https://youtu.be/4Wat6gesVDA [4 min]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
1262. ఈయనగారే చేసిన మరొక కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ఉద్భోధించారు:
“మీరు చారులాంటిది వండినపుడు అందులో కాస్త నీరు ఎక్కువగా పోయండి. మీ పొరుగువారిని కనిపెడుతూ ఉండండి”(ఈ రెండు హదీసులనూ ‘ముస్లిం’ పొందుపరచారు)
సొరాంశం:
ఈ హదీసులో ఇరుగు పొరుగు వారి హక్కును నొక్కి చెప్పటం జరిగింది. కూర వండేటప్పుడు, మాంసాహారం తయారు చేసేటప్పుడు రోస్ట్, ఇగురు వంటివి చేసేబదులు షేర్వా, సూప్ లాంటివి తయారు చేసుకోవాలనీ, అయితే పొరుగింటి వారిని మాత్రం విస్మరించరాదని దీని భావం. అందునా ఇరుగు పొరుగువారు పేదవారైనపుడు వారికి కానుకగా పంపటం తప్పనిసరి. ఒకవేళ పొరుగింటివారు ధనవంతులై ఉంటే అప్పుడప్పుడూ సత్సంబంధాల కోసమైనా సరే పంపుతూ ఉండాలి.
వేరొక హదీసులో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు :
“దైవదూత జిబ్రయీల్ నా వద్దకు వచ్చినప్పుడల్లా పొరుగువారి హక్కును గురించి గట్టిగా నొక్కి చెబుతుండేవారు. ఆయన నొక్కి వక్కాణిస్తున్న తీరునుబట్టి బహుశా పొరుగువారిని (ఆస్తిలో) వారసులుగా ప్రకటించటం జరుగుతుందా! అని నాకు ఒకింత సందేహం కలిగేది“
—
యూట్యూబ్ ప్లే లిస్ట్ – బులూగుల్ మరాం – కితాబుల్ జామి:
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV266FkpuZpGacbo51H-4DV3
మా యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి ఇన్ షా అల్లాహ్:
http://www.youtube.com/user/teluguislam?sub_confirmation=1