహ్ చెప్పాడు,

إِنَّكَ لَا تُسْمِعُ الْمَوْتَى
(ఇన్నక లా తుస్మిఉల్ మౌతా)
నిశ్చయంగా నువ్వు మృతులకు వినిపించలేవు.

నువ్వు మృతులకు, చనిపోయిన వారికి వినిపించలేవు. అలాగే సూరె రూమ్ ఆయత్ నెంబర్ 52లో ఇలాంటి ఆయతే ఉంది. అక్కడ కూడా ఉంది, ఓ ప్రవక్తా నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ మృతులకు వినిపించలేవు. అయితే మృతులు వినరు, బ్రతికి ఉన్న వారు తమ ఏ మాటను కూడా మృతులకు వినిపించలేరు అని ఈ ఆయత్ చాలా స్పష్టంగా ఉంది. అంతేకాకుండా అల్లాహు త’ఆలా కోరినప్పుడు, ఏదైనా అవసర సందర్భంగా అల్లాహు త’ఆలాకు ఇష్టమైతే వినిపించవచ్చు. ఆ శక్తి అల్లాహ్‌కు ఉంది. కానీ ఒక సామాన్య నియమం, ఒక రూల్, ఒక పద్ధతి ఏమిటి? మృతులు వినరు. కానీ అల్లాహ్ కోరినప్పుడు వినిపిస్తాడు. అల్లాహ్ స్వయంగా వినిపిస్తాడు. దానికి సాక్ష్యంగా ఈ హదీస్, ఈ ఖుర్ఆన్ యొక్క ఆయతును మనం తెలుసుకోవచ్చు. ఈ ఆయత్ సూరె ఫాతిర్ ఆయత్ నెంబర్ 22.

وَمَا يَسْتَوِي الْأَحْيَاءُ وَلَا الْأَمْوَاتُ
(వమా యస్తవిల్ అహ్యాఉ వలల్ అమ్వాత్)
బ్రతికి ఉన్న వారు, చనిపోయిన వారు ఇద్దరూ సమానులు కాలేరు.

إِنَّ اللَّهَ يُسْمِعُ مَنْ يَشَاءُ
(ఇన్నల్లాహ యుస్మిఉ మన్ యషా)
నిశ్చయంగా అల్లాహ్ తాను కోరిన వారికి వినిపిస్తాడు

وَمَا أَنْتَ بِمُسْمِعٍ مَنْ فِي الْقُبُورِ
(వమా అంత బిముస్మిఇన్ మన్ ఫిల్ ఖుబూర్)
మరియు సమాధులలో ఉన్నవారికి నీవు వినిపించలేవు.

ఇక్కడ అల్లాహ్ కోరినప్పుడు వినిపిస్తాడు అని దీంతో కూడా కొందరు పెడమార్గంలో పడిపోతారు. అదేమిటి? అవును ఔలియా అల్లాహ్‌కు వినిపించే శక్తి అల్లాహ్‌కు ఉంది, అందుగురించి మేము మొరపెట్టుకునే మొరలను వారు ఇప్పుడు వింటున్నారు, అల్లాహ్ వినిపిస్తున్నాడు, వారు స్వయంగా వింటారని మేము అనుకుంటలేము. మళ్ళీ ఇలా తిప్పికొట్టి వారు తమ యొక్క విశ్వాసాన్ని మరింత గట్టి పరుచుకునే ప్రయత్నం చేస్తారు. అయితే బుఖారీలోని మొదటి హదీస్ బద్ర్‌లో చనిపోయిన ముష్రికులకు ఏదైతే ప్రవక్త వినిపించారో దానికి ఈ ఆయత్ సాక్ష్యం అవుతుంది.

అంతేకాకుండా చనిపోయిన ప్రతీ వ్యక్తిని సమాధిలో పెట్టినప్పుడు అతన్ని సమాధిలో పెట్టేసి వారి యొక్క బంధుమిత్రులు తిరిగి వస్తున్నప్పుడు అతను ఏదైతే వారి చెప్పుల శబ్దాన్ని వింటాడో, అయ్యో అందరూ నన్ను వదిలేసి నన్ను ఒక్కడిని వదిలేసి పోతున్నారా, నేను ఏకాంతంలో అయిపోయానా, అలాంటి రంది అతనికి కలగడానికి, ఎవరి ఎవరి యొక్క అండదండ నాకు ఉంది అన్న యొక్క ఆలోచనతో నేను ఎంతో అల్లాహ్‌కు వ్యతిరేకంగా కూడా జీవితం గడిపానో, ఇప్పుడు ఈ సమాధిలో నన్ను ఎవరూ కూడా కానడానికి చూడడానికి వస్తలేరు, నేను ఒక్కడిని అయిపోయాను, అలాంటి ఒక ఆవేదన అతనికి కలగడానికి కేవలం వారు వెళ్ళిపోతున్న చెప్పుల శబ్దాన్ని వినిపిస్తాడు, అంతే. ఇంకా వేరే మాటలను వినిపిస్తాడు అని అక్కడ ఇక్కడ లేదు మనకు. అలాంటి విషయం తెలుస్తలేదు.

అందుగురించి సోదరులారా, ఈ రెండు హదీసులను మనం తీసుకొని ఖుర్ఆన్ ఆయతులను మనం తిరస్కరించవద్దు. ఈ రెండు ఆయతులకు రెండు హదీసులను ఈ సూరె ఫాతిర్ యొక్క ఆయత్. ఒకవేళ వీరందరూ వింటున్నారు అని మనం అనుకుంటే, అల్లాహ్ వారిని వినిపిస్తున్నాడు అని అనుకుంటే, ‘ఇన్నల్లాహ యుస్మిఉ మన్ యషా’, అల్లాహ్ తాను కోరిన వారికి వినిపిస్తాడు అని చెప్పేకి ముందు బ్రతికి ఉన్న వారు, చనిపోయిన వారు ఇద్దరూ సమానులు కాజాలరు అని ఏదైతే అంటున్నాడో మరి దాని యొక్క భావం ఏంటి? ఒకవేళ అందరూ వినేది ఉంటే, వారు కూడా బ్రతికి ఉన్న వాళ్ళ మాదిరిగానే అయిపోయారు. అందుగురించి ఈ ఆయతులు ఈ హదీసులను మనం విన్న తర్వాత సామాన్యంగా మృతులు వినరు. ఏదైనా ప్రత్యేక సందర్భంలో, ఏదైనా ఒక ఉద్దేశంతో వినిపిస్తాడు అన్నటువంటి హదీస్ ఎక్కడైనా వచ్చి ఉంటే దానిని అక్కడి వరకే మనం నమ్మాలి గానీ, అంతకంటే ఇంకా ముందుకు వెళ్ళేసి అన్ని విషయాలను వింటారు అని మనం దాంట్లో కలుపుకోవడం ఇది పెడమార్గానికి తీసుకెళ్తుంది.

మరికొందరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి ఏం విశ్వసిస్తారు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాలో తమ సమాధిలో ఉండి మనల్ని చూస్తున్నారు, మనం చేసే కార్యాలను చూస్తున్నారు, మనం చెప్పే మాట్లాడే మాటలను వింటున్నారు అని కొందరు విశ్వసిస్తారు. అది కూడా ఖుర్ఆన్ హదీసులకు వ్యతిరేకమైన విశ్వాసం.

ఏమిటంటారు తెలుసా వాళ్ళు? ఒక హదీసులో మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై దరూద్ చదివినప్పుడు ఆ దరూద్ దేవదూతలు తీసుకెళ్లి ప్రవక్త గారికి వినిపిస్తారు. అయితే సహీ హదీసుల్లో ఇంత విషయమే ఉంది. కానీ మరికొన్ని జయీఫ్ హదీసులలో ఏం వస్తుంది అంటే, ఎవరైనా ప్రవక్త సమాధి వద్దకు వచ్చి దరూద్ సలాం చేస్తే స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క దరూద్ సలాంకు సమాధానం ఇస్తారు. కానీ ఇది నిరాధారమైన హదీస్. బలమైనది కాదు. అయితే హదీసులు కూడా బలహీనంగా ఉంటాయా? హదీస్ యొక్క పరంపరలో, హదీస్ యొక్క సనదులో పరంపరలో కొందరు అబద్దీకులు, కొందరు తప్పుగా ప్రవక్త వైపునకు మాటలు కల్పించే వాళ్ళు కూడా వస్తారు. హదీస్ యొక్క పండితులు అలాంటి కల్పిత హదీసులను వేరుగా చేసి ఉన్నారు. అయితే సహీ హదీసులో ఎక్కడా కూడా ప్రవక్త డైరెక్ట్ మన యొక్క సలాంను దరూదును వింటారు అని లేదు. ఏ సహీ హదీసులో లేదు. దూరమైనా దగ్గరైనా ఎక్కడ ఉండి మనం దరూద్ చదివినా గానీ ప్రవక్త డైరెక్ట్ గా వింటారు అని ఎక్కడా ఏ హదీసులో కూడా లేదు. అందుగురించి ప్రవక్త కూడా మన మాటలను వింటారు అని మనం ఎప్పుడూ కూడా నమ్మవద్దు విశ్వసించవద్దు.

అయితే, ఇంతవరకు ఈ విషయాలు మనం విన్న తర్వాత నేను ఖుర్ఆన్‌లోని ఒక ఆయత్, ఆ ఆయత్‌కు సాక్ష్యాధారంగా సహీ బుఖారీలోని ఒక హదీస్ వినిపిస్తాను. ఈ ఆయత్ మరియు ఈ హదీస్ విన్న తర్వాతనైనా ఇక మన విశ్వాసాలు కరెక్ట్, నిజమైనవి, శుద్ధమైనవి మరియు ప్రవక్త సహాబాల విశ్వాస ప్రకారంగా ఉండాలి. శవాలు వింటారు అని, వారి సమాధుల వద్దకు వెళ్లి అక్కడ ఎలాంటి షిర్క్ పనులకు, ఎలాంటి మనం తావు ఇవ్వకూడదు, ఎలాంటి మనం అక్కడ మోసాలకు గురికాకూడదు.

అదేవిటండీ ఆ ఆయత్ అంటే, సూరె మాయిదాలో అల్లాహు త’ఆలా ఈసా అలైహిస్సలాం కు సంబంధించిన ఒక సంఘటన తెలిపారు. అదేమిటి, ఈసా అలైహిస్సలాం అల్లాహ్ యొక్క సత్య ప్రవక్త, తండ్రి లేకుండా అల్లాహు త’ఆలా మర్యమ్ అలైహిస్సలాం ద్వారా అతన్ని పుట్టించాడు. ఈ విషయం మనకు తెలిసిందే. అలాగే మనం విశ్వసించాలి. అయితే ఈ రోజుల్లో అనేకమంది క్రైస్తవులు స్వయంగా ఈసా అలైహిస్సలాంనే దేవునిగా పూజిస్తున్నారు. మరికొందరు మర్యమ్ అలైహిస్సలాంను కూడా పూజిస్తున్నారు. ఇంకొందరు ఈసా, పరిశుద్ధాత్మ, యెహోవా అని త్రైత్వ దైవాన్ని (Trinity) పూజిస్తున్నారు. ఇవన్నీ కూడా తప్పుడు విశ్వాసాలు. వారి యొక్క ఈ ఆరాధనలన్నీ కూడా షిర్క్‌లోకి వస్తాయి. స్వయంగా ఈసా అలైహిస్సలాం నన్ను కాదు ఏకైక దేవుణ్ణి పూజించండి అని స్పష్టంగా చెప్పారు. ఖుర్ఆన్ సూరె ఆలి ఇమ్రాన్‌లో ఉంది.

اعْبُدُوا اللَّهَ رَبِّي وَرَبَّكُمْ
(ఉ’బుదుల్లాహ రబ్బీ వ రబ్బకుమ్)
నాకు మీకు ప్రభువైన అల్లాహ్‌ను మాత్రమే మీరు ఆరాధించండి.

అలాగే బైబిల్‌లో యోహాను సువార్తలో ఉంది. ఆకాశాల్లో ఉన్న ఆ దేవుణ్ణి పూజించేవారే నిత్య జీవితాన్ని పొందుతారు అని చాలా స్పష్టంగా ఉంది. అయితే ప్రళయ దినాన అల్లాహు త’ఆలా ఈసా అలైహిస్సలాంను పిలుస్తాడు. అక్కడ గట్టిగా ప్రశ్నిస్తాడు. ఆ విషయం ఏంటి? ఆ ప్రశ్నలు ఏంటి? కొంచెం శ్రద్ధగా వినండి.

وَإِذْ قَالَ اللَّهُ يَا عِيسَى ابْنَ مَرْيَمَ أَأَنْتَ قُلْتَ لِلنَّاسِ اتَّخِذُونِي وَأُمِّيَ إِلَٰهَيْنِ مِنْ دُونِ اللَّهِ
మరియు (ఆ రోజును గుర్తు చేసుకోండి), అప్పుడు అల్లాహ్ ఇలా అంటాడు: ఓ మర్యమ్ కుమారుడవైన ఈసా! నీవు ప్రజలతో, ‘అల్లాహ్‌ను వదలి నన్నూ, నా తల్లినీ ఆరాధ్య దైవాలుగా చేసుకోండి’ అని అన్నావా?

మరియం పుత్రుడైన ఓ ఈసా, అల్లాహ్‌ను వదలి నన్ను నా తల్లిని ఆరాధ్య దైవాలుగా చేసుకోండి అని నీవు ప్రజలకు చెప్పావా? అని అల్లాహ్ నీలదీసి అడిగే సందర్భం కూడా స్మరించుకోదగినది. అప్పుడు ఈసా అలైహిస్సలాం ఇలా విన్నవించుకుంటారు. ఏమని,

قَالَ سُبْحَانَكَ مَا يَكُونُ لِي أَنْ أَقُولَ مَا لَيْسَ لِي بِحَقٍّ
ఓ అల్లాహ్, నిన్ను పరమ పవిత్రుడిగా భావిస్తున్నాను. ఏ మాటను అనే హక్కు నాకు లేదో అలాంటి మాటను అనటం నాకే మాత్రం తగదు.

إِنْ كُنْتُ قُلْتُهُ فَقَدْ عَلِمْتَهُ تَعْلَمُ مَا فِي نَفْسِي وَلَا أَعْلَمُ مَا فِي نَفْسِكَ
ఒకవేళ నేను గనక అలాంటిది ఏదైనా అని ఉంటే అది నీకు తెలిసి ఉండేది. నా మనసులో ఏముందో కూడా నీకు తెలుసు. కానీ నీలో ఏముందో నాకు తెలియదు.

إِنَّكَ أَنْتَ عَلَّامُ الْغُيُوبِ
నిశ్చయంగా నీవు సమస్త గుప్త విషయాలను ఎరిగినవాడవు.

مَا قُلْتُ لَهُمْ إِلَّا مَا أَمَرْتَنِي بِهِ أَنِ اعْبُدُوا اللَّهَ رَبِّي وَرَبَّكُمْ
నీవు నాకు ఆజ్ఞాపించిన దానిని తప్ప నేను వారికి మరేమీ చెప్పలేదు: ‘అల్లాహ్‌ను ఆరాధించండి, ఆయనే నా ప్రభువు మరియు మీ ప్రభువు.’

وَكُنْتُ عَلَيْهِمْ شَهِيدًا مَا دُمْتُ فِيهِمْ فَلَمَّا تَوَفَّيْتَنِي كُنْتَ أَنْتَ الرَّقِيبَ عَلَيْهِمْ وَأَنْتَ عَلَىٰ كُلِّ شَيْءٍ شَهِيدٌ
నేను వారి మధ్య ఉన్నంత కాలం వారిపై సాక్షిగా ఉన్నాను. కానీ నీవు నన్ను పైకి లేపుకున్న తరువాత, నీవే వారిపై పర్యవేక్షకుడవుగా ఉన్నావు. మరియు నీవు ప్రతి విషయానికి సాక్షిగా ఉన్నావు.

ఈసా అలైహిస్సలాం ప్రవక్త కదా, అయినా ఇప్పుడు వారందరూ అంటే క్రైస్తవులందరూ వారిని పూజిస్తున్నారు అన్న విషయం ఈసా అలైహిస్సలాంకు తెలుసా? తెలియదు. అందుగురించి ఏమంటున్నారు, నేను వారి మధ్యలో ఉన్నంత వరకే నేను సాక్ష్యంగా ఉన్నాను. ఎప్పుడైతే నీవు నన్ను నీ వద్దకు తీసుకున్నావో, నీవే వారిపై వారిని పర్యవేక్షించి ఉన్నావు. వారు ఏం చేస్తున్నారో నాకేం తెలుసు. ఇది సూరె మాయిదాలోని 116, 117వ ఆయత్.

దీనికి సాక్ష్యాధారంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క హదీస్ ఏంటి? అది కొంచెం శ్రద్ధగా వినండి. కానీ ఈ హదీసులో తెలిపే ముందు, ఈ రోజుల్లో ప్రపంచమంతటిలో ఎక్కడెక్కడ ఏ పెద్ద పెద్ద ఔలియాలు, పెద్ద పెద్ద బాబాలు, పీరీలు, ముర్షదులు ఎవరెవరైతే ఉన్నారో, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్థానం వారి కంటే గొప్పదా లేకుంటే వారందరూ మన ప్రవక్త కంటే గొప్పవారా? సమాధానం ఇవ్వండి. ప్రవక్తనే గొప్పవారు కదా. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు కదా మనకు. అయితే స్వయంగా ప్రవక్త సంగతి ఈ హదీసులో వినండి. ప్రవక్త ఎలా విన్నవించుకుంటున్నారు? ప్రవక్త తమ తర్వాత జరిగిన విషయాలను నాకు తెలియవు అన్నట్టుగా ఎలా ప్రస్తావిస్తున్నారో. మరి ఈ రోజుల్లో మనం ఎలాంటి తప్పుడు విశ్వాసాల్లో, పెడమార్గాల్లో పడి ఉన్నామో మనం మనకు మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ హదీస్ సహీ బుఖారీలో హదీస్ నెంబర్ 4625, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఈ హదీసును హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు త’ఆలా అన్హు గారు ఉల్లేఖించారు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రసంగించారు. ఖుత్బా ఇచ్చారు. అంటే ఏదో ఒక సహాబీతో ప్రత్యేకంగా చెప్పిన విషయం కాదు. 10 మంది 50 మంది 100 మంది ముంగట ఖుత్బాలో ప్రసంగంలో చెప్పిన విషయం. ఆ ప్రసంగంలో ఇలా చెప్పారు. యా అయ్యుహన్నాస్, ఓ ప్రజలారా ఇన్నకుమ్ మహ్షూరున ఇలల్లాహి హుఫాతన్ ఉరాతన్ గుర్లా. మీరు అల్లాహ్ వైపునకు లేపబడతారు. మొదటిసారి పుట్టిన స్థితిలో, శరీరంపై బట్టలు లేకుండా, కాళ్ళకు చెప్పులు లేకుండా, సున్నతీలు చేయబడకుండా. మళ్లీ ప్రవక్త ఖుర్ఆన్ యొక్క ఆయత్ చదివారు. సూరె అంబియా ఆయత్ నెంబర్ 104.

كَمَا بَدَأْنَا أَوَّلَ خَلْقٍ نُعِيدُهُ وَعْدًا عَلَيْنَا إِنَّا كُنَّا فَاعِلِينَ
తొలిసారిగా మిమ్మల్ని పుట్టించిన రీతిలో మలిసారి మిమ్మల్ని మేము లేపుతాము. ఇది మా యొక్క వాగ్దానం. దీనిని మేము పూర్తి చేసి తీరుతాము.

ఇది సూరె అంబియా ఆయత్ నెంబర్ 104 యొక్క అనువాదం. మళ్లీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, వినండి, వ ఇన్న అవ్వలల్ ఖలాయిఖి యుక్సా యౌమల్ ఖియామతి ఇబ్రాహీమ్ అలైహిస్సలాతు వస్సలాం. అందరూ ఏ స్థితిలో లేస్తారు సమాధుల నుండి? నగ్నంగా. బట్టలు లేకుండా. చెప్పులు లేకుండా. సున్నతీలు చేయబడకుండా. అయితే, మొట్టమొదటిసారిగా హజ్రత్ ఇబ్రాహీమ్ అలైహిస్సలాంకు వస్త్రాలు ధరింపజేయబడతాయి. ఆ తర్వాత మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి. అయితే, ఆ మైదానే మహ్షర్‌లో, ఆ పెద్ద మైదానంలో ఎక్కడైతే అందరూ, ఆదం అలైహిస్సలాం నుండి మొదలుకొని ప్రళయం సంభవించే వరకు వచ్చిన ఈ జన సమూహం అంతా ఒకే ఒక మైదానంలో సమూహం అవుతారు, జమా అవుతారు. అక్కడ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు, వినండి, వ ఇన్నహు యుజాఉ బిరిజాలిన్ మిన్ ఉమ్మతీ ఫయు’ఖదు బిహిమ్ దాతశ్శిమాల్. నేను నా హౌదె కౌసర్ పై నా ఉమ్మతీయులు, నా అనుచర సంఘం వస్తుంది అని నేను వేచిస్తూ ఉంటాను. వారు కొన్ని కొన్ని గ్రూపుల రూపంలో వస్తూ ఉంటారు. కొందరు నా వైపునకు వస్తూ ఉంటారు, ఫయు’ఖదు బిహిమ్ దాతశ్శిమాల్, వారిని నా వద్దకు రానివ్వకుండా ఎడమ వైపునకు నెట్టేయడం జరుగుతుంది. ఫ అఖూల్, అప్పుడు నేను అంటాను, యా రబ్బీ ఉసైహాబీ, ఓ ప్రభువా వీరు నా యొక్క అనుచరులు, నన్ను విశ్వసించిన వారు. ఫ యుఖాల్, అప్పుడు అనబడడం జరుగుతుంది.

إِنَّكَ لَا تَدْرِي مَا أَحْدَثُوا بَعْدَكَ
(ఇన్నక లా తద్రీ మా అహదసూ బ’అదక)
నిశ్చయంగా, నీ తర్వాత వారు ఏ కొత్త కొత్త విషయాలు పుట్టించుకొని ధర్మం నుండి దూరమయ్యారో నీకు తెలియదు ఆ విషయం.

ఎప్పుడు అనబడుతుంది? ప్రళయ దినాన. హౌదె కౌసర్ వద్ద. హౌదె కౌసర్ వద్ద ప్రవక్త శుభ హస్తాలతో హౌదె కౌసర్ ఆ శుభ జలాన్ని త్రాగడానికి అందరూ గుంపులు గుంపులుగా వెళ్తూ ఉంటారు. ఒక గుంపు వచ్చినప్పుడు వారిని ప్రవక్త వద్దకు రానివ్వడం జరగదు. ఎడమ వైపునకు నెట్టేయడం జరుగుతుంది. అయ్యో నా వారు వాళ్ళు, రానివ్వండి నా దగ్గరికి అని ప్రభువును వేడుకుంటారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు. కానీ ప్రభువు వైపు నుండి సమాధానం ఏమొస్తుంది? నీవు చనిపోయిన తర్వాత, నీ తర్వాత వారు ఏ కొత్త కొత్త విషయాలు పుట్టించుకొని ధర్మం నుండి దూరమయ్యారో (ఇన్నక లా తద్రీ) నీకు తెలియదు ఆ విషయం.

ఈ హదీస్ ఇంకా ముందుకు ఉంది. కానీ ఇక్కడ నేను ఈ విషయాన్ని నొక్కి చెప్తున్నాను మరోసారి. ఇన్నక లా తద్రీ. నీకు తెలియదు. నీకు ఆ సందర్భంలో నీకు జ్ఞానం లేదు. నీవు చనిపోయిన తర్వాత నీ యొక్క ఈ నిన్ను విశ్వసించే వారు ఏ పెడమార్గంలో పడిపోయారో నీకు తెలియదు. ఈరోజు మనం ఏమనుకుంటున్నాము? ప్రవక్త మనల్ని చూస్తున్నారు, మనం చెప్పే మాట్లాడే మాటలన్నీ, మనం చేసే ప్రార్థనలన్నీ వింటున్నారు. ఇది తప్పు విషయం ఇది. ఈ హదీసుకి వ్యతిరేకంగా ఉందా లేదా వారి యొక్క ఈ విశ్వాసం? ఆ తర్వాత వినండి, ఫ అఖూల్, ప్రవక్త అంటున్నారు, అప్పుడు నేను అంటాను కమా ఖాలల్ అబ్దుస్సాలిహ్, ఎలాగైతే ఆ పుణ్య పురుషుడైన, సదాచరుడైన దాసుడు ఈసా అలైహిస్సలాం చెప్పాడో

وَكُنْتُ عَلَيْهِمْ شَهِيدًا مَا دُمْتُ فِيهِمْ فَلَمَّا تَوَفَّيْتَنِي كُنْتَ أَنْتَ الرَّقِيبَ عَلَيْهِمْ وَأَنْتَ عَلَىٰ كُلِّ شَيْءٍ شَهِيدٌ
నేను వారి మధ్య ఉన్నంత కాలం వారిపై సాక్షిగా ఉన్నాను. కానీ నీవు నన్ను పైకి లేపుకున్న తరువాత, నీవే వారిపై పర్యవేక్షకుడవుగా ఉన్నావు. మరియు నీవు ప్రతి విషయానికి సాక్షిగా ఉన్నావు.

నేను వారి మధ్యలో ఉన్నంత మాత్రం నేను వారిపై సాక్ష్యంగా ఉన్నాను. ఫలమ్మా తవఫ్ఫైతనీ, ఎప్పుడైతే నీవు నన్ను చంపివేశావో, ఎప్పుడైతే నువ్వు నన్ను నా ప్రాణం తీసుకున్నావో, కున్త అంతర్రఖీబ అలైహిమ్, నీవే వారిని పర్యవేక్షిస్తూ ఉన్నావు. వ అంత అలా కుల్లి షైఇన్ షహీద్, మరియు నీవే సర్వ విషయాలపై సర్వ జగత్తుపై సత్యమైన సాక్షివి.

అయితే సోదరులారా, ఈ హదీస్ ఎంత స్పష్టంగా ఉంది. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సైతం ఆయన కూడా ఎవరి ఏ మాట వినరు ఇప్పుడు. ఎవరి యొక్క మొరలను ఆలకించలేరు. అలాంటప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే తక్కువ స్థానంలో ఉన్న వారి గురించి వారు వింటారు, వారు చేస్తారు, మనకు అన్ని రకాల అనుగ్రహాలు ప్రసాదిస్తారు, ఇలాంటి విశ్వాసాలు, ఇలాంటి నమ్మకాలు మనల్ని ఎంత షిర్క్ లాంటి లోతుకు తీసుకెళ్తాయో మనమే ఆలోచించాలి. ఇ

లా చెప్పుకుంటూ పోతే సోదరులారా, ఖుర్ఆన్‌లో ఇంకా ఎన్నో ఆయతులు ఉన్నాయి, ఎన్నో హదీసులు ఉన్నాయి. ఇలాంటి తప్పుడు విశ్వాసాలకు వ్యతిరేకంగా. కానీ, కొంత సమయం ఉంది గనుక కేవలం ఒకే ఒక ఆయత్, దాని యొక్క అనువాదం మీ ముందు తెలిపి నేను ఈ యొక్క ప్రసంగాన్ని సమాప్తం చేస్తాను. ఇది సూరె ఫాతిర్. సూరె ఫాతిర్‌లోని ఆయత్ నెంబర్ 13, 14. అల్లాహ్ అంటున్నాడు,

ذَٰلِكُمُ اللَّهُ رَبُّكُمْ لَهُ الْمُلْكُ
(దాలికుముల్లాహు రబ్బుకుమ్ లహుల్ ముల్క్)
ఆయనే అల్లాహ్, మీ ప్రభువు, ఆధిపత్యం ఆయనదే.

وَالَّذِينَ تَدْعُونَ مِنْ دُونِهِ مَا يَمْلِكُونَ مِنْ قِطْمِيرٍ
(వల్లదీన తద్ఊన మిన్ దూనిహీ మా యమ్లికూన మిన్ ఖిత్మీర్)
మరియు ఆయనను వదలి మీరు పిలిచేవారు ఖర్జూరపు బీజంపై ఉండే పొరంత కూడా అధికారం కలిగి లేరు.

ఆయన్ని కాకుండా, ఆయన్ని వదలి మీరు ఎవరెవరినైతే మొరపెట్టుకుంటున్నారో, ఎవరెవరినైతే మీరు పిలుస్తున్నారో, దుఆలు చేస్తున్నారో, మా యమ్లికూన మిన్ ఖిత్మీర్, ఖర్జూరపు బీజంపై ఉన్నటువంటి మరీ పలుచని ఆ పొర అంత మాత్రం శక్తి కూడా వారికి లేదు. మీరు అల్లాహ్‌ను కాకుండా ఎవరినైతే పూజిస్తున్నారో, ఎవరినైతే మొరపెట్టుకుంటున్నారో వారి వద్ద ఖర్జూరపు గుట్లి, దాని యొక్క బీజంపై చాలా పలుచని పొర ఏదైతే ఉంటుందో అంత శక్తి కూడా వారి వద్ద లేదు.

إِنْ تَدْعُوهُمْ لَا يَسْمَعُوا دُعَاءَكُمْ
(ఇన్ తద్ఊహుమ్ లా యస్మఊ దుఆఅకుమ్)
ఒకవేళ నీవు వారిని మొరపెట్టుకుంటే మీ మొరలను వారు ఆలకించలేరు, వినలేరు.

وَلَوْ سَمِعُوا مَا اسْتَجَابُوا لَكُمْ
(వలవ్ సమీఊ మస్తజాబూ లకుమ్)
ఒకవేళ వారు విన్నా, మీకు సమాధానం ఇవ్వలేరు.

లేదు వింటారు, వింటారు, వింటారు అని ఏదైతే మీ విశ్వాసం ఉందో, ఒకవేళ విన్నా గానీ మస్తజాబూ లకుమ్, మీకు ఎలాంటి జవాబ్, సమాధానం ఇవ్వలేరు. అల్లాహ్ అంటున్నాడు, ఒకవేళ మీ యొక్క బలహీన విశ్వాసం ఉంది కదా లేదు వింటున్నారు అని, ఒకవేళ విన్నా గానీ సమాధానం ఏ మాత్రం ఇవ్వలేరు. సహీ బుఖారీలోని మొదటి హదీస్ ఏదైతే వినిపించానో అక్కడ కూడా ప్రవక్త అదే చెప్పారు. ఇప్పుడు వారు వింటున్నారు కానీ జవాబు ఇవ్వలేరు. సమాధానం ఇవ్వలేరు. బదులు పలకలేరు. అల్లాహ్ ఏమంటున్నాడు ఇక్కడ? ఒకవేళ మీ విశ్వాస ప్రకారంగా, ఏదైనా అవసరం పడి, ఏదైనా సందర్భంలో మేము వారికి వినిపించినా గానీ వారు సమాధానం చెప్పలేరు, ఇవ్వలేరు.

وَيَوْمَ الْقِيَامَةِ يَكْفُرُونَ بِشِرْكِكُمْ
మరియు ప్రళయ దినాన వారు మీ షిర్క్‌ను తిరస్కరిస్తారు.

మరియు ప్రళయ దినాన యక్ఫురూన బిషిర్కికుమ్. మీరు అల్లాహ్‌తో పాటు వారిని ఏదైతే సాటి కల్పించారో దీనిని వారు తిరస్కరిస్తారు. తిరస్కరిస్తారు. అల్లాహ్ మీరు అల్లాహ్‌తో పాటు మీరు వారిని ఏదైతే సాటి కల్పిస్తున్నారో వాటి దానిని వారు తిరస్కరిస్తారు. అంటే ఏంటి? అంటే వారికి ఈ విషయం తెలియదు. ఒకవేళ తెలిసేది ఉంటే ఎందుకు తిరస్కరిస్తారు? తెలిసేది ఉంటే ఎందుకు తిరస్కరిస్తారు? మీరు ఇక్కడ మొరపెట్టుకున్న విషయం, అల్లాహ్‌ను కాకుండా వారిని మీరు ఏదైతే దుఆ చేస్తున్నారో ఇవన్నీ విషయాలు వాస్తవానికి వారు వినలేరు, వారికి ఏమాత్రం తెలియదు. అందుగురించే ప్రళయ దినాన ఎప్పుడైతే వీరు వెళ్తారో, అక్కడ కూడా వారు వీరి యొక్క ఈ షిర్క్‌ను తిరస్కరిస్తారు. ఈ తిరస్కరిస్తారు అన్న విషయం బహుశా ఇంకొందరికి అర్థం అవతలేదు అనుకుంటా. సూరె బఖరాలో, సూరె అహ్కాఫ్‌లో 26వ పారా స్టార్టింగ్ ఆయతులలోనే ఐదు ఆరు ఆయతులలోనే అక్కడ విషయం ఉంది. సూరె బఖరాలో రెండవ అధ్యాయం అంటే రెండవ పారా ఏదైతే ఉందో, అందులో సగం అయిన తర్వాత ఇంచుమించు సుమారు ఒక క్వార్టర్ పారా అయిపోయిన తర్వాత

إِذْ تَبَرَّأَ الَّذِينَ اتُّبِعُوا مِنَ الَّذِينَ اتَّبَعُوا وَرَأَوُا الْعَذَابَ وَتَقَطَّعَتْ بِهِمُ الْأَسْبَابُ
(ఆ రోజును గుర్తు చేసుకోండి), ఎప్పుడైతే అనుసరించబడిన వారు తమను అనుసరించిన వారి నుండి వైదొలగిపోతారో, మరియు వారు శిక్షను చూస్తారో, మరియు వారి మధ్య సంబంధాలన్నీ తెగిపోతాయో.

ఆ ఆయతుల సంగతి ఆ ఆయతులను దాని యొక్క వ్యాఖ్యానం చదవండి. ఏమవుతుంది, సహీ బుఖారీలో వివరణ ఉంది. ప్రళయ దినాన ప్రజలందరూ ఆ మైదానే మహ్షర్‌లో జమా అవుతారు కదా, అక్కడ అల్లాహు త’ఆలా ఎవరెవరు ఎవరెవరిని మొరపెట్టుకునేవారో వారి వెంట వెళ్ళండి అని అన్నప్పుడు, ఈ ఇమాములను, పీరీలను, ముర్షదులను, బాబాలను వారందరినీ మొరపెట్టుకునేవారు వారి వారిని వెనుకులాడుతూ ఉంటారు. వెనుకులాడి ఆ మీరే కదా పీరానే పీర్ షేఖ్ అబ్దుల్ ఖాదర్ జీలాని, మీరే కదా పెద్ద గుట్ట వాళ్ళు, మీరే కదా ఈ విధంగా వారి వారి వద్దకు వెళ్లి వారి వెంట ఉండి వారి యొక్క సిఫారసు పొందడానికి వారి వెనక వెళ్లే ప్రయత్నం చేస్తారు ప్రళయ దినాన. అప్పుడు వారు వీరిని చూసి ఓ అల్లాహ్ వీరు మమ్మల్ని పూజించే వారు కాదు, మమ్మల్ని మొరపెట్టుకునే వారు కాదు, వీరు మాకు శత్రువులు, మమ్మల్ని బద్నాం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, మాకు వీరికి ఎలాంటి సంబంధం లేదు అని స్పష్టంగా చెప్తారు.

సోదరులారా, ఖుర్ఆన్‌లో ఈ ఆయతులు, హదీసుల్లో ఈ విషయాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అసలైన రోగం, అసలైన పెద్ద సమస్య ఏంటంటే ఇలాంటి ఆయతులను ఇలాంటి హదీసులను మనం చదవడం లేదు. ఈ సమాధుల వద్ద ఉండే మౌల్వీలు, ఇలాంటి పండితులు మన సామాన్య ప్రజలకు తెలపడం లేదు. అందుగురించి సామాన్య ప్రజలు ఇలాంటి ఘోరమైన షిర్క్‌లో పడిపోతున్నారు.

అల్లాహు త’ఆలా మనందరికీ సరియైన సన్మార్గం మరియు తౌహీద్, ఈ నిజమైన అఖీదా విశ్వాసానికి సంబంధించిన విషయాలు ఖుర్ఆన్ హదీస్ ఆధారంగా మరిన్ని ఎక్కువగా తెలుసుకునే భాగ్యం అల్లాహ్ కలిగించుగాక. ఈ రోజుల్లో ప్రజలు ఏదైతే షిర్క్‌లో పడి ఉన్నారో వాటి నుండి అల్లాహు త’ఆలా వారిని రక్షించుగాక. జజాకుముల్లాహు ఖైరా, వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ : https://teluguislam.net/?p=8426

ఇతరములు: