అల్లాహ్ అర్ష్ నీడలో.. (In the Shade of Allah’s Throne)

shade-of-allah

దైవ సింహాసనపు నీడలో..
పుస్తకం నుండి:  కలామే హిక్మత్ – 1(వివేక వచనం)
రచన: సఫీ అహ్మద్ మదనీ,
అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్
ప్రకాశకులు: జమీ అతే అహ్ లె హదీస్, ఆంధ్రప్రదేశ్

[ఇక్కడ చదవండి / డౌన్ లోడ్ చేసుకోండి]

English version of this hadeeth:

The Prophet said: “There are seven whom Allah will shade in His Shade on the Day when there is no shade except His Shade: a just ruler; a youth who grew up in the worship of Allah, the Mighty and Majestic; a man whose heart is attached to the mosques; two men who love each other for Allah’s sake, meeting for that and parting upon that; a man who is called by a woman of beauty and position [for illegal intercourse], but be says: ‘I fear Allah’, a man who gives in charity and hides it, such that his left hand does not know what his right hand gives in charity; and a man who remembered Allah in private and so his eyes shed tears.”

Narrated by Abu Hurairah & collected in Saheeh al-Bukhari (english trans.) vol.1, p.356, no.629 & Saheeh Muslim (english trans.) vol.2, p.493, no.2248

దైవ నామ స్మరణ – Zikr and Remembrance of Allah

do-not-forget-remember-Allah

ప్రవక్త మహనీయులు (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారని హజ్రత్‌ అబూహురైర (రధి అల్లాహు అన్హు) ఉల్లేఖించారు :

దైవదూతలు కొందరు దైవనామాన్ని స్మరించే వారిని వెదుకుతూ దార్లలో తిరుగుతుంటారు. దైవ స్మరణలో నిమగ్నులై ఉన్నవారిని చూడగానే వారు, “మా అవసరార్థం ఇటు మరలిరండి’ అని పరస్పరం పిలుచుకుంటారు. దైవనామ స్మరణలో ఉన్నవారిని ఎందరు దూతలు తమ బాహువులతో ఆక్రమిస్తారంటే, వారి వరస మొదటి ఆకాశం వరకు చేరుకుంటుంది.

వారిని వారి ప్రభువు, అంతా తెలిసి కూడా అడుగుతాడు : “నా దాసులు ఏమంటున్నారు?” దైవదూతలు సమాధాన మిస్తారు – ‘వారు నీ పవిత్రతను కొనియాడుతున్నారు. ఇంకా, నీ గొప్పతనాన్ని కొనియాడుతున్నారు. ఇంకా, నీ ఔన్నత్యాన్ని శ్లాఘిస్తున్నారు. ఇంకా, నిన్ను స్తుతిస్తున్నారు. నీ పెద్దరికాన్ని వర్ణిస్తున్నారు. అల్లాహ్‌ అడుగుతాడు : ‘వారు నన్ను చూశారా?” “లేదు. అల్లాహ్‌ సాక్షి! వారు నిన్ను చూడలేదు’ అని దూతలు సమాధానమిస్తారు. అల్లాహ్‌ అడుగుతాడు : ‘ఒకవేళ వారు నన్ను చూస్తే అప్పుడు వారి  స్థితి ఎలా ఉంటుంది?” దూతలు అంటారు – ‘వారు గనక నిన్ను చూసినట్లయితే నిన్ను మరింత ఎక్కువగా సేవిస్తారు. నిన్ను ఇంకా ఎక్కువగా జ్ఞాపకం చేస్తారు. ఇంకా ఎక్కువగా నీ పవిత్రతను కొనియాడతారు.’

ఆయన అంటాడు : ‘వారు నా నుండి ఏం కోరుతున్నారు?” దూతలు అంటారు – ‘వారు మీతో స్వర్గం కోరుతున్నారు. ఆయన అంటాడు : ‘ఒకవేళ వారు నన్ను చూస్తే అప్పుడు వారి స్థితి ఎలా ఉంటుంది?” దూతలు అంటారు – వారు గనక నిన్ను చూసినట్లయితే నిన్ను మరింత ఎక్కువగా సేవిస్తారు. నిన్ను ఇంకా ఎక్కువగా జ్ఞాపకం చేస్తారు. ఇంకా ఎక్కువగా నీ పవిత్రతను కొనియాడుతారు. ఆయన అంటాడు : ‘వారు నా నుండి ఏం కోరుతున్నారు?” దూతలు అంటారు – ‘వారు మీతో స్వర్గం కోరుతున్నారు.’ ఆయన అంటాడు : ఒకవేళ ధాన్ని చూస్తే వారి పరిస్థితి ఎట్లా ఉంటుంది?’ దూతలు బదులిస్తారు – “వారు గనక దాన్ని చూస్తే ఇంకా అధికంగా దాన్ని ఆశిస్తారు. దాని కోసం ఎంతగానో గాలిస్తారు. దాని వైపునకు మరింత ఎక్కువగా మళ్ళుతారు.’

ఆయన అడుగుతాడు : “వారు దేన్నుండి శరణువేడుతున్నారు?’ దూతలు సమాధానమిస్తారు – “(నరకాగ్ని నుండి.’ ఆయన అంటాడు : ‘వారు ఆ అగ్నిని చూశారా?’ దూతలంటారు – “లేదు, అల్లాహ్‌ సాక్షిగా! ఓ ప్రభూ! వారు దాన్ని చూడలేదు.’ ఆయన అంటాడు : “ఒకవేళ వారు దాన్ని చూసి ఉంటే అప్పుడు వారి స్ధితి ఏమౌను?’ వారు సమాధానమిస్తారు – ‘ఒకవేళ వారు దాన్ని చూస్తే దాన్నుండి మరింత ,దూరం పారిపోతారు. దానిపట్ల ఇంకా ఎక్కువగా భయపడతారు.’ అల్లాహ్‌ సెలవిస్తాడు : ‘నేను మిమ్మల్ని సాక్ష్యంగా పెట్టి చెబుతున్నాను – నేను వారిని క్షమించి వేస్తాను.’ అప్పుడు ఒక దూత అంటాడు – ‘ఫలానా మనిషి స్మరణ చేసిన వారిలో లేడు. అతను మరో పని మీద అక్కడకు వచ్చేశాడు.” అల్లాహ్‌ అంటాడు : ‘వారు (దైవస్మరణ చేసేవారు) ఎటువంటి వారంటే వారితోపాటు కూర్చున్న వ్యక్తి కూడా (ఆ భాగ్యాన్ని) కోల్పోడు.” (బుఖారి)

ఈ హదీసులో “జిక్ర్‌” వాస్తవికతను, “జిక్ర్‌” చేసే వారి ఘనతను, ఇంకా జిక్ర్‌ చేసే వారితోపాటు కూర్చునే వారి భాగ్యాన్ని గురించి వివరించటం జరిగింది.

ఇక్కడ ‘జిక్ర్‌ అంటే అర్ధం ఇతర హదీసులలో పలుసార్లు నొక్కి చెప్పబడిన పవిత్ర వాక్కులను వల్లించడం. ఉదాహరణకు, ‘సుబ్‌హానల్లాహ్‌’”, ‘అల్‌హమ్‌దు లిల్లాహ్‌”, “లా ఇలాహ ఇల్లల్లాహ్‌”, “అల్లాహు అక్బర్‌. ఇంకా అదేవిధంగా ‘లాహౌల వలా ఖువ్వత ఇల్లా బిల్హాహ్‌’, ‘“బిస్మిల్లాహ్‌’, ‘హస్బునల్లాహ వ నీమల్‌ వకీల్ , “అస్తగ్‌ఫిరుల్లాహ్‌’ మొదలగు వాక్యాలను పలుకుతూ ఉండటం, ఇంకా ఇహపర శ్రేయాలను దైవం నుండి కోరటం కూడా జిక్ర్‌ కోవలోకే వస్తాయి. వాజిబ్‌ మరియు ముస్తహబ్‌ ఆచరణలను చేయటం కూడా కొన్ని సమయాలలో ‘జిక్ర్‌’ (దైవస్మరణ) గానే పరిగణించబడుతుంది. ఉదాహరణకు ఖుర్‌ఆన్‌ పారాయణం, హదీసు అధ్యయనం, జ్ఞాన సదనం, నఫిల్‌ నమాజులు.

దైవ నామ స్మరణ చేసే వ్యక్తికి తాను పలికే పదాల భావం తెలిస్తేనే పుణ్యఫలం లభిస్తుందన్న నియమం లేదు. అయితే ఆయా పదాలకు వ్యతిరేక భావం మాత్రం అతని మనసులో ఉండకూడదన్నది షరతు. పలికే పదాలకు అర్థం కూడా తెలిసి ఉంటే ఆ స్మరణ పరిపూర్ణతను సంతరించుకుంటుంది. అల్లాహ్‌ ఔన్నత్యం, ఆయన అన్ని లోపాలకు, బలహీనతలకు అతీతుడు అనే భావం మనసులో గనక సతతం మెదలుతూ ఉన్నట్లయితే అప్పుడు ఆ స్మరణ మరింత అర్థవంతం అవుతుంది. దైవమార్గంలో కృషి సలుపుతూ, ఆయన మనపై విధిగా చేసిన వాటిని తు.చ, తప్పకుండా పాటిస్తూ గనక ‘జిక్ర్‌’ చేస్తే అది ఇంకా సమగ్రతను సంతరించుకుంటుంది. సంస్కర్త గనక ఏకాగ్ర చిత్తంతో దైవం వైపునకు మరలి, సంకల్పశుద్దితో దైవాన్ని స్మరిస్తే అది మరింతగా ప్రభావవంతం అవుతుంది.

హజ్రత్‌ అబ్బుల్లా బిన్‌ బసర్‌ (రజిఅన్‌) ఉల్లేఖించిన హదీసులో దైవ నామ స్మరణ యొక్క ప్రాముఖ్యత మరోవిధంగా చెప్పబడింది. ఒక వ్యక్తి మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వచ్చి, “ఓ దైవప్రవక్తా! ఇస్లాం ఆదేశాలెన్నో ఉన్నాయి. మీరు నాకు ఏదో ఒక దాన్ని గురించి చెప్పండి, దాన్ని నేను అంటిపెట్టుకుని ఉంటాను” అని అన్నాడు. అప్పుడు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రబోధించారు – “నీ నోరు (నాలుక) సతతం అల్లాహ్‌ నామస్మరణలో ఉండాలి.” (తిర్మిజి)

వివిధ ఉల్లేఖనాల ద్వారా స్పష్టమయ్యేదేమంటే, దేవుని పవిత్రతను, ఆయన ఘనతను కొనియాడటం, ఆయన స్తోత్రం చేయటం, ఆయన గ్రంథాన్ని పారాయణం చేయటం, స్వర్గ నరకాలను ప్రస్తావించటం, దైవానుగ్రహాలపై కృతజ్ఞతలు వ్యక్తపరచటం వంటివి “జిక్ర్‌ సదనాలు’ అనిపించుకుంటాయి.

“అంతా తెలిసి ఉండి కూడా వారిని వారి ప్రభువు అడుగుతాడు.” సర్వజ్ఞాని అయిన్న అల్లాహ్హ్‌ తన దూతలతో తన దాసుల గురించి అలా ప్రశ్నించాడంటే, దాసుల విధేయతను వారికి తెలియపరచటానికే అలా చేసి ఉండవచ్చు. ఎందుకంటే, అల్లాహ్‌ ఆదంను సృష్టించదలచినపుడు దైవదూతలు పలికిన పలుకులను దృష్టిలో ఉంచుకుని అల్లాహ్హ్‌ ఈ విధంగా ప్రశ్నిస్తాడని కొందరు ఇస్లామీయ విద్వాంసులు వ్యాఖ్యానించారు. ధరణిలో ఒక ఖలీఫా (ప్రతినిధి) ని సృష్టించబోతున్నానని అల్లాహ్‌ అన్నప్పుడు దైవదూతలు,

“ప్రభూ! అవనిలో కల్లోలం రేకెత్తించే, రక్తపాతం సృష్టించేవాడిని నువ్వు సృష్టిస్తున్నావా?! నీ స్తోత్రంతో పాటు నీ పవిత్రతను కొనియాడటానికి మేమున్నాముగా” అని విన్నవించుకున్నారు. ఆయన సెలవిచ్చాడు : “ఏదైతే నాకు తెలుసో అది మీకు తెలియదు.” (అల్‌ బఖర : 20)

“ఆనాడు నేను ఆదంను సృష్టిస్తుంటే మీరలా అన్నారు, చూడండి ఇప్పుడు ఆదం సంతతి ఏ విధంగా షైతానీ ప్రేరణలను ఎదిరించి, నా స్తోత్రం చేస్తున్నారో అని అల్లాహ్‌ తన దూతలకు పరోక్షంగా చెప్పదలిచాడు.

ఈ హదీసుపై మరికొంతమంది విద్వాంసుల వ్యాఖ్యానం ఇలా ఉంది : ఆదం బిడ్డలు చేసే ‘జిక్ర్‌ (దైవస్మరణ) దైవదూతలు చేసే స్మరణకన్నా శ్రేష్ఠమైనది. ఎందుకంటే మనిషి తన దైనందిన వ్యాపకాలను నిర్వర్తిస్తూ అనేక సమస్యల్ని ఎదుర్కొంటూ, సైతాన్‌ ఎత్తులను ఎప్పటికప్పుడు చిత్తుచేస్తూ దైవ నామస్మరణకు పూనుకుంటాడు, కాని దైవ దూతలకు ఈ ఇబ్బందులు లేవు.

“ఒకవేళ వారు నన్ను చూస్తే అప్పుడు వారి పరిస్థితి ఎలా ఉంటుంద”ని ప్రశ్న.

దీనిద్వారా తెలిసిందేమంటే ఐహిక జీవితంలో అల్లాహ్‌ను చూడటం సాధ్యపడదు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచనాన్ని ఇమామ్‌ ముస్లింగారూ అబూ అమామ ద్వారా ఉటంకించారు – ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు : “మీరు మీ ప్రభువును మీరు మరణించే వరకు చూడలేరని తెలుసుకోండి.” దైవచిత్తమయితే విశ్వాసులు తీర్పుదినంనాడు సర్వలోకాల ప్రభువును చూస్తారు. అయితే అల్లాహ్‌ను కళ్ళారా చూడకుండానే ఆయనకు భయపడటం, ఆయన వైపునకు మరలటమే సాఫల్యానికి నిదర్శనం.

“వారెటువంటి వారంటే వారితో పాటు కూర్చున్న వ్యక్తి కూడా (భాగ్యానికి) నోచుకోక పోడు.”

సుబ్‌హానల్లాహ్‌! వారితో కలసి కూర్చున్న వ్యక్తి సయితం అదృష్టవంతుడై పోయాడంబే దైవ నామస్మరణ చేసేవారు ఎంతటి శుభప్రదమైనవారు!

ఈ హదీసులో పేర్కొనబడిన “జిక్ర్‌ సమావేశాలు” అంటే భావం విశ్వాస భావంతో దైవ నామాన్ని, స్మరించే సమావేశాలలో విశ్వాసులను సహజమైన రీతిలో కలుసు కోవటం అని మహాప్రవక్త మరియు ఆయన సహచరుల హయాంలో అటువంటి సదనాలు సమావేశాలు జరిగేవి. విశ్వాసులు పరస్పరం కలుసుకునేవారు, పరామర్శలు జరిపేవారు. అల్లాహ్‌ను స్మరించేవారు. ఒండొకరిని మంచి వైపునకు ఆహ్వానించేవారు. చెడుల సంస్కరణకై నిర్మొహమాటంగా చెప్పేవారు. అల్లాహ్‌కు విధేయులై మెలగాలని, ఆయన ధర్మంపై స్థిరత్వం కలిగి ఉండాలని తాకీదు చేసేవారు.

ఈ హదీసు ద్వారా జిక్ర్‌ మరియు దానికోసం సమావేశమువటం యొక్క మహత్మ్యం తెలిసి వస్తోంది. ఆఖరికి సద్వర్హ్తనులతో కలిసి కూర్చునే వ్యక్తి కూడా కారుణ్య భాగ్యానికై అర్హుడైపోతాడు. “దైవనామ స్మరణ’ దైవదూతలకు ఆహారం వంటిదని వారు దానికోసం తిరుగుతూ ఉంటారని కూడా ఈ హదీసువల్ల తెలుస్తోంది. అల్లాహ్‌చే నిర్మితమైన స్వర్గం మేలైన వస్తువులతో నిండి ఉంది. దాన్ని ఆశించే వ్యక్తికై అల్లాహ్‌ మార్గం సుగమం చేస్తాడు. దానికి భిన్నంగా నరకం కష్టాలతో యాతనలతో నిండి ఉంది. ఎవరయితే నరకాగ్నిని కోరుకుని, దానికి ఆహుతి అయ్యేవనులు చేయాలనుకుంటారో అటువంటి వారికై కూడా అల్లాహ్‌ మార్గాలు తెరుస్తాడు.

పుస్తకం నుండికలామే హిక్మత్ – 1(వివేక వచనం)
రచన: సఫీ అహ్మద్ మదనీ,
అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్
ప్రకాశకులు: జమీ అతే అహ్ లె హదీస్, ఆంధ్రప్రదేశ్

[డౌన్లోడ్ PDF]


1447. Abu Hurairah (May Allah be pleased with him) reported: The Messenger of Allah (sallallaahu ’alayhi wa sallam) said, “Allah, the Exalted, has teams of angels who go about on the roads seeking those who remember Allah. When they find some people remembering Allah they call to one another and say, `Come to what you are looking for;’ and they surround them with their wings till the space between them and the lowest sky is fully covered. Allah, the Exalted and Glorious, asks them (although He is best informed about every thing): `What are my slave saying?’ They say: `They are glorifying Your Tasbih, Tahmid, Takbir, Tamjid, (i.e., they were declaring Your Perfectness, praising, remembering the Greatness and Majesty of Allah).’ He asks: `Have they seen Me?’ They reply, `No, indeed, they have not seen You.’ He asks: `How would they act if they were to see Me?’ Thereupon they reply: `If they were to see You, they would engage more earnestly in worshipping and glorifying You and would extol You more.’ He would say: `What do they beg of Me?’ They say, `They beg You for Your Jannah.’ Allah says, `Have they seen My Jannah?’ They say, `No, our Rubb.’ He says: `How would they act if they were to see My Jannah?’ They reply, `Were they to see it, they would more intensely eager for it.’ They (the angels) say, `They seek Your Protection.’ He asks, `Against what do they seek My Protection?’ They (the angels) say, `Our Rubb, from the fire of Hell.’ (He, the Rubb) says, `Have they seen the fire of Hell?’ They say, `No. By Your Honour, they have not seen it.’ He says: `How would they act if they were to see My Fire?’ They say: `If they were to see it, they would more earnest in being away from it and fearing it. They beg of Your forgiveness.’ He says: `I call you to witness that I hereby grant pardon to them and confer upon them what they ask for; and grant them protection against what they seek protection from.’ One of the angels says: `Our Rubb, there is amongst them such and such slave who does not belong to the assembly of those who are participating in Your remembrance. He passed by them and sat down with them.’ He says: `I also grant him pardon because they are the people by virtue of whom their associates will not be unfortunate‘.”
[Al-Bukhari and Muslim].

(The narration in Muslim is also the same with minor changes in wordings).

Commentary: What kind of circles and gatherings of remembrance of Allah are referred to here? Obviously not those in which Allah is remembered in the ways invented by the participants themselves, i.e., repetition of the slogans “Allah-Hu”, “Haq-Allah”,  etc.,which have not been mentioned in any Hadith. The repetition of any specific word, in a specific manner and in a peculiar surrounding (such as by putting the lights off) – this manner of conducting the remembrance of Allah is also not evident from the practice of the Prophet (sallallaahu ’alayhi wa sallam) and his Companions. The circles and gatherings mentioned in this Hadith are those in which, the Prophet’s Sunnah is fully observed. The words such as Subhan-Allah, Al-hamdu lillah, La ilaha illallah, Allahu Akbar etc., are recited and Praise and Glorification of Allah are done after Salat. The groups are quietly engaged in the remembrance of Allah, and those who attend the sermons and speeches delivered in mosques on Friday also come in this category of meetings and gatherings as these are ordained in Islam. This Hadith also highlights the distinction of Muslims who are engaged in the remembrance of Allah and the Du`a they recite on the suggested times and occasions.

ఇహపరాల శ్రేయం కోరుతూ చేసే ఒక మంచి దుఆ, దాని వివరణ

ప్రవక్త మహనీయులు ప్రబోధిస్తూ ఉండేవారని హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు :

اللَّهُمَّ أَصْلِحْ لِي دِينِي الَّذِي هُوَ عِصْمَةُ أَمْرِي ، وَأَصْلِحْ لِي دُنْيَايَ الَّتِي فِيهَا مَعَاشِي ، وَأَصْلِحْ لِي آخِرَتِي الَّتِي فِيهَا مَعَادِي وَاجْعَلِ الْحَيَاةَ زِيَادَةً لِي فِي كُلِّ خَيْرٍ وَاجْعَلِ الْمَوْتَ رَاحَةً لِي مِنْ كُلِّ شَرٍّ

అల్లాహుమ్మ అస్లిహ్ లీ దీనియల్లజీ హువ ఇస్మతు అమ్రీ, వఅస్లిహ్ లీ దున్యాయల్లతీ ఫీహా మఆషీ, వఅస్లిహ్ లీ ఆఖిరతియల్లతీ ఫీహా మఆదీ, వజ్అలిల్ హయాత జియాదతల్లీ ఫీ కుల్లి ఖైర్ ,వజ్అలిల్ మౌత రాహతల్లీ మిన్ కుల్లి షర్ర్

“ఓ అల్లాహ్! నా ధర్మాన్ని నా కోసం సవ్యంగా చెయ్యి. అది నా వ్యవహారానికి ప్రాతిపదిక. ఇంకా, నా కొరకు ప్రపంచాన్ని సజావుగా చెయ్యి. అందులో నా జీవితం ఉంది. ఇంకా, నా కొరకు పరలోకాన్ని సజావుగా చెయ్యి. దాని వైపునకే నేను మరలవలసి ఉంది. ఇంకా జీవితాన్ని నా కొరకు, అన్ని రకాల శ్రేయాలలో సమృద్ధికి మూలంగా చెయ్యి. ఇంకా, మరణాన్ని అన్ని రకాల ఆపదల నుండి విముక్తినిచ్చే సాధనంగా చెయ్యి.” (సహీ ముస్లిం 2720)

ఇక్కడ దుఆ విని నేర్చికోండి

ఈ హదీసు ఐదు ప్రార్థనా వాక్యాలతో కూడుకుని ఉంది. ఈ ప్రార్థనా వచనాలను మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అనేకసార్లు పలికేవారు. ఎందుకంటే ఈ ప్రార్థనా వచనాలు అత్యంత సమగ్రమైనవి, అర్థవంతమైనవి.

(1) “నా ధర్మాన్ని నా కోసం సవ్యంగా చెయ్యి” అనేది అసలు దుఆ. ఎవరికయితే ధర్మాన్ని సవ్యం చేసుకునే సద్బుద్ధి ప్రాప్తమయిందో వారికి ప్రాపంచిక, పారలౌకిక భాగ్యం కూడా లభించినట్లే. ఇంకా, అతని జీవితం శుభప్రదమైనదిగా, అతని పర్యవసానం ప్రశంసనీయంగా రూపుదాల్చింది. ధర్మం సవ్యం గావించబడటమంటే అర్థం మనిషికి సన్మార్గం ప్రాప్తమవటం, సదాచరణ చేసేవాడుగా అతను రూపొందడం అన్నమాట. దైవోపదేశం ఎటువంటి వరమంటే అది ప్రతి ఒక్కరికీ లభించదు. అల్లాహ్ అనుగ్రహం ఎవరిపై వర్షిస్తుందో వారికే అది ప్రాప్తమవుతుంది. దివ్య ఖుర్ఆన్లో అల్లాహ్ సెలవిచ్చాడు : “(ఓ ప్రవక్తా!) …. ఈ ప్రజలు, తాము ఇస్లాం స్వీకరించి మీకు ఉపకారం చేసినట్లు మాట్లాడుతున్నారు. వారితో అనండి, మీ ఇస్లాం ఉపకారం నాపై పెట్టకండి. అల్లాహ్ మీకు, మేలును చేశాడు. నిజానికి మీరు (మీ విశ్వాసంలో) సత్యవంతులైతే ఆయన మీకు విశ్వాసభాగ్యం ప్రసాదించాడు.”

తరువాత వచ్చిన నాలుగు దుఆ వచనాలు మొదటి వాక్యానికి తాత్పర్యం వంటివి. ఎవరి ధర్మం (దీన్) అయితే సజావుగా ఉందో వారి అన్నింటికన్నా పెద్ద సమస్య పరిష్కృతమైపోయింది. ఇక ఇతర సాఫల్య మార్గాలన్నీ తెరచుకున్నట్లే. ఈ మొదటి వాక్యంతో పాటు మిగిలిన నాలుగు వాక్యాలు కూడా మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నోట వచ్చేశాయి. ఎందుకంటే అది దుఆ (ప్రార్థన, వేడుకోలు) చేసే సమయం! అల్లాహ్ ముందు అత్యంత వినమ్రతను ప్రదర్శించే సందర్భం! దాసుడు గనక దైవాన్ని అడిగితే, మాటి మాటికి అడిగితే సర్వోన్నత ప్రభువు సంతోషిస్తాడు. దాసుని నుండి ఆయన కోరేది కూడా అదే.

ఇబ్నె ఖయ్యూమ్ (రహ్మలై) ఇలా రాస్తున్నారు: దైవ సమక్షంలో వేడుకునే సమయంలో వేడుకోలు వచనాలను విస్తృతపరచటం, సుదీర్ఘం చేయటం ‘సంక్షిప్తీకరణ’ కంటే ఉత్తమం. అందుకనే ‘దుఆ’ వచనాలను మలిసారి పలకటం, పునశ్చరణ చేయటం సంప్రదాయం (మస్నూన్). ఇదీ దుఆ యొక్క ఔన్నత్యం. దుఆలో మాటిమాటికి అడిగే దాసులను అల్లాహ్ ఇష్టపడతాడు. అందుచేతనే మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి ప్రార్థనలలో స్పష్టమైన పదాలు మనకు కనిపిస్తాయి. ఇమామ్ ముస్లిం, అలీ బి బిన్ అబీ తాలిబ్ ద్వారా – మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించినట్లు ఉల్లేఖించారు : “ఓ అల్లాహ్! నేను నీకే విధేయుడినయ్యాను. నిన్నే విశ్వసించాను. ఇంకా నిన్నే నమ్ముకున్నాను. నిన్నే సేవించాను. నీవిచ్చిన ఆధారంతోనే వాదించాను. నువ్వే న్యాయ నిర్ణేత అని చెప్పాను. కనుక నువ్వు నా గత అపరాధాలను, జరగబోయే దోషాలను, గోచర అగోచర పాపాలను మన్నించు. నువ్వే నాకు దైవం. నువ్వు తప్ప మరో నిజ దైవం లేడు.”

ఒకవేళ మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నా అపరాధాలన్నింటినీ మన్నించు అని పలికినా. సరిపోయేది. కాని ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎంతో వివరంగా విన్నవించుకున్నారు. ఇదే ఉత్తమ విధానం కూడా. ఎందుకంటే వేడుకోలు సమయంలో దాసుని తరఫున వినమ్రతా భావం, దాస్యభావం, నిస్సహాయ స్థితి వ్యక్తం కావాలి. తాను ఏ అపరాధాల మన్నింపునకై అంతగా మొరపెట్టుకుంటున్నాడో వాటిపట్ల అతని పశ్చాత్తాప భావం కూడా ప్రస్ఫుటమవటం అవసరం. ముక్తసరిగా అడిగేదానికన్నా వివరంగా అడగటాన్నే అల్లాహ్ మెచ్చుకుంటాడు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి ప్రార్థనలు కూడా చాలావరకు ఇలాగే (వివరంగా) ఉండేవి. ఈ పద్ధతి ద్వారానే దాసుడు తన ప్రభువుకు సన్నిహితుడవుతాడు. తద్వారానే అతనికి ఎక్కువ ప్రతిఫలం లభ్యమవుతుంది. ఇదీ సృష్టికర్త పరిస్థితి లేక విధానం.

అయితే మనిషి వ్యవహరణ ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. మనిషిని ఎంత ఎక్కువగా అడిగితే అంత ఎక్కువగా విసుగుచెందుతాడు. మొహం చాటేస్తాడు. అడిగే వాళ్ళ నుండి పలాయనం చిత్తగిస్తాడు. అసహ్యించుకుంటాడు. యాచకులు తనకు భారమయ్యారని భావిస్తాడు. ఎదుటివారు తనని ఎంత తక్కువగా అడిగితే అంతగా వారిని గౌరవిస్తాడు. అడగని వారిని అధికంగా ప్రేమిస్తాడు. కాని దైవం అలా కాదు. పవిత్రుడైన అల్లాహ్ ను మీరు ఎంతగా అడిగితే అంతే ఎక్కువగా ఆయన మిమ్మల్ని ప్రేమిస్తాడు.

(2) “నా ప్రపంచాన్ని నా కొరకు సవ్యం చెయ్యి” అంటే ధర్మసమ్మతమైన (హలాల్) సంపాదనా మార్గాలను సుగమం చెయ్యమని భావం. సౌశీల్యవతి అయిన ఇల్లాలు, సద్వర్తనులయిన సంతానం ప్రసాదించమని, సజ్జనుల సహచర్యం వొసగమని, విపత్తులు, వైపరీత్యాల నుండి క్షేమంగా ఉంచమని, అన్ని రకాల పరీక్షలనుండి దూరంగా ఉంచమని భావం.

(3) “నా పరలోకాన్ని సజావుగా చెయ్యి” అంటే, సమాధి యాతన నుండి రక్షించమని, ప్రళయదినం నాటి కడగండ్ల నుండి కాపాడమని, “పుల్సరాత్”ను సులభతరం చేయమని, అపరాధాలను, అపసవ్యమైన పోకడలను, అన్యాయాన్ని పరిహరించమని, కానుకల నిలయమైన స్వర్గంలోకి ప్రవేశం కల్పించమని భావం.

(4) “జీవితాన్ని శ్రేయాల పెంపుదలకు మూలంగా చేయి” అంటే భావం ఇది నా జీవితం మంచి పనులలో గడిచిపోవాలి. జీవితంలోని ప్రతి ఘడియ ఫలవంతమైనదై ఉండాలి. జీవితం కూడా అల్లాహ్ యొక్క మహదానుగ్రహం. ఎంతోమంది మరణ ఘడియలో ఆందోళన చెందుతారు. తమకు మరికొంత వ్యవధి ఇస్తే ఫలాన ఫలాన మంచిపనులు చేసుకోవచ్చని కాంక్షిస్తారు. కాని ఆ క్షణాన్ని ఎవరూ ఆపలేరు. మరణ నిర్ణయాన్ని వాయిదా వేయలేరు. విశ్వాసి, అల్లాహ్ తనకు ప్రసాదించిన జీవితాన్ని మహాభాగ్యంగా భావించి మంచి పనులలో గడుపుతాడు. సత్కర్మల పత్రాన్ని పెంచుకుంటూ పోతాడు. కాని దుర్మార్గుడు, దౌర్భాగ్యుడు అలా కాదు అతను ప్రతిక్షణం జీవితాన్ని దుర్వినియోగం చేస్తూ పరంలో అది తనకు భారం అయ్యేలా వ్యవహరిస్తాడు.

(5) “మరణాన్ని అన్నిరకాల యాతనల నుండి విముక్తినిచ్చే సాధనంగా చెయ్యి.” చెడులు, అపరాధాలతో నిండిన బ్రతుకుకన్నా మరణమే మేలు. ఇస్లాంలో ఆత్మ హత్యకు ఎట్టి స్థితిలోనూ అనుమతి లేదు. మరణాన్ని కోరుతూ వేడుకోవడమూ తగదు. ఈ హదీసులో ‘మరణం’ ప్రస్తావన వచ్చిందంటే, దాని భావం మరణాన్ని కోరినట్లు ఎంతమాత్రం కాదు. ఈ హదీసులో మరణం వొసగమని చెప్పబడలేదు. వచ్చే మృత్యువు ప్రపంచలోనూ మరియు సమాధి యాతన నుండి కాపాడి, అన్ని రకాల ప్రశాంతతను, సౌఖ్యాన్ని ప్రసాదించేలా చెయ్యమని మాత్రమే దీని భావం.

మహాప్రవక్త వారి ఈ వేడుకోలులోని వాక్యాల క్రమం కూడా అత్యున్నతమైనది. ప్రథమంగా ధర్మం (దీన్) సజావుగా ఉంచమని కోరటం జరిగింది. ఆ తరువాత ప్రపంచ క్షేమం, పరలోక జీవిత సాఫల్యం ఆశించటం జరిగింది. అనంతరం జీవన వ్యవహరాలలో ఉత్తమ సరళిని, మరణానంతరం జీవితంలోని మొదటి దశను ప్రస్తావించటం జరిగింది.

[డౌన్లోడ్ PDF]

పుస్తకం నుండి :కలామే హిక్మత్ – 1 (వివేక వచనం)
రచన:సఫీ అహ్మద్ మదనీ,
అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్
ప్రకాశకులు:జమీ అతే అహ్ లె హదీస్,ఆంధ్రప్రదేశ్

Abu Hurairah (May Allah be pleased with him) reported: The Messenger of Allah Sallallaahu alaihi wa Sallam used to say:

اللَّهُمَّ أَصْلِحْ لِي دِينِي الَّذِي هُوَ عِصْمَةُ أَمْرِي ، وَأَصْلِحْ لِي دُنْيَايَ الَّتِي فِيهَا مَعَاشِي ، وَأَصْلِحْ لِي آخِرَتِي الَّتِي فِيهَا مَعَادِي وَاجْعَلِ الْحَيَاةَ زِيَادَةً لِي فِي كُلِّ خَيْرٍ وَاجْعَلِ الْمَوْتَ رَاحَةً لِي مِنْ كُلِّ شَرٍّ

Allahumma aṣliḥ lī dīn al-lathi huwa ‘iṣmatu amrī, wa aṣliḥ lī dunya-ya al-lati fīhā ma’āshī, wa aṣlih lī ākhirati al-lati fīhā ma’ādī, wa-ja’al al-ḥayāta ziyādatan lī fī kuli khayr, wa-ja’al al-mawta rāḥatan lī min kuli sharr

O Allaah, set right my religion, which is the safeguard of my affairs; and set right my world, wherein is my living; and set right my next life, to which is my return, And make life for me an increase in all good and make death a relief for me from every evil

పరలోకపు బికారి (Bankrupt in Aakhirah)

అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో

ప్రవక్త మహనీయులు (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవచించారని హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: “దరిద్రుడు ఎవరో మీకు తెలుసా?” దానికి సహాబాలు, ‘ఎవరి వద్ద డబ్బు, సామగ్రి లేవో అతనే దరిద్రుడు’ అని మేము భావిస్తున్నాము’ అని అన్నారు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రబోధించారు :

“నా అనుచర సమాజం (ఉమ్మత్)లో దరిద్రుడు ఎవరంటే, అతను ప్రళయదినం నాడు నమాజులు, ఉపవాసాలు, జకాత్ లతో పాటు హాజరవుతాడు. (కాని అతను) ఒకప్పుడు ఇతన్ని తిట్టాడు, అతనిపై అపనింద వేశాడు. మరొకప్పుడు ఇతని సొమ్మును కాజేశాడు, వేరొకప్పుడు అతన్ని కొట్టాడు. అందుచేత అతని సత్కర్మలు వారికి (ఆ బాధితులకు) ఇచ్చివేయబడతాయి. ఒకవేళ అతని సత్కర్మలన్నీ అయిపోయి అతనింకా వారికి బాకీపడితే, వారి అపరాధాలు తీసి ఇతని లెక్కలో వేయబడతాయి. ఆపైన అతన్ని అగ్నిలోకి నెట్టివేయడం జరుగుతుంది.” (ముస్లిం) :

“దరిద్రుడెవరు?” అనేది హదీసులో ముఖ్యాంశం. సహాబాల మనుస్సుల్లో పరలోక చింతనను పెంపొందించడానికి మహాప్రవక్త పలు రీతుల్లో విషయాన్ని ప్రస్తావించేవారు. ఇహలోకంలోని పదాలను పరలోక పరమార్థంతో మేళవించేవారు. సహచరులు కూడా అదే రీతిలో ఆలోచించాలి, యోచించాలన్నదే దీని ఉద్దేశ్యం. ‘దరిద్రుడెవరు?’ అని ప్రశ్నించే రీతిలో అడిగారు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం). సహచరుల దృష్టిని కేంద్రీకరించే ఉద్దేశ్యంతో ఇలా అడగటం జరుగుతుంది. సహాబాలు తమకు తోచినంతవరకు ఉత్తమరీతిలోనే దరిద్రునికి నిర్వచనం చెప్పారు. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) పరలోక దరిద్రుని స్థితిని విశ్లేషించారు. ప్రపంచపు దారిద్య్రమైతే. తాత్కాలికమైనది. ఎంతో సంక్షిప్తమైన ప్రపంచ జీవితంతోపాటే అది కూడా అంతమైపోతుంది. చాలావరకు ప్రపంచంలోనే మనిషి లేమి తరువాత కలిమి కూడా పొందుతాడు. నిజమైన దరిద్రుడు, ప్రళయదినాన చేసుకున్న సత్కర్మలన్నీ కోల్పోయేవాడే. అప్పుడతని వద్ద సత్కర్మల నిధి ఉండదు. అతనికి రుణం కూడా ఎవరూ ఇవ్వరు. ఇంకా అతను, ఇతరుల వద్ద నుండి సత్కర్మల్ని ముట్టెత్తుకుని తన అవసరాన్ని నెరవేర్చుకోనూలేడు.

లోకంలో కొంతమంది పరిస్థితి ఏమంటే వారు ఒకవైపు నుండి సత్కార్యాలు చేస్తూ పోతుంటారు. కాని మరోవంక వారి దుష్కర్మల చిట్టా కూడా పెరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా తోటి మనుషులకు చేసే అన్యాయానికి సంబంధించిన అపరాధాల చిట్టా. తీర్పు దినంనాడు మనిషి, ఇతరుల నుండి తాను పొందవలసిన హక్కును అంత తేలిగ్గా వదలుకోడు. తప్పకుండా బదులును అపేక్షిస్తాడు. ఈ హదీసు ద్వారా బోధపడే ముఖ్యాంశం ఏమంటే మనిషి కొన్ని మంచి పనులు చేసుకున్నంత మాత్రాన సరిపోదు – అతను చెడుపనులు, అపరాధాలకు దూరంగా ఉండటం కూడా ఎంతో అవసరమే. ఒక వంక సత్కార్యాలు చేస్తూనే మరోవంక చెడు పనులు చేసే వ్యక్తి దృష్టాంతం ఎటువంటిదంటే, ఒక రోగి ఉన్నాడు – అతను, వ్యాధి నయం కావటానికి మందులూ వాడుతున్నాడు. ఇంకోవైపు పత్యం చేయకుండా ఏదిబడితే అది తినేస్తున్నాడు. దాని పర్యవసానం నష్టం తప్ప మరేం కాగలదు? ఏవో కొన్ని దానధర్మాలు చేసి నిశ్చింతగా ఉండిపోయి, ఇక తమకేమీ ఫరవాలేదనుకుని ఏ చెడుపనికయినా వడిగట్టే వారికి ప్రళయదినాన పట్టే దుర్గతిపై అందరూ ఆలోచించాలి.

ఈ హదీసును ఉల్లేఖించిన వారు హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు), వీరు ప్రవక్త సహచరులలో ఎక్కువ హదీసుల్ని ఉల్లేఖించినవారు. హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) యమన్లోని దోప్ తెగకు చెందినవారు. హిజ్రీ శకం 6వ ఏట వీరు మదీనాకు వచ్చి ఇస్లాం స్వీకరించారు. అప్పటి నుండి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) జీవించినంతకాలం ఆయనకు తోడుండేవారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) పలుకులన్నింటినీ ఆయన శ్రద్ధగా వినేవారు, ప్రవక్త ఆచరణను హృదయంలో పదిలపరచుకునేవారు. ఆయన ఇలా అన్నారు : “అన్సార్లు తమ తోటల్లో, ముహాజిర్లు వ్యాపార వ్యవహారాలలో నిమగ్నులై ఉండేవారు. నా చేయి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చేతిలో ఉండేది.”

ఒకసారి హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)తో, “ఓ దైవప్రవక్తా! నేను మీ పలుకులెన్నింటినో వింటున్నాను. (వాటిని) మరచిపోతానేమోనన్న భయం నాకుంది” అని విన్నవించుకున్నారు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) సెలవిచ్చారు – “మీ దుప్పటిని పరచండి”. హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) దుప్పటి పరిచారు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన చేతితో ఇన్ని నీళ్ళు దానిపై చల్లి, ఆ దుప్పటిని తుడుచుకొమ్మని చెప్పారు. తాను దుప్పటి తుడుచుకున్న తరువాత ఇక ఎన్నడూ మరుపు అనేదే రాలేదని హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) అన్నారు.. వీరు గౌరవప్రదులయిన సహాబాలలోని వారు. 69 ఏళ్ళ వయస్సులో (హిజ్రీ 57లో) మదీనాలో తనువు చాలించారు.

పరలోకపు బికారి (Bankrupt in Aakhirah)
పుస్తకం నుండి :కలామే హిక్మత్ – 1 (వివేక వచనం)
రచన:సఫీ అహ్మద్ మదనీ
అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్
ప్రకాశకులు:జమీ అతే అహ్ లె హదీస్,ఆంధ్రప్రదేశ్

[ఇక్కడ చదవండి / డౌన్ లోడ్ చేసుకోండి]

English Version of this Hadith:

Abu Hurayra (May Allah be pleased with him) narrated that the Messenger of Allah (Peace Be Upon Him) once asked his companions: “Do you know who is the bankrupt one?”

The companions replied: “A bankrupt person amongst us is the one who neither has a dirham nor any possessions.”

The Prophet (Peace Be Upon Him) said: “Rather, the bankrupt person from my Ummah is the one who will come on the Day of Resurrection with a good record of Salah (Prayers), Sawm (Fasts) and Zakah (Obligatory Charity); but he would have offended a person, slandered another, unlawfully consumed the wealth of another person, murdered someone and hit someone. Each one of these people would be given some of the wrong-doer’s good deeds. If his good deeds fall short of settling the account, then their sins will be taken from their account and entered into the wrong-doer’s account and he would be thrown in the Hell Fire. {Sahih Muslim, Book 32, Hadith Number 6251}

అల్ కుఫ్ర్ – అవిశ్వాసం (Kufr-Disbelief) – ముహ్సిన్ ఖాన్ & అల్ హిలాలీ

sad-tree-kufrరచయిత : ముహమ్మద్ ముహ్సిన్ ఖాన్ & ముహమ్మద్ తకిఉద్దీన్ అల్ హిలాలీ
అనువాదకులు : ముహమ్మద్ కరీముల్లాహ్
పునర్విచారకులు : షేఖ్ నజీర్ అహ్మద్
క్లుప్త వివరణ: అల్ కుఫ్ర్ అంటే అవిశ్వాసం యొక్క నిర్వచనం మరియు దాని యొక్క భాగాల గురించి ఈ వ్యాసంలో క్లుప్తంగా చర్చించబడినది.

అవిశ్వాసం (అల్ కుఫ్ర్)  – الـْــكُــفْــرْ 

అవిశ్వాసం మరియు దాని యొక్క వేర్వేరు పద్ధతులు

అవిశ్వాసం అంటే ప్రధానంగా ఇస్లాం ధర్మంలోని విశ్వాసపు మూలస్థంభము (అర్కానె ఈమాన్) లలో ఏ మూలస్థంభాన్ని అయినా విశ్వసించక పోవటం.

విశ్వాసపు మూలస్థంభములు (అర్కానె ఈమాన్) ఆరు : అవి

  1. అల్లాహ్ పై విశ్వాసం ఉంచటం,
  2. అల్లాహ్ యొక్క దైవదూతల పై విశ్వాసం ఉంచటం,
  3. అల్లాహ్ యొక్క సందేశహరుల పై విశ్వాసం ఉంచటం,
  4. అల్లాహ్ అవతరింపజేసిన దివ్యగ్రంథాల పై విశ్వాసం ఉంచటం,
  5. పునరుజ్జీవన దినం (తిరిగి లేపబడే తీర్పుదినం) పై విశ్వాసం ఉంచటం,
  6. అల్ ఖదర్ పై విశ్వాసం ఉంచటం – సర్వలోక సృష్టికర్త అయిన ఏకైక ఆరాధ్యుడు (అల్లాహ్) మానవుల జాతకాలను ముందుగానే నిర్దేశించాడని నమ్మటం, దేనినైతే ఆయన ముందుగానే నిర్దేశించి ఉన్నాడో, మన జీవితంలో అది తప్పక అంటే నూటికి నూరు పాళ్ళు జరిగి తీరుతుందని విశ్వసించటం.

ఈ అవిశ్వాసం రెండు రకాలు: –

  1. ఘోరమైన అవిశ్వాసం
  2. అల్పమైన అవిశ్వాలం

1) ఘోరమైన అవిశ్వాసం (అల్ కుఫ్ర్ అల్ అక్బర్): ఈ విధమైన అవిశ్వాసం ఇస్లాం నుండి పూర్తిగా బహిష్కరింపజేస్తుంది.  దీనిలో ఐదు రకాలు ఉన్నాయి.:

  • తిరస్కారపు అవిశ్వాసం – కుఫ్ర్ అత్తఖాదిబ్: దివ్యమైన సత్యసందేశాన్ని నమ్మకపోవటం లేదా విశ్వాసపు మూలస్థంభాలలో దేనినైనా నిరాకరించటం (త్రోసి పుచ్చటం) లేదా ఖండించటం. దివ్యఖుర్ఆన్ లోని 39వ అధ్యాయం 32వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు – “ఎవడు అల్లాహ్ కు అబద్ధాన్ని ఆపాదిస్తాడో, సత్యం (దివ్యఖుర్ఆన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవన విధానం) అతడి ముందుకు వచ్చినప్పుడు అది అబద్దమని దానిని తిరస్కరిస్తాడో, అతడి కంటే పరమ దుర్మార్గుడెవరు? అటువంటి వారికి నరకంలో స్థానమేమీ లేదా?” (V. 39:32)
  • అహంకారపు అవిశ్వాసంకుఫ్ర్ ఇబావత్తకాబ్బుర్ మా అత్తస్ది: అల్లాహ్ ఆదేశాలు సత్యమైనవని తెలిసీ, అహంకారం వలన వాటికి సమర్పించుకోకుండా తిరస్కరించటం. దివ్యఖుర్ఆన్ లోని 2వ అధ్యాయం 34వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు – “మేము దైవదూతలకు: ‘మీరందరూ ఆదమ్ కు సజ్దా (సాష్టాంగం)చేయండి.’ అని ఆదేశించినప్పుడు, వారందరూ సాష్టాంగ పడినారు. కాని ఇబ్లీసు ధిక్కరించాడు. దురహంకారానికి గురి అయ్యాడు. అవిధేయులలో కలసి పోయాడు. (అల్లాహ్ కు అవిధేయుడైనాడు)”
  • ధిక్కారపు అవిశ్వాసంకుఫ్ర్ అష్షక్కాజ్జాన్న్: విశ్వాసపు ఆరు మూలస్థంభాలపై సందేహం ఉంచటం లేక స్పష్టమైన అవగాహన లేకపోవటం. దివ్యఖుర్ఆన్ లోని 18వ అధ్యాయం 35 – 38వ వచనాలలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: “మరియు ఈ విధంగా అతడు తనకు తాను అన్యాయం చేసుకునే వాడవుతూ, తన తోటలో ప్రవేశించి ఇలా అన్నాడు: ‘ఇది ఎన్నటికైనా నాశనమవుతుందని నేను భావించను. మరియు అంతిమ ఘడియ కూడా వస్తుందని నేను భావించను. ఒకవేళ నా ప్రభువు వద్దకు నేను తిరిగి మరలింపబడినా, అచ్చట నేను దీనికంటే మేలైన స్థానాన్నే పొందగలను.’ అతని పొరుగువాడు అతడితో మాట్లాడుతూ ఇలా అన్నాడు ‘నిన్ను మట్టితో, తర్వాత ఇంద్రియ బిందువుతో సృష్టించి, ఆ తర్వాత నిన్ను (సంపూర్ణ) మానవునిగా తీర్చిదిద్దిన ఆయన ను నీవు తిరస్కరిస్తున్నావా? కాని నిశ్చయంగా నాకు మాత్రం ఆయనే అంటే అల్లాహ్ యే నా ప్రభువు మరియు నేను ఎవ్వడినీ నా ప్రభువుకు భాగస్వామిగా కల్పించను”
  • సంకల్పంలో అవిశ్వాసంకుఫ్ర్ అల్ ఇరాదహ్: తెలిసీ సత్యం నుండి తిరిగి పోవటం (ముఖం త్రిప్పుకోవటం) లేదా అల్లాహ్ అవతరింపజేసిన స్పష్టమైన చిహ్నాల నుండి  దృష్టి మళ్ళించటం (ఉల్లంఘించడం). దివ్యఖుర్ఆన్ లోని 46వ అధ్యాయం 3వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: “మేము ఆకాశాలను, భూమిని మరియు వాటి మధ్య ఉన్న సమస్తాన్ని, సత్యంతో ఒక నిర్ణీతకాలం కొరకు మాత్రమే సృష్టించాము. మరియు సత్యాన్ని తిరస్కరించిన వారు తమకు చేయబడిన హెచ్చరిక నుండి విముఖులవుతున్నారు.” (V. 46:3)
  • కపటత్వపు అవిశ్వాసంకుఫ్ర్ అన్నిఫాఖ్: మోసపూరితమైన, వంచనతో కూడిన లేక కపటమైన అవిశ్వాసం. దివ్యఖుర్ఆన్ లోని 63వ అధ్యాయం 3వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: “వారు తమ ప్రమాణాలను ఢాలుగా చేసుకున్నారు. ఆ విధంగా వారు (ఇతరులను) అల్లాహ్ మార్గం నుండి విరోధిస్తున్నారు. నిశ్చయంగా, వారు చేస్తున్న చేష్టలు ఎంతో నీచమైనవి. ఇది నిశ్చయంగా, వారు విశ్వసించిన తరువాత సత్యతిరస్కారులు అవటం మూలంగానే జరిగినది. కావున వారి హృదయాలు మీద ముద్ర వేయబడి ఉన్నది. కనుక వారు ఏమీ అర్థం చేసుకోలేరు.” (V. 63:2 – 3)

2) అల్పమైన (తక్కువ స్థాయి) అవిశ్వాసం (అల్ కుఫ్ర్ అల్ అస్గర్):

ఈ విధమైన అవిశ్వాసం ఇస్లాం ధర్మం నుండి బహిష్కరింప జేయదు. దీనినే కుఫ్ర్ అన్నిఆమాహ్ అని కూడా అంటారు. అల్లాహ్ ప్రసాదిస్తున్న దీవెనలు మరియు శుభాల పై అయిష్టంగా ఉండటం అంటే అల్లాహ్ కే కృతఘ్నత చూపటం. దివ్యఖుర్ఆన్ లోని 16వ అధ్యాయం 112వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: “మరియు అల్లాహ్ ఒక నగరపు ఉపమానం ఇస్తున్నాడు. మొదట అది శాంతి భద్రతలతో నిండి ఉండేది. దాని (ప్రజలకు) ప్రతి దిక్కు నుండి జీవనోపాధి పుష్కలంగా లభిస్తూ ఉండేది. తరువాత  వారు అల్లాహ్ అనుగ్రహాలను తిరస్కరించారు. కావున అల్లాహ్ వారి చర్యలకు బదులుగా వారికి ఆకలీ, భయమూ వంటి ఆపదల రుచి చూపించాడు” (V. 16:112)

English Source: Appendix  from the book: “Interpretation of the Meaning of The Noble Quraan” By Dr. Muhammad Taqiuddeen al-Hilaalee, Ph.D. and Dr. Muhammad Muhsin Khan .

అన్నిఫాఖ్ – కపటత్వం [ముహ్సిన్ ఖాన్ & అల్ హిలాలీ]

hypocrisy-nifaqరచయిత : ముహమ్మద్ ముహ్సిన్ ఖాన్ & ముహమ్మద్ తకిఉద్దీన్ అల్ హిలాలీ
అనువాదకులు : ముహమ్మద్ కరీముల్లాహ్
పునర్విచారకులు : షేఖ్ నజీర్ అహ్మద్
క్లుప్త వివరణ: అన్నిఫాఖ్ అంటే కపటత్వం యొక్క నిర్వచనం మరియు దాని యొక్క భాగాల గురించి ఈ వ్యాసంలో క్లుప్తంగా చర్చించబడినది.

అన్నిఫాఖ్الــنــفـــاق

కాపట్యం మరియు దాని యొక్క వేర్వేరు పద్ధతులు.

కాపట్యం రెండు రకాలు, అవి:

  1. విశ్వాసం (నమ్మకం) లో కాపట్యం
  2. ఆచరణలలో మరియు కార్యములలో (పనులలో) కాపట్యం.

(1) విశ్వాసం (నమ్మకం)లో కాపట్యం: దీనిలో ఆరు రకాలున్నాయి.

  1. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను తిరస్కరించటం
  2. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకు వచ్చిన (ఆయన పై అవతరించిన లేక ఆయన బోధించిన) వాటిలో కొన్నింటిని తిరస్కరించటం (ఉదాహరణ – ఖుర్ఆన్, సున్నహ్, ఇస్లామీయ ధర్మశాస్త్ర నియమ నిబంధనలు)
  3. ప్రవక్త  సల్లల్లాహు అలైహి వసల్లం ను ద్వేషించుట, అసహ్యించుట.
  4. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకు వచ్చిన వాటిలో కొన్నింటిని ద్వేషించటం లేక అసహ్యించుకోవటం (ఉదాహరణ – ఏకదైవత్వం లేక ఏక దైవారాధన మొదలైనవి)
  5. అల్లాహ్ యొక్క అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించిన ఇస్లాం ధర్మానికి ఏదైనా తాత్కాలిక పరాభవం గాని లేదా అపకీర్తి గాని కలిగినప్పుడు సంతోషపడటం.
  6. అల్లాహ్ యొక్క అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించిన ఇస్లాం ధర్మానికి విజయం కలిగినట్లయితే విచారపడటం. (ఇస్లాంధర్మపు సాఫల్యాన్ని చూసి అసంతృప్తి చెందటం)

ఎవరిలోనైతే పైన పేర్కొన్న ఆరు కపటపు గుణాలు ఉంటాయో, వారు నరకాగ్నిలోని అట్టడుగు పొరలలోనికి చేర్చబడతారు. (కపటులు నరకం లోని అట్టడుగు పొరలలోనికి పంపబడతారుఖుర్ఆన్ 4:145)

(2) ఆచరణలలో మరియు కార్యములలో (పనులలో) కాపట్యం.

అల్లాహ్ యొక్క అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వేర్వేరు ప్రకటనల ఆధారంగా, దీనిలో ఐదు పద్ధతులు ఉన్నాయి. కపటుల చిహ్నాలు –

  1. అతడు మాట్లాడినప్పుడు, అబద్ధం చెబుతాడు.
  2. అతడు వాగ్దానం చేసినప్పుడు, దానిని పూర్తిచేయడు.
  3. ఒకవేళ అతడిని నమ్మినట్లయితే (అతడిపై భరోసా చేసినట్లయితే), అతడు వంచకుడిగా, మోసగాడిగా తేలుతాడు. (మీరు దేనినైనా అతడి దగ్గర ఉంచినట్లయితే, దానిని తిరిగి వాపసు ఇవ్వడు).
  4. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఇంకో హదీథ్ లో- ఘర్షణ పడినప్పుడల్లా (పోట్లాటకు దిగినప్పుడు) అతడు తెలివి లేని వాడిగా, అవివేకిగా, దుష్టుడిగా, చెడ్డవాడిగా, ఇతరులకు అవమానం, పరాభవం కలిగించే విధంగా ప్రవర్తిస్తాడు.
  5. అతడు ఒప్పందం చేసినట్లయితే, స్వయంగా అతడు తనకు తానే విశ్వాసఘాతకుడిగా నిరూపించుకుంటాడు.

English Source: Appendix  from the book: “Interpretation of the Meaning of The Noble Quraan” By Dr. Muhammad Taqiuddeen al-Hilaalee, Ph.D. and Dr. Muhammad Muhsin Khan .

ప్రవక్తలను, సందేశహరులను عليهم السلام అల్లాహ్ ఎందుకు పంపెను?

prophets-telugu-islamరచయితలు : ముహమ్మద్ ముహ్సిన్ ఖాన్ & ముహమ్మద్ తకిఉద్దీన్ అల్ హిలాలీ
అనువాదకులు : ముహమ్మద్ కరీముల్లాహ్
పునర్విచారకులు : షేఖ్ నజీర్ అహ్మద్
క్లుప్త వివరణ: ప్రవక్తలను మరియు సందేశహరులను అల్లాహ్ ఈ ప్రపంచానికి ఎందుకు పంపెను అనే విషయం ఈ వ్యాసంలో స్పష్టంగా చర్చించబడెను.

ఎప్పుడైతే ప్రజలు సర్వలోక సృష్టికర్త యొక్క ఏకదైవారాధనను వదిలి, షిర్క్ (ఏకైక దైవారాధనలో ఇతరులను అల్లాహ్ కు భాగస్వాములుగా చేర్చటం) అనే అంధవిశ్వాసాల్ని, సహేతుకం కాని సిద్ధాంతాల్ని కనుగొన్నారో, అప్పటి నుండి తన భక్తులను కేవలం తనను మాత్రమే ఆరాధించమని ఆహ్వానించటానికి, ఆరాధనలలో ఇతరులను తనతో జత పరచ వద్దని ఆజ్ఞాపించటానికి మరియు వారిని బహుదైవారాధనపు గాఢాంధకారంలో నుండి ఏకైక దైవారాధనపు వెలుగు లోనికి తీసుకు రావటానికి అల్లాహ్ తన ప్రవక్తలను మరియు సందేశహరులను పంపటం మొదలు పెట్టినాడు. ప్రవక్తలందరూ తౌహీద్ (ఏకైక దైవత్వం అంటే మహోన్నతమైన మరియు అత్యంత ప్రశంసనీయమైన అల్లాహ్ యొక్క ఏకైకత్వంలో విశ్వాసం)నే బోధించారు. ఖుర్ఆన్ లోని క్రింది వచనాలు ఈ వాస్తవాన్ని నిరూపిస్తున్నాయి:

వాస్తవంగా మేము నూహ్ ను అతని జాతి వద్దకు పంపాము. అతను వారితో ప్రజలారా! అల్లాహ్ నే ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్య దైవం లేడు. వాస్తవానికి నేను మీపై రాబోయే ఆ గొప్ప దినపు శిక్షను గురించి భయపడుతున్నానుఅని అన్నాడు(7:59)

మరియు మేము ఆద్ జాతి వద్దకు, వారి సోదరుడైన హూద్ ను పంపాము. అతను:ఓ నా జాతి సోదరులారా! మీరు కేవలం అల్లాహ్ నే ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్య దైవం లేడు. ఏమిటీ? మీకు దైవభీతి లేదా? (7:65) ఇది ఆద్ జాతి కు వచ్చిన ప్రవక్త సందేశం.

మరియు మేము మద్యన్ జాతి వద్దకు వారి సహోదరుడు షుఐబ్ ను (పంపాము) అతను వారితో అన్నాడు: నా జాతి ప్రజలారా! అల్లాహ్ నే ఆరాధించండి, మీకు ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు. వాస్తవంగా, మీ వద్దకు, మీ ప్రభువు దగ్గర నుండి స్పష్టమైన (మార్గదర్శకత్వం) వచ్చియున్నది. కొలిచేటప్పుడు మరియు తూచేటప్పుడు పూర్తి నిజాయితీతో ఇవ్వండి. ప్రజలకు వారి వస్తువులను తగ్గించి ఇవ్వకండి. భూమిపై శాంతి స్థాపించబడిన తర్వాత మరల కల్లోల్లాన్ని రేకెత్తించకండి. మీరు విశ్వాసులే అయితే, ఇదే మీకు మేలైనది (7:85). ఇది మద్యన్ జాతి వద్దకు పంపబడిన ప్రవక్త తన ప్రజలను అల్లాహ్ వైపునకు ఆహ్వానించిన ప్రకటన.{మద్యన్ అనేది ఒక తెగ & నగరపు పేరు. వారి వద్దకు షుఐబ్ అలైహిస్సలాం ప్రవక్త గా  పంపబడ్డారు. మద్యన్ యొక్క  మరొక పేరు అయ్ కహ్. మృత సముద్రానికి తూర్పున, అఖాభా అగాధం నుండి (Gulf of Aqaba) పడమటి వైపు ఉన్న సినాయి ద్వీపకల్పం మరియు మోఆబ్ పర్వతాల వరకు వ్యాపించి ఉన్నది. అక్కడ నివసించే వారు ఆమోరైట్ తెగకు చెందిన అరబ్బులు. షుఐబ్ మరో పేరు ఎత్రో (Jethro)}

ఇక సమూద్ జాతి వద్దకు వారి సోదరుడైన సాలెహ్ ను పంపాము. అతను వారితో:“నా జాతి ప్రజలారా! అల్లాహ్ నే ఆరాధించండి, ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్య దైవం లేడు(7:73) ఇది సమూద్ జాతి వద్దకు పంపబడిన ప్రవక్త తన ప్రజలను అల్లాహ్ వైపునకు రమ్మని ఆహ్వానించిన ప్రకటన.{సమూద్ ప్రజలు ఆద్ జాతికి చెందిన నబాతియన్ తెగకు చెందిన వారు. రెండవ ఆద్ జాతిగా ప్రసిద్ధి చెందినారు. వారు హిజాజ్ ఉత్తర భాగంలో ఉండేవారు. ఆ ప్రాంతం వాది అల్ ఖురా అనబడుతుంది. వారు ఆ పర్వత ప్రాంతంలో కొండలను తొలిచి గుహలను నిర్మించారు. వాటి పేరు మదాయిన్ సాలెహ్. నేటికీ అవి ఆ పేరుతోనే పిలవబడుతున్నాయి. ఇది మదీనా పట్టణం మరియు తబూక్ పట్టణాల మధ్య ఉన్నది. ఇప్పటికీ వారు కొండలను తొలిచి నిర్మించిన కట్టడాలు ఉన్నాయి.}

మరియు వాస్తవానికి మేము ప్రతి సమాజం వద్దకు ఒక ప్రవక్తను పంపాము.(అతడన్నాడు): మీరు అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండి. మరియు మిథ్యాదైవాల (తాగూత్ ల) ఆరాధనను త్యజించండి (16:36)

అల్లాహ్ ప్రతి ప్రవక్తను ఆయన స్వంత జాతి వద్దకు  వారి మార్గదర్శకత్వం కోసం పంపెను. కాని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను మొత్తం మానవజాతి మరియు జిన్నాతుల మార్గదర్శతక్వం కోసం పంపెను. ఇదే విషయాన్ని ఖుర్ఆన్ లోని (7:158) వచనం ధృవీకరుస్తున్నది-(ఓ ముహమ్మద్!) ఇలా ప్రకటించు:మానవులారా! నిశ్చయంగా నేను మీ అందరి వైపునకు (పంపబడిన) అల్లాహ్ యొక్క సందేశహరుడను

మరియు నేను జిన్నాతులు మరియు మానవులను సృష్టించింది, కేవలం వారు నన్ను ఆరాదించటానికే! (51:56)

ఇంకా ఖుర్ఆన్ లోని అనేక వచనాల మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశాల వలన స్పష్టమవుతున్న దేమిటంటే, మానవాళికి మార్గదర్శకత్వపు అవసరం కలిగినప్పుడు,  అల్లాహ్ ప్రవక్తలను పంపినాడు.

English Source: Appendix II from the book: “Interpretation of the Meaning of The Noble Quraan” By Dr. Muhammad Taqiuddeen al-Hilaalee, Ph.D. and Dr. Muhammad Muhsin Khan .

జీసస్ మరియు ముహమ్మద్ (అల్లాహ్ వారిపై శాంతి కురిపించుగాక!) బైబిల్ మరియు ఖుర్ఆన్ లలో

బిస్మిల్లాహ్

జీసస్ మరియు ముహమ్మద్ (అల్లాహ్ వారిపై శాంతి కురిపించుగాక!) బైబిల్ మరియు ఖుర్ఆన్ లలో

జీసస్ (యేసు) – ఏకైక సృష్టికర్త యొక్క దాసుడని మరియు ఆయనకు దైవత్వంలో ఎటువంటి భాగస్వామ్యం లేదనే కఠోర సత్యం గురించి బైబిల్ లోని దివ్యవచనాల ద్వారా ధృవీకరణ

నిర్మాణం : డా.ముహమ్మద్ తకి ఉద్దీన్ అల్ హిలాలీ
అనువాదకులు : ముహమ్మద్ కరీముల్లాహ్
క్లుప్త వివరణ: ఈ పుస్తకం జీసస్ మరియు ముహమ్మద్ గురించి క్రైస్తవులలో ఉన్న అనేక అపోహలను ప్రామాణిక ఆధారాలతో దూరం చేస్తున్నది. సత్యం తెలుసుకోగోరిని ప్రతి ఒక్కరికీ ఇది ప్రయోజనం చేకూర్చును.

Jesus and Muhammad (peace be upon them) in the Bible and Qur’an: Biblical evidence of Jesus being a servant of God and having no share in divinity –

By Dr.M.T.Al-Hilali,Ph.D in the appendix in the book “Interpretation of the Meaning of The Noble Quraan” By Dr. Muhammad Taqiuddeen al-Hilaalee, Ph.D. and Dr. Muhammad Muhsin Khan

[ఇక్కడ చదవండి / డౌన్ లోడ్ చేసుకోండి]

ఈ పుస్తకం లో క్రింది విషయాలు చర్చించ బడ్డాయి:

  • – బైబిల్ లో జీసస్ అలైహిస్సలాం మరియు సైతాను
  • – దేవుని బిడ్డ
  • – ప్రభువే తండ్రి
  • – జీసస్ అలైహిస్సలాం– ఏక దైవారాధకుడు, దైవభక్తుడు
  • – బైబిలులోని ఒక వృత్తాంతం.
  • – జీసస్: అల్లాహ్ యొక్క ఒక ప్రవక్త
  • – జీసస్ : అల్లాహ్ యొక్క ఒక దాసుడు.
  • – బైబిల్ సంకలనం
  • – జీసస్: ఏకదైవత్వ(తౌహీద్) బోధకుడు
  • – ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆగమనం గురించిన బైబిల్ లోని భవిష్యద్వాక్యాలు
  • – శిలువ గాథ పై కల్పించబడిన వాదనల పై చివరి మాట

జీసస్ (యేసు) – ఏకైక సృష్టికర్త యొక్క దాసుడని మరియు ఆయనకు దైవత్వంలో ఎటువంటి భాగస్వామ్యం లేదనే కఠోర సత్యం గురించి బైబిల్ లోని దివ్యవచనాల ద్వారా ధృవీకరణ 

ఉపోద్ఘాతం

అన్ని విధాల ఘనతలకు, గౌరవ మర్యాదలకు, సత్కారములకు, కీర్తిప్రతిష్టలకు యోగ్యుడైన ఆ ఏకైక సర్వలోక సర్వాధికారికే సకల ప్రశంసలు చెందుతాయి. ఆయన పరిపూర్ణమైన లక్షణాలన్నీ కలిగి ఉన్న ఏకైకుడు, ఆయనకు సంతానం లేదు, ఆయన ఎవరికీ సంతానం కాదు. ఆయనకు సరిసమానుడెవరూ లేరు. అయనే సర్వలోక శక్తిమంతుడైన, ఏకైక దివ్యశక్తి.

‘అన్ని రకాల ఆరాధనలకు అర్హత కలిగిన, ఏకైకుడైన ఆయననే కేవలం ఆరాధించమని బోధిస్తూ మరియు బహుదైవారాధన, ఏకైక ఆరాధ్యుడైన అల్లాహ్ కు భాగస్వాములను జతచేయడం, సృష్టితాలను ఆరాధించటం మొదలైన అత్యంత ఘోర పాపముల యొక్క శాశ్వతమైన, భయంకరమైన, భరించలేని దుష్పరిణామాల గురించి ప్రజలను హెచ్చరిస్తూ’ మానవాళికి ఏకైక దైవత్వపు మార్గదర్శకత్వాన్ని వహించటానికి, ఆయన తన సందేశహరులను, ప్రవక్తలను పంపాడు.

 అల్లాహ్ యొక్క అందరు ప్రవక్తల పై, సందేశహరుల పై ముఖ్యంగా అంతిమ సందేశహరుడైన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై మరియు ప్రళయ దినం వరకు ఆయనను ధార్మికంగా అనుసరించే వారిపై అల్లాహ్ యొక్క శాంతి మరియు దీవెనలు కలుగు గాక . ఆమీన్!!

బైబిల్ లో జీసస్ అలైహిస్సలాం మరియు సైతాను

 బైబిల్ యొక్క క్రొత్త నిబంధనలలో అంటే మత్తాయి గోస్పెల్ లోని నాలుగవ అధ్యాయంలోని ఆరవ మరియు ఏడవ వచనంలో ‘జీసస్ – మరణాన్ని తప్పించుకోలేని ఒక విధేయుడైన దైవదాసుడని (an obedient mortal), ఇంకా దైవమే అతడి యజమాని మరియు ప్రభువని’ ఏడవ వచనంలోని జీసస్ బోధనలలో స్పష్టంగా ఉన్నది.

“ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరియొక చోట వ్రాయబడి యున్నదని వానితో చెప్పెను”.

ఈ అధ్యాయంలో వాస్తవానికి సైతాను మెస్సయ్యా ను ఒకచోట నుండి మరొక చోటుకు మోసుకుంటూ పోయాడని మనం చదువుతాం. సైతాను దేవుడిని ఎలా మోసుకు పోగలడు? సకల ప్రశంసలకు అర్హుడైన అల్లాహ్ మహోన్నతుడు.  అటువంటి అపనిందలు blasphemy ఆయన దరిదాపులకి కూడా చేరలేవు!

అప్పుడు సైతాను ఆయనను తన ముందు సాష్టాంగ పడమని మరియు తనను ఆరాధించమని ఆజ్ఞాపించినది. ఇంకా ప్రాపంచిక భోగభాగ్యాలను ప్రసాదిస్తానని ఆశ చూపినది. ఎరగా చూపించినది. సైతాను దేవుడితో నిర్భయంగా అలా పలికే సాహసం ఎలా చేయగలదు? ఎప్పుడైతే సైతాను జీసస్ ను తన ఆజ్ఞలను అనుసరించమని ఆదేశించినాడో, ఇలా (పూర్వగ్రంథాలలో) వ్రాయబడి ఉన్నదని సైతానుకు జీసస్ జవాబిస్తారు:”ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను”. Matthew 4:10 

దేవుని బిడ్డ

Son of God దేవుని బిడ్డగా జీసస్ తనను తాను ఏనాడూ పిలుచుకోలేదు కాని మనిష్య కుమారునిగా (Mark 2:10) ఆయన తనకు తాను పిలుచుకుని ఉన్నాడు. బైబిల్ తో తెలిపినట్లుగా, ఎవరైనా అలా పిలిచినా ఆయన వారించ లేదు ఎందుకంటే అలాంటి పిలుపును కేవలం తన కోసమే ప్రత్యేకించుకోలేదు.

పాత, క్రొత్త నిబంధనలలోని బైబిల్ పదాల పరిభాష ప్రకారం దేవుడి భయభక్తులు గల ప్రతి ఒక్క పుణ్యపురుషుడు ‘Son of God’ దేవుని బిడ్డగా పిలవబడును.

Matthew 5:9 లో మనం ఇలా చదువుతాం: “సమాధాన పరచువారు ధన్యులు; వారు దేవుని కుమారులనుబడుదురు”

మత్తయి 5:44లో – “మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు”

ప్రభువే తండ్రి

Matthew 5:48 లో–”మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు”

Matthew 6:1 లో– “లేనియెడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు”.

Matthew 7:21 లో – “ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును”.

గమనిక – ఇక్కడ వాడబడిన ‘Lord ప్రభువా’ అనే పదం అరబీ భాషలోని బైబిల్ లో ‘రబ్’ అని అనువదించబడినది. అలా చేయటం ద్వారా ప్రజలను ‘జీసస్ యే దేవుడు!’ వొప్పించవచ్చును.  కాని మిగిలిన ఆ వచనాన్ని పూర్తిగా చదివినట్లయితే, అసలైన దేవుడికి మెసయ్యా – జీసస్ విధేయతగా, అణుకువగా తన ఇచ్ఛను సమర్పించుకున్నాడనే విషయం పై  ఆ వచనం  సాక్ష్యమిస్తున్నదని గమనిస్తారు. కావున అక్కడ ఉండవలసిన సరైన అనువాదం :

“నాతో ‘ఓ యజమాని, ఓ యజమాని’ అని పలికిన ప్రతివారూ స్వర్గసామ్రాజ్యంలో ప్రవేశించరు. కాని స్వర్గంలో ఉన్న నా తండ్రి ఇచ్ఛానుసారం జీవించివారే స్వర్గంలో ప్రవేశిస్తారు.”

బైబిల్ లోని పై వచనాన్ని చదవటం ద్వారా ‘Father – తండ్రి’ అనే పదం అనేక చోట్ల అసలైన దేవుడి కోసం వాడబడినది.  ఆ పదం కేవలం జీసస్ కోసమే ప్రత్యేకంగా వాడబడలేదు.

Matthew 11:25 లో – “ఆ సమయమున యేసు చెప్పినదేమనగా – తండ్రీ, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలు పరచినావని నిన్ను స్తుతించుచున్నాను” 

జీసస్ అలైహిస్సలాంఏక దైవారాధకుడు, దైవభక్తుడు

Matthew 14:23 లో – “ఆయన ఆ జనసమూహములను పంపివేసి, ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండ యెక్కి పోయి, …”.

ఒకవేళ జీసస్ యే గనుక దేవుడైతే లేక దైవుడిలోని భాగమైతే ఆయన ఎందుకు ప్రార్థిస్తాడు? వాస్తవానికి ప్రార్థన అనేది సమర్పించుకున్న వారి వైపు నుండి, అవసరాలున్న వారి వైపు నుండి మరియు అల్లాహ్ యొక్క దయాదాక్షిణ్యాలపై ఆధారపడిన వారి వైపు నుండి ఉంటుంది. ఖుర్ఆన్ లో అల్లాహ్ ప్రకటిస్తున్నాడు:

“ఓ మానవులారా! అల్లాహ్ అక్కర గలవారు మీరే. వాస్తవానికి అల్లాహ్ స్వయం సమృద్ధుడు, సర్వస్తోత్రాలకు అర్హుడు” (V. 35:15)

“ఎందుకంటే భూమ్యాకాశాలలో నున్న వారందరూ కేవలం అనంత కరుణామయుని దాసులుగా మాత్రమే హాజరు కానున్నారు” (V. 19:93)

బైబిలులోని ఒక వృత్తాంతం.

Matthew 15: 22 – 28 –  “ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ యొకతె వచ్చి – ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము; నా కుమార్తె దయ్యము పట్టి, బహు బాధపడుచున్నదని కేకలు వేసెను! అందుకాయన ఆమెతో ఒక్క మాట యైనను చెప్పలేదు. అప్పుడాయన శిష్యులు వచ్చి – ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపి వేయుమని అనెను. ఆయనను వేడుకొనగా! ఆయన – ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొఱ్ఱెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడ లేదనెను! అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి – ప్రభువా, నాకు సహాయము చేయుమని అడిగెను! అందుకాయన – పిల్లల రొట్టె తీసికొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా! ఆమె – నిజమే ప్రభువా, కుక్కపిల్లలు కూడ తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పెను! అందుకు యేసు – అమ్మా, నీ విశ్వాసము గొప్పది; నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను.”

కనాన్ కు చెందిన ఒక స్త్రీ కు చెందిన ఈ వృత్తాంతంలో గమనించ దగిన కొన్ని ముఖ్య సూచనలు ఉన్నాయి:

ఇక్కడ ప్రవక్త జీసస్ (ఈసా) అలైహిస్సలాం పై దయాదాక్షిణ్యాలు మరియు ప్రేమాభిమానాలు లేనివారుగా ఇక్కడ భాండం వేయబడినది, నింద మోపబడినది. (ఒకవేళ ఆ వృత్తాంతం కరక్టుగా వ్రాయబడి ఉన్నట్లయితే)

  1. ఆయన తన తెగనే ఉన్నతమైన మార్గం వైపు తీసుకుపోతూ, ఇతరులను చిన్నబుచ్చి కులవిచక్షణ చూపినట్లు తెలుపబడినది.
  2. ఆయన ఇతర తెగలను కుక్కలని పిలిచి దురభిమానం చూపిస్తూ, వారిపై తన తెగ వారికి దర్పాన్ని ఇచ్చినట్లు పేర్కొనబడినది.
  3. ఇక్కడ అజ్ఞానంలో మునిగి ఉన్న బహుదైవారధకురాలైన ఒక స్త్రీ ఆయనతో వాదులాడి, గెలిచినది అని తెలియజేయబడినది.

జీసస్: అల్లాహ్ యొక్క ఒక ప్రవక్త

Matthew 19:16 – 17 “ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి – బోధకుడా, నిత్యజీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని ఆయనను అడిగెను! అందుకాయన – మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన యెడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పెను”.  పై వచనంలో అల్లాహ్ వైపునకు ఆయన యొక్క విధేయతా పూర్వకమైన సమర్పణ కనబడుతున్నది.

Matthew 21:45 – 46 “ప్రధాన యాజకులును పరిసయ్యులును ఆయన చెప్పిన ఉపమానములను విని, తమ్మును గూర్చియే చెప్పెనని గ్రహించి! ఆయనను పట్టుకొన సమయము చూచుచుండిరి గాని జనులందరు ఆయనను ప్రవక్తయని యెంచిరి గనుక వారికి భయపడిరి”.

జీసస్ ను ఆయన జీవితకాలంలో విశ్వసించిన సహచరులు, వారిని దేవుడని లేక దేవుడి కుమారుడని లేక ట్రినిటీలో తెలిపిన విధంగా ముగ్గురిలో ఒకరని నమ్మలేదని ఇక్కడు ఋజువు అవుతున్నది; కాని వారు ఆయనను కేవలం ఒక ప్రవక్తగా మాత్రమే విశ్వసించారని తెలుస్తున్నది.. ఎవరైతే జీసస్ కు దైవత్వాన్ని ఆపాదిస్తున్నారో, వారికి వ్యతిరేకంగా నిరూపితమైన ఒక బలమైన ఆధారం.  కృతనిశ్చయంతో, చిత్తశుద్ధితో గమనిస్తేనే వారు దీనిని గ్రహించగలరు.

జీసస్ : అల్లాహ్ యొక్క ఒక దాసుడు.

Matthew 23:8 – ‘But be not ye called Rabbi: for one is your master, even Jesus, and all ye are brethren.’ “మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరు సహోదరులు”. (“Even Jesus” యొక్క  అనువాదం తెలుగు బైబిల్ లో లేదు)

జీసస్ ఇక్కడ అల్లాహ్ యొక్క దాసుడని. ఇంకా, అక్కడ ఒకే ఒక యజమాని ఉంటాడని ఆయనే అల్లాహ్ అని ఋజువు అవుతున్నది. అరబీ భాషలోని బైబిల్ లో జీసస్ ను యజమాని అనే అర్థం వచ్చేటట్లుగా అనువదించారు. కాని ఇంగ్లీషు అనువాదం లో అలా చేయక పోవటం వలన వాస్తవ భావానికి కొంచెం చేరువలో ఉన్నది.

Matthew 23:9 – “మరియు భూమిమీద ఎవనికైనను తండ్రి అని పేరు పెట్టవద్దు; ఒక్కడే మీ తండ్రి; ఆయన పరలోక మందున్నాడు”.

పితృత్వం మరియు పుత్రత్వం అనేది దైవానికి మరియు ఆయన దాసులకు మధ్య ఉన్న సంబంధమని దీని ద్వారా మీరు గమనించగలరు: ఇది సాధారణ పదంగా వాడబడినదే గాని జీసస్ కోసం ప్రత్యేకించబడలేదు.

Matthew 24:36 – “అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే (యెరుగును) గాని, యే మనుష్యడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు.”

 అంతిమ ఘడియ గురించి కేవలం ఒక్క అల్లాహ్ కు మాత్రమే తెలుసుననటానికి ఇది ఒక ఖచ్చితమైన ఋజువు. కాబట్టి జీసస్ యొక్క జ్ఞానం ఇతర మానవుల వలె అసంపూర్ణమైనది.  కేవలం అల్లాహ్ మాత్రమే అన్నీ ఎరిగిన సర్వజ్ఞుడు.

Matthew 26:39 – “కొంత దూరము వెళ్ళి సాగిలపడి – నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయనను నా యిష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను”.

ఇక్కడ అల్లాహ్ యొక్క ఇష్టాయిష్టాలకు సమర్పించుకోవటం గురించే కాక ఆయన అల్లాహ్ యొక్క దాసుడు అనే వాస్తవం గురించి కూడా ప్రస్తావించబడినది. కేవలం అల్లాహ్ మాత్రమే దేనినైనా మార్చగలడు.

బైబిల్ సంకలనం

Matthew 27:7 – 8 – “కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి, పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరి వాని పొలము కొనిరి! అందువలన నేటివరకు ఆ పొలము రక్తపు పొలమనబడుచున్నది”.

బైబిల్ (కొత్త నిబంధనలు) జీసస్ కాలంలో వ్రాయబడలేదని, ఆ సంఘటనలు జరిగిన చాలా కాలం తర్వాత ప్రజల జ్ఞాపకాలలో నుండి వెలికితీసి వీటిని వ్రాయటం జరిగినదని ఈ వచనాల ద్వారా స్పష్టమవుతున్నది.

Matthew 27:46 – “And about in the ninth hour Jesus cried with a loud voice, saying, ‘Eli, Eli, Iama sabachthani? (My God, My god, why hast Thou forsaken me?’)”

తనను శిలువ మీద పెట్ట చిల్లులు కొట్టినప్పుడు జీసస్ పై వాక్యాలు బిగ్గరగా పలుకుతూ ఏడ్చినాడని క్రైస్తవుల అభిప్రాయం. ఇది జీసస్ పై మోపబడిన ఒక ఘోరమైన అపవాదు. ఈ పదాలను గమనించినట్లయితే, అలాంటివి కేవలం అవిశ్వాసుల నుండి మాత్రమే వెలువడగలవని తెలుస్తుంది. ఇంకా, అలాంటి పదాలు అల్లాహ్ యొక్క ప్రవక్త నుండి వెలువడినాయనటం ఒక అమితాశ్చర్యకర మైనది. ఎందుకంటే అల్లాహ్ ఎప్పుడూ తన వాదనను భంగం చేయడు మరియు ఆయన ప్రవక్తలు ఆయన వాదనాభంగం గురించి ఆయనకు ఏనాడూ ఫిర్యాదు చేయరు.

జీసస్: ఏకదైవత్వ(తౌహీద్) బోధకుడు

John 17:3 లో– అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము“.

Mark 12:28 – 30 శాస్త్రులలో ఒకడు వచ్చి, వారు తర్కించుట విని, ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చెనని గ్రహించి – ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనదేదని ఆయన నడిగెను! అందుకు యేసు – ప్రధానమైనది ఏదనగా – ఓ ఇశ్రాయేలూ, వినుము; మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు! నీవు నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణవివేకముతోను, నీ పూర్ణబలముతోను, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలె ననునది ప్రధానమైన ఆజ్ఞ“.

Mark 12:32 –  ఆ శాస్త్రి – బోధకుడా, బాగుగా చెప్పితివి; ఆయన అద్వితీయుడనియు, ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే.

Mark 12:34 – “… నీవు దేవుని రాజ్యమునకు దూరముగ లేవని అతనితో చెప్పెను“.

పై వచనాలలో, జీసస్ అలైహిస్సలాం స్వయంగా సాక్ష్యం ఇలా ఉన్నది – అల్లాహ్ ఒకే ఒక ఆరాధ్యుడు, ఆయన తప్ప ఇంకెవ్వరూ ఆరాధ్యులు లేరు, అల్లాహ్ యొక్క ఏకైకత్వాన్ని విశ్వసించిన వారు ఆయన యొక్క సామ్రాజ్యానికి దగ్గరలో ఉంటారు. కావున, అల్లాహ్ కు భాగస్వాములను కల్పించిన వారు లేదా ట్రినిటీలో నమ్మకం ఉంచినవారు ఆయన యొక్క సామ్రాజ్యానికి బహుదూరంగా ఉంటారు, మరియు వారు అల్లాహ్ కు శత్రువులుగా పరిగణింపబడతారు.

Matthew 24:36 – అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే (యెరుగును) గాని, యే మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు

అంతిమ ఘడియ ప్పుడు వస్తుందో ఒక్క అల్లాహ్ కు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు అనే ఖుర్ఆన్ లోని ప్రకటన లాంటిదే మత్తాయి బైబిల్ లో కూడా ఉన్నది. ఇంకా అల్లాహ్ కు జీసస్ విధేయతాపూర్వకంగా సమర్పించుకున్నాడని మరియు దైవత్వంలో ఆయనకు ఎలాంటి భాగస్వామ్యం లేదనే వాస్తవాన్ని ధృవీకరిస్తుంది: ఆయన దేవుడి అవతారమనే విషయం కేవలం కనాన్ ప్రజల కల్పితం మాత్రమే.

John 20:16 – 18 యేసు ఆమెను చూచి – మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూనీ అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము! యేసు ఆమెతో నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు; అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి – నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవుచున్నానని వారితో చెప్పు మనెను! మగ్దలేనే మరియ వచ్చి – నేను ప్రభువును చూచితిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పెనని శిష్యులకు తెలియజేసెను“.

పై వచనాలలో జీసస్ చాలా స్పష్టంగా ‘అల్లాహ్ యే తన దైవమని మరియు మిగిలిన వారి దైవమని, అల్లాహ్ యొక్క ఆరాధనలో తనకు మరియు వారికి ఎటువంటి భేదం లేదని’ ధృవీకరించెను. జీసస్ కూడా దేవుడే అనేవారు తప్పక అల్లాహ్ పై ఘోర అపనింద మోపినవారవుతారు మరియు జీసస్ ను, అల్లాహ్ యొక్క ప్రవక్తలందరినీ, అల్లాహ్ యొక్క  సందేశహరులందరినీ  మోసం చేసిన వారవుతారు.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆగమనం గురించిన బైబిల్ లోని భవిష్యద్వాక్యాలు

John 14:15 – 16“మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు! నేను తండ్రీని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడు నుండుటకైన ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించును.”

ముస్లిం ధర్మవేత్తలు ఇలా తెలిపారు – “మరొక ఆదరణ కర్త” అంటే అల్లాహ్ యొక్క సందేశహరుడు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం; మరియు “ఎల్లప్పుడూ ఉండేది” అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం  యొక్క ధర్మాదేశాలు మరియు ఆయనపై అవతరింపజేసిన ఖుర్ఆన్.

John 15:26 – 27 – తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపియైన అత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును! మీరు మొదటనుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యమిత్తురు

John 16:5 – 8 – ఇప్పుడు నన్ను పంపినవాని యొద్దకు వెళ్ళుచున్నాను – నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవడును నన్నడుగుటలేదు గాని, నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దు:ఖముతో నిండియున్నది. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళనియెడల ఆదరణకర్త మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి, పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును

John 16:12 – 14 – నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు, గాని యిప్పుడు మీరు వాటిని సహింపలేరు! అయితే ఆయన, అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును; ఆయన తనంతట తానే యేమియు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును! ఆయన నా వాటిలోనివి తీసికొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును.

John 16:16 – కొంచెము కాలమైన తరువాత మీరిక నన్ను చూడరు; మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరని చెప్పెను. ఎందుకంటే నేను తండ్రి దగ్గరకు వెళ్ళుచున్నాను“.

ముస్లిం ధర్మవేత్తల ఇలా ధృవీకరిస్తునారు –  పైన తెలిపిన బైబిల్ వచనాలలో జీసస్ తర్వాత వచ్చే ప్రవక్త గురించిన వివరణలు కేవలం అల్లాహ్ యొక్క అంతిమ ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తోనే ఏకీభవిస్తున్నాయి. తన తర్వాత వచ్చే అతని పేరును జీసస్ ‘Parqaleeta’ అని పిలిచెను. ఈ పదాన్ని తర్వాతి బైబిల్ వ్యాఖ్యానకర్తలు, అనువాదకర్తలు తొలగించివేసి, క్రమంగా దానిని ‘Spirit of Truth’ సత్యమైన ఆత్మ అని, మరికొన్ని చోట్ల, ‘Comforter’ ఆదరణకర్త అని మరియు మరికొన్ని చోట్ల ‘Holy Spirit’ దివ్యాత్మ అని మార్చివేసినారు. దీని అసలు పదం గ్రీకు భాషలో ఉన్నది. దాని అసలు అర్థం ‘one whom people praise exceedingly – ప్రజలచే అపరిమితంగా ప్రశంసించ బడేవాడు’. ఇదే పదం అరబీ భాషలోని ‘Muhammad అంటే ప్రశంసింపబడేవాడు’ అనే పదానికి సరిగ్గా సరిపోతున్నది.

శిలువ గాథ పై  కల్పించబడిన వాదనల పై చివరి మాట

1) జీసస్ యొక్క ముఖము యూదులకు తెలుసునని బైబిల్ సాక్ష్యమిస్తున్నది; జెరుసలెంలోని సోలొమాన్ ఆలయంలో ఆయన వారికి బోధించేవారు, ఉపదేశాలు చేసేవారు. కాబట్టి, మత్తాయి బైబిల్ తెలిపినట్లు, ముప్పై వెండినాణాలకు ఒక యూదుడిని బాడుగకు కుదుర్చుకోవటం అనవసరమైన విషయం కాదా?

2) 12 మంది సహచరులలో ఒకడైన జుదాస్ ఇస్కారియట్ Judas Iscariot అనే అతడిని జీసస్ ను చూపటానికి బాడుగకు కుదుర్చుకున్నారు. ఆ తర్వాత జీసస్ ను శిక్షించటం చూసి, అతడు చాలా సిగ్గుపడి, వారి ఆ పని తనను తాను వేరు చేసుకుని, ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదంతా 24గంటల లోపు జరిగి పోయినది. ఇందులోని వ్యత్యాసములు చాలా స్పష్టంగా బహిర్గతమవుతున్నాయి.

3) యూదులు జీసస్ కు మరణశిక్ష విధించి, అనుమతి కోసం పిలాతు Pontius Pilate అనే గవర్నరు వద్ద అనుమతి పొందటానికి ప్రయత్నించిన స్పష్టమైన క్రింది సంఘటన ఒక్కటి చాలు, జీసస్ యొక్క శిలువ వృత్తాంతంలోని అసత్యాలను బయటికి లాగటానికి.

Matthew 27:11 – 14 – యేసు అధిపతి యెదుట నిలిచెను; అప్పుడు అధిపతి – యూదుల రాజవు నీవేనా? అని ఆయన నడుగగా యేసు అతని చూచి – నీవన్నట్టే అనెను! ప్రధాన యాజకులును పెద్దలును ఆయనమీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమియు ఇయ్యలేదు! కాబట్టి పిలాతు – నీమీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా? అని ఆయనను అడిగెను! అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరమియ్యలేదు గనుక అధిపతి మిక్కలి ఆశ్చర్యపడెను“.

పై వృత్తాంతానికి క్రైస్తవులు ఇచ్చే వివరణ – సమస్త మానవాళి విముక్తి కోసం, విమోచన కోసం, మోక్షం కోసం మరియు మానవాళి యొక్క పాప ప్రక్షాళణ కోసం, ఇంకా వాటిని క్షమింపజేయటానికి జీసస్ శిలువ పై కెక్కి మరణించాలని కోరుకున్నాడు. ఒకవేళ అదే నిజమైతే, జీసస్ ఎందుకని మరణం నుండి తనను తప్పించమని అడిగినాడు? శిలువ మీద నుండి (వారి అభిప్రాయం ప్రకారం) ఆయన ఎందుకు ఇలా ఏడ్చినాడు: “ఓ దేవా, నన్నెందుకు విడిచి పెట్టినావు?” సత్యాన్ని ఆక్షేపిస్తున్నప్పుడు, సవాలు చేస్తున్నప్పుడు ఆయన ఎందుకు మౌనం వహించాడు? ఆయన ఆత్మలను ప్రేరేపించే విధంగా యూదు పండితులను సవాలు చేస్తూ, ఉపన్యాసాలు ఇవ్వడంలో ప్రఖ్యాతి గాంచినాడు. ఊహలో ఉన్న ఏ వ్యక్తి అయినా దీనిని ఎలా నమ్మగలడు? ఒకవేళ శిలువ వృత్తాంతమే సత్యమైనదిగా ఋజువు కాకపోతే, దాని ఆధారం పైనా ఉన్న మొత్తం క్రైస్తవపు పునాదులే కదిలిపోతాయి.

యూదులచే జీసస్ శిలువపై చంపబడలేదు అనేది ముస్లింల విశ్వాసం. ఇదే విషయాన్ని ఖుర్ఆన్ లో అల్లాహ్ అవతరింపజేసిన పవిత్ర వచనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి: మరియు వారు: ‘నిశ్చయంగా మేము అల్లాహ్ యొక్క సందేశహరుడు, మర్యం కుమారుడైన ఈసా మసీహ్ (యేసు క్రీస్తు) ను చంపాము’ అని అన్నందుకు. మరియు వారు అతనిని చంపనూ లేదు మరియు శిలువ పై ఎక్కించనూ లేదు. కాని వారు భ్రమకు గురిచేయబడ్డారు (అతని లాంటి మరొక వ్యక్తిని శిలువ పైకి ఎక్కించారు). నిశ్చయంగా, ఈ విషయాన్ని గురించి అభిప్రాయభేదం ఉన్నవారు దీనిని గురించి సంశయగ్రస్తులై ఉన్నారు. ఈ విషయం గురించి వారికి నిశ్చిత జ్ఞానం లేదు. వారు కేవలం ఊపలనే అనుసరిస్తున్నారు. నిశ్చయంగా వారు అతనిని చంపలేదు. వాస్తవానికి అల్లాహ్ అతనిని (ఈసాను) తన వైపునకు ఎత్తుకున్నాడు. మరియు అల్లాహ్ సర్వశక్తి సంపన్నుడు, మహా వివేకవంతుడు. V. 4:157, 158

మొత్తం క్రైస్తవులతో పాటు యూదులు కూడా స్వయంగా జీసస్ శిలువ పై మరణించాడనే విశ్వసించారు. వారి అభిప్రాయాలకు విరుద్ధంగా, ఇస్లామీయ ప్రకటనలోని సత్యాన్ని బైబిల్ ద్వారా నిరూపించటానికి మత్తాయి కొత్త నిబంధనల (26 మరియు 27 వ అధ్యాయం) నుండి క్రింది ప్రశ్నలు తయారు చేయబడినాయి:

1) ఎవరైతే జీసస్ ను పట్టుకున్నారో (వారి అభిప్రాయం ప్రకారం), వారు జీసస్ ను వ్యక్తిగతంగా ఎరుగుదురా? లేదా వారు జీసస్ ను ఎరుగరా?

మత్తాయి బైబిలు: వారు జీసస్ ను ఎరుగరు.

2) జీసస్ ను పట్టుకున్నది పగటి వేళలోనా లేక రాత్రి వేళలోనా?

మత్తాయి బైబిలు: అది రాత్రి వేళ.

3) జీసస్ దగ్గరికి దారి చూపినది ఎవరు?

మత్తాయి బైబిలు: 12 మంది సహచరులలో ఒకడైన జుదాస్ ఇస్కారియట్ Judas Iscariot దారి చూపాడు.

4) అతడు వారిని ఉచితంగా దారి చూపాడా లేక వారు ఆశ చూపిన నిశ్చిత మూలధనం కోసం దారి చూపాడా?

మత్తాయి బైబిలు: 30 వెండి నాణాల బహుమతి కోసం అతడు దారి చూపాడు.

5) ఆ రాత్రి జీసస్ పరిస్థితి ఎలా ఉండినది?

మత్తాయి బైబిలు: జీసస్ భయపడుతూ ఉన్నాడు మరియు ఇలా ప్రార్థిస్తూ సాష్టాంగ పడి ఉన్నాడు: “ఓ దేవా, ఈ కప్పును నా నుండి దాటిపోనివ్వడం నీకు సాధ్యమే అయితే దీనిని దాటి పోనివ్వు.” ఇటువంటి మాటలు ఒక నిజమైన దైవవిశ్వాసి నుండి వెలువడటం అనేది నమ్మశక్యం కాని అత్యంత విడ్డూరమైన విషయం. దైవ ప్రవక్త విషయం ప్రక్కన పెట్టి, ఒక మామూలు దైవవిశ్వాసిలోని విశ్వాసమే గమనించి నట్లయితే, ఆ ఏకైక దైవానికి అన్నింటి మీదా శక్తి సామర్థ్యాలున్నాయని వారు ప్రగాఢంగా నమ్ముతారు, విశ్వసిస్తారు.

6) జీసస్ యొక్క మిగిలిన 11 మంది సహచరుల పరిస్థితి ఏమిటి?

మత్తాయి బైబిలు: భయం వలన (వారి అభిప్రాయం ప్రకారం) వారి బోధకుడితో పాటు వారి పైకీ నిద్ర ఆవరించినది.

7) వారి పరిస్థితితో జీసస్ పోరాడినాడా?

మత్తాయి బైబిలు (verses 40 – 46): ఆయన తృప్తి చెందలేదు. ఆయన వారి దగ్గరికి వచ్చి ఇలా పలుకుతూ, వారిని లేపినాడు: “చూడండి మరియు ప్రార్థించండి, మీరు ప్రలోభానికి గురికాకుండా ఉండటానికి; ఆత్మ నిశ్చయంగా సమ్మతిస్తున్నది కాని మాంసపు కండ బలహీనంగా ఉన్నది.” అప్పుడు ఆయన మరల వచ్చి చూడగా, వారు నిద్రలో ఉంటారు. మరియు వారిని ఆయన మరల నిద్రలేపి, పై వాక్యాలనే తిరిగి పలుకుతాడు. ఇలాంటి బలహీనత సరైన ఉత్తమమైన శిష్యులలోనే కాకుండా అతి మామూలు దైవభక్తి గల బోధకుడి మామూలు శిష్యులలో కూడా  కనబడదు, మరి ఆ బలహీనత కేవలం మర్యం కుమారుడైన జీసస్ శిష్యులలో ఎలా కనబడగలదు?

8) ఆ దుష్టులు జీసస్ ను బంధించినప్పుడు, వారు ఆయనకు సహాయపడినారా?

మత్తాయి బైబిలు: వారు ఆయనను విడిచిపెట్టి పారిపోయినారు.

9) ఆ రాత్రి జీసస్ కు తన సహచురులపై నమ్మకం ఉండినదా?

మత్తాయి బైబిలు:  వారందరూ తనను విడిచి పారిపోతారని జీసస్ వారికి తెలియజేసెను. ఆ తర్వాత జీసస్ వారితో ఇలా అనెను: నిశ్చయంగా ఈ రాత్రి కోడికూతకు ముందు, మీరు నన్ను వదిలి పారిపోతారు – ఇలా మూడు సార్లు అనగా, వారిలో నుండి పీటర్ అనే సహచరుడు – నేను చనిపోతాను గాని విడిచి పారిపోను అని పలికెను. అలాగే మిగిలిన సహచరులందరూ పలికిరి. మరియు అలా జరిగినది.

10) ఆ దుష్ట సైనికులు జీసస్ ను ఎలా పట్టుకున్నారు?

మత్తాయి బైబిలు: ఒక యూదుడు దారి చూపిస్తుండగా, వారు ఆయన దగ్గరకు కత్తులతో మరియు కర్రలతో వచ్చి, 57వ వచనంలో తెలిపినట్లుగా వారు ఆయనను పట్టుకున్నారు: “మరియు వారు ఆయనను గట్టిగా పట్టుకున్నారు, Caiaphas సియాఫస్ అనే వారి యొక్క మహాగురువు వద్దకు తీసుకుని పోయారు, అక్కడి వారి పెద్దలందరూ సమావేశమై ఉన్నారు.”

అక్కడ వారు ఆయనకు మరణశిక్ష విధించారు. ఆ దుష్టసైనికులు అక్కడి నుండి ఆయనను తీసుకుని పోయారు. ఆయన ముఖం పై ఉమ్మేశారు మరియు తమ చేతులతో ఆయనను మోదారు, ఆ తర్వాత ఆయన దుస్తులను చింపివేశారు. ఆ తర్వాత సిందూర వర్ణపు దుస్తులతో చుట్టివేశారు, ఆ పై ముళ్ళతో నిండి ఉన్న కిరీటాన్ని ఆయన తలపై ఉంచి, ఆయనను పీడిస్తూ, ఎగతాళి చేస్తూ పట్టుకుపోయారు. వారు ఆయనతో ఇలా పలికారు, ‘నీ దావా ప్రకారం నీవు ఇస్రాయీలుకు రాజువి.’ వారు ఆయనను తీవ్రంగా అవమానించారు.

11) చివరిగా ఆయనకు మరణశిక్ష విధించాలని ఎవరు నిర్ణయించారు?

మత్తాయి బైబిలు: ఆనాటి ఫలస్తీన్ దేశపు గవర్నరైన పిలాతు Pontius Pilate.

12) ఆ దుష్టసైనికులు ఆయనను, గవర్నరు ముందుకు తీసుకు వచ్చి, యూదుల గురువు వారి ధర్మశాస్త్రమైన తోరాహ్ ప్రకారం ఆయనకు శిలువ పైకి ఎక్కించి, చంపాలనే మరణశిక్షను విధించాడని తెలియజేయగా, ఆ గవర్నరు విచారించకుండానే, పరిశోధించకుండానే వారిని నమ్మినాడా?

మత్తాయి బైబిలు: ఆ గవర్నరు వారిని నమ్మలేదు, కాని ఆయనను ప్రశ్నించాడు: “వారు ఏదైతే చెప్పినారో, అది నిజమేనా?” ఆయన నిశ్శబ్దంగా ఉండిపోయెను. ప్రశ్న మరల మరల అడుగ బడినది మరియు ఆయన అలాగే నిశ్శబ్దంగా ఉండెను. సత్యం కోసం ఆయన నిశ్శబ్దంగా ఉండెను.; ఒకవేళ ఆయన ప్రవక్త కాకపోయినా సరే, సత్యాన్ని స్పష్టం చేయటం మరియు యూదుల అపనిందలను నిరాకరించటం తప్పనిసరి. గవర్నరు భార్య,  గవర్నరు వద్దకు వెళ్ళి ఆయనతో ఇలా పలికినది: “మీరు ఆ మంచి వ్యక్తిని ఏమీ చేయకుండా వదలలేరా? ఆయన కారణంగా నాకు ఈ రోజున కలలో అనేక సంఘటనలు జరిగినవి.”

యూదులను తిరస్కరిస్తూ మరియు హెచ్చరిస్తూ గంటల తరబడి జీసస్ అనేక ఉపన్యాసాలు ఇచ్చేవాడని, దీని వలన వారు జీసస్ ను నిందిచేవారని బైబిల్ ప్రకటిస్తున్నది. మరి ఆ రోజున ఆయన నిశ్శబ్దంగా ఎందుకు ఉండిపోయాడు? ఆయనను మాటిమాటికీ ప్రశ్నించటంలో ఆ గవర్నరు యొక్క ఉద్ధేశం సత్యం వైపు నిలబడాలని అయిఉండవచ్చును.

13) వారి ఊహల ప్రకారం జీసస్ ఎలా శిలువ పైకి ఎక్కించబడి, హత్య చేయబడినాడు?

మత్తాయి బైబిలు:  వారు జీసస్ ను ఇద్దరు దొంగల మధ్య శిలువ పైకి ఎక్కించారు, ఆ దొంగలు జీసస్ ను దూషిస్తూ ఇలా పలికినారు, “నీవే గనుక సత్యవంతుడివైతే, ఇప్పుడు నిన్ను నీవే రక్షించుకో.”

14) ఇది ఒక మహా ఉపద్రవం. జీసస్ (వారి అభిప్రాయం ప్రకారం) శిలువ పై ఉండగా ఏమని పలికెను?

మత్తాయి బైబిలు  (27:46): జీసస్ ఏడుస్తూ, బిగ్గరగా ఇలా పలికినాడు “Eli, Eli, Iama sabachthani? అర్థం – నా ప్రభూ, నా ప్రభూ, నన్ను ఎందుకు విడిచి పెట్టివేసినావు?”

అన్ని ధర్మాల ప్రామాణిక నియమాలను అనుసరించి ఇది ఒక పచ్చి అవిశ్వాసపు ప్రకటన. అవతరింపజేయబడిన ధర్మాలను అనుసరించి, ఎవరైనా ఇటువంటి వాక్యాలను ఒక ప్రవక్త పై చెప్పి నట్లయితే, వారు అవిశ్వాసులు అవుతారు.

సర్వలోక శక్తమంతుడైన అల్లాహ్ ఖుర్ఆన్ లో యూదులను మరియు క్రైస్తవులను – జీసస్ అల్లాహ్ యొక్క అవతారమనే, అల్లాహ్ యొక్క కుమారుడనే, పూర్తిగా జీసస్ నే తిరస్కరించేటటు వంటి  వారి అపనిందల గురించి హెచ్చరిస్తూ, వారు జీసస్ ను కేవలం అల్లాహ్ యొక్క సందేశహరుడిగానే విశ్వసించమని దివ్యఖుర్ఆన్ (V. 4:159) లో ఆజ్ఞాపిస్తున్నాడు: మరియు గ్రంథ ప్రజలలో ప్రతి ఒక్కరూ తమ మరణం సంభవించక ముందే ఆయనను (జీసస్ ను అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు ఒక మానవుడని) తప్పక విశ్వసించవలెను. మరియు పునరుత్థాన దినాన ఆయన (ఈసా) వారి పై సాక్ష్యమిచ్చును


రమదాన్ నెలలో దివ్యఖుర్ఆన్ మొత్తం చదవటం ఎలా? (How to Read the Whole Quran in Ramadan?)

ramadhan-quranHow to Read the Whole Qur’an in Ramadan?
(రమదాన్ నెలలో దివ్యఖుర్ఆన్ మొత్తం చదవటం ఎలా?)

Read the PPT (Power Point Presentation)

1. ఈ రమదాన్ నెలలో       దివ్యఖుర్ఆన్      మొత్తం చదవాలని      కోరుకుంటున్నారా?
2. మీరు చేయవలసినదల్లా ప్రతి ఫర్ద్ నమాజు తరువాత 4½ పేజీలు చదవటమే.
3. ఒకసారి దీనిని పరిశీలించండి :  పేజీలు(4.5)*ప్రతిదిన నమాజులు(5)*దినములు(౩౦) =  (604)దివ్యఖుర్ఆన్ లోని మొత్తం పేజీలు.
4. ప్రతి నమాజు తరువాత కేవలం కొన్ని నిమిషాలు వెచ్చించటం ద్వారా చాలా సులభంగా ప్రతి నెలలో ఒకసారి మొత్తం ఖుర్ఆన్ పూర్తిగా చదవుకో వచ్చనే విషయం నాకింత వరకు తెలియదే.
ఎంత లాభదాయకమైన పెట్టుబడి!!!
ఒకవేళ మీరు బిజీగా ఉంటే, ప్రతి నమాజు తరువాత కేవలం రెండు పేజీలు చదవటం ద్వారా ప్రతి రెండు నెలలలో ఒకసారి ఖుర్ఆన్ పూర్తిగా చదవుకోవచ్చు.
నమ్మలేక పోతున్నారు కదూ???
5. గుర్తుంచుకోండి! దివ్యఖుర్ఆన్ లో మీరు చదివే ఒక్కో అక్షరానికి బదులుగా 10పుణ్యాలు మీ ఖాతాలో జమ చేయబడతాయి.
మరి ఒక్కో పదానికి బదులుగా??
ఒక్కో పంక్తికి బదులుగా??
ఒక్కో పేజీకి బదులుగా??
ఒక్కో అధ్యాయానికి బదులుగా??
మొత్తం ఖుర్ఆన్ చదివినందుకు బదులుగా?
6. ఇంత మంచివిషయం తెలుసుకున్నాక మీరేమి చేయగలరు?
మీరు చేయగలిగే కనీస పని ఏమిటంటే, దీనిని ఇతరుల వరకు అందజేయటం. మీకు తెలిసిన ప్రతి ఒక్కరికీ పంపండి.
జజాకల్లాహ్ ఖైర్.

సులభశైలిలో దివ్య ఖుర్ఆన్ – మౌలానా అబ్దుస్సలాం ఉమ్రీ

ఖుర్ఆన్ 30 భాగాలు (తెలుగు) – సులభశైలిలో దివ్యఖుర్ఆన్
క్లుప్త వివరణ: ఇది తెలుగు భాషలో ఖుర్ఆన్ భావం యొక్క అనువాదము. మొదటి పారా నుండి చివరి పారా వరకు పారాల వారీగా ఇక్కడ పొందుపరచ బడినది.
సంకలనం:మౌలానా అబ్దుస్సలాం ఉమ్రీ
అనువాదం: ఇఖ్బాల్ అహ్మద్
ప్రకాశకులు:ఇదారా ఫిక్రే ఆఖిరత్
అధ్యక్షులు :జనాబ్ ముహమ్మద్ హరూన్ అన్సారీ
Masjid-e-Farooqia, Hakeempet, Tolichowki, Hyderabad

ఇందులో ఖుర్ఆన్ తో పాటు దాని అనువాదం,వ్యాఖ్యానం కూడా ఉన్నాయి. దీని శైలి సరళతరం.ఈ వ్యాఖ్యానం వివిధ ప్రఖ్యాత వ్యాఖ్యానాలను మున్డున్చ్గుకొని వ్రాయబడింది.ఇందులో ప్రత్యేకించి తఫ్సీర్ ఇబ్నె కసీర్,తఫ్సీర్ సనాయి,మౌలానా సనావుల్లా అమ్రుత్సరీ తర్జుమానుల్ ఖుర్ఆన్  మౌలానా అబుల్ కలాం అజాద్,తైసీరుల్ ఖుర్ఆన్ హాఫిజ్ అతీఖుర్రహ్మాన్ కీలానీ,తఫ్సీర్ ఆహ్సనుల్ బయాన్ హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ మరియు మౌలా సఫీఉర్రహ్మాన్ ముబారక్ పూరీ,తఫ్సీరుల్ ఖుర్ఆన్  కరీం మౌలానా జూనాగడీ మక్కా ముకర్రమహ్ సౌదీ అరబ్ లు చేర్చబడి ఉన్నాయి.

[ఇక్కడ చదవండి] – జుజ్ (Juz) : [01][02][03][04][05][06][07][08][09][10] [11] [12] [13] [14] [15] [16] [17] [18] [19] [20] [21] [22] [23] [24] [25] [26] [27] [28] [29] [30]

ఇక్కడ పూర్తి పుస్తకం చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [PDF] [1406 పేజీలు]