దొంగతనం మరియు ఇస్లాం బోధనలు [వీడియో & టెక్స్ట్]

దొంగతనం మరియు ఇస్లాం బోధనలు
https://youtu.be/htWndMP8VBQ [55 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, దొంగతనం మరియు దానిపై ఇస్లామీయ బోధనల గురించి వివరించబడింది. దొంగతనం ఇస్లాంలో ఒక ఘోరమైన పాపంగా పరిగణించబడుతుందని, దానిని నివారించడానికి ఖురాన్ మరియు హదీసులలో స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని వక్త తెలియజేశారు. సూరహ్ అల్-మాయిదాలోని ఆయతులను ఉటంకిస్తూ, దొంగతనం చేసిన స్త్రీపురుషులకు ఇస్లామీయ ప్రభుత్వం విధించే శిక్ష గురించి, మరియు పశ్చాత్తాపపడితే అల్లాహ్ క్షమించే కారుణ్యం గురించి వివరించారు. దొంగతనం యొక్క చెడు ప్రభావాలను, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలోని సంఘటనలను ఉదాహరణలుగా చూపిస్తూ, ఈ చెడు గుణానికి దూరంగా ఉండాలని, ధర్మబద్ధమైన జీవితం గడపాలని ప్రబోధించారు. ఈ నేరానికి పాల్పడిన వారికి ఇహలోకంలో మరియు పరలోకంలో ఎదురయ్యే తీవ్రమైన పరిణామాల గురించి కూడా హెచ్చరించారు.

అల్ హందులిల్లాహ్.

الْحَمْدُ لِلَّهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللَّهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللَّهُ فَلَا مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلَا هَادِيَ لَهُ، وَأَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللَّهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ، أَمَّا بَعْدُ: فَإِنَّ خَيْرَ الْحَدِيثِ كِتَابُ اللَّهِ، وَخَيْرَ الْهَدْيِ هَدْيُ مُحَمَّدٍ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، وَشَرَّ الْأُمُورِ مُحْدَثَاتُهَا، وَكُلَّ مُحْدَثَةٍ بِدْعَةٌ، وَكُلَّ بِدْعَةٍ ضَلَالَةٌ، وَكُلَّ ضَلَالَةٍ فِي النَّارِ

సర్వస్తోత్రాలు అల్లాహ్ కే శోభిల్లుతాయి. మేము ఆయననే స్తుతిస్తున్నాము, ఆయన సహాయాన్నే అర్థిస్తున్నాము, ఆయననే క్షమాపణ వేడుకుంటున్నాము. మా ఆత్మల కీడుల నుండి, మా దుశ్చర్యల నుండి అల్లాహ్ శరణు వేడుకుంటున్నాము. అల్లాహ్ మార్గదర్శకత్వం వహించినవానిని ఎవరూ మార్గభ్రష్టతకు గురిచేయలేరు. ఆయనచే మార్గభ్రష్టతకు గురైనవానికి ఎవరూ మార్గదర్శకత్వం చూపలేరు. అల్లాహ్ తప్ప మరెవరూ ఆరాధ్యుడు లేడని నేను సాక్ష్యమిస్తున్నాను. ముహమ్మద్ ఆయన దాసుడు మరియు ప్రవక్త అని కూడా నేను సాక్ష్యమిస్తున్నాను. ఆ తర్వాత, నిశ్యయంగా ఉత్తమమైన మాట అల్లాహ్ గ్రంథం, ఉత్తమమైన మార్గం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మార్గం. కార్యాలలోకెల్లా చెడ్డవి కొత్తగా కల్పించబడినవి. ప్రతి కొత్త కల్పన ఒక బిద్అత్ (ధర్మభ్రష్టత). ప్రతి బిద్అత్ ఒక మార్గభ్రష్టత. ప్రతి మార్గభ్రష్టత నరకానికి దారితీస్తుంది.

أعوذ بالله السميع العليم من الشيطان الرجيم
(అవూజు బిల్లాహిస్ సమీఇల్ అలీమి మినష్ షైతానిర్ రజీమ్)
సర్వశ్రోత, సర్వజ్ఞాని అయిన అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను, శపించబడిన షైతాన్ నుండి.

وَالسَّارِقُ وَالسَّارِقَةُ فَاقْطَعُوا أَيْدِيَهُمَا جَزَاءً بِمَا كَسَبَا نَكَالًا مِّنَ اللَّهِ ۗ وَاللَّهُ عَزِيزٌ حَكِيمٌ
దొంగతనం చేసినది – పురుషుడైనా, స్త్రీ అయినా – ఉభయుల చేతులూ నరకండి. అది వారు చేసిన దానికి ప్రతిఫలం. అల్లాహ్‌ తరఫున విధించబడిన శిక్ష. అల్లాహ్‌ సర్వాధిక్యుడు, వివేచనాశీలి కూడా. (5:38)

فَمَن تَابَ مِن بَعْدِ ظُلْمِهِ وَأَصْلَحَ فَإِنَّ اللَّهَ يَتُوب عَلَيْهِ ۗ إِنَّ اللَّهَ غَفُورٌ رَّحِيمٌ
పాపం చేసిన తరువాత పశ్చాత్తాపం చెంది, తన నడవడికను సరిదిద్దుకున్నవాని వైపుకు అల్లాహ్‌ కారుణ్యంతో మరలుతాడు. నిస్సందేహంగా అల్లాహ్‌ క్షమాభిక్షపెట్టేవాడు, కరుణించేవాడూను. (5:39)

أَلَمْ تَعْلَمْ أَنَّ اللَّهَ لَهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ يُعَذِّبُ مَن يَشَاءُ وَيَغْفِرُ لِمَن يَشَاءُ ۗ وَاللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
ఆకాశాల మరియు భూమి యొక్క రాజ్యాధికారం అల్లాహ్‌దే నన్న సంగతి నీకు తెలియదా? ఆయన తాను తలచిన వారిని శిక్షిస్తాడు, తాను తలచినవారిని క్షమిస్తాడు. అల్లాహ్‌ అన్నింటిపై తిరుగులేని అధికారం కలవాడు.(5:40)

సర్వ స్తోత్రములు, అన్ని రకాల పొగడ్తలు, అన్ని రకాల గొప్పతనాలు కేవలం ఏకైక సృష్టికర్త మరియు మనందరి ఏకైక ఆరాధ్యుడైన అల్లాహ్ కు మాత్రమే శోభిస్తాయి.

ప్రియ వీక్షకుల్లారా! సోదర సోదరీమణులారా! ఈరోజు మన అంశం దొంగతనం మరియు ఇస్లామీయ బోధనలు. దొంగతనం మరియు ఇస్లామీయ బోధనలు ఈ అంశాన్ని పురస్కరించుకొని నేను సూరతుల్ మాయిదా, సూర నెంబర్ ఐదు, ఆయత్ నంబర్ 38 నుండి 40 వరకు మూడు ఆయతులు తిలావత్ చేశాను. నేను తిలావత్ చేసినటువంటి ఈ ఆయతుల అనువాదం ముందు మీరు వినాలని ఆ తర్వాత మనం ఇన్షా అల్లాహ్ మన అంశంలో మరికొన్ని వివరాలు తెలుసుకుందాము.

దొంగతనం చేసినది పురుషుడైనా స్త్రీ అయినా ఉభయుల చేతులు నరకండి. అది వారు చేసిన దానికి ప్రతిఫలం, అల్లాహ్ తరఫున విధించబడిన శిక్ష, అల్లాహ్ సర్వాధిఖ్యుడు, వివేచనాశీలి కూడా. (5:38)

పాపం చేసిన తరువాత పశ్చాత్తాపం చెంది, తన నడవడికను సరిదిద్దుకున్నవాని వైపుకు అల్లాహ్‌ కారుణ్యంతో మరలుతాడు. నిస్సందేహంగా అల్లాహ్‌ క్షమాభిక్షపెట్టేవాడు, కరుణించేవాడూను. (5:39)

ఆకాశాల మరియు భూమి యొక్క రాజ్యాధికారం అల్లాహ్‌దే నన్న సంగతి నీకు తెలియదా? ఆయన తాను తలచిన వారిని శిక్షిస్తాడు, తాను తలచినవారిని క్షమిస్తాడు. అల్లాహ్‌ అన్నింటిపై తిరుగులేని అధికారం కలవాడు. (5:40)

పాపం చేసిన తర్వాత పశ్చాత్తాపం చెంది, ఇక్కడ ఈ అనువాదం చాలా శ్రద్ధగా గమనించండి.

فَمَن تَابَ مِن بَعْدِ ظُلْمِهِ
ఈ దుర్మార్గానికి పాల్పడిన తర్వాత పశ్చాత్తాపపడి

అని ఇక్కడ అరబీలో అల్లాహుతాలా ఖురాన్ లో జుల్మ్ అన్న పదం చెప్పాడు. దీనికి పాపం అన్న ఒక భావం కూడా వస్తుంది. మరియు సర్వసామాన్యంగా జుల్మ్, హక్కు గల వారి నుండి వారి హక్కును దోచుకోవడం, తీసుకోవడం, లాక్కోవడం మరియు అలాగే దౌర్జన్యం, అన్యాయం ఈ భావాల్లో కూడా వస్తుంది.

అల్లాహ్ ఏమంటున్నాడు? ఈ దౌర్జన్యానికి ఈ పాపానికి దొంగతనం లాంటి చెడ్డ గుణానికి పాల్పడిన తర్వాత నిజంగా అతను పశ్చాత్తాపం చెంది అల్లాహ్ వైపునకు మరలి క్షమాపణ కోరుకొని وَأَصْلَحَ (వ అస్లహ) తన నడవడికను సరిదిద్దుకున్న వాని వైపుకు అల్లాహ్ కారుణ్యంతో మరలుతాడు. నిస్సందేహంగా అల్లాహ్ క్షమాభిక్ష పెట్టేవాడు, కరుణించేవాడు. ఆకాశాల మరియు భూమి యొక్క రాజ్యాధికారం అల్లాహ్ దే నన్న సంగతి నీకు తెలియదా? ఆయన తాను తలచిన వారిని శిక్షిస్తాడు, తాను తలచిన వారిని క్షమిస్తాడు. అల్లాహ్ అన్నింటిపై తిరుగులేని అధికారం కలవాడు.

సోదర మహాశయులారా! మనం ఏ అంశంపై చదవదలుచుకున్నా, వినదలుచుకున్నా, ఏ అంశం పైనైనా మనం మాట్లాడదలుచుకున్నా, ఖురాన్ మరియు హదీసులో దాని గురించి ఏముంది? సహాబాలు ఆ అంశాన్ని ఎలా అర్థం చేసుకున్నారు? దీనిని మనం అన్నింటికంటే ముందు పెట్టి ఆ అంశాన్ని పరిశీలించాలి, అధ్యయనం చేయాలి, అర్థం చేసుకోవాలి, చదవాలి, చదివించాలి, వినాలి, వినిపించాలి.

ఈ ఆయత్ యొక్క వివరణ ఇన్షా అల్లాహ్ మరి కొన్ని క్షణాల్లో ముందుకు రానున్నది. అయితే రండి. మన ఈనాటి అంశం దొంగతనం మరియు ఇస్లాం బోధనలు. ఈ రోజుల్లో ఎన్నో రకాల రంగాలలో దొంగతనం యొక్క ఎన్నో రకాలు చాలా ప్రబలిపోయి ఏవైతే ఉన్నాయో, దానిని అంతమొందించి, ఈ చెడు గుణాన్ని నిర్మూలించాలంటే ఇస్లాం మాత్రమే సరియైన మంచి పరిష్కారం. అయితే ఒక రెండు పలుకుల్లో చెప్పాలంటే దొంగతన నిర్మూలానికి, దొంగతనం లాంటి చెడు గుణం దూరం కావడానికి ఇస్లామే సరియైన పరిష్కారం.

ఎందుకంటే ఇస్లాం ధర్మం అన్ని రకాల ప్రజలపై ఉన్నటువంటి భారాలను దించి వేయడానికి, వారు ఎదుర్కొంటున్నటువంటి సామాజిక రుగ్మతలను, వారు ఏ సామాజిక రుగ్మతలలో కొట్టుమిట్టాడుతున్నారో చాలా ఇబ్బందికి మరియు కష్టానికి గురై ఉన్నారో వాటి మంచి ఉత్తమ పరిష్కారం ఇస్లాం తెలియజేసింది. ఇస్లాం కొన్ని హద్దులు, ఉదాహరణకు, దొంగతనానికి, వ్యభిచారానికి, ఏ ఆధారం లేకుండా ఒకరిపై వారి మానభంగం, వారి యొక్క పరువు విషయంలో జోక్యం చేసుకొని అపనిందలు వేసే వారిపై కొన్ని రకాల శిక్షలు ఏదైతే విధించినదో, మరియు ఇస్లామీయ పరిభాషలో వాటిని الْحُدُود (అల్ హుదూద్) అని అంటారో, ఈ హద్దులు ఏవైతే నిర్ణించబడ్డాయో, ఈ శిక్షలు ఏవైతే నిర్ణయించబడ్డాయో, ఎవరి మనసులలో రోగాలు ఉన్నాయో అవి బాగుపడడానికి, జనులపై అల్లాహ్ వైపు నుండి కరుణగా అవి వచ్చాయి. మరియు చివరికి హత్యకు బదులుగా హత్య అన్నటువంటి ఏ హక్కైతే ఇస్లాం ప్రభుత్వాలకు ఇచ్చినదో, ఇందులో కూడా బుద్ధిమంతులకు, జ్ఞానవంతులకు ఎంతో గొప్ప గుణపాఠం ఉన్నది.

وَلَكُمْ فِي الْقِصَاصِ حَيَاةٌ يَا أُولِي الْأَلْبَابِ
(వలకుమ్ ఫిల్ ఖిసాసి హయాతున్ యా ఉలిల్ అల్బాబ్)
ఇందులో వాస్తవానికి ఒక జీవనం ఉన్నది. దీనిని బుద్ధిమంతులు మాత్రమే గ్రహించగలరు.

అని అల్లాహుతాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అలాగే, ఎవరైతే ఒకరి సొమ్మును దొంగతనంగా, ఒకరి హక్కును దొంగతనంగా కాజేసుకుంటారో, అలాంటి వారి యొక్క చేతులను నరకాలి అని ఏదైతే శిక్ష వచ్చిందో, అది కూడా ప్రజల యొక్క సొమ్ము, వారి యొక్క ధనం, వారి యొక్క హక్కులు భద్రంగా ఉండాలని. అలాగే మనం ఇంకా ఇతర ఎన్నో రకాల హద్దులను ఏదైతే చూస్తున్నామో, వాస్తవానికి ఇందులో ప్రజల కొరకు ఎంతో మేలు ఉంది.

కొన్ని సందర్భాల్లో మనకు ఇస్లాం యొక్క జ్ఞానం తక్కువ ఉండడం వల్ల ఏదైనా ఒక శిక్ష గురించి అయ్యో, ఇంత చిన్న పాపానికి ఇంత పెద్ద శిక్షనా అన్నట్లుగా కొందరు భావిస్తారు. కానీ దాని యొక్క సంపూర్ణ జ్ఞానం లభించినదంటే అది వాస్తవానికి మేలు అన్న విషయాన్ని గ్రహిస్తారు.

సోదర మహాశయులారా! సోదరీమణులారా! సమాజంలో ప్రబలి ఉన్నటువంటి ఎన్నో రకాల చెడులలో ఒకటి, ఒక చెడు దొంగతనం. దొంగతనం ఇళ్లల్లో పిల్లలు వారి చిన్న వయసు నుండి చేయడం ఏదైతే మొదలు పెడతారో, ఈ దురలవాటు వారు వయసు వారైన తర్వాత పెద్ద పెద్ద దొంగతనాలకు పాల్పడుతూ ఉంటారు. చివరికి ఇది సమాజానికే ఎంతో వినాశకరంగా మారుతుంది.

అయితే దొంగతనం గురించి మనం తెలుసుకోవలసిన మొట్టమొదటి విషయం ఏమిటంటే, ఇది ఘోర పాపాల్లోని ఒక పాపం. ఎవరైతే దొంగతనానికి పాల్పడుతున్నారో, వారు గ్రహించాలి. ఆ దొంగతనం ఏదైనా చిన్న వస్తువుది చేసినా, ఏదైనా పెద్ద వస్తువుది చేసినా, దొంగతనం చేయబడినటువంటి ఆ వస్తువు దానికి ఎంతో పెద్ద రేట్ ప్రైస్ వెల ఉన్నా లేకపోయినా, ఇక్కడ ముందు గమనించవలసిన విషయం అల్లాహ్ దొంగతనాన్ని నిషిద్ధపరిచాడు. ఎందుకంటే ఇస్లాం ధర్మం, ధర్మాన్ని, మానవుల యొక్క మానాన్ని, పరువును, వారి యొక్క ధనాన్ని అన్ని రకాలుగా వారికి భద్రత ఇస్తుంది. మరియు దొంగతనం అనేది వారి ఆర్థిక విషయాల్లో ఇంకా వేరే రకంగా కూడా వారికి అన్యాయం ఇందులో జరుగుతుంది గనక ఇస్లాం దీనిని నిషిద్ధపరిచింది.

అయ్యో చిన్నదే కదా అని ఎవరైతే కొందరు అనుకుంటారో, ఇక్కడ వారు గమనించాలి. గొప్పవాడైనటువంటి అల్లాహ్ అజ్జవజల్లా యొక్క ఆదేశానికి వ్యతిరేకం చేస్తున్నారు. అతని ఆజ్ఞ పాలన చేయడం లేదు. ఇది చాలా ఘోరమైన పాపం అన్న విషయాన్ని గ్రహించాలి.

అందుకొరకే సుమారు మొత్తమొక సూరాగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలో సుమారు చివరిగా అవతరించినటువంటి సూరతుల్ మాయిదా, దాని ఆయత్ నెంబర్ 38లో అల్లాహుతాలా ఇలాంటి దుశ్చేష్టకు పాల్పడే వారి చేతులను నరకాలి. ఆ దొంగతనం చేసేవారు పురుషుడైనా, స్త్రీ అయినా, ఇద్దరికీ ఈ శిక్ష పడాలి అని చాలా స్పష్టం చేశారు.

మరి ఇక్కడ గమనించవలసిన విషయం ఆయత్ యొక్క చివరిలో:

وَاللَّهُ عَزِيزٌ حَكِيمٌ
(వల్లాహు అజీజున్ హకీమ్)
అల్లాహ్‌ సర్వాధిక్యుడు, వివేచనాశీలి కూడా.

నేను మాటిమాటికి చెబుతూ ఉంటాను కదా. ఖురాన్లో ఎక్కడైతే అల్లాహ్ యొక్క పేర్లు వస్తున్నాయో, ఆయత్ యొక్క చివరిలో ఆ పూర్తి ఆయత్ యొక్క భావాన్ని దృష్టిలో పెట్టుకొని అల్లాహ్ యొక్క పేర్లు ఏవైతే వచ్చాయో, వాటిపై అవగాహన, పరిశీలన, దూరపు ఆలోచన, తదబ్బుర్, తఫక్కుర్ చాలా అవసరం.

ఎందుకంటే, ఇందులోనే గమనించండి. అల్లాహుతాలా దొంగతనం చేసేవారు పురుషులైనా, స్త్రీ అయినా వారి యొక్క చేతులను నరకండి. ఇది వారు చేసినటువంటి పాపానికి ఒక శిక్ష అని ఏదైతే అంటున్నాడో, వెంటనే ఏమన్నాడు? వల్లాహు అజీజున్ అంటే ఏంటి? అల్లాహుతాలా చాలా అధికారం గలవాడు. ఎలాంటి? అతనికి ఎలాంటి సర్వాధికారం ఉన్నది అంటే అతడు ఒక ఆదేశం ఇచ్చాడంటే దానికి తిరుగు అనేది ఉండదు. ఎవరైతే అతని ఆ ఆదేశానికి వ్యతిరేకంగా చేస్తాడో అతడే నష్టంలో పడిపోతాడు. ఇక హకీం, చూడడానికి ఇక్కడ ఒక మనిషి చెయ్యిని నరికి వేయడం జరుగుతుంది. ఇలాంటి ఆదేశం అల్లాహ్ ఇస్తాడా? హకీం అతడు సంపూర్ణ వివేకం గలవాడు. అతడు ఇచ్చినటువంటి ఈ ఆదేశంలో ఎన్నో వివేకవంతమైన విషయాలు, బోధనలు ఉన్నాయి. ఇందులో చాలా గొప్ప హితోపదేశాలు ఉన్నాయి. వాటిని గమనించే ప్రయత్నం చేయాలి. అల్లాహ్ కు వ్యతిరేకంగా ఏ మాట పలకరాదు.

దొంగతనం సమాజానికి చాలా నష్టం చేకూర్చునది గనక ఇస్లాంలో వచ్చే వారితో ప్రవక్త మహానీయం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు షిర్క్ చేయకూడదు అన్నటువంటి వాగ్దానం ఏదైతే తీసుకునేవారో, దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు అన్నటువంటి ఇలాంటి చెడు గుణాలు చేయకుండా పవిత్రంగా ఉంటారన్నటువంటి వాగ్దానం కూడా తీసుకునేవారు.

దీనికి సంబంధించి సహీ బుఖారీ మరియు సహీ ముస్లింలలో చాలా స్పష్టంగా హదీస్ వచ్చి ఉంది. సహీ బుఖారీలోని హదీస్ నెంబర్ 18, సహీ ముస్లింలోని 1709 హదీసులు గమనిస్తే ఉబాదా బిన్ సామిత్ రదియల్లాహు తాలా అన్హు తెలుపుతున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చుట్టూ సహాబాలు కూర్చుని ఉన్నారు. ప్రవక్త వారు చెప్పారు,

بَايِعُونِي عَلَى أَنْ لاَ تُشْرِكُوا بِاللَّهِ شَيْئًا، وَلاَ تَسْرِقُوا، وَلاَ تَزْنُوا، وَلاَ تَقْتُلُوا أَوْلاَدَكُمْ، وَلاَ تَأْتُوا بِبُهْتَانٍ تَفْتَرُونَهُ بَيْنَ أَيْدِيكُمْ وَأَرْجُلِكُمْ، وَلاَ تَعْصُوا فِي مَعْرُوفٍ
(బాయిఊనీ అలా అల్లా తుష్రికూ బిల్లాహి షైఅ, వలా తస్రికూ, వలా తజ్నూ, వలా తక్తు లూ అవ్లాదకుం, వలా తతూ బిబుహ్తానిన్ తఫ్తరూనహు బైన ఐదీకుం వఅర్జులికుం, వలా తఅసూ ఫీ మఅరూఫిన్)

బైఅత్ చేయండి, శపదం చేయండి, మీరు ఏ మాత్రం అల్లాహ్ తో పాటు ఇతరులను భాగస్వామిగా చేయరు, షిర్క్ చేయరు అని. దొంగతనం చేయరు అని. వ్యభిచారం చేయరు అని. మీ సంతానాన్ని హతమార్చరని. మీరు ఎవరిపై ఎలాంటి అపనింద వేయరు అని. మరియు మేలు విషయాల్లో ఏ ఆదేశం నేను మీకు ఇస్తున్నానో, దానికి మీరు అవిధేయత పాటించరని కూడా వాగ్దానం చేయండి

గమనిస్తున్నారా? ఎలా వాగ్దానం తీసుకునేవారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ వాగ్దానం కేవలం పురుషులతోనే కాదు, స్త్రీలతో కూడా తీసుకునేవారు. ముస్లిం షరీఫ్ లోని ఈ హదీస్ ని గమనించండి, 1866. అల్లాహుతాలా సూరతుల్ ముమ్తహినా ఆయత్ నెంబర్ 12లో దీని ప్రస్తావన చేశారు.

గమనించండి. ఈ ఆయతును శ్రద్ధ వహించండి.

يَا أَيُّهَا النَّبِيُّ إِذَا جَاءَكَ الْمُؤْمِنَاتُ يُبَايِعْنَكَ عَلَىٰ أَن لَّا يُشْرِكْنَ بِاللَّهِ شَيْئًا وَلَا يَسْرِقْنَ وَلَا يَزْنِينَ وَلَا يَقْتُلْنَ أَوْلَادَهُنَّ وَلَا يَأْتِينَ بِبُهْتَانٍ يَفْتَرِينَهُ بَيْنَ أَيْدِيهِنَّ وَأَرْجُلِهِنَّ وَلَا يَعْصِينَكَ فِي مَعْرُوفٍ ۙ فَبَايِعْهُنَّ وَاسْتَغْفِرْ لَهُنَّ اللَّهَ ۖ إِنَّ اللَّهَ غَفُورٌ رَّحِيمٌ

ఓ ప్రవక్తా! విశ్వసించిన స్త్రీలు నీ వద్దకు వచ్చి, తాము ఎవరినీ అల్లాహ్ కు భాగస్వామ్యం కల్పించబోము అనీ, దొంగతనం చేయబోము అనీ, వ్యభిచారానికి పాల్పడబోము అనీ, తమ సంతానాన్ని చంపబోము అనీ, తమ కాళ్ళు చేతుల మధ్య నుండి ఎలాంటి అభాండాన్నీ కల్పించబోము అనీ, ఏ సత్కార్యంలోనూ నీకు అవిధేయత చూపబోము అని ప్రమాణం చేస్తే నువ్వు వారి చేత ప్రమాణం చేయించు. వారి క్షమాపణ కొరకు అల్లాహ్ ను ప్రార్ధించు. నిశ్చయంగా అల్లాహ్ క్షమాశీలి, దయాశీలి. (60:12)

ఆయిషా రదియల్లాహు తాలా అన్హా తెలుపుతున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్త్రీలతో కూడా ఇలాంటి శపదం తీసుకునేవారు. కానీ ఏం జరిగేది? ప్రవక్త మహానీయం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పురుషులతో వాగ్దానం తీసుకునే సందర్భంలో చేతిలో చేయి వేసి వారితో శపదం తీసుకునేవారు. కానీ స్త్రీలతో ఏ మాత్రం చేయి ముట్టుకునేవారు కాదు. ఆయిషా రదియల్లాహు అన్హా చెప్పారు,

وَاللَّهِ مَا مَسَّتْ يَدُ رَسُولِ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَدَ امْرَأَةٍ قَطُّ
(వల్లాహి మా మస్సత్ యదు రసూలిల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం యదంరఅతిన్ కద్)
ఎప్పుడు కూడా, ఎన్నడూ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క శుభ హస్తం ఏ పరాయి స్త్రీని తాకలేదు, ఏ పరాయి స్త్రీ యొక్క చేతిని అంటుకోలేదు, ముట్టలేదు.

غَيْرَ أَنَّهُ يُبَايِعُهُنَّ بِالْكَلَامِ
(గైర అన్నహు యుబాయి ఉహున్న బిల్ కలాం)
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నోటి మాట ద్వారానే వారితో శపదం తీసుకునేవారు.

అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటి? దొంగతనం ఎంతటి చెడ్డ దురలవాటు, కొన్ని సందర్భాలలో ఇస్లాంలో ప్రవేశించే స్త్రీ పురుషులందరితో కూడా దీని గురించి వాగ్దానం తీసుకోబడేది. దీని ద్వారా ఈ చెడు గుణం యొక్క చెడుతనం అర్థమవుతుంది కదా? అలాగే సోదర మహాశయులారా, సోదరీమణులారా, ఈ దొంగతనం అన్నది ఎంతటి చెడ్డ గుణం అంటే,

وَمَا أَرْسَلْنَاكَ إِلَّا رَحْمَةً لِّلْعَالَمِينَ
(వమా అర్సల్నాక ఇల్లా రహమతల్ లిల్ ఆలమీన్)
సర్వ లోకాల కొరకు మేము మిమ్మల్ని కారుణ్య మూర్తిగా పంపాము

అని ఎవరి గురించైతే అల్లాహ్ తెలుపుతున్నాడో, అలాంటి కారుణ్య మూర్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దొంగతనం చేసే వారిని لَعْنَة (లఅనత్) చేశారు, శపించారు, ఏం చెప్పారు? సహీ హదీసులో వచ్చి ఉంది. సహీ బుఖారీ 6783 మరియు సహీ ముస్లిం 1687.

لَعَنَ اللَّهُ السَّارِقَ
(లఅనల్లాహు స్సారిక్)
దొంగతనం చేసే వారిని అల్లాహ్ శపించాడు.

ఇలా కూడా వస్తుంది దీని భావం.
దొంగతనం చేసే వారిని అల్లాహ్ శపించుగాక.

అల్లాహ్ శపించుగాక అంటే ఏంటో అర్థం తెలుసా మీకు? అల్లాహ్ అతన్ని తన కారుణ్యం నుండి దూరం చేయుగాక. అల్లాహ్ యొక్క కారుణ్యం ఇలాంటి చెడు గుణానికి పాల్పడే వారికి అల్లాహ్ యొక్క దయ, కరుణ ఏదీ కూడా లభించకుండా ఉండాలి.

بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ (బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం) అని మాటిమాటికి మనం చదువుతుంటాము. ఏంటి? అల్లాహ్ యొక్క రెండు గుణాలు అందులో వచ్చాయి. الرَّحْمَٰن (అర్రహ్మాన్) الرَّحِيم (అర్రహీం). ప్రవక్త మహానీయం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం رَءُوفٌ رَحِيمٌ (రఉఫుర్రహీం). కానీ దొంగతనం ఎంత చెడ్డ గుణం, అలాంటి వారి గురించి ప్రవక్త శపించారు, అలాంటి వారిపై అల్లాహ్ యొక్క శాపం పడుతుంది.

ఇక ఇంత విన్న తర్వాత ఎవరైనా తనకు తాను అల్లాహ్ యొక్క శాపానికి గురి చేసుకోవడం ఇది మంచిదేనా ఒకసారి గమనించండి. దొంగతనం ఎంత చెడ్డ గుణం, దీనికి పాల్పడే వారికి ఇతర పాపాలు, ఇతర నేరాలతో పాటు ఈ దొంగతనానికి పాల్పడినందుకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొందరికి ఎలాంటి శిక్ష ఇచ్చారో ఒక్కసారి గనక మీరు గమనించారంటే, సహీ బుఖారీ, సహీ ముస్లింలో వారి ప్రస్తావన వచ్చి ఉంది.

ఉకల్ లేదా ఉరైనా కబీలాకు సంబంధించిన కొంత మంది మదీనాలో వచ్చారు. అక్కడి వాతావరణం వారికి అనుకూలంగా లేకుండినది. అనారోగ్యానికి పాలయ్యారు. వారి యొక్క రోగాన్ని బట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒంటెలు కట్టే చోట ఏదైతే ఉంటుందో, మదీనా సిటీకి కొంచెం దూరంలో, అక్కడికి వారిని పంపి కొంచెం బయటి ప్రాంతంలో, బయటి వాతావరణంలో అక్కడ ఉండండి, ఆ ఒంటె యొక్క పాలు మరియు దాని యొక్క మూత్రం మీ ఈ రోగానికి ఒక మంచి చికిత్స అని తెలియజేశారు. అయితే వారు కొద్ది రోజులు అక్కడ ఉన్నారు. ఆ తర్వాత ఆరోగ్యవంతులైపోయారు. వారికి స్వస్థత కలిగింది. చూడండి, ఉపకారానికి అపకారము చేయరాదు అని చదువుకుంటూ ఉంటాము కదా మనం. కానీ దీనికి విరుద్ధంగా వారేం చేశారు? ఆ ఒంటెల కాపరి అక్కడ ఎవరైతే ఉన్నారో, ఆ ఒంటెల కాపరిని హతమార్చి, ఒంటెలు దొంగతనం చేసి మరియు అరాచకం చేసి అక్కడి నుండి పారిపోయారు. పొద్దు పొద్దున్న ఈ నేరాలు, ఈ ఘోర పాపాలకు గురై అక్కడి నుండి పారిపోయారు అన్న విషయం ప్రవక్తకు తెలిసింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొంతమంది వీరులను వారిని పట్టుకోవడానికి పంపారు. సహాబాలు, వీరులు వారిని గాలించి, వెతికి పట్టుకొని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు తీసుకొచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పగటి పూట రాకముందే వారిని పట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత వారి ఒక చెయ్యిని, ఒక కాలును నరికి వేయడంతో పాటు వారికి ఘోరమైన శిక్ష విధించడం జరిగింది. మరియు ఒకచోట ఎక్కడైతే సౌకర్యాలు లేవో అక్కడ వారిని వదలడం జరిగింది.

అబూ కిలాబా రహిమహుల్లాహ్ ఈ హదీస్ ను ఉల్లేఖించిన వారు, ఒక తాబియీ చెబుతున్నారు,
فَهَؤُلَاءِ
(ఫహా ఉలా)
ఈ ముజ్రిమీన్, ఈ క్రిమినల్ పర్సన్స్,

سَرَقُوا
(సరకూ)
దొంగతనానికి పాల్పడ్డారు,

وَقَتَلُوا
(వకతలూ)
హత్య నేరానికి పాల్పడ్డారు,

وَكَفَرُوا بَعْدَ إِيمَانِهِمْ
(వకఫరూ బాద ఈమానిహిం)
విశ్వాసం తర్వాత అవిశ్వాసానికి పాల్పడ్డారు,

وَحَارَبُوا اللَّهَ وَرَسُولَهُ
(వహారబుల్లాహ వరసూల)
అల్లాహ్ మరియు ప్రవక్తకు వ్యతిరేకంగా యుద్ధానికి సిద్ధమయ్యారు.

గమనిస్తున్నారా? ఈ నేరాలలో ఒకటి ఏముండినది? దొంగతనం కూడా ఉండినది. ఇక అల్లాహుతాలా వారికి ఎలాంటి శిక్ష ఇచ్చాడో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఎలాంటి శిక్ష విధించారో విన్నారు.

అందుకే సోదర మహాశయులారా, ఇక్కడి వరకే సరిపోదు, ఒకవేళ దొంగతనం చేసే వ్యక్తి స్వచ్ఛమైన తౌబా చేసి తన మనసును పరిశుభ్రం చేసుకొని అల్లాహ్ తో భయపడి ఈ తప్పిదాన్ని, ఈ పాపాన్ని వదలలేదు అంటే అతడు మరీ ఘోరాతి ఘోరమైన శిక్షకు గురి అవుతాడు. ఏంటి ఆ శిక్ష? అల్లాహు అక్బర్. గమనించండి. ఆ శిక్ష ఏమిటో, ఎలాంటి రోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి నమాజులో ఉండగా ఇలాంటి పాపానికి పాల్పడే వారి శిక్ష నరకంలో ఏముందో అది చూపించబడింది అంటే ఆ సిచువేషన్, ఆ సందర్భాన్ని మీరు గ్రహించండి. ఈ దొంగతనం లాంటి చెడ్డ గుణం ఎంత చెడ్డదో అర్థం చేసుకోండి.

అనేక హదీసుల్లో వచ్చిన విషయం ఏంటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ఒకసారి సూర్య గ్రహణం అయింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చాలా దీర్ఘంగా ఖియాం, రుకూ, సజ్దాలు చేస్తూ రెండు రకాతుల నమాజ్ చేయించారు. ఆ నమాజ్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి స్వర్గం మరియు స్వర్గ యొక్క భోగ భాగ్యాలు పొందే కొందరు స్వర్గ వాసులను చూపించడం జరిగింది. ఏ సదాచరణ, సత్కార్యాల వల్ల ఎవరు ఏ స్వర్గ భాగ్యం పొందారో, స్వర్గంలో ఏ స్థానం పొందారో అది చూపించడం జరిగింది ప్రవక్తకు. అలాగే కొన్ని ఘోరమైన పాపాలు, నేరాలకు పాల్పడే వారిని కూడా వారు నరకంలో ఎలాంటి శిక్ష పొందుతున్నారో చూపించడం జరిగింది.

సోదర మహాశయులారా, ఆ సందర్భంలో ఏం జరిగింది? ఒకసారి మీరు గమనించారంటే ఎంత భయాందోళన కలిగే విషయం. ఆ హదీస్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నరకంలో ఎవరెవరిని చూశారో, ఏ ఏ పాపాలు చేసే వారిని చూశారో, కొందరి గురించి ప్రస్తావించారు. అందులో ఒకరు ఎవరు?

ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క రెండు ఒంటెలను దొంగతనం చేశాడు. అతన్ని చూపించడం జరిగింది. అలాగే హజ్ కొరకు వచ్చిన వారు, అల్లాహ్ యొక్క గృహం, దాని యొక్క దర్శనం కొరకు, తవాఫ్ చేయడానికి వచ్చిన వారిని దొంగలించే దొంగను కూడా అందులో చూశారు. మరియు కొందరు దొంగతనంలో కూడా తమకు తాము ఎంత హుషారీతనం, ఎంత నైపుణ్యం కలిగి ఉన్నారో అన్నటువంటి గర్వానికి గురవుతారు. అలాంటి ఒక ప్రస్తావన కూడా అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. ఏంటి? ఒక దొంగ ఒక కట్టె తీసుకుని ఉంటాడు, దాని యొక్క చివరిలో కొంచెం ఇలా వంగి ఉంటుంది. హజ్ చేసే సందర్భంలో కొందరు తమ యొక్క ఏదైనా సామాన్, ఆ సామానుకు తన యొక్క ఆ కట్టెను ఇలా మెల్లగా తగిలించి, అతడు ఆ సామాను యొక్క వ్యక్తి గ్రహించకుండానే దాన్ని కింద పడేసుకొని లాక్కునే ప్రయత్నం చేసేవాడు. ఒకవేళ సామాను గల వ్యక్తి చూశాడు, గమనించాడు అంటే అయ్యో సారీ నా యొక్క కట్టె తగిలిపోయిందండి మీ సామానులో అనేవాడు. ఒకవేళ గమనించకుంటే దొంగలించి తీసుకెళ్లేవాడు. పవిత్రమైన స్థలం, సామాన్య నేరాల యొక్క పాపము, దాని యొక్క స్థానం అక్కడ ఎక్కువ పెరిగిపోతుంది హరంలో. అలాంటి చోట ఈ దొంగతనం చేసే వ్యక్తి మరియు ఇలాంటి సాకులు చెప్పుకుంటూ తనకు తాను ఎంతో హుషారీతనం చేస్తున్నాడు అన్నట్లుగా భావిస్తూ ఉన్న అలాంటి వారిని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నరకంలో చూశారు.

అంటే ఏం తెలుస్తుంది? ఎవరైతే దొంగతనానికి పాల్పడతారో స్వచ్ఛమైన తౌబా చేసి ఆ చెడు గుణానికి దూరంగా ఉండరో, ప్రళయ దినాన కూడా వారికి ఎలాంటి శిక్ష ఉందో ప్రవక్తకు ఈ లోకంలోనే చూపించడం జరిగింది.

అంతే కాదు సోదర మహాశయులారా, దొంగతనం ఎంతటి చెడ్డ గుణం అంటే, రవ్వంత విశ్వాసం ఉన్న వ్యక్తి కూడా వెంటనే తౌబా చేయాలి. దొంగతనం చేసిన సామాను అతని దగ్గర ఉంటే ఏదో ఒక రకంగా ఆ హక్కు గల వారికి, ఎవరి నుండి దొంగలించాడో వారికి ఇచ్చేసేయాలి. మరియు తన విశ్వాసాన్ని స్వచ్ఛమైనదిగా, బలమైనదిగా చేసుకునే ప్రయత్నం చేయాలి. లేదా అంటే చాలా ప్రమాదంలో పడిపోతాడు. ఏంటి విషయం? సహీ బుఖారీ 2475, సహీ ముస్లిం 57 హదీద్ నంబర్:

وَلاَ يَسْرِقُ حِينَ يَسْرِقُ وَهْوَ مُؤْمِنٌ
(వలా యస్రికు హీన యస్రికు వహువ ముమిన్)
దొంగతనం చేసే సందర్భంలో విశ్వాసం అతనిలో ఉండదు.

అల్లాహు అక్బర్. ఎవరైనా తనకు తాను ముస్లిం గా భావించి దొంగతనానికి పాల్పడుతున్నాడు అంటే దొంగతనం చేసే ఆ సందర్భంలో విశ్వాసం అతనిలో ఉండదు, అతని నుండి దూరమైపోతుంది. గమనిస్తున్నారా? విశ్వాసం అతనిలో ఉండజాలదు. ఏమవుతుంది? ఎక్కడికి వెళ్ళిపోతుంది? దాని యొక్క వివరాల్లోకి వెళ్లేది ఉంటే నా యొక్క అంశాన్ని పూర్తి చేయలేను. కానీ ఇంత విషయం కూడా మనం విన్నామంటే భయపడిపోవాలి. ఇది ఎంతటి చెడ్డ గుణం, ఆ పనికి ఆ చెడుకు పాల్పడిన సందర్భంలో విశ్వాసం మనలో ఉండదు.

సోదర మహాశయులారా, సోదరీమణులారా, ఇక హదీసుల్లోని వివరాల్లోకి వెళ్లి మనం చూశామంటే, అల్లాహు అక్బర్. కొన్ని కొన్ని దొంగతనాలకు ఎలాంటి శిక్షలు ఉన్నాయో, అది కూడా ప్రవక్త మహానీయం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలపడం జరిగింది, ప్రవక్త వారు వాటి నుండి మనల్ని హెచ్చరించారు.

ఒకసారి ఈ హదీస్ ను వినండి. సర్వసామాన్యంగా ఈ రోజుల్లో ఎంతో మంది ఇలాంటి దొంగతనానికి పాల్పడుతున్నారు. చాలా విచిత్రం ఏమిటంటే పెద్ద పెద్ద హోదాలలో ఉన్నవారు, రాజకీయాల్లో ఉన్నవారు, డబ్బు ధనం గలవారు, ఇంకా సామాన్య ప్రజలు కూడా ఎంతో మంది ఇలాంటి పాపానికి ఒడిగడుతున్నారు. మరి వారికి ఎంత ఘోరమైన శిక్ష ఉందో, సహీ బుఖారీ హదీస్ నెంబర్ 3198, సహీ ముస్లిం హదీస్ నెంబర్ 1610, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:

مَنْ أَخَذَ شِبْرًا مِنَ الأَرْضِ ظُلْمًا فَإِنَّهُ يُطَوَّقُهُ يَوْمَ الْقِيَامَةِ مِنْ سَبْعِ أَرَضِينَ
ఎవరైతే మరో వ్యక్తి భూమిలో నుండి జానెడైనా అన్యాయంగా తీసుకొంటాడో, ప్రళయ దినాన ఏడు భూముల బరువు అతని మెడలో వేయబడుతుంది.

జుల్మన్ (అతని హక్కు కాదు అది కానీ అన్యాయంగా తీసుకుంటున్నాడు, దౌర్జన్యంగా తీసుకుంటున్నాడు), ఏమవుతుంది?
అతని యొక్క మెడలో ఏడు భూముల ఒక హారం లాంటిది చేసి, ఒక తౌఖ్, బంధన్ లాంటిది చేసి అతని మెడలో వేయబడుతుంది. కదిలించలేడు.

గమనించండి. జానెడు, జానెడు భూమి అన్యాయంగా తీసుకున్న వారికి ఇంత ఘోరమైన శిక్ష ఉంటే ఇక ఎవరైతే అంతకంటే ఎక్కువ తీసుకుంటున్నారో వారికి ఎలాంటి శిక్షలు ఉంటాయో గమనించండి. పంట భూముల్లో, పొలాల్లో ఇలాంటి అన్యాయాలు జరుగుతూ ఉంటాయి. ఇంకా రియల్ ఎస్టేట్ బిజినెస్ లలో అక్కడనైతే అన్యాయంగా ఎవరిదైతే అసలు భూమి ఉంటుందో వారిపై నానా రకాలుగా ఇండైరెక్ట్ గా ఎవరెవరితో ఎన్నో లంచాలు తినిపించి ఏదో అది సెంటర్ సిటీలో ఉంది, దాని యొక్క విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. వారు ఓ రెండు లక్షలు వారి మూతిపై పారేస్తే ఎక్కడైనా వెళ్లి బతుకుతారు అన్నటువంటి సాకులతో, ఇంకా ఎన్నెన్నో సాకులతో భూములను కాజేసుకోవడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా ఏదైనా ఇల్లు కట్టడానికి పునాది తవ్వుతున్నారు అంటే అయ్యో పక్క వానిలో భూమి నుండి ఓ జానెడే కదా వానికి ఏం తెలుస్తుంది? ఇలాంటి అన్యాయాలకు కూడా పాల్పడతారు. కానీ గమనించండి, ఎల్లవేళల్లో ఈ హదీసును దృష్టిలో ఉంచుకోవాలి. ఇది సమాధి శిక్షల్లోని ఓ శిక్ష. అంతేకాదు, ఈ దొంగతనం ఎంతటి చెడ్డ గుణం అంటే, మనిషి ఒకవేళ ఈ చెడు గుణం నుండి ఇహలోకంలోనే తౌబా చేసుకొని దూరం కాకపోతే, తాను స్వయంగా ఎంతో పశ్చాత్తాపపడుతూ ఉంటాడు. తన చావు సమయంలో, సమాధిలో మరియు ఆ తర్వాత ప్రళయ దినాన లేపబడినప్పుడు దీనికి సంబంధించి సహీ ముస్లింలోని ఒక హదీస్ను గమనించండి. హదీసు నెంబర్ : 1013, అబూ హురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు :

تَقِيءُ الْأَرْضُ أَفْلَاذَ كَبِدِهَا أَمْثَالَ الْأُسْطُوَانِ مِنَ الذَّهَبِ وَالْفِضَّةِ فَيَجِيءُ الْقَاتِلُ فَيَقُولُ فِي هَذَا قَتَلْتُ وَيَجِيءُ الْقَاطِعُ فَيَقُولُ فِي هَذَا قَطَعْتُ رَحِمِي وَيَجِيءُ السَّارِقُ فَيَقُولُ فِي هَذَا قُطِعَتْ يَدِي ثُمَّ يَدَعُونَهُ فَلَا يَأْخُذُونَ مِنْهُ شَيْئًا

భూమి తన గర్భంలోని నిధులను బంగారు, వెండి స్తంభాల రూపంలో బయటకు కక్కుతుంది. అప్పుడు హంతకుడు వచ్చి, ‘దీని కోసమే నేను హత్య చేశాను’ అంటాడు. బంధుత్వాలను తెంచుకున్నవాడు వచ్చి, ‘దీని కోసమే నేను బంధుత్వాలను తెంచుకున్నాను’ అంటాడు. దొంగ వచ్చి, ‘దీని కోసమే నా చెయ్యి నరకబడింది’ అంటాడు. ఆ తర్వాత వారంతా దానిని వదిలేస్తారు, దాని నుండి ఏమీ తీసుకోరు.

ఆ తర్వాత పరలోక దినాన వచ్చినప్పుడు, హంతకుడు వచ్చి ఏమంటాడు? నేను ఈ డబ్బు ధనం కొరకే, దీని ఆశలోనే అన్యాయంగా ఒకరిని హత్య చేశాను కదా అని పశ్చాత్తాప పడుతూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. డబ్బు ధనాల కోసం బంధుత్వాలను తెంచుకున్నవాడు ఎంతో రోదిస్తాడు, బాధపడతాడు, పశ్చాత్తాప పడతాడు. ఈ డబ్బు ధన పేరాశలో పడి నేను నా బంధుత్వాలను తెంచుకున్నాను కదా. దొంగతనం చేసి చేసిన వ్యక్తి వస్తాడు, ఏమంటాడు? ఈ డబ్బు ధన ఆశలో నేను దీనికి పాల్పడి దొంగతనం చేసినందుకు నా చేతులు నరికి వేయబడ్డాయి కదా. వారి కండ్ల ముంగట డబ్బు ధనం అంతా కనబడుతూ ఉంటుంది. అప్పుడు వారికి పశ్చాత్తాపం ఏర్పడుతుంది. దానిలో నుండి ఏ మాత్రం ఏ రవ్వంత తీసుకోరు. కానీ ఆ రోజు ఈ పశ్చాత్తాపం ఏదైనా పనికి వస్తుందా? ఆ రోజు ఈ పశ్చాత్తాపం ఏదైనా లాభం చేకూరుస్తుందా? లేదు.

సోదర మహాశయులారా! దొంగతనం ఎంత చెడ్డ గుణం అన్నది గమనించండి. ప్రవక్త మహానీయం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ఖురైష్ లో ఒక సంఘటన జరిగినది.

మఖ్జూం కబీలా అని ఒక వంశం ఉండినది. ఆ వంశాన్ని చాలా గౌరవంగా ప్రజలు చూసేవారు. అయితే వారిలో ఒక స్త్రీ ఉండినది. ఆమె ప్రజల యొక్క సామానులు అమానతుగా ఉంచుకునేది. కానీ ఎక్కడ ఏ చెడ్డ గుణం కలిగిందో, షైతాన్ ప్రేరణలో వచ్చేసింది, దొంగతనానికి పాల్పడింది. అయితే పేరుకు అంత మంచి స్త్రీ, ఎన్ని రోజుల నుండి చాలా పలుకుబడి ఉన్నది, మరియు వంశం కూడా ఆమెది చాలా పెద్ద వంశం. ఏమంటారు? అరే ఎంత పెద్ద మినిస్టర్ కదండీ, అగ్ర కులానికి చెందిన వారు కదండీ అని ఈ రోజుల్లో కూడా శిక్షలు పడకుండా తమ హోదా అంతస్తు, తమ వంశం పేరు మీద తప్పించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదా. అలాంటి వారు కూడా మరి ఎవరి చేతిలోనైతే అధికారాలు ఉన్నాయో కేవలం కింది వారికి శిక్షలు ఇచ్చి పెద్దవారిని వదులుతూ ఉంటారో ఈ హదీసును వినాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఆమె ప్రస్తావన వచ్చేసింది. ఇక ప్రవక్త ఆమె యొక్క చేతులు నరికి వేయడానికి శిక్ష ఇవ్వకూడదు అని ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ప్రవక్తకు చాలా ప్రియాతి ప్రియులైన వారిని ప్రవక్త వద్దకు పంపి సిఫారసులు చేయించడం మొదలు పెట్టారు. ప్రవక్త యొక్క ప్రియుడైన కొడుకు, అతను కూడా చాలా ప్రియుడు, ఉసామా బిన్ జైద్, అతన్ని పంపడం జరిగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎంత కరాఖండిగా నిరాకరించారంటే ఉసామా భయపడిపోయారు. ఎందుకంటే ప్రవక్త వద్ద ఈ సిఫారసు గురించి మాట్లాడడానికి వచ్చినప్పుడు, ప్రవక్త ఇతని మాట విన్న తర్వాత ప్రవక్త యొక్క ముఖ కవళికలు మారిపోయాయి. ఆగ్రహానికి గురయ్యారు ప్రవక్త. ఏం చెప్పారు ప్రవక్త?

أَتَشْفَعُ فِي حَدٍّ مِنْ حُدُودِ اللَّهِ؟
(అతష్వఫీ హద్దిన్ మిన్ హుదూదిల్లాహ్)
అల్లాహ్ నిర్ణయించిన హద్దులో, అల్లాహ్ ఏ శిక్ష విధించాడో అది పడకుండా ఉండడానికి నీవు సిఫారసు చేయడానికి వచ్చావా?

ఉసామా చాలా చాలా సిగ్గుపడి, పశ్చాత్తాపపడి ప్రవక్తతో వెంటనే

اسْتَغْفِرْ لِي يَا رَسُولَ اللَّهِ
(ఇస్తగ్ఫిర్లీ యా రసూలల్లాహ్)
నేను ఇలాంటి పాపానికి, ఇలాంటి తప్పుకు గురి కాను. మీరు నా గురించి క్షమాపణ కోరండి అని చెప్పారు.

అంతేకాదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క భార్య, ఉమ్ముల్ ముమినీన్, ఉమ్మె సలమా రదియల్లాహు తాలా అన్హా వారి వద్దకు కూడా ఆమె వచ్చింది. ప్రవక్తకు సిఫారసు చేయాలన్నట్లుగా. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భార్య యొక్క మాట కూడా వినలేదు. ఆ సందర్భంలోనే ప్రవక్త వారు ఒక మాట చెప్పారు, స్వర్ణాక్షరాలతో రాయబడేవి. ఏంటి?

لَوْ أَنَّ فَاطِمَةَ بِنْتَ مُحَمَّدٍ سَرَقَتْ لَقَطَعْتُ يَدَهَا
(లవ్ అన్న ఫాతిమత బిన్త ముహమ్మదిన్ సరఖత్ లఖతఅతు యదహా)
ముహమ్మద్ కుమార్తె అయినటువంటి ఫాతిమా కూడా ఒకవేళ దొంగతనం చేసింది అంటే, నేను ఆమె చేతులు కూడా నరికేవాన్ని.

ఆ తర్వాత ఆ మఖ్జూమియా కబీలాకు చెందినటువంటి స్త్రీ యొక్క చేతులు నరికేయాలని ఆదేశం ఇవ్వడం జరిగింది. ఆమె చేతులు నరికి వేయడం జరిగింది. అయితే ఇక్కడ ఈ శిక్షను గ్రహించండి. మరియు ఈ రోజుల్లో కూడా తారతమ్యాలు ఏదైతే చేస్తారో శిక్ష విధించడంలో, అలాంటి వారు కూడా ప్రవక్త వారి ఈ మాటలు శ్రద్ధ వహించాలి. కానీ ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెపై శిక్ష విధించారు. ఆమె ఆ శిక్ష పొందినది. కానీ తర్వాత స్వచ్ఛమైన తౌబా చేసినది. ఆయిషా రదియల్లాహు అన్హా చెబుతున్నారు,

حَسُنَتْ تَوْبَتُهَا وَتَزَوَّجَتْ
(హసనత్ తౌబతహా, వతజవ్వజత్)
ఆ తర్వాత ఆమె వివాహం కూడా చేసుకున్నది, చాలా మంచి జీవితం ఆమె గడిపినది.

అంటే ఇస్లాంలో ఇలాంటి గొప్ప అవకాశం కూడా ఉన్నది. ఎవరైనా వాస్తవంగా మారిపోతే, తనలో మార్పు తెచ్చుకుంటే, సంస్కరించుకుంటే ఇస్లాంలో చాలా గొప్ప స్థానం కూడా ఉన్నది. అయితే ఇక్కడ మరో విషయం ఏం తెలుస్తుంది అంటే హాకిం, ఖాదీ, జడ్జ్, ఎవరైతే శిక్ష విధించే అధికారి ఉన్నాడో అతని వద్దకు విషయం రాకముందు, దొంగ తౌబా చేసుకొని ఎవరి హక్కు ఉన్నదో వారికి ఇచ్చేస్తే ఆ హక్కు గలవారు మాఫ్ చేసేస్తే ఇక ఆ విషయం అక్కడికే అయిపోతుంది. కానీ అధికారి వద్దకు వచ్చిన తర్వాత శిక్ష అనేది తప్పనిసరిగా పడవలసిందే. దీనికి సంబంధించి కూడా మన ముందు కొన్ని హదీసులు ఉన్నాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో సునన్ నిసాయిలో వచ్చినటువంటి హదీస్, సఫ్వాన్ బిన్ ఉమయ్య చెబుతున్నారు. ఆయన కాబతుల్లాలో తవాఫ్ చేశారు, నమాజ్ చేశారు. ఆ తర్వాత తన వద్ద ఉన్నటువంటి ఒక దుప్పటి దాన్ని పెట్టుకొని తల కింద పడుకున్నారు. కానీ ఒక దొంగ వచ్చాడు. మెల్లగా దాన్ని తీశాడు.

فَاسْتَلَّهُ مِنْ تَحْتِ رَأْسِهِ
(ఫస్తల్లహు మిన్ తహ్తి రఅసిహి)
తెలియకుండా దొంగలించాడు.

ఎప్పుడైతే ఈ విషయం ప్రవక్త వద్దకు వచ్చిందో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతన్ని దొంగను పిలిచి అడిగారు. అతను ఒప్పుకున్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి శిక్ష పడాలి అని ఆదేశించేశారు. ఆ సందర్భంలో సఫ్వాన్ బిన్ ఉమయ్య అంటున్నారు, ప్రవక్తా, ఇతని చేతులు నరికి వేయబడతాయి అని నాకు తెలిసేది ఉంటే నేను మీ వద్దకు విషయం తీసుకురాకపోయేది, అతన్ని మన్నించేసేయండి, నా వస్తువు అయితే నాకు దొరికిపోయింది కదా. ప్రవక్త చెప్పారు, వస్తువు దొరికిపోవడమే కాదు, ఇలాంటి ఈ చెడుకు గురి కాకూడదు మరోసారి. అందుకొరకే ఈ శిక్ష. దీని ద్వారా మనకు ఏం తెలుస్తుంది? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు అతనికి, నీవు ఇక్కడికి రాకముందే మాఫ్ చేసేసి, నీ హక్కులు తీసుకొని ఉండేది ఉంటే బాగుండు. కానీ ఇప్పుడు నీ యొక్క మాట చెల్లదు, అతనికి శిక్ష పడవలసిందే.

దీంతో తెలిసింది ఏమిటంటే మనిషి తౌబా చేసుకుంటాడు హాకిం వద్దకు రాకముందు. అలాంటప్పుడు అల్హందులిల్లాహ్ అతని విషయం, అతని మధ్యలో అల్లాహ్ మధ్యలోనే ఉంటుంది. కానీ ఎవరైతే జడ్జ్, ఎవరైతే అధికారి ఉంటాడో, అతని వద్దకు వచ్చిన తర్వాత సిఫారసు చెల్లదు. మరియు అతనికి ఏదైతే శిక్ష పడినదో వాస్తవంగా అతను ఒకవేళ తౌబా కూడా చేసుకున్నాడు, తన మనసును కూడా శుభ్రపరుచుకున్నాడు, ఇలాంటి చెడ్డ గుణాన్ని పూర్తిగా వదిలేశాడు అంటే ఒక గొప్ప లాభం ఏమిటో తెలుసా? పరలోక శిక్ష అనేది అతనికి ఉండదు. ఇంతకుముందు నేను మీకు ఒక హదీస్ వినిపించాను. సహీ బుఖారీలో హదీస్ నెంబర్ 18, సహీ ముస్లిం హదీస్ నెంబర్ 1709. ఉబాదా బిన్ సామిత్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించినది. అయితే ఆ హదీస్ లోనే వస్తుంది.

وَمَنْ أَصَابَ مِنْ ذَلِكَ شَيْئًا فَعُوقِبَ فِي الدُّنْيَا فَهُوَ كَفَّارَةٌ لَهُ
(వమన్ అసాబ మిన్ దాలిక షైఅన్, ఫఊకిబ ఫిద్దున్యా, ఫహువ కఫ్ఫారతుల్లహ్)
ఎవరైతే ఈ పాపాల్లో ఏదైనా ఒక పాపానికి గురవుతాడో, దాని యొక్క శిక్ష ఈ లోకంలో పొందుతాడో, ఇది అతని కొరకు కఫ్ఫారా అయిపోతుంది.

సోదర మహాశయులారా, దొంగతనం చేసిన వ్యక్తి యొక్క చేయి నరికి వేసే విషయం ఏదైతే ఉందో, అది వ్యక్తిగతంగా కాదు. ఈ విషయం ముందు గుర్తుంచుకోవాలి. అంటే నా సొమ్ము ఎవరైనా దొంగతనం చేశాడు, నాకు తెలిసింది. నేను వెళ్లి అతని యొక్క చేయి నరకడం ఇది కాదు. ఇలాంటి శిక్షలు అనేటివి ఇస్లామీయ ప్రభుత్వం, ఇస్లామీయ ఖలీఫా మరియు నాయకులు ఎవరికైతే అధికారం ఇచ్చి ఉన్నాడో కోర్టులలో, ఇస్లామీయ అదాలతులలో ఏ జడ్జిలను నిర్ణయించాడో, అలాంటి వారు మాత్రమే చేయగలుగుతారు. ఈ విషయాన్ని ముందు గ్రహించాలి. లేదా అంటే హత్యకు బదులుగా హత్య, దొంగతనం చేసేదానికి బదులుగా శిక్ష, వ్యభిచారం చేసిన వారికి శిక్ష, ఇలాంటివి కొందరు ఏమంటారు? ఇస్లాంలో ఉన్నాయి కదా, నా చెల్లెలును వాడు, అతను అత్యాచారం చేశాడు అని, ఫలానా వారిపై అత్యాచారం చేశాడు అని వెంటనే ఎవరైనా వెళ్లి అతన్ని చంపడం, అతనికి ఏదైనా శిక్ష ఇవ్వడం, ఇది సరైన విషయం కాదు.

ఇక్కడ తెలుసుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే, ఎంత పరిమాణంలో దొంగతనం చేస్తే చేతులు నరికి వేయబడతాయి? దీని గురించి చాలా వివరాలు ఉన్నాయి. ఆ వివరాల్లోకి ఇప్పుడు నేను వెళ్ళలేను. ఎందుకంటే ఇక్కడ నా ఉద్దేశం ఈరోజు దొంగతనం ఎంత చెడ్డ గుణం, దీన్ని వదులుకోవాలి అన్నటువంటి హెచ్చరిక ఇవ్వడం. మరియు ఎంత దొంగతనం చేస్తే ఎంత, ముందు ఏ చెయ్యి, చెయ్యిలో ఎంతవరకు?. కానీ ఇందులో కొన్ని కండిషన్స్ లు ఉన్నాయి.

ఇక్కడ తెలుసుకోవాల్సిన మరొక విషయం ఏమిటంటే, ఏ వ్యక్తి నుండి సామాను దొంగలించబడినదో, అతడు తన ఒక సొమ్ము దొంగలించబడినది అని ఆ దొంగతనం కంటే ఎక్కువ పరిమాణంలో వేరే ఏదైనా అత్యాచారం, దౌర్జన్యం లాంటివి చేసే ప్రయత్నం ఎంత మాత్రం చేయకూడదు. తన హక్కు ఏదైతే దొంగలించబడినదో దాన్ని పొందడానికి ధర్మ హద్దుల్లో ఉండి అంతకంటే ఘోరమైన పాపానికి పాల్పడకూడదు. ఈ రోజుల్లో కొందరు ఏం చేస్తారు? తన సైకిల్ మోటార్ ఏదైనా దొంగలించబడింది. తను నిలబెట్టి పోయాడు కార్, పార్కింగ్ చేసి వెళ్ళాడు. ఎవరైనా దాన్ని కొట్టి వెళ్లారు అంటే చూడడు, వెతకడు, రీసెర్చ్ చేయడు. అధికారులకు ఏదైనా మెసేజ్ ఇవ్వాలి, వారికి తెలపాలి, అలాంటిది ఏమీ చేయకుండా ఆ రోడ్డు మీద ఉన్న బండ్లన్నిటిని కూడా నాశనం చేయడం, అన్నింటిని కూడా తగలబెట్టడం, ఇంకా ఇలాంటి కొన్ని పనులు ఏదైతే చేస్తారో, ఇది సరైన విషయం కాదు. ఇలాంటి వాటికి మనం చాలా దూరం ఉండాలి.

ఈ సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఒక హదీస్ మనం గుర్తుంచుకుంటే మన విశ్వాసం పెరుగుతుంది మరియు మనకు చాలా సంతోషం కలుగుతుంది. అదేమిటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో చెప్పారు. ముస్లిం షరీఫ్ లోని హదీస్.

مَا مِنْ مُسْلِمٍ يَغْرِسُ غَرْسًا، إِلَّا كَانَ مَا أُكِلَ مِنْهُ لَهُ صَدَقَةً، وَمَا سُرِقَ مِنْهُ لَهُ صَدَقَةً، وَمَا أَكَلَ السَّبُعُ مِنْهُ فَهُوَ لَهُ صَدَقَةً، وَمَا أَكَلَتِ الطَّيْرُ فَهُوَ لَهُ صَدَقَةً، وَلَا يَرْزَؤُهُ أَحَدٌ إِلَّا كَانَ لَهُ صَدَقَةً

ఏ ముస్లిం అయినా ఒక మొక్కను నాటితే, దాని నుండి తినబడినది అతనికి సదకా (దానం) అవుతుంది, దాని నుండి దొంగలించబడినది అతనికి సదకా అవుతుంది, దాని నుండి క్రూరమృగం తిన్నది అతనికి సదకా అవుతుంది, పక్షి తిన్నది అతనికి సదకా అవుతుంది. ఎవరైనా దానిని తీసుకున్నా అది అతనికి సదకా అవుతుంది.

ఏ ముస్లిం అయినా ఒక ఏదైనా చెట్టు నాటాడు, ఇక ఆ చెట్టులో నుండి ఏ కొంచెం తినబడిన, లేక దొంగలించబడిన, లేదా ఆ మృగ జంతువులు వచ్చి వాటిని నాశనం చేసిన, లేక పక్షులు వచ్చి తిన్నా ఇదంతా కూడా ఒక్కొక్క విషయం చెబుతూ ప్రవక్త చెప్పారు. لَهُ صَدَقَةٌ (లహు సదకా) ఇది అతని కొరకు ఒక పుణ్యంగా రాయబడుతుంది. ఇది అతని కొరకు ఒక సదకాగా పరిగణించబడుతుంది.

అయితే మనకు దాని యొక్క ప్రతిఫలం అల్లాహ్ వద్ద లభిస్తుంది. అల్లాహ్ వద్ద ప్రతిఫలం లభిస్తుంది. ధర్మ పరిధిలో ఉండి మనం ఓపిక సహనాలు వహించాలి. హక్కు తీసుకోవడానికి కూడా ఇస్లాం అనుమతిస్తుంది. కానీ ధర్మ హద్దులో ఉండి మాత్రమే ఇలా చేయాలి.

ఇక దొంగతనం అన్నది సోదర మహాశయులారా, ఏదైనా ఒక సామాను వరకే పరిమితం ఉండదు. కొన్ని ఉదాహరణలు వచ్చేసాయి మీ ముందు. భూములు దొంగతనం చేయడం జరుగుతుంది. దొంగతనంలోని రూపాల్లో ఈ రోజుల్లో ఆన్లైన్ గా దొంగతనం, సోషల్ మీడియాలో దొంగతనాలు, ఎలక్ట్రానిక్ పరంగా దొంగతనాలు, ఇంకా పాస్వర్డ్లు అన్ని తెలుసుకొని ఏదైనా ఆ తప్పు లింకులు పంపి దాని ద్వారా ఒకరి అకౌంట్లో నుండి ఏదైనా లాక్కోవడం. దొంగతనానికి ఏ రూపు ఉన్నా కానీ. దొంగతనంలో ఈ రోజు కొందరు ఏం చేస్తారు? ఉదాహరణకు ఒక వ్యక్తి ఏదైనా పుస్తకం రాశాడు అంటే అతని పేరు తీసేసి మొత్తం తన పేరు పెట్టుకొని తాను రాసినట్లుగా చెప్పుకోవడం. ఇలా దొంగతనంలోని ఏ ఏ రూపం ఉన్నా గానీ ప్రతి ఒక్కటి దొంగతనంలో వస్తుంది, చెడ్డ గుణం, ప్రతి రకమైన దొంగతనం నుండి మనం దూరం ఉండాలి.

అల్లాహ్ మనందరికీ ఇలాంటి చెడు అలవాట్ల నుండి, చెడు గుణాల నుండి దూరం ఉంచుగాక. దీని యొక్క నష్టాలు, దీని యొక్క ఆ వినాశకరాలు ఏమైతే ఉన్నాయో ఖురాన్ హదీస్ ఆధారంగా మీరు విన్నారు. వీటిని ఇతరులకు తెలియజేయండి, సమాజాన్ని పవిత్ర పరిచే ప్రయత్నం చేయండి. అల్లాహ్ మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వా ఆఖిరు దావాన అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.

దొంగతనానికి విధించబడే శిక్ష (హదీసులు)
హదీసు మకరందం (బులూఘ్-అల్–మరామ్) – Bulugh al Maraam నుండి : https://teluguislam.net/wp-content/uploads/2022/01/bulugh-al-maram.10.03.pdf (10 పేజీలు)

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=18540

తయమ్ముం, దాని విధానం మరియు సందర్భాలు [వీడియో, టెక్స్ట్]

బిస్మిల్లాహ్

తయమ్ముం, దాని విధానం మరియు సందర్భాలు
[https://youtu.be/1saC1XDHDgo [30 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) 


తయమ్ముమ్‌:

క్రింద తెలుపబడే కారణాలు సంభవించినప్పుడు ప్రయాణికులు, స్థానికులు ఎవరైనా సరే వుజూ మరియు గుస్ల్‌ కు బదులుగా తయమ్ముమ్‌ చేయవచ్చును.

1- అతికష్టంగా వెతికినప్పటికీ నీళ్ళు దొరకనప్పుడు, లేదా ఉండికూడా వుజూకు సరిపడనప్పుడు తయమ్ముమ్‌ చేయవచ్చును. కొంత దూరములో నీళ్ళు ఉన్నా అక్కడికి వెళ్ళి తీసుకోవడంలో అతనికి ధన, ప్రాణ నష్టమున్నప్పుడు కూడా తయమ్ముమ్‌ చేయవచ్చును.

2- వుజూ అవయవాల్లో ఏ ఒకదానికైనా గాయమయితే దాన్ని కడిగే ప్రయత్నం చేయాలి. కడగడం వల్ల నష్టం ఉంటే మసహ్‌ చేయాలి, అంటే చేయి తడి చేసి దాని మీద తుడువాలి. మసహ్‌ వల్ల కూడా హాని కలిగే భయం ఉంటే తయమ్ముమ్‌ చేయవచ్చును.

3- ఏ నీళ్ళు లేదా వాతవరణం మరీ చల్లగా ఉండి నీళ్ళ ఉపయోగం హానికరంగా ఉంటే తయమ్ముమ్‌ చేయవచ్చును.

4- నీళ్ళు కేవలం త్రాగడానికి మాత్రమే ఉన్నప్పుడు కూడా తయమ్ముమ్‌ చేయవచ్చును.

తయమ్ముమ్‌ విధానం:

మనుసులో నియ్యత్‌ /సంకల్పం చేసుకొని రెండు అరచేతులు ఒక సారి భూమిపై తట్టి ముఖముపై మళ్ళీ మణికట్ల వరకు రెండు చేతులపై మసహ్‌ చేయాలి. (కొందరు వుజూ చేసినట్టుగా మోచేతుల వరకు, కాళ్ళు సయితం మసహ్‌ చేస్తారు ఇది ప్రవక్త పద్దతి ఎంతమాత్రం కాదు). వుజూను భంగపరిచే విషయాలే తయమ్ముమ్‌ ను భంగపరుస్తాయి. నమాజుకు ముందు లేదా నమాజు మధ్యలో నీళ్ళు లభిస్తే తయమ్ముమ్‌ భంగమవుతుంది. నమాజు పూర్తి చేసుకున్న తరువాత నీళ్ళు లభిస్తే ఆ నమాజు అయినట్లే. తిరిగి మళ్ళీ చేయవలసిన అవసరం లేదు.

[ఇది నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)  గారు రాసిన “శుద్ధి & నమాజు (Tahara and Salah)” అనే పుస్తకం నుండి తీసుకోబడింది]

ఈ ఆడియోలో, ప్రవక్త తయమ్ముమ్ (నీరు లేనప్పుడు చేసే శుద్ధి) గురించి వివరిస్తున్నారు. తయమ్ముమ్ అంటే అల్లాహ్ ఆరాధన ఉద్దేశంతో పరిశుభ్రమైన మట్టిపై రెండు చేతులు కొట్టి ముఖాన్ని మరియు రెండు అరచేతులను తుడుచుకోవడం. నీరు అందుబాటులో లేనప్పుడు లేదా దాని వాడకం హానికరమైనప్పుడు తయమ్ముమ్ చేయడం విధిగా చెప్పబడింది. ఇది ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క ఉమ్మత్‌కు మాత్రమే ఇవ్వబడిన ఒక గొప్ప వరం మరియు సౌకర్యం అని, గత ప్రవక్తల అనుచరులకు ఈ సౌలభ్యం లేదని హదీసుల ద్వారా వివరించబడింది. తయమ్ముమ్ యొక్క షరతులు – నియ్యత్ (ఉద్దేశం), నీరు లేకపోవడం, మరియు పరిశుభ్రమైన మట్టిని ఉపయోగించడం. చిన్న అశుద్ధి (హదసె అస్గర్) మరియు పెద్ద అశుద్ధి (హదసె అక్బర్) రెండింటికీ తయమ్ముమ్ సరిపోతుంది. అయితే, నీరు అందుబాటులోకి వచ్చిన వెంటనే, తయమ్ముమ్ చెల్లదు మరియు స్నానం లేదా వుదూ చేయడం తప్పనిసరి అవుతుంది.

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్. అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహీ వ సహ్‌బిహీ అజ్మయీన్, అమ్మా బాద్.

తయమ్ముమ్ అంటే అల్లాహ్ యొక్క ఆరాధన ఉద్దేశంతో పరిశుభ్రమైన మట్టి మీద రెండు అరచేతులను కొట్టి ముందు ముఖం మీద తర్వాత రెండు అరచేతుల మీద ఇలా తుడుచుకోవడం.

నీళ్లు లేని సందర్భంలో లేదా నీళ్లు ఉండి దాని ఉపయోగం హానికరంగా ఉన్నందువల్ల ఈ తయమ్ముమ్ చేయటం విధిగా ఉంది. అల్లాహుతాలా దీని గురించి చాలా స్పష్టంగా ఆదేశించాడు. సూరె మాయిదా సూర నెంబర్ ఐదు ఆయత్ నెంబర్ ఆరులో అల్లాహ్ ఆదేశం ఉంది.

فَلَمْ تَجِدُوا مَاءً فَتَيَمَّمُوا صَعِيدًا طَيِّبًا
ఫలమ్ తజిదూ మాఅన్ ఫతయమ్మమూ సయీదన్ తయ్యిబా
మీరు నీళ్లు పొందని స్థితిలో పరిశుభ్రమైన మట్టితో తయమ్ముమ్ చేసుకోండి.

فَامْسَحُوا بِوُجُوهِكُمْ وَأَيْدِيكُمْ مِنْهُ
ఫమ్సహూ బివుజూహికుమ్ వ ఐదీకుమ్ మిన్హ్
మీ ముఖాలను తుడుచుకోండి. మీ చేతులను కూడా తుడుచుకోండి.

అయితే దీని ఆదేశం ఏంటి? విధిగా ఉంది. నీళ్లు లేని సందర్భంలో లేక నీళ్లు ఉండి మన కొరకు హానికరంగా ఉన్న సందర్భంలో తయమ్ముమ్ తప్పనిసరిగా చేయాలి.

అయితే ఇక్కడ ఇంకో విషయం మనకు తెలిసి ఉండటం చాలా మంచిది. అందువల్ల మనం అల్లాహ్ యొక్క కృతజ్ఞత అనేది ఇంకా ఎంతో గొప్పగా చెల్లించుకోవచ్చు. అదేమిటి?

ఈ తయమ్ముమ్ యొక్క సౌకర్యం ఇది అల్లాహ్ వైపు నుండి కేవలం మన కొరకు ఒక గొప్ప వరం. ఎందుకంటే ఇంతకుముందు ప్రవక్తల అనుసరులకు, ఇంతకుముందు ప్రవక్తలను విశ్వసించిన వారికి ఇలాంటి సౌకర్యం అల్లాహ్ ప్రసాదించలేదు. ఈ సౌకర్యం అల్లాహ్ తాలా ఎవరికి ఇచ్చాడు ప్రత్యేకంగా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుసరులకు, ఆయనను విశ్వసించిన వారికి ప్రసాదించాడు.

ఈ విషయం బుఖారీ ముస్లింలో ఒక చాలా స్పష్టమైన హదీస్ ఉంది. జాబిర్ బిన్ అబ్దుల్లా రదియల్లాహు తాలా అన్హు గారు ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు: “ఐదు విషయాలు ఉన్నాయి, నాకంటే ముందు ఏ ప్రవక్తకు అవి ఇవ్వబడలేదు.” గమనించండి. అంటే ఈ ఐదు విషయాల ప్రత్యేకత అనేది కేవలం మన ప్రవక్తకే ప్రసాదించబడినది. ఒకటి, నా శత్రువులు నా నుండి ఒక నెల దూర ప్రయాణంలో ఉంటారు కానీ వారి హృదయాల్లో అల్లాహ్ నా యొక్క భయం వేస్తాడు. రెండవది, అది మన టాపిక్ కు సంబంధించింది.

وَجُعِلَتْ لِيَ الْأَرْضُ مَسْجِدًا وَطَهُورًا
వ జుఇలత్ లియల్ అర్దు మస్జిదవ్ వతహూరా
సర్వభూమిని అల్లాహ్ నా కొరకు నమాజు చేయుటకు స్థలంగా, పరిశుభ్రత పొందుటకు సాధనంగా చేశాడు.

فَأَيُّمَا رَجُلٍ مِنْ أُمَّتِي أَدْرَكَتْهُ الصَّلَاةُ فَلْيُصَلِّ
ఫఅయ్యుమా రజులిమ్ మిన్ ఉమ్మతీ అద్రకత్ హుస్సలా ఫల్ యుసల్లీ.
ఈ భూమిలో మీరు ఎక్కడ సంచరిస్తున్నా సరే, ఎక్కడా ఉన్నా సరే నమాజ్ టైం అయిన వెంటనే నమాజ్ చేసుకోవాలి. నీళ్లు లేవు, తహారత్ లేదు ఇలాంటి ఏ సాకులు చెప్పుకోరాదు.

మూడో విషయం,

وَأُحِلَّتْ لِيَ الْغَنَائِمُ وَلَمْ تَحِلَّ لِأَحَدٍ قَبْلِي
వ ఉహిల్లత్ లియల్ గనాయిమ్ వలమ్ తహిల్ల లిఅహదిన్ ఖబ్లీ.
యుద్ధ ఫలం నా కొరకు హలాల్, ధర్మసమ్మతంగా చేయబడింది. నాకంటే ముందు ఎవరి కొరకు కూడా అది ధర్మసమ్మతంగా లేకుండింది.

మాలె గనీమత్, యుద్ధ ఫలం, యుద్ధ ధనం, యుద్ధం జరిగినప్పుడు ఇస్లాం మరియు కుఫ్ర్ మధ్యలో ఇస్లాం పై ఉన్నవారు గెలిచిన తర్వాత అవిశ్వాసుల ధనం ఏదైతే పొండేవారో దానిని మాలె గనీమత్ అని అనబడుతుంది.

నాలుగో విషయం, وَأُعْطِيتُ الشَّفَاعَةَ వ ఉ’తీతుష్షఫాఆ. ప్రళయ దినాన సిఫారసు చేసే ఈ గొప్ప భాగ్యం అల్లాహ్ నాకు ప్రసాదించనున్నాడు.

ఐదో విషయం,

وَكَانَ النَّبِيُّ يُبْعَثُ إِلَى قَوْمِهِ خَاصَّةً وَبُعِثْتُ إِلَى النَّاسِ عَامَّةً
వ కానన్నబియ్యు యుబ్అసు ఇలా కౌమిహీ ఖాస్సతన్ వ బుఇస్తు ఇలన్నాసి ఆమ్మహ్.
ఇంతకుముందు ప్రవక్తలు ప్రత్యేకంగా తమ జాతి వారి వైపునకు పంపబడేవారు. కానీ నేను సర్వ మానవాళి వైపునకు ప్రవక్తగా పంపబడ్డాను.

ఇక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చారు, చనిపోయారు కూడా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత ప్రళయం వచ్చే వరకు ప్రతి మనిషి మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను విశ్వసించడం తప్పనిసరి. లేకుంటే అతని అంతిమ గతి ఏమవుతుంది? నరకమే అవుతుంది. అయితే మన టాపిక్ కు సంబంధించిన విషయం ఏంటి ఇక్కడ? భూమి మస్జిద్ గా కూడా ఉంది, అది తహూర్, పరిశుభ్రతకు సాధనంగా కూడా అల్లాహ్ తాలా దానిని చేశాడు.

మూడు విషయాలు మనం విన్నాము. తయమ్ముమ్ అంటే ఏమిటి, దాని ఆదేశం ఏంటి అంటే అది విధిగా ఉంది, మూడో విషయం అది అల్లాహ్ వైపు నుండి ఒక గొప్ప వరం.

నాలుగో విషయం, ఖురాన్లో మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీసుల్లో దీని గురించి చాలా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి గనక, ఎవరికీ ఏ సందేహం అనేది ఉండకూడదు. తయమ్ముమ్ చేసే విషయంలో, ఎక్కడ ముస్లిం, ఒక విశ్వాసుడు ఏ ప్రాంతంలో ఉన్నా గానీ, అక్కడ అతనికి నైట్ ఫెయిల్ అయింది అని, భార్య భర్తలు ఉండేది ఉంటే వారిద్దరూ మధ్యలో సంబంధాలు జరిగాయి గనక వారిపై ఇప్పుడు స్నానం చేయడం విధిగా ఉంది, నీళ్లు లేవు అని, ఇంకా వేరే ఏ సాకులు కూడా చెప్పకుండా, నమాజ్ టైం అయిన వెంటనే నీళ్లు లేనప్పుడు తయమ్ముమ్ చేసి లేక నీళ్లు ఉండి మన ఆరోగ్యానికి, మన శరీరానికి హానికరంగా ఉంటే నీళ్లు వాడకుండా తయమ్ముమ్ చేసి వెంటనే నమాజ్ చేయాలి. ఈ రోజుల్లో అనేక మంది యువకులు ప్రత్యేకంగా బజారుల్లో తిరగడం, ఇంకా వేరే పనుల్లో ఉండి, నమాజ్ టైంలో ఏదైనా మస్జిద్ దగ్గర ఉన్నప్పటికీ కూడా నమాజ్ కు రారు. సాకు ఏం చెప్తారు ఎక్కువ శాతం? “నాకు తహారత్ లేదు”. ఇది చాలా ఘోరమైన పాపం.

తయమ్ముమ్ హదసె అక్బర్ (పెద్ద అశుద్ధి), హదసె అస్గర్ (చిన్న అశుద్ధి) రెండిటికీ పనిచేస్తుంది. హదసె అక్బర్ అంటే ఏంటి? స్వప్న స్కలనం కావడం (నైట్ ఫెయిల్ కావడం), లేక భార్య భర్తలు కలుసుకోవడం. ఇందువల్ల ఏదైతే స్నానం చేయడం విధిగా ఉంటుందో దానిని హదసె అక్బర్ అంటారు. సామాన్యంగా మలమూత్ర విసర్జన తర్వాత, ఏదైనా అపాన వాయువు (గాలి) వెళితే, ఇలాంటి స్థితులు ఏవైతే ఉంటాయో వాటిని హదసె అస్గర్ అంటారు.

ఈ రెండిటికీ కూడా తయమ్ముమ్ సరిపోతుంది. దానికి దలీల్ (ఆధారం) ఏమిటి? సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లింలో ఒక చాలా పెద్ద హదీస్ ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రయాణ విషయంలో. అందులో ఒక తయమ్ముమ్ కు సంబంధించిన విషయం ఏంటంటే, ఒకచోట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నమాజ్ చేసి,

فَلَمَّا انْفَتَلَ مِنْ صَلَاتِهِ إِذَا هُوَ بِرَجُلٍ مُعْتَزِلٍ لَمْ يُصَلِّ مَعَ الْقَوْمِ
ఫలమ్మన్ ఫలత మిన్ సలాతిహీ ఇదా హువ బిరజులిమ్ ముఅతజిలిల్ లమ్ యుసల్లి మఅల్ కౌమ్
నమాజ్ చేసి తిరిగిన తర్వాత ఒక వ్యక్తిని చూశారు ప్రవక్త గారు. అతను ఒక పక్కకు ఉన్నాడు, అందరితో కలిసి నమాజ్ చేయలేదు.

مَا مَنَعَكَ يَا فُلَانُ أَنْ تُصَلِّيَ مَعَ الْقَوْمِ
మా మనఅక యా ఫులాన్ అన్ తుసల్లి మఅల్ కౌమ్
అందరితో జమాఅత్ తో సహా, సామూహికంగా నమాజ్ ఎందుకు చేయలేదు నీవు అని ప్రవక్త వారు అతన్ని అడిగారు.

అప్పుడు అతడు ఏం చెప్పాడు?

أَصَابَتْنِي جَنَابَةٌ وَلَا مَاءَ
అసాబత్నీ జనాబతున్ వలా మా
నేను అశుద్ధావస్థకు గురయ్యాను, స్నానం చేయడం నాకు విధిగా అయిపోయింది. నీళ్లు లేవు.

అందు గురించి ఇంతవరకు నేను స్నానం చేయలేకపోయాను గనక, మీతో పాటు నేను నమాజ్ చేయలేదు. అప్పుడు ప్రవక్త ఏమన్నారు?

عَلَيْكَ بِالصَّعِيدِ فَإِنَّهُ يَكْفِيكَ
అలైక బిస్సయీద్ ఫఇన్నహూ యక్ఫీక్
పరిశుభ్రమైన మట్టి ఉంది కదా, అది నీకు సరిపోతుంది.

అలాగే సహీహ్ బుఖారీలోనే అమ్మార్ బిన్ యాసిర్ రదియల్లాహు తాలా అన్హు గారి యొక్క సంఘటన ఉంది. అప్పటి వరకు ఆయనకు తయమ్ముమ్ విషయం తెలియదు. నమాజ్ టైం అయిపోయింది, స్నానం చేయడం విధిగా ఉంది. ఆయన ఏం చేశాడు? గాడిద మట్టిలో ఎలా పొర్లుతుందో చూశారా ఎప్పుడైనా? అతను స్వయంగా అంటున్నాడు, గాడిద ఎలా మట్టిలో పొర్లుతుందో అలా నేను మట్టిలో మొత్తం స్నానం చేసినట్టుగా లేచి నమాజ్ చేసుకొని ప్రవక్త వద్దకు వచ్చాను. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో ఈ విషయం అడిగాను. ప్రవక్త గారు చెప్పారు, “అంతగా చేసే అవసరం లేదే నీకు. కేవలం రెండు చేతులు పరిశుభ్రమైన మట్టి మీద కొట్టి, మట్టి అంటి ఉంటుంది గనక అని ఒక్కసారి ఊదుకొని ముఖముపై, కుడి చేయి అరచేతితో ఎడమ చేయి అరచేతి మీద, ఈ ఎడమ చేయి యొక్క అరచేతి లోపలి భాగంతో కుడి చేయి అరచేతి పై భాగం మీద మసాజ్ చేస్తే ఒక్కసారి సరిపోతుంది.”

ఈ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీసుల ద్వారా మనకు ఏం తెలుస్తుంది? స్నానం చేయడం విధిగా అయిన సందర్భంలో గానీ, లేక వుదూ చేయడం విధిగా ఉన్న సందర్భంలో గానీ, ఈ రెండు సందర్భాల్లో కూడా నీళ్లు లేనప్పుడు తయమ్ముమ్ సరిపోతుంది.

స్నానం అంటే తెలుసు, వుదూలో మనం కొన్ని ప్రత్యేక అవయవాలు కడుగుతాము. స్నానం చేయడం విధిగా ఉంటే ఏం చేస్తాము? గోరంత కూడా ఎక్కడా పొడితనం ఉండకుండా మంచిగా స్నానం చేస్తాము. కానీ నీళ్లు లేని సందర్భంలో ఒకే ఒక తయమ్ముమ్ రెండిటికీ సరిపోతుంది. ఒకసారి స్నానానికి ఇంకొకసారి వుదూకు అని రెండు రెండు సార్లు తయమ్ముమ్ చేసే అవసరం లేదు. ఒక్కసారి తయమ్ముమ్ చేసి నమాజ్ చేసుకుంటే స్నానానికి బదులుగా మరియు వుదూకు బదులుగా సరిపోతుంది.

తయమ్ముమ్ కూడా ఒక ఇబాదత్. నమాజుకు వుదూ చేయడం షరత్ కదా. వుదూ దేనితో చేస్తాము? నీళ్లతోని. నీళ్లు లేని సందర్భంలో అల్లాహ్ మనకు ఈ సౌకర్యం కలుగజేశాడు. అందు గురించి ఇది కూడా ఒక ఇబాదత్ గనక ఇందులో కొన్ని షరతులు ఉన్నాయి.

మొదటి షరత్, మొదటిది నియ్యత్. నియ్యత్ అంటే తెలుసు కదా ఇంతకు ముందు ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాము. ఏదో పెద్ద మంత్రం అలా చదవడం కాదు నోటితోని. ఏ కార్యం చేస్తున్నామో, ఏ సత్కార్యం, ఏ మంచి కార్యం, ఏ ఇబాదత్, దాని యొక్క సంకల్పం మనసులో చేసుకోవాలి. ఏమని? ఈ నా యొక్క సత్కార్యం ద్వారా అల్లాహ్ యే సంతృప్తి పడాలి, అల్లాహ్ యే నాకు దీని యొక్క ప్రతిఫలం ఇవ్వాలి అన్నటువంటి నమ్మకం ఉండాలి, అన్నటువంటి సంకల్పం, నియ్యత్ అనేది ఉండాలి. వేరే ప్రజలకు చూపడానికి గాని, ముతవల్లాకు చూపడం గాని, ఇంకా మన సంతానానికి చూపించడానికి గాని, నేను ఒక ముస్లింగా అన్నటువంటి భావన ఇతరులకు కలిగించడం కొరకు ఇలాంటి ఏ ప్రాపంచిక ఉద్దేశాలు ఉండకూడదు.

రెండవ నిబంధన, రెండవ షరత్, నీళ్లు లేకపోవడం లేదా ఉండి దానిని వాడడం మనకు నష్టకరంగా ఉండడం. అందుగురించి అల్లాహుతాలా సూరె మాయిదాలో ఏదైతే చెప్పాడో, అది కూడా మనకు ఒక ఆధారంగా ఉంది:

وَإِن كُنتُم مَّرْضَىٰ أَوْ عَلَىٰ سَفَرٍ
వ ఇన్ కున్తుమ్ మర్దా అవ్ అలా సఫరిన్
ఒకవేళ మీరు రోగులై ఉన్నా లేదా ప్రయాణంలో ఉన్నా…

హానికరంగా ఉండడం అనేదేదైతే చెప్తున్నామో, అది మనకు కొన్ని హదీసుల ద్వారా కూడా వివరంగా తెలుస్తుంది. అంతే కాకుండా ఖురాన్లో అల్లాహ్ ఏం చెప్పాడు? సూరె నిసా, ఆయత్ నెంబర్ 29లో ఉంది:

وَلَا تَقْتُلُوا أَنفُسَكُمْ
వలా తఖ్తులూ అన్ఫుసకుమ్
మీకు మీరు (లేదా ఒకరినొకరు) చంపుకోకండి.

ఆత్మహత్యలు చేసుకోకండి, పరస్పరం ఒకరు మరొకరిని హత్య చేయకండి. ఇవన్నీ భావాలు దీంట్లో వస్తాయి.

إِنَّ اللَّهَ كَانَ بِكُمْ رَحِيمًا
ఇన్నల్లాహ కాన బికమ్ రహీమా
నిశ్చయంగా అల్లాహ్ మీ పట్ల చాలా కనికరం కలవాడు.

ఈ విధంగా ఈ షరతులు మనకు తెలిసినాయి, అర్థమైనాయి.

మూడో షరత్ ఏంటంటే, తయమ్ముమ్ చేయడానికి పరిశుభ్రమైన మట్టితో చేయాలి. ఈ మూడు షరతులు తయమ్ముమ్ కు సంబంధించినవి.

ఇందులో రెండు ఫర్దులు ఉన్నాయి. ఒకటి ఏమిటి? ముఖాన్ని తుడవడం. మరొకటి? రెండు అరచేతులను.

అయితే ఏ సందర్భాల్లో తయమ్ముమ్ చేయవచ్చు అన్న విషయం మనకు ఇంతకు ముందే సంక్షిప్తంగా వచ్చింది. నీళ్లు లేనప్పుడు లేక ఉండి కూడా వాడడం నష్టంగా ఉన్నప్పుడు. దానినే మరికొంచెం వివరంగా తెలుసుకుందాం.

నీళ్లు లేకపోవడం అంటే ఏమిటి? నీళ్లు లేకపోవడం అంటే మనం ఎక్కడ ఉన్నామో ఆ చుట్టుపక్క ప్రాంతాల్లో ఎక్కడా నీళ్లు వుదూ చేయడానికి దొరకకపోవడం. మనం అక్కడి వరకు మన వద్ద బండి ఉంటే బండి ద్వారా వెళ్లడం గానీ, లేక కాలి నడకతో వెళ్లడం గానీ సాధ్యం ఉండి కొన్ని అడుగులు వెళ్తే అక్కడ దొరుకుతాయి అన్నటువంటి ఛాన్స్ ఉండేది ఉంటే, నీళ్లు లేని కింద లెక్కించబడదు. ఉదాహరణకు, ఇప్పుడు ఇక్కడ మనం సౌదియాలో ఉన్నాం గనక ఇక్కడి నుండి ఒక రెండు కిలోమీటర్ల దూరంలో నీళ్లు ఉన్నాయి అనుకోండి. మనకు ఇక్కడ దగ్గరలో లేవు, అయితే నమాజ్ టైం అయినప్పుడు మన దగ్గర ఏదైనా బండి ఉంది లేక కార్ ఉంది, లేక మన మిత్రుని దగ్గర బండి ఉంది, వేరే ఎన్నో అవసరాలకు మనం తీసుకుంటూ ఉంటాం, వాడుకుంటూ ఉంటాము. ఆ రెండు కిలోమీటర్ల దూరానికి వెళ్లి ఆ నీళ్లు తీసుకురావడం మనకు కష్టంగా ఉంటుందా? ఉండదు. అయితే దాన్ని నీళ్లు లేవు అన్న విషయం అక్కడ వర్తించదు. మనం ఎక్కడి వరకు వెళ్లి నీళ్లు తీసుకోవడం సాధ్యం ఉన్నదో అక్కడి వరకు వెళ్లి తీసుకోవాలి. ఇక ఎక్కడైతే సాధ్యం కాదో అది నీళ్లు లేవు అన్న దానికి కింద లెక్కించబడుతుంది.

రెండో విషయం, మన దగ్గర నీళ్లు ఉన్నాయి కానీ త్రాగడానికి ఉన్నాయి. ఆ నీళ్లతో మనం స్నానం చేస్తే లేక వుదూ చేయడం మొదలు పెడితే త్రాగడానికి మనకు నీళ్లు దొరకవు. కొన్ని కొన్ని సందర్భాల్లో కరువు ఏర్పడుతుంది, వర్షాలు ఉండవు, మన దగ్గర కూడా అలాంటి ప్రాంతం అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది కదా. నీళ్లు త్రాగడానికి మాత్రమే ఉన్నాయి. వాడుకోవడానికి లేవు. అలాంటి సందర్భంలో కూడా అది నీళ్లు లేని కిందనే లెక్కించబడుతుంది. ఎందుకంటే ఇస్లాం మనల్ని మనం నష్టపరుచుకోవడానికి ఆదేశించదు. ఇదే ఆయత్లో, ఎక్కడైతే మనం ఇంతకు ముందు సూరె మాయిదా ఆయత్ చదివామో అందులోనే అల్లాహుతాలా ముందు ఏం చెప్తున్నాడు?

مَا يُرِيدُ اللَّهُ لِيَجْعَلَ عَلَيْكُم مِّنْ حَرَجٍ
మా యురీదుల్లాహు లియజ్అల అలైకుమ్ మిన్ హరజ్
అల్లాహుతాలా మిమ్మల్ని ఎలాంటి ఇబ్బందికి గురి చేయదల్చుకోలేదు.

وَلَٰكِن يُرِيدُ لِيُطَهِّرَكُمْ
వలాకిన్ యురీదు లియుతహ్హిరకుమ్
అల్లాహ్ ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని శుభ్రపరచడం, పరిశుద్ధులుగా చేయడం.

وَلِيُتِمَّ نِعْمَتَهُ عَلَيْكُمْ
వ లియుతిమ్మ నిఅమతహూ అలైకుమ్
తన యొక్క కారుణ్యాన్ని మీపై సంపూర్ణం చేయడం.

ఎందుకు?

لَعَلَّكُمْ تَشْكُرُونَ
లఅల్లకుమ్ తష్కురూన్
మీరు కృతజ్ఞత చెల్లించే వాళ్ళు కావాలి అని.

గమనించండి. నీళ్లు త్రాగడానికి కూడా మనకు లేకుంటే మన జీవితమే చాలా నష్టంలో పడిపోవచ్చు. అందుగురించి వాడుకోవడానికి ఉన్న నీళ్లు మొత్తానికి అయిపోయి, కేవలం త్రాగడానికి మాత్రమే ఉన్నాయి, దానిని వాడితే ఇక మనకు చాలా ఇబ్బందికి గురవుతాము, అలాంటప్పుడు కూడా నీళ్లు లేవు అన్న విషయంలోనే వర్తిస్తుంది.

మూడో రకం, నీళ్లు ఉన్నాయి చాలా. కానీ కొనాల్సి వస్తుంది. కొనాల్సి వస్తుంది. అయితే పిసినారితనం చేసి డబ్బు పెట్టి ఎందుకు కొనాలి? ఎక్కడైనా ఫ్రీగా దొరికితే చూసుకుందాము. అన్నటువంటి భావన ఉంచుకొని, శక్తి ఉండి కూడా మనం కొనకుంటే అది పాపంలో పడిపోతాము. కానీ మన దగ్గర నీళ్లు కొనేంత శక్తి లేదు. ఉన్నాయి నీళ్లు కానీ కొనాల్సి వస్తుంది. కొనేంత శక్తి కూడా మన దగ్గర లేదు. కొన్నే కొన్ని డబ్బులు ఉన్నాయి, అవి మన ఈ రోజుకు గాని, లేకుంటే ఇంకా కొన్ని రోజుల వరకు మన అతి ముఖ్యమైన తిండి ఏదైతే ఉందో దాని గురించి గడవాలి. ఇలాంటి ఇబ్బందికరమైన జీవితం ఉన్నప్పుడు కొనడం కష్టతరంగా ఉన్నప్పుడు, కడుపు నిండా భోజనం చేసుకొని డ్రింకులు తాగవచ్చు కానీ ఇక్కడ వుదూ చేసుకోవడానికి ఒక నీళ్లు, ఒక అర లీటర్ నీళ్లు కొనలేము? ఆ డ్రింకులు ఏంటి, పెప్సీలు ఏంటి అవి మన జీవనానికి అత్యవసరమైన తిండి కింద లెక్కించబడుతుందా? లెక్కించబడదు.

విషయం అర్థమవుతుంది కదా. నీళ్లు లేవు అన్న ఈ పదం అనేది ఎన్ని రకాలుగా వస్తుంది, దాని యొక్క రూపాలు ఏంటున్నాయో అవన్నీ నేను వివరిస్తున్నాను.

రెండో విషయం, నీళ్లు ఉన్నాయి కానీ దాని ఉపయోగం మనకు నష్టకరంగా ఉంది. అంటే చలి వల్ల కావచ్చు. నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి. వేడి చేసుకోవడానికి ఎలాంటి సౌకర్యం లేదు ఇప్పుడు. ఒకవేళ ఉన్నది సౌకర్యం కానీ ఎంత సేపు పడుతుందంటే, మన ఈ నమాజ్ టైం అనేది దాటిపోతుంది. అలాంటప్పుడు ఆ నీళ్లు ఉపయోగించడం వల్ల మనకు నష్టం కలుగుతుంది అన్న భయం ఉండేది ఉంటే తయమ్ముమ్ చేయవచ్చు. ప్రవక్త సల్లల్లాహు వసల్లం కాలంలో ఒకసారి ఏం జరిగింది? ఒక వ్యక్తికి నెత్తిలో గాయమైంది. ప్రయాణంలో ఉన్నాడు, నెత్తిలో గాయమైంది. చాలా చల్లని రాత్రి, అతనికి స్నానం చేయడం కూడా విధి అయిపోయింది. దగ్గర ఉన్న స్నేహితులను అడిగాడు, ఏం చేయాలి నేను? ఫజర్ నమాజ్ టైం. “లేదు లేదు నీకేంటి, తప్పకుండా నువ్వు స్నానం చేసి నమాజ్ చేయాల్సిందే” అని అన్నారు అతని స్నేహితులు. అల్లాహ్ కరుణించు గాక వారిని. ఆయన స్నానం చేశాడు కానీ అందువల్ల అతని ప్రాణం పోయింది. తర్వాత ప్రవక్త సల్లల్లాహు వసల్లం వారి వద్దకు వచ్చిన తర్వాత, “మీరు మీ సోదరుని చంపేశారు. ధర్మజ్ఞానం లేనప్పుడు ఎందుకు మీరు ప్రశ్నించలేదు? ఎందుకు అడగలేదు? అతను అలాంటి సందర్భంలో కేవలం తయమ్ముమ్ చేస్తే సరిపోయేది కదా” అని ప్రవక్త సల్లల్లాహు వసల్లం గారు బోధ చేశారు.

అయితే చలి వల్ల గాని, లేక మన శరీరంలో వుదూ చేసే అవయవాలకు ఏదైనా గాయమై ఉంది, అందువల్ల కూడా మనకు నీళ్లు వాడడం, ఉపయోగించడం నష్టకరంగా, హానికరంగా, ప్రాణం పోయేటువంటి భయం, లేక రోగం ఏదైతే ఉందో అది ఇంకా ఎక్కువ పెరిగే భయం, ఖురాన్లో అల్లాహ్ ఏం చెప్పాడు? “వ ఇన్ కున్తుమ్ మర్దా.” మీరు ఒకవేళ అనారోగ్యానికి గురియై మీకు నీళ్లు దొరకకుంటే తయమ్ముమ్ చేయవచ్చును. చూడండి, గమనించండి, ఇన్ని సౌకర్యాలు అల్లాహ్ ఇచ్చిన తర్వాత అరే జాన్దేలేరే క్యా ముస్లిం థండీ అయినా క్యా నమాజ్ పడతా? సామాన్యంగా అనుకుంటూ ఉంటాం కదా మనం. ఏంటి ఈ ముతవల్లాలు, ఈ మౌల్వీ సాబులు వీళ్లకు ఏం పని పాటలు ఉండయి, కేవలం అల్లాహ్ అల్లాహ్ అంటూ నమాజులు చేసుకుంటూ ఉంటారు, మన లెక్కలో ఎక్కడ పని చేస్తారు? కానీ అదే ఈ తిండి కొరకు, కూడు కొరకు, పని గురించి ఇంతటి చల్లని వాతావరణంలో కూడా ఎవరైనా డ్యూటీ వదులుకుంటాడా? చల్లగా ఉంది ఈ రోజు డ్యూటీకి వెళ్లకూడదు అని. ఏమీ దొరకకుంటే కప్పుకునే బ్లాంకెట్ అయినా వేసుకొని డ్యూటీకి వెళ్తాడు కానీ నమాజ్ విషయం వచ్చేది ఉంటే, అల్లాహ్ యొక్క దయ అని నమాజు ఎగ్గొడతాడు. ఇంకా సౌదియాలో ఇంటి నుండి మనం మస్జిద్ కి వెళ్ళడానికి కిలోమీటర్లు నడిచిపోయే అవసరమే పడదు. అవునా కాదా? వెనకా, ముంగట, కుడి పక్కన, ఎడమ పక్కన, ఎటు చూసినా అల్లాహ్ యొక్క దయ వల్ల మస్జిద్లే మస్జిద్లు. చాలా దగ్గరలో. అయినా గానీ మనం చలి కాలంలో ఇలాంటి సాకులు చెప్పి నమాజులను వదిలేస్తే, మనం ఇంకెవరికో కాదు నష్టంలో పడేసేది. మనకు మనం నరకానికి దారి సులభం చేసుకుంటున్నాము. అందు గురించి సోదరులారా, అల్లాహ్ మనందరికీ భయపడే మరియు ఇలాంటి సౌకర్యాలు ఏదైతే అల్లాహ్ ఇచ్చాడో వాటిని ఉపయోగించుకొని అల్లాహ్ యొక్క ఆరాధన సరైన పద్ధతిలో చేసే భాగ్యం కలిగించు గాక.

అయితే ఒక విషయం ఇక్కడ గుర్తించాలి, అదేమిటి? ఎప్పుడైతే నీళ్లు దొరుకుతాయో అప్పుడు తయమ్ముమ్ చేయడం అనేది మానేసేయాలి. నీళ్లు వచ్చిన వెంటనే. చివరికి కొందరు ఆలిములు ఏమంటున్నారో తెలుసా? నీళ్ల గురించి అన్ని రకాల ప్రయత్నం నువ్వు చేశావు, నీళ్లు దొరకలేదు, తయమ్ముమ్ చేసుకుని నమాజ్ మొదలు పెట్టావు, నీళ్లు వచ్చాయి. నమాజ్ ను తెంపేసేయ్, వుదూ చేసుకొని నమాజ్ చెయ్. అర్థమైందా?

మరో విషయం ఇక్కడ, తయమ్ముమ్ ద్వారా కూడా ఒక్కటి కంటే ఎక్కువ నమాజులు కూడా చేయవచ్చు. ఉదాహరణకు మీరు అసర్ లో తయమ్ముమ్ చేశారు. ఆ వుదూను, అంటే తయమ్ముమ్ తో ఏదైతే మీకు వుదూ అయిందో దాన్ని మీరు కాపాడుకున్నారు. మూత్రానికి వెళ్ళలేదు, ఇంకా వుదూ భంగమయ్యే ఏవైతే కారణాలు మనం ఇంతకు ముందు విన్నామో అలాంటివి ఏవీ సంభవించలేదు. అయితే మగ్రిబ్, ఇషా అన్నీ చేసుకుంటూ వచ్చినా గానీ కానీ నీళ్లు వచ్చేస్తే అరె నేను అప్పుడు తయమ్ముమ్ చేసుకున్నాను కదా, ఇప్పుడు మగ్రిబ్ నమాజ్ కంటే ముందు నీళ్లు వచ్చేసాయి, అసర్ టైంలో నీళ్లు లేవు. మగ్రిబ్ వరకు నీళ్లు వచ్చేసినాయి. నా అప్పటి వుదూ ఉంది కదా, దానితోనే నేను మగ్రిబ్ చేసుకుంటాను. తప్పు విషయం. నీళ్లు వచ్చేసాయి ఇప్పుడు తయమ్ముమ్ నీది చెల్లదు, తయమ్ముమ్ నీది నడవదు, అది expire అయిపోయినట్లు. అర్థమవుతుంది కదా. మళ్లీ కొత్తగా వుదూ చేసుకొని మీరు మగ్రిబ్ నమాజ్ అనేది చేయాలి. అంటే నీళ్లు వచ్చిన వెంటనే తయమ్ముమ్ సమాప్తం అయిపోతుంది. దాని యొక్క ఆదేశం అనేది ఇక ఉండదు. ఎందుకు? అల్లాహ్ ఏమంటున్నాడు?

فَلَمْ تَجِدُوا مَاءً فَتَيَمَّمُوا
ఫలమ్ తజిదూ మాఅన్ ఫతయమ్మమూ
నీళ్లు పొందని సందర్భంలో మీరు తయమ్ముమ్ చేయండి.

నీళ్లు వచ్చిన తర్వాత? ఇక ఉండదు.

ఇంకో విషయం. స్నానం చేసే విషయంలో, అంటే స్నానం విధి అయింది, నీళ్లు లేవు. నమాజ్ టైం అయింది. ఏం చేసినాం మనం? తయమ్ముమ్ చేసుకొని నమాజ్ చేశాం. ఓకే? తర్వాత నీళ్లు వచ్చాయి. స్నానం చేయాలా చేయవద్దా? చేయాలి. ప్రశ్న అర్థమైందా? ఉదాహరణకు ఫజర్ నమాజే అనుకోండి. రాత్రి నైట్ ఫెయిల్ అయింది. నీళ్లు దొరకలేదు. లేక ఫజర్ నమాజ్ టైం గనక ఎక్ దమ్ మైనస్ డిగ్రీ వాతావరణం ఉండి, నీళ్లు వాడితే మనకు జ్వరం వచ్చేస్తుంది, నీళ్లు వాడేది ఉంటే మనకు ఇంకా ఏదైనా అనారోగ్యానికి గురి అయ్యే సూచనలు ఉన్నాయి. నీళ్లు వాడలేదు, తయమ్ముమ్ చేసుకున్నాము. పొద్దెక్కేసరికి మనకు ఆరోగ్యం బాగైపోయింది, ఇప్పుడు నీళ్లు వాడడంలో నష్టం లేదు. అప్పుడు స్నానం చేయాలా, చేయవద్దా? చేయాలి.

చాలా పెద్దగా ఉంది హదీస్ అని నేను ఇంతకు ముందు ఒక ఇమ్రాన్ బిన్ హుసైన్ రదియల్లాహు అన్హు గారి హదీస్ ఏదైతే చెప్పానో, అందులో ఆ వ్యక్తి నువ్వు ఎందుకు మాతో నమాజ్ చేయలేదు అని ప్రవక్త గారు అడిగారు కదా, అతను ఏమన్నాడు? నా దగ్గర నీళ్లు లేవు, నేను జునుబీ అయిపోయాను, అశుద్ధావస్థకు గురయ్యాను. ప్రవక్త చెప్పారు, నీకు తయమ్ముమ్ సరిపోయేది. ఆ తర్వాత కొంతసేపటికి, అయితే ప్రవక్త సల్లల్లాహు వసల్లం గారు అప్పటికే పంపి ఉన్నారు కొందరిని నీళ్ల గురించి. పోండి మీరు నీళ్ల గురించి వెతకండి అని. ఆ హదీస్ అంతా పొడుగ్గా ఉన్నది అంటే అందులో ప్రవక్త సల్లల్లాహు వసల్లం గారి గొప్ప మహిమ కూడా ఉన్నది. మరి ఎప్పుడైనా గుర్తు చేయండి చెప్తాను దాని గురించి. కానీ సంక్షిప్తం ఏంటంటే నీళ్లు దొరుకుతాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అందులో తమ చేతులు పెడతారు, అల్లాహ్ బరకత్ ప్రసాదిస్తాడు, అందరూ తమ తమ దగ్గర ఉన్న పాత్రలన్నీ నింపుకుంటూ ఉంటారు. ప్రవక్త సల్లల్లాహు వసల్లం గారు చూడండి, ఏ విషయం ఎంత ముఖ్యమైనది, అవసరమైనది ఉంటుందో దాని విషయంలో అశ్రద్ధ వహించరు. ప్రవక్త సల్లల్లాహు వసల్లం గారు ప్రయాణంలో ఉన్నారు, ఎందరో సహచరులు ఉన్నారు, ఎందరియో ఎన్నో సమస్యలు ఉంటాయి. ఆ నీళ్లు వచ్చిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు వసల్లం గారు ఆ వ్యక్తిని గుర్తు చేసి, అతన్ని పిలవండి, హా నీళ్లు తీసుకెళ్ళు, తీసుకెళ్లి నువ్వు స్నానం చెయ్యి అని ఆదేశించారు.

సహీహ్ బుఖారీలో ఆ హదీస్ ఉంది, 344 హదీస్ నెంబర్. అయితే విషయం ఏం తెలిసింది మనకు? స్నానం విధిగా ఉన్నప్పుడు నీళ్లు లేవు లేక ఉండి దానిని వాడడం మనకు నష్టకరంగా ఉంటే నమాజ్ చేసుకున్నాము తయమ్ముమ్ తోని. కానీ తర్వాత ఆ నష్టం తొలిగిపోయింది లేదా నీళ్లు మనకు దొరికినాయి, అలాంటప్పుడు ఏం చేయాలి? స్నానం అనేది చేయాలి.

కొంచెం ఈ విషయాలు ఎక్కువ శాతం చలి కాలంలో, ఇంకా వేరే ప్రయాణంలో ఉన్న సందర్భంలో, వేరే సందర్భాల్లో కూడా మనకు అవసరం పడతాయి గనక కొంచెం వివరంగా చెప్పడం జరిగింది. అయితే, మేజోళ్లపై మసాహ్ విషయం అనేది అల్లాహ్ యొక్క దయతో మనం వచ్చే నెక్స్ట్ పాఠంలో తెలుసుకుందాము. దీని గురించి కొన్ని కొన్ని సందర్భాల్లో ఇంకా కొన్ని ప్రశ్నలు కూడా తలెత్తుతాయి. అయితే తప్పకుండా ఉలమాలతో, ధర్మవేత్తలతో మనం మంచి సంబంధాలు ఉంచుకొని అలాంటి ప్రశ్నలను మనం వారితో తెలుసుకోవాలి. షరీయత్ యొక్క సమాధానం, ధర్మపరమైన సమాధానం ఏముంటుందో తెలుసుకొని దాని ప్రకారంగా అల్లాహ్ యొక్క ఆరాధన చేసే ప్రయత్నం చేయండి. జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్.


ఇతరములు: