ఉపవాసమున్నవారి కోసం దైవదూతలు ఎప్పటి వరకు దుఆ చేస్తారు? [ఆడియో]

బిస్మిల్లాహ్

[9 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

(2) ఉపవాసమున్నవారి కోసం దైవదూతలు ఎప్పటి వరకు దుఆ చేస్తారు?

A) సహరీ వరకు
B) జొహ్ర్ వరకు
C) ఇఫ్తార్ వరకు

ఆన్సర్ : ఇఫ్తార్ వరకు (ఇది జఈఫ్ హదీస్ )

وتستغفر لهم الملائكةُ حتى يُفطروا

ఈ హదీసును తమ హదీసు గ్రంథాలలో ప్రస్తావించిన ఇమాముల్లో: ఇమాం అహ్మద్, 7917, ఇమాం బజ్జార్ 963, ముహమ్మద్ బిన్ నస్ర్ మిర్వజీ ఖియాము రమజాను 112లో, ఇమాం బైహఖీ షుఅబుల్ ఈమాన్ 3602లో

حَدَّثَنَا يَزِيدُ، أَخْبَرَنَا هِشَامُ بْنُ أَبِي هِشَامٍ، عَنْ مُحَمَّدِ (1) بْنِ الْأَسْوَدِ، عَنْ أَبِي سَلَمَةَ بْنِ عَبْدِ الرَّحْمَنِ، عَنْ أَبِي هُرَيْرَةَ

ఈ హదీసును ఇంత మంది ఇమాములు ఉల్లేఖించినప్పటికీ ఇది జఈఫ్, దీనికి కారణం ఈ హదీసు పరంపరలో ఒకరు హిషామ్ బిన్ అబీ హిషామ్ జఈఫ్ అని హదీసు శాస్త్రవేత్తలందరూ ఏకీభవించారు. ఇక ముహమ్మద్ బిన్ అస్వద్ గురించి మజ్ హూలుల్ హాల్ అని చెప్పడం జరిగింది. ఇది జఈఫ్ అన్న విషయం మీకు తెలియజేస్తూ కొంత వివరణ ఇవ్వడానికే ఈ ప్రశ్న తీసుకురావడం జరిగింది.

అయితే దైవదూతలు సర్వ సామాన్యంగా విశ్వాసుల కొరకు ఇస్తిగ్ఫార్ చేస్తూ ఉంటారు. ఈ ప్రస్తావన సూర ఘాఫిర్ 40:7 లో వచ్చి ఉంది.

الَّذِينَ يَحْمِلُونَ الْعَرْشَ وَمَنْ حَوْلَهُ يُسَبِّحُونَ بِحَمْدِ رَبِّهِمْ وَيُؤْمِنُونَ بِهِ وَيَسْتَغْفِرُونَ لِلَّذِينَ آمَنُوا رَبَّنَا وَسِعْتَ كُلَّ شَيْءٍ رَّحْمَةً وَعِلْمًا فَاغْفِرْ لِلَّذِينَ تَابُوا وَاتَّبَعُوا سَبِيلَكَ وَقِهِمْ عَذَابَ الْجَحِيمِ * رَبَّنَا وَأَدْخِلْهُمْ جَنَّاتِ عَدْنٍ الَّتِي وَعَدتَّهُمْ وَمَن صَلَحَ مِنْ آبَائِهِمْ وَأَزْوَاجِهِمْ وَذُرِّيَّاتِهِمْ ۚ إِنَّكَ أَنتَ الْعَزِيزُ الْحَكِيمُ * وَقِهِمُ السَّيِّئَاتِ ۚ وَمَن تَقِ السَّيِّئَاتِ يَوْمَئِذٍ فَقَدْ رَحِمْتَهُ ۚ وَذَٰلِكَ هُوَ الْفَوْزُ الْعَظِيمُ

అర్ష్‌ (అల్లాహ్‌ సింహాసనం)ను మోసేవారు, దాని చుట్టూ ఉన్న వారు (దైవదూతలు) స్తోత్రసమేతంగా తమ ప్రభువు పవిత్రతను కొనియాడుతున్నారు. వారు ఆయన్ని విశ్వసిస్తున్నారు. విశ్వాసుల మన్నింపు కొరకు ప్రార్థిస్తూ వారు ఇలా అంటారు: “మా ప్రభూ! నీవు ప్రతి వస్తువును నీ దయానుగ్రహంతో, పరిజ్ఞానంతో ఆవరించి ఉన్నావు. కనుక పశ్చాత్తాపం చెంది, నీ మార్గాన్ని అనుసరించినవారిని నీవు క్షమించు. ఇంకా వారిని నరక శిక్ష నుంచి కూడా కాపాడు.  “మా ప్రభూ! నువ్వు వారికి వాగ్దానం చేసివున్న శాశ్వితమైన స్వర్గవనాలలో వారికి ప్రవేశం కల్పించు. మరి వారి పితామహులలోని, సతీమణులలోని, సంతానంలోని సజ్జనులకు కూడా (స్వర్గంలో స్థానం కల్పించు). నిశ్చయంగా నీవు సర్వసత్తాధికారివి, వివేక సంపన్నుడివి. “వారిని చెడుల నుండి కూడా కాపాడు. యదార్థమేమిటంటే ఆనాడు నీవు చెడుల నుంచి కాపాడినవారిపై నీవు (అమితంగా) దయ జూపినట్లే. గొప్ప సాఫల్యం అంటే అదే!”

నుండి: https://teluguislam.net/2020/04/19/quiz-51/

ఇతరములు:

%d bloggers like this: