జీవనోపాధి గురించి ఖుర్ఆన్, హదీసుల వెలుగులో |  ఖుత్ బాతే నబవీ ﷺ

జీవనోపాధి గురించి ఖుర్ఆన్, హదీసుల వెలుగులో [6p] [PDF]

وَمِنْهُمْ مَنْ يَقُولُ رَبَّنَا آتِنَا فِي الدُّنْيَا حَسَنَةً وَفِي الْآخِرَةِ حَسَنَةً وَقِنَا عَذَابَ النَّارِ 

ప్రజల్లోనే మరికొందరు, “ప్రభూ! మాకు ప్రపంచంలోనూ మేలును ప్రసాదించు, పరలోకంలో కూడా మేలును ప్రసాదించు. ఇంకా మమ్మల్ని నరకాగ్ని శిక్ష నుండి కాపాడు” అని ప్రార్థించేవారు కూడా ఉన్నారు. (అల్ బఖర 2: 201) 

ప్రియసోదరులారా! 

నేటి జుమా ప్రసంగంలో ‘జీవనోపాధి’ గురించి ఖుర్ఆన్, హదీసుల వెలుగులో తెలుసుకుందాం. అల్లాహ్ సూరా మూమినూన్, 51వ ఆయతులో ప్రవక్తలందరినీ సంబోధిస్తూ ఇలా సెలవిస్తున్నాడు: 

يَا أَيُّهَا الرُّسُلُ كُلُوا مِنَ الطَّيِّبَاتِ وَاعْمَلُوا صَالِحًا ۖ إِنِّي بِمَا تَعْمَلُونَ عَلِيمٌ
ఓ ప్రవక్తలారా! పరిశుద్ధ వస్తువులు తినండి, సదాచరణ చేయండి. మీరు చేసేదంతా నాకు తెలుసు.” (అల్ మూమినూన్ 23 : 51) 

ప్రవక్తలకు గల గౌరవస్థానం సర్వ సృష్టిలో మరెవ్వరికీ లేదు. వారి స్థానం ఎంత గొప్పదో వారికి ఇవ్వబడిన పై ఆజ్ఞ కూడా అంతే గొప్పది! బ్రతుకు తెరువుకోసం పై ప్రపంచంలో జీవనం గడపటంకోసం ధర్మ సమ్మతమైన, పరిశుద్ధమైన వస్తువులను సంపాదించాలని పై ఆయతులో ప్రవక్తలందరికీ ఆదేశించబడింది. 

ఇక ఖుత్బాయే మస్నూన తరువాత నేను పఠించిన మరొక ఆయతులో ఇహపరాల మంచికై వేడుకోలు ఉంది. 

విశ్వాసి సాఫల్యమార్గాన్ని ఎన్నుకుని తన ఇహలోక జీవితాన్ని ఎంత చక్కగా, అందంగా తీర్చిదిద్దుకుంటాడో దాని మీదనే అతని పరలోక జీవితం, సాఫల్యం ఆధారపడి ఉంటుంది. ప్రాపంచిక జీవిత సంస్కరణలో మొట్టమొదటగా ప్రాముఖ్యత ఇవ్వదగిన విషయం-మనిషి సంపాదన. మనిషి సంపాదన ధర్మసమ్మతమైనదైతే, పరిశుద్ధమైనదైతే అతని జీవితంలోని ఇతర విషయాలు కూడా శుభప్రదమవుతాయి. 

మనిషి ప్రాపంచిక జీవితానికి ధర్మ సమ్మతమైన (హలాల్) సంపాదన ఎంతో అవసరం. ఖుర్ఆన్, హదీసులలో ఏ విధంగా నమాజ్, రోజా, జకాత్, హజ్ గురించి పదేపదే తాకీదు చేయబడిందో అదే విధంగా హలాల్ సంపాదన గురించి కూడా నొక్కి చెప్పటం జరిగింది. దానికి గల మార్గాలు ఎంతో చక్కగా విశ్లేషించబడ్డాయి. హలాల్ సంపాదనకుగల ప్రాముఖ్యతను, విశిష్ఠతను దాని లాభాలను, ప్రయోజనాలను స్పష్టపరచటం జరిగింది. 

తన మార్గంలో హలాల్ సంపాదనకై కృషి చేయమని ప్రత్యేక ఆజ్ఞ ఇస్తూ అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:

فَإِذَا قُضِيَتِ الصَّلَاةُ فَانتَشِرُوا فِي الْأَرْضِ وَابْتَغُوا مِن فَضْلِ اللَّهِ وَاذْكُرُوا اللَّهَ كَثِيرًا لَّعَلَّكُمْ تُفْلِحُونَ
నమాజు ముగిసిన తరువాత భూమిలో విస్తరించి, దైవానుగ్రహాన్ని అన్వేషిం చండి. ఎక్కువగా అల్లాహ్ను స్మరిస్తూ ఉండండి. తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు“. (అల్ జుమఅ 62:10) 

వ్యాపారం కోసం, సంపాదన కోసం దైవ అనుగ్రహాలను అన్వేషించాలని, ఆరాధన తరువాత మళ్ళీ తమ విధి నిర్వహణలో నిమగ్నమైపోవాలని, వ్యవసాయం చేసేవారు, ఇతర వృత్తి పనులు చేసుకునేవారు తమ తమ కార్యకలాపాల్లో చేరి పోవాలనేది ఈ ఆయత్ భావం. 

‘హలాల్ సంపాదన’ కూడా మనిషి విధే. అది లేనిదే అతని జీవన రథం ధర్మపథంలో ముందుకు సాగదు మరి! దానిని సాధించటానికి శక్తికొలదీ శ్రమించాలి. ఇలా చేసే శ్రమకు ప్రతిఫలం, పుణ్యం లభిస్తుంది. 

ఇస్లాంలో మొదటి జుమా ఖుత్బా | ప్రవక్త ﷺ ఇచ్చిన చారిత్రాత్మక ప్రఖ్యాత ప్రసంగం

చివరకు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు హిజ్రత్ అనుమతి లభించింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నబవీ శకం 13వ యేట (27 సఫర్), క్రీ.శ 621 సెప్టంబర్ 12వ తేదీన మక్కా వదిలి మదీనాకు పయనమయ్యారు. మూడు పగళ్లు రాత్రుళ్ళు మక్కాకు సమీపంలోని సౌర్ గుహలో గడిపారు. ఆ తరువాత సుదీర్ఘ ప్రయాణం చేస్తూ చివరకు నబవీ శకం 13వ యేట రబీవుల్ అవ్వల్ 8వ తేదీ సోమవారం (అంటే క్రీ.శ 622 సెప్టెంబర్ 23వ తేదీ) మదీనా సమీపంలో గల కుబా ప్రాంతానికి చేరారు. అక్కడే బస చేసి తిరిగి 12 రబీవుల్ అవ్వల్ ఒకటవ హిజ్ర శకం శుక్రవారం అక్కడ నుంచి పయనమయ్యారు. బనీసాలిమ్ వాడకు చేరేవరకు జుమా సమయం అయ్యింది. అక్కడే దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వంద మంది అనుచరులతో జుమా ప్రార్థన చేశారు. అదే ఇస్లాంలో మొదటి జుమా. 

ప్రియ సోదరులారా..! 

జుమా సుభదినాన దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇచ్చిన ఆ ప్రసంగం చారిత్రాత్మకంగా చాలా గొప్పస్థానాన్ని కలిగి ఉంది. ఆనాటి ఆ ఖుత్బాను ఈనాటి జుమా ప్రసంగంలో వినిపించాలనుకుంటున్నాను. ఈ చారిత్రక ప్రఖ్యాత ప్రసంగాన్ని చాలా శ్రద్ధగా వినండి అల్లాహ్ ఈ ఖుత్బాను శుభకరంగా చేయుగాక… ఆమీన్. 

(రహ్మతుల్లిల్ ఆలమీన్ 1:92-93) 

ఇస్లామీయ సోదరులారా..! 

ఎంతటి మహత్తర ప్రసంగం! ఎంతటి మహాభాగ్యం!! ఆనాడు ఆరంభమైన ఈ వారంవారం పండుగ ప్రళయం వరకు జారి చేయబడింది. ఇస్లామీయ చరిత్రలోని తొలి ఖుత్బాలో పాల్గొన్న ఆ సహాబాలు ఎంతటి ధన్యజీవులో ఇప్పటికి కూడా బనూ సాలీం వీధి ఖుబాలో ఉంది. అక్కడే ఒక మహాన్నతమైన మస్జిద్ నిర్మించడం జరిగింది గత చరిత్ర వైభవానికి నిదర్శనంగా. 

అల్లాహ్ మనందరికి పవిత్ర మక్కా యాత్ర చేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక. 

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి ప్రసంగాన్ని కంఠస్తంచేసి, వాటిపై ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించు గాక!. ఆమీన్. 

ఈ పోస్ట్ హిజ్రత్ తరువాత తొలి చారిత్రక ప్రసంగం [PDF] [6p] అనే ఖుత్బా నుండి తీసుకోబడినది.
పుస్తకం: ఖుత్ బాతే నబవీ ﷺ (పార్ట్ 1) – మర్కజ్ దారుల్ బిర్ర్ పబ్లికేషన్స్

మదీనా ప్రస్థానం (హిజ్రత్) | జాదుల్ ఖతీబ్

[డౌన్ లోడ్ PDF]

ఖుత్బా యందలి ముఖ్యాంశాలు 

1) హిజ్రత్ అర్థం 
2) హిజ్రత్ విశిష్టత
3) దివ్య ఖుర్ఆన్ మరియు హదీసు వెలుగులో హిజ్రత్ ఆదేశం ప్రళయం వరకు ఉంది
4) మదీనాకు హిజ్రత్ : కారణాలు, వృత్తాంతాలు. 

మొదటి ఖుత్బా 

ధార్మిక సహోదరులారా! 

హిజ్రీ శకపు నూతన సంవత్సరపు ఆరంభాన్ని పురస్కరించుకొని, నేటి ప్రసంగంలో, ఎంతో ప్రాచుర్యం పొందిన “మదీనా ప్రస్థానం (హిజ్రత్)” వృత్తాంతాన్ని సమగ్రంగా వివరించడం సబబుగా అనిపిస్తోంది. ఎందుకంటే – ఈ సంఘటన ద్వారానే ఇస్లామీ శకం ఆరంభమైనది. కానీ, దీని వివరాల్లోకి వెళ్ళే ముందు అసలు హిజ్రత్ అంటే ఏమిటి? దివ్య ఖుర్ఆన్ మరియు హదీసులలో దీని గూర్చి వివరించబడ్డ విశిష్ఠతలు ఏమిటి? వీటిని గూర్చి తెలుసు కుందాం రండి. 

హిజ్రత్ అంటే – ‘అల్ హిజ్రహ్’ హిజర్ నుండి వచ్చింది. దీని అర్థం  ‘వదలిపెట్టడం‘ అని. 

అరబ్బులు ఇలా అనేవారు: “ఫలానా జాతి ఒక ప్రదేశాన్ని వదిలి మరో ప్రదేశానికి వెళ్ళిపోయింది.” ముహాజిర్ సహబాలు కూడా మక్కా పట్టణాన్ని వదిలి మదీనాకు ప్రస్థానం గావించారు. 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

وَاهْجُرُوهُنَّ فِي الْمَضَاجِعِ
మరియు పడక గదులలో వారిని వదిలిపెట్టండి” (నిసా : 34) 

‘అల్ హిజ్రత్’ ను మెజారిటీ ఉలమాలు ధార్మికంగా ఇలా నిర్వచించారు: 
“అవిశ్వాస భూభాగం (దారుల్ కుఫ్ర్) నుండి ఇస్లామీయ భూభాగం (దారుల్ ఇస్లామ్) వైపు మరలిరావడం”. 

అయితే, హాఫిజ్ ఇబ్నె హజర్ (రహిమహుల్లాహ్) దీని గురించి ఇలా వివరించారు: 
“షరీయత్తు పరంగా ‘హిజ్రత్’ అంటే – అల్లాహ్ వారించిన ప్రతి కార్యాన్నీ విడిచిపెట్టడం.” 

బహుశా, హాఫిజ్ ఇబ్నె హజర్ (రహిమహుల్లాహ్) ఈ నిర్వచనాన్ని, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి ఈ హదీసు నుండి గ్రహించి వుండవచ్చు. 

అల్లాహ్ వారించిన కార్యాలను విడిచిపెట్టేవాడు ముహాజిర్” (బుఖారీ: 1/35, అల్ ఫతహ్) 

ఈ హదీసు ద్వారా తెలిసిందేమిటంటే- ‘హిజ్రత్’ అన్న పదం – బాహ్యము మరియు అంతరంగం – ఈ రెండు రకాల హిజ్రత్ లకు కూడా వర్తిస్తుంది. 

అంతరంగ హిజ్రత్ లక్ష్యమేమిటంటే – మనిషి షైతాను మరియు స్వయంగా అతని మనస్సు ఎంతో ఆకర్షకంగా మలచి అతని ముందు ప్రవేశపెట్టే కార్యాలను త్యజించడం. ఇక, బాహ్య హిజ్రత్ లక్ష్యమేమిటంటే – మనిషి తన ధర్మాన్ని అవిశ్వాసం మరియు ఉపద్రవాల బారి నుండి కాపాడుకొనే నిమిత్తం ఇస్లామీయ బోధనలపై శాంతియుతంగా ఆచరించుకోగలిగే ప్రదేశానికి మరలి వెళ్ళడం.” (ఫత్హుల్ బారి  : 1/54) 

ఇమామ్ అలాజ్ బిన్ అబ్దుస్సలామ్ (రహిమహుల్లాహ్) ఇలా సెలవిచ్చారు: 

హిజ్రత్ రెండు రకాలు. స్వదేశాన్ని విడిచిపెట్టడం మరియు పాపాలను, దౌర్జన్యాన్ని త్యజించడం. వీటిలో, రెండవ హిజ్రత్ ఉత్తమమైనది. ఎందుకంటే – దీని ద్వారా ఆ కరుణామయుడు (అల్లాహ్) సంతృప్తి చెందడమేకాక, మనస్సు మరియు షైతానుల దుష్ప్రరణ కూడా తగ్గుతుంది.”

హిజ్రత్ విశిష్టతలు 

మొహర్రం మాసం మరియు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సహచరులు | జాదుల్ ఖతీబ్

మొహర్రం మాసంలో ప్రత్యేకించి జరిగే దౌర్జన్యాలలో ఒకటి ఏమిటంటే – దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వ సల్లం) శిష్యులైన సహాబాల గురించి చెడుగా పలకడం మరియు వారిని తిట్టి పోయడం. వాస్తవానికి ప్రవక్త సహచరులను గూర్చి చెడు పలకడం, వారిని దుర్భాషలాడడం అనేవి పూర్తిగా నిషేధించ బడ్డాయి. 

ప్రవక్త సహచరులను గూర్చి ‘అహ్లె సున్నత్ వల్ జమాత్’ యొక్క విశ్వాసాన్ని గూర్చి వివరిస్తూ ఇమామ్ తహావి (రహిమహుల్లాహ్) ఇలా సెలవిచ్చారు: 

మేము దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సహచరులను ప్రేమిస్తాము మరియు వారిని ప్రేమించడంలో ఏ ఒక్కరి విషయంలో కూడా అతిశయోక్తిని ప్రదర్శించము. అంతేగాక, ఏ ఒక్కరితో విముక్తిని కూడా ప్రకటించుకోము. సహాబాలను ద్వేషించే ప్రతి వ్యక్తినీ, వారిని చెడుగా చిత్రీకరించే ప్రతి ఒక్కరినీ మేము కూడా ద్వేషిస్తాము. మేమైతే సహాబాలను మంచి తలంపుతో స్మరించు కుంటాము. వారిని ప్రేమిచండం ధర్మం, విశ్వాసం మరియు ఎహసాన్లలో ఓ ముఖ్యభాగం అనీ మరియు వారిని ద్వేషించడం, తిరస్కారానికి (కుఫ్ర్), కాపట్యానికి (నిఫాక్) మరియు అవిధేయతలకు చిహ్నమని భావిస్తాము”. (షరహ్ అఖీదా తహావియ : 467 పేజీ) 

దివ్య ఖుర్ఆన్లో అల్లాహ్ సహాబాల మహత్యాన్ని గూర్చి వివరించిన తర్వాత – తిరస్కారులకు (అవిశ్వాసులకు) సహాబాల పట్ల అసహ్యం కలుగుతుంది మరియు ఎల్లప్పుడూ వారి గురించి (మనస్సుల్లో) ద్వేషాగ్ని రగులుకొని వుంటుంది అని సెలవిచ్చాడు. 

అంటే సహాబాలను అసహ్యించుకోవటం, వారి పట్ల ద్వేషభావం కలిగి వుండడం తిరస్కారుల ప్రవృత్తి అన్న మాట. ముస్లిములది కాదు. 

దివ్య ఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

“ముహమ్మద్ అల్లాహ్ ప్రవక్త. ఆయన వెంట వున్నవారు అవిశ్వాసుల పట్ల కఠినులుగానూ, పరస్పరం కరుణామయులుగానూ వుంటారు. దైవకృపను, దైవప్రసన్నతను చూరగొనే ప్రయత్నంలో వారు (దైవ సన్నిధిలో) వినమ్రులై వంగటాన్ని, సాష్టాంగపడటాన్నీ నీవు చూస్తావు. వారి సాష్టాంగ ప్రణామాల ప్రత్యేక ప్రభావం వారి ముఖార విందాలపై తొణికిసలాడుతూ ఉంటుంది. వీరికి సంబంధించిన ఈ ఉపమానమే తౌరాతులో వుంది. ఇంజీలులో (కూడా వీరి ఉపమానం వుంది. అది ఒక పంట పొలం వంటిది. అది తన మొలకను మొలకెత్తించింది. తరువాత దానిని బలపరిచింది. ఆ తర్వాత అది లావు అయ్యింది. ఆ పైన అది తన కాండంపై నిటారుగా నిలబడింది. రైతులను అలరించ సాగింది. వారి ద్వారా అవిశ్వాసులను మరింత ఉడికించాలని. వారిలో విశ్వసించి సత్కార్యాలు చేసిన వారికి మన్నింపును, గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తానని అల్లాహ్ వాగ్దానం చేసివున్నాడు.” (ఫతహ్ : 29) 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కూడా తన సహచరుల గురించి దుర్భాషలాడడం నుండి గట్టిగా వారించారు. ఆయన ఇలా ఉద్బోధించారు: 

నా సహచరులను దుర్భాషలాడకండి. నా ప్రాణం ఎవరి చేతుల్లో వుందో ఆ శక్తివంతుని సాక్షి! మీలో ఎవరైనా ఉహద్ పర్వతమంత బంగారం దానం చేసినా సరే అది వీరి (సహచరులు) ఒక ముద్ లేదా అర ముద్ కు కూడా సమానం కాలేదు”. (ముద్ అంటే ఒక రకమైన కొలత) 

(సహీ బుఖారీ: ఫజాయెల్ అసబున్నబీ : 3673, సహీ ముస్లిం : ఫజాయెల్ సహాబా : 254) 

అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు ) ఇలా అంటూ వుండేవారు : 

ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) సహచరులను గూర్చి చెడుగా అనకండి. ఎందుకంటే – దైవప్రవక్తతో వారు నిలబడ్డ ఒక్క క్షణం అయినా మీ పూర్తి జీవితపు ఆచరణలకన్నా ఉత్తమమైనది

(ఇబ్నెమాజా : ఫజాయెల్ అసహాబున్నబీ : 162, సహీ ఇబ్నెమాజా లిల్ అల్బానీ : 1/132-133) 

అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఇలా అంటూ వుండేవారు: 

“మీరు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) సహచరులను దుర్భాష లాడకండి. ఎందుకంటే దైవప్రవక్త సహచరులలో ఎవరైనా ఒక్క క్షణం ఆయనతో నిలబడితే ఆ ఒక్క క్షణం కూడా మీ 40 సంవత్సరాల ఆచరణల కన్నా ఉత్తమమైనది.”

(ఇబ్నెబత్తా, సహీ అల్బానీ ఫీ తఖీజ్ షరహ్ అఖీదా తహావియా -469 పేజీ) 

అల్లాహ్ మనందరినీ దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సహచరులను ప్రేమించే మరియు వారిని గౌరవించే సద్బుద్ధిని ప్రసాదించుగాక! 

ఈ పోస్ట్ మొహర్రం నెల మరియు ఆషూరా దినం | జాదుల్ ఖతీబ్ అనే ఖుత్బా నుండి తీసుకోబడింది
జాదుల్ ఖతీబ్ (ఖుత్బాల సంగ్రహం) – మొదటి సంపుటం – ముహమ్మద్ ఇస్ హాఖ్ జాహిద్

3 కఫ్ఫారాత్, 3 దరజాత్, 3 ముంజియాత్, 3 ముహ్ లికాత్

3 కఫ్ఫారాత్, 3 దరజాత్, 3 ముంజియాత్, 3 ముహ్ లికాత్
https://youtu.be/Wa4vEgWCsDE [ 2 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు:

మూడు (కఫ్ఫారాత్) పరిహారాలున్నాయి,
మూడు (దరజాత్) స్థానాలను పెంచేవి ఉన్నాయి
మూడు (ముంజియాత్) మోక్ష సాధనాలున్నాయి
మూడు (ముహ్ లికాత్) వినాశనానికి గురి చేసేటివి ఉన్నాయి

కఫ్ఫారాత్:
1- విపరీత చలిలో సంపూర్ణ వుజూ చేయుట
2- ఒక నమాజు తర్వాత మరో నమాజు కొరకు వేచించుట
3- జమాఅతుతో (సాముహిక) నమాజు చేయుట కొరకు కాలి నడకతో వెళ్ళుట
.

దరజాత్:
1- అన్నం తినిపించుటు,
2- సలాం వ్యాపింపజేయుట
3- రాత్రి ప్రజలు పడుకున్నప్పుడు లేచి తహజ్జుద్ నమాజు చేయుట
.

ముంజియాత్:
1- కోపం, సంతోషం అన్ని స్థితుల్లో న్యాయం పాటించుట
2- పేదరికం, సిరివంతం అన్ని స్థితుల్లో మధ్యేమార్గాన్ని అవలంభించుట
3- ఏకాంతంలో ఉన్నా, నలుగురి మధ్యలో ఉన్నా అల్లాహ్ తో భయపడుతూ ఉండుట.

ముహ్ లికాత్:
1- దురాశ, పిసినారితనానికి బానిస అయిపోవడం
2- మనోవాంఛల (అంధా)నుకరణ
3- అహంభావం, మిడిసిపడడం

[ముస్నద్ బజ్జార్, సహీ తర్గీబ్ 453]

తౌహీద్ & షిర్క్ (మెయిన్ పేజీ):
https://teluguislam.net/tawheed-shirk/

మొహర్రం నెల మరియు శోక గీతాలాపన | జాదుల్ ఖతీబ్

మీకు తెలిసే వుంటుంది చాలా మంది మొహర్రం నెలలో, దుఃఖ సూచిత దుస్తులు ధరించి శోక గీతాలాపన చేస్తూ, ఏడ్పులు, పెడబొబ్బలు పెడుతూ ఛాతీని బాదుకోవడం చేస్తూ వుంటారు. మా దృష్టిలో ఇది కూడా నిషేధించబడ్డ దౌర్జన్యపు ఒక రూపమే. ఈ కార్యాలనుద్దేశించి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధంగా సెలవిచ్చారు: 

అజ్ఞానకాలం నాటి నాలుగు ఆచరణలను ఈ అనుచర సమాజం విడనాడడానికి సిద్ధంగా ఉండదు. తమ వంశంపై గర్వపడడం, ఇతరుల వంశాన్ని తక్కువగా భావించడం, నక్షత్రాల ద్వారా అదృష్టాన్ని తెలుసుకోవడం (లేదా వాటి ద్వారా వర్షాన్ని అర్థించడం) మరియు శోకగీతాలాపనలు చేయడం.” (సహీ ముస్లిం – అల్ జనాయెజ్ : 936) 

ఇంకా ఈ విధంగా కూడా ఉద్భోదించారు: 

శోక గీతాలాపన చేసే స్త్రీ తన మరణానికి ముందు గనక తౌబా (పశ్చాతాపం) చెందకపోతే, ప్రళయం రోజు తన శరీరంపై గజ్జి, దురద వ్యాపించి వుండగా, గంధకపు వస్త్రాలు ధరించి వున్న స్థితిలో లేపబడుతుంది.” 

ఈ హదీసు ద్వారా తెలిసిందేమిటంటే – శోక గీతాలాపనలు వగైరా… చేయడం అనేవి అజ్ఞానపు చేష్టలు మరియు ఇస్లాంతో వీటికేమాత్రం సంబంధం లేదు. అందుకే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) శోకగీతాలాపన … వగైరా… లాంటి పనులు చేసే వ్యక్తితో తనకే మాత్రం సంబంధం లేదని ప్రకటిస్తూ ఇలా పేర్కొన్నారు: 

తన చెంపలను బాదుకొనేవాడు, వస్త్రాలను చింపుకొనేవాడు, అజ్ఞాన కాలపు కార్యాలను గూర్చి ఘనంగా చర్చించేవాడు, కష్ట సమయాల్లో వినాశనాన్ని, మరణాన్ని కోరుకునేవాడు మాలోని వాడు కాడు.” (సహీ బుఖారీ – అల్ జనాయెజ్ : 1294) 

అబూ దర్ద బిన్ అబూ మూసా అష్రీ (రదియల్లాహు అన్హు) కథనం : అబూ మూసా అష్రీ ఓసారి తీవ్ర అనారోగ్యానికి గురై మూర్చపోయినట్లు అయిపోయారు. ఆయన తల ఆయన సతీమణుల్లో ఒకరి ఒడిలో వుంది. (ఈ స్థితిని చూసి) అమె పెద్దగా ఏడ్వడం ఆరంభించింది. కానీ ఆయన మాత్రం ఆమెకు జవాబు ఇవ్వలేకపోయారు. కాసేపటికి, కాస్త కుదుటపడ్డాక, ఆమె నిర్వాకం చూసి ఇలా సెలవిచ్చారు: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) విముక్తి ప్రకటించుకున్న ప్రతి వ్యక్తితో నేను కూడా విముక్తుణ్ణి. నిస్సందేహంగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఏడ్పులు, పెడబొబ్బలు పెట్టే, దుఃఖ, విచార ఘడియల్లో తల గొరికించుకునే మరియు వస్త్రాలు చింపుకొనే స్త్రీ నుండి విముక్తిని ప్రకటించుకున్నారు. (సహీ బుఖారీ – అల్ జనాయెజ్: 1296, ముస్లిం : 1167) 

ఈ హదీసుల ద్వారా రూఢీ అయిన విషయమేమిటంటే – ఏడ్పులు, పెడబొబ్బలు పెట్టడం, ఛాతీని బాదుకోవడం…. లాంటి పనులు పూర్తిగా నిషేధిం చబడ్డాయి. 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ పనులను, వీటిలో లిప్తమైవున్న వారిని గూర్చి తనను తాను పూర్తిగా విముక్తుడిగా, ఏ మాత్రం సంబంధం లేని వానిగా ప్రకటించుకున్నారు. కనుక ముస్లిములందరూ ఇలాంటి దుష్కార్యాలను గూర్చి జాగ్రత్తపడాలి. మరియు (ఒకవేళ లిప్తమై వుంటే) వెంటనే వీటిని మనః పూర్వకంగా త్యజించాలి. 

ప్రియ శ్రోతలారా! 

మొహర్రం మాసంలో శోక గీతాలాపన మరియు ఏడ్పులు, పెడబొబ్బలు పెట్టడం అనేవి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి మనవడు హుస్సేన్ (రదియల్లాహు అన్హు ) వీర మరణం దృష్ట్యా దుఃఖంలో చేస్తూ వుంటారు. 

ఆయన వీరమరణంపై దుఃఖించని, విచారపడని వ్యక్తి ఎవరున్నారు చెప్పండి? నిశ్చయంగా ప్రతి ముస్లింకు ఈ విషయంలో దుఃఖం కలుగుతుంది. కానీ, ప్రతి దుఃఖ, విచార ఘడియల్లో ఎలాగైతే సహనం పాటించాలో హుస్సేన్ (రదియల్లాహు అన్హు ) వీరమరణంపై కూడా అదే విధంగా సంయమనం పాటించాలి. అంతేగాని, శోక గీతాలాపన, ఛాతీని బాదుకోవడం, ఏడ్పులు పెడబొబ్బలు పెట్టడం వంటి అజ్ఞానపు చేష్టలు మాత్రం చేయకూడదు. 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

وَلَنَبْلُوَنَّكُم بِشَيْءٍ مِّنَ الْخَوْفِ وَالْجُوعِ وَنَقْصٍ مِّنَ الْأَمْوَالِ وَالْأَنفُسِ وَالثَّمَرَاتِ ۗ وَبَشِّرِ الصَّابِرِينَ الَّذِينَ إِذَا أَصَابَتْهُم مُّصِيبَةٌ قَالُوا إِنَّا لِلَّهِ وَإِنَّا إِلَيْهِ رَاجِعُونَ أُولَٰئِكَ عَلَيْهِمْ صَلَوَاتٌ مِّن رَّبِّهِمْ وَرَحْمَةٌ ۖ وَأُولَٰئِكَ هُمُ الْمُهْتَدُونَ

భయ ప్రమాదాలకు, ఆకలి బాధకు, ధన ప్రాణ ఆదాయాల నష్టానికి గురి చేసి మేము మిమ్మల్ని తప్పకుండా పరీక్షిస్తాము. ఈ పరిస్థితులలో మనఃస్థయిర్యంతో వుండేవారు, కష్టకాలం దాపురించినపుడు ‘మేమంతా అల్లాహ్ కే చెందిన వారము, అల్లాహ్ వైపునకే మరలిపోవలసినవారము’ అని అనేవారికి శుభవార్తలు తెలుపు. వారిపై వారి ప్రభువు దయాను గ్రహాలు, కారుణ్యం వున్నాయి. సన్మార్గాన్ని పొందిన వారు కూడా వీరే.” (బఖర 2 : 155-157) 

సహనం పాటించే వారికి అల్లాహ్ లెక్కలేనంతగా అనుగ్రహిస్తాడు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

إِنَّمَا يُوَفَّى الصَّابِرُونَ أَجْرَهُم بِغَيْرِ حِسَابٍ
సహనం వహించే వారికి లెక్కలేనంత పుణ్యఫలం ప్రసాదించ బడుతుంది.” (జుమర్ 39 : 10) 

హుస్సేన్ (రదియల్లాహు అన్హు ) ఒక విశిష్టమైన సహాబి (దైవ ప్రవక్త (స) సహచరుడు) అవడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఆయన మహత్యం గురించి చెప్పాలంటే -ఆయన దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి చిన్న మరియు ప్రియ కూతురైన ఫాతిమా (రదియల్లాహు  అన్హా) పుత్రులు అన్న ఒక్క విషయమే చాలు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు ఆయన మరియు హసన్ (రదియల్లాహు అన్హు ) అంటే వల్ల మాలిన ప్రేమాభిమానాలు వుండేవి. 

అతా బిన్ యసార్ (రహిమహుల్లాహ్) కథనం: ఒక సహాబీ (ప్రవక్త సహచరుడు) నాకు తెలియజేసిన విషయమేమిటంటే – “దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హసన్ మరియు హుస్సేన్ (రదియల్లాహు  అన్హుమ్)లను తన ఛాతీతో హత్తుకొని ఇలా అన్నారు: ఓ అల్లాహ్! వీరిద్దరినీ నేను ప్రేమిస్తు న్నాను. కనుక నీవు కూడా వీరిని ప్రేమించు”

(ముస్నద్ అహ్మద్ – 38వ సంపుటం 211 పేజీ, నెం. 23133 – సహీ పరంపరతో, తిర్మిజి – బరా బిన్ ఆజిబ్ ఉల్లేఖనం -3782, అస్సహీహ అలా ్బనీ : 2789) 

అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇంటి నుండి బయలుదేరి మా వద్దకు విచ్చేశారు. ఆయనతో పాటు హసన్, హుస్సేన్ (రదియల్లాహు  అన్హుమ్)లు కూడా వున్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఓసారి ఒకర్ని ముద్దాడితే మరోసారి ఇంకొకర్ని ముద్దాడేవారు. ఇదిచూసి ఓ వ్యక్తి ఇలా ప్రశ్నించాడు: ఓ దైవప్రవక్తా! మీరు వారిని ప్రేమిస్తారా? దీనిపై దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) స్పందిస్తూ- ఎవరైతే వీరిని ప్రేమిస్తారో వారు నన్ను ప్రేమించినట్లు. ఇక ఎవరైతే వీరి పట్ల ద్వేషం కలిగి ఉంటారో వారు నా పట్ల కూడా ద్వేషం కలిగి వున్నట్లే. 

(అహ్మద్: 15వ సంపుటం, 42వ పేజీ, నెం. 9673 మరియు 13వ సంపుటం, 26వ పేజీ, నెం.: 7876, ఇబ్నెమాజా సంక్షిప్తం : 143, హసన్ -అల్బానీ) 

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన ఇద్దరు మనువళ్ళను ఎంత గాఢంగా ప్రేమించే వారంటే – తన ప్రసంగాన్ని సయితం ఆపి వారిని లేపడానికి మింబర్ దిగి వచ్చి వారిని లేపి, తిరిగి మింబర్ వేదిక) పైకి వెళ్ళి తన ప్రసంగాన్ని పూర్తి చేసేవారు. 

బరీరా (రదియల్లాహు అన్హా)  కథనం: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఓసారి ప్రసంగిస్తున్నారు. ఈ తరుణంలో హసన్, హుస్సేన్ (రదియల్లాహు  అన్హుమ్)లు అక్కడికి విచ్చేశారు, వారు ఎరుపు రంగు చొక్కాలు ధరించి వున్నారు. వాటిలో వారు మాటిమాటికీ జారుతూ వున్నారు. ఇది గమనించిన దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మింబర్ నుండి క్రిందికి దిగి ప్రసంగం ఆపేశారు. వారిద్దరినీ లేపి తన ఒడిలో కూర్చోబెట్టు కున్నారు. తదుపరి వారిని తీసుకొని మింబర్ పై  ఎక్కారు. తిరిగి మాట్లాడుతూ – “అల్లాహ్ సత్యం పలికాడు. నిశ్చయంగా మీ సంపద మరియు మీ సంతానం మీకొక పరీక్ష. నేను వారి స్థితిని చూసి ఆగలేకపోయాను.” అని పలికి తదుపరి తన ప్రసంగాన్ని పూర్తిచేశారు. (అబూ దావూద్ : 1109, నసాయి : 1413, ఇబ్నెమాజా : 3600, సహీ · అల్బానీ) 

అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) తో – ఇహ్రాం స్థితిలో ఎవరైనా ఒక ఈగను చంపితే, దాని గురించి ఆదేశం ఏమిటి? అని అడగబడింది. దానికాయన ఇలా జవాబిచ్చారు: ఇరాక్ వాసులు ఈగను గూర్చి ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి వారు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మనవడి హంతకులు! దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన మనవళ్ళ గురించి ఇలా సెలవిచ్చారు. “వీరిద్దరూ (హసన్, హుస్సేన్లు) ఈ ప్రపంచంలో నా రెండు పుష్పాలు.” (సహీ బుఖారీ : 3753, 5994) 

సునన్ తిర్మిజి లో ఈ హదీసు పదాలు ఇలా వున్నాయి: 

ఇరాక్ వాసుల్లోని ఓ వ్యక్తి అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు  అన్హు)తో -దోమ రక్తం బట్టలపై అంటుకుంటే దాని గురించిన ఆదేశం ఏమిటి? అని ప్రశ్నించాడు. దానికాయన ఇలా బదులిచ్చారు. ఈ వ్యక్తిని చూడండి! ఇతను దోమ రక్తాన్ని గూర్చి ప్రశ్నిస్తున్నాడు: వాస్తవానికి వీరు (ఇరాక్ వాసులు) దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు ప్రాణమైన ప్రియ మనవడిని హత్య చేశారు. నేను దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నోట ఇలా సెలవిస్తుండగా విన్నాను: “నిశ్చయంగా హసన్, హుస్సేన్లు ఈ లోకంలో నా రెండు పుష్పాలు.” (తిర్మిజి : 377, సహీ -అల్బానీ) 

హుజైఫా (రదియల్లాహు అన్హు)  కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు: 

నిశ్చయంగా ఈ దైవదూత (మొదటిసారి) ఈ రాత్రే భూమిపైకి విచ్చేశాడు. గతంలో ఎప్పుడూ తను భూమిపైకి రాలేదు. అతను అల్లాహ్, నన్ను కలవాలని విన్నవించుకోగా, అల్లాహ్ తనకు ఈ శుభవార్తలు నాకిమ్మని చెప్పి పంపించాడు. అవేమిటంటే – ఫాతిమా (రదియల్లాహు అన్హా ) స్వర్గంలో స్త్రీల నాయకురాలిగా వుంటుంది మరియు హసన్, హుస్సేన్లు స్వర్గంలో యువకులకు నాయకులుగా వుంటారు”. (తిర్మిజీ: 3781, సహీ – అల్బానీ) 

అనస్ (రదియల్లాహు  అన్హు) కథనం: హుస్సేన్ బిన్ అలీ (రదియల్లాహు అన్హు ) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను ఎక్కువగా పోలి వుండేవారు. (సహీ బుఖారీ : 3748) 

ప్రియ శ్రోతలారా! 

ఈ హదీసులన్నింటిలోనూ, హసన్, హుస్సేన్ (రదియల్లాహు  అన్హుమ్)ల మహత్యం వివరించబడింది. ఈ హదీసులను దృష్టిలో వుంచుకొనే మేము వీరిద్దరిని ప్రేమిస్తాము మరియు వీరిని ప్రేమించడం విశ్వాసంలో అంతర్భాగం అని తలుస్తాము. అంతేగాక, హుస్సేన్ (రజియల్లాహు అన్హు) వీరమరణం ఒక దురదృష్టకరమైన, విచారకరమైన సంఘటన అని స్వీకరిస్తాం. కానీ, మేము దీని కోసం, శోకగీతాలాపన చేయడం, ఏడ్పులు పెడబొబ్బలు పెట్టడం, ఛాతీని బాదుకోవడం లాంటి చర్యలు చేయడాన్ని అనుచితంగానూ, నిషేధంగానూ భావిస్తాము. ఎందుకంటే – ఇంతకు ముందు వివరించినట్లు, స్వయంగా మన ప్రియ దైవప్రవక్తే (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలాంటి చర్యలను నిషేధిం చారు. కనుక, ఈ సంఘటనపై కేవలం సహనం పాటించడం మినహా మనకు వేరే మార్గం లేదు. 

గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే- హుస్సేన్ (రదియల్లాహు అన్హు ) వీరమరణం గూర్చి జిబ్రాయీల్ (అలైహిస్సలాం) ముందే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు సూచించి వున్నారు. 

ఉమ్మె సలమా (రదియల్లాహు  అన్హా) కథనం : ఓసారి జిబ్రయీల్ (అలైహిస్సలాం) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వద్దకు విచ్చేశారు. ఆ సమయంలో హుస్సేన్ (రదియల్లాహు అన్హు ) నా దగ్గర వున్నారు. అకస్మాత్తుగా ఆయన ఏడ్వడం ప్రారంభించారు. నేనాయన్ని వదిలిపెట్టగా, ఆయన తిన్నగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దగ్గరికెళ్ళి కూర్చున్నారు. జిబ్రయీల్ (అలైహిస్సలాం) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తో : ఓ ముహమ్మద్ ! మీరితన్ని ప్రేమిస్తారా? అని అడిగారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ‘అవునని’ జవాబిచ్చారు. జిబ్రయీల్ (అలైహిస్సలాం) మాట్లాడుతూ : నిశ్చయంగా మీ అనుచర సమాజం అతి త్వరలో ఇతణ్ణి హత్య చేస్తుంది. మీరు కోరుకుంటే అతను హత్య చేయబడే స్థలం యొక్క మట్టిని మీకు చూపిస్తాను. తదుపరి ఆయన దానిని చూపించారు. అదే ‘కర్బలా’ అనే స్థలం. (అబ్రజ అహ్మద్ ఫీ ఫజాయెల్ సహాబా హసన్ పరంపరతో, 2వ సంపుటం, 782 పేజీ, నెం. 1391) 

కనుక మేము, హుస్సేన్ (రదియల్లాహు అన్హు ) వీరమరణాన్ని అల్లాహ్ యొక్క విధి వ్రాత అని నమ్ముతాము. ఇలాగే హుస్సేన్ (రదియల్లాహు అన్హు ) తండ్రి అయిన అలీ (రదియల్లాహు అన్హు ) కూడా అల్లాహ్ విధి వ్రాత ప్రకారం వీరమరణం పొందారు. ఆయనైతే హిజ్రీ  శకం 40వ సంవత్సరంలో రమజాన్ 17వ తేదీ నాడు, శుక్రవారం తెల్లవారుఝామున ఫజర్ నమాజు కోసం వెళు తుండగా వీరమరణం పొందారు! 

ఇదే విధంగా, ఆయనకు ముందు, ఉస్మాన్ (రదియల్లాహు  అన్షు) ను కూడా కొంతమంది దుర్మార్గులు కలిసి అతి భయంకరంగా తుదముట్టించారు. ఆయన హి.శ. 36వ సంవత్సరంలో జిల్  హిజ్జ మాసపు, ఖుర్బానీ దినాలలో అమరగతులయ్యారు. ఆయన కన్నా ముందు, ఉమర్ (రదియల్లాహు అన్హు ) కూడా ఫజర్ నమాజులో దివ్య ఖుర్ఆన్ పఠిస్తూ వీరమరణం పొందారు. వీరందరూ నిస్సందేహంగా హుస్సేన్ (రదియల్లాహు అన్హు) కన్నా ఉత్తములు మరియు వీరి వీరమరణ వృత్తాంతాలు కూడా అత్యంత భయంకరంగా, విచారకరంగా వున్నాయి. కానీ ఈ సంఘటనలన్నింటిపై మనం “ఇన్నాలిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్” అని అనడం తప్ప ఇంకేం చేయగలం! 

ఈ పోస్ట్ మొహర్రం నెల మరియు ఆషూరా దినం | జాదుల్ ఖతీబ్ అనే ఖుత్బా నుండి తీసుకోబడింది
జాదుల్ ఖతీబ్ (ఖుత్బాల సంగ్రహం) – మొదటి సంపుటం – ముహమ్మద్ ఇస్ హాఖ్ జాహిద్

మొహర్రం నెల మరియు ఆషూరా దినం | జాదుల్ ఖతీబ్

[డౌన్ లోడ్ PDF]

ముఖ్యమైన అంశాలు 

1) మొహర్రం మాసం ప్రాధాన్యత 
2) నాలుగు నిషిద్ధ మాసాలు మరియు వాటి ప్రత్యేక ఆదేశాలు 
3) దుష్కార్యాల ప్రభావాలు 
4) మొహర్రం నెలలో శోక గీతాలాపన (నోహా) మరియు హాహాకారాలు (మాతం) చేయడం
5) హుస్సేన్ (రదియల్లాహు  అన్హు) వీర మరణం 
6) మొహర్రం మాసం మరియు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సహచరులు 
7) మొహర్రం మాసంలో ఉపవాసం ప్రాధాన్యత 
8) చరిత్రలో ఆషూరా దినం ప్రాధాన్యత 
9) ఆషూరా దినపు ఉపవాసం ప్రాధాన్యత మరియు మహత్యం 

మొదటి ఖుత్బా 

ప్రియమైన శ్రోతలారా! మొహర్రం మాసం ఒక మహోన్నతమైన పవిత్ర మాసం. ఇది హిజ్రీ సంవత్సరపు మొదటి మాసం అవడమే గాక, నిషేధిత నాలుగు మాసాల్లో ఒకటి. 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

إِنَّ عِدَّةَ الشُّهُورِ عِندَ اللَّهِ اثْنَا عَشَرَ شَهْرًا فِي كِتَابِ اللَّهِ يَوْمَ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ مِنْهَا أَرْبَعَةٌ حُرُمٌ ۚ ذَٰلِكَ الدِّينُ الْقَيِّمُ ۚ فَلَا تَظْلِمُوا فِيهِنَّ أَنفُسَكُمْ

యథార్థం ఏమిటంటే, ఆకాశాన్నీ భూమినీ అల్లాహ్ సృష్టించినప్పటి నుండీ, మాసాల సంఖ్య అల్లాహ్ గ్రంథంలో పన్నెండు మాత్రమే. వాటిలో నాలుగు నిషిద్ధ మాసాలు. ఇదే సరైన ధర్మం. కనుక ఈ నాలుగు మాసాల్లో మీకు మీరు అన్యాయం చేసుకోకండి.” (తౌబా 9: 36) 

అంటే – భూమ్యాకాశాలు సృష్టించబడినప్పటి నుండి అల్లాహ్ దృష్టిలో సంవత్సరపు మాసాల సంఖ్య పన్నెండు మాత్రమే. అందులో నాలుగు మాసాలు నిషిద్ధ మాసాలు. మరి ఆ నిషిద్ధ మాసాలు ఏవి? దీనికి సంబంధించిన ఒక హదీసు వినండి! 

అబూ బక్ర్ (రదియల్లాహు అన్హు)  కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: 

సంవత్సరం పన్నెండు మాసాలు కలిగి వుంది. వీటిలో నాలుగు నిషిద్దమైనవి. వాటిలో మూడు మాసాలు ఒకదాని తర్వాత మరొకటి వస్తాయి. అవి జిల్ ఖాదా, జిల్ హిజ్జ మరియు మొహర్రం మాసాలు కాగా నాల్గవది జమా దిస్సానీ మరియు షాబాన్ మాసాల మధ్య వచ్చే రజబ్ మాసం.” (సహీ బుఖారీ, తఫ్సీర్- బాబ్ సూరహ్ తౌబా) 

మూడు మాసాలేమో ఒకదాని తర్వాత మరొకటి. నాల్గవది ఒంటరిది. దీనిలో దాగివున్న మర్మం ఏమిటి? హాఫిజ్ ఇబ్నె కసీర్ దీనిలోగల మర్మాన్ని గూర్చి ఇలా వివరించారు. 

హజ్ మాసానికి ముందు వచ్చే జిల్ ఖాదా మాసంలో వారు (అప్పటి ప్రజలు) యుద్ధం చేయడాన్ని పరిత్యజించేవారు. తదుపరి జిల్ హిజ్జ మాసంలో హజ్ చేసేవారు. ఆ తర్వాత, ప్రజలు శాంతియుతంగా తమ తమ ప్రదేశాలకు వెళ్ళగలిగేందుకుగాను ఆ తర్వాతి నెల కూడా నిషిద్దం గావించబడింది. తదుపరి, సంవత్సరపు మధ్య కాలంలో ఇంకో నెల నిషిద్ధం గావించబడింది. తద్వారా ప్రజలు ఉమ్రాహ్ మరియు బైతుల్లాహ్ దర్శనానికి శాంతియుతంగా వెళ్ళి రాగలగడానికి“. (తఫ్సీర్ ఇబ్నె కసీర్ : 2/468)

ప్రియ శ్రోతలారా! 

వీడ్కోలు హజ్జ్ (హజ్జతుల్ విదా) సందర్భంలో ఖుర్బానీ దినం నాడు మినా లో దైవప్రవక్త ﷺ ఇచ్చిన ఖుత్బా & వివరణ | జాదుల్ ఖతీబ్

[డౌన్ లోడ్ PDF]

మొదటిలో మీరు, హజ్జతుల్ విదాను పురస్కరించుకొని, అరాఫాత్లో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇచ్చిన ఖుత్బా గురించి విన్నారు. రండి! ఇక హజ్జతుల్ విదా సందర్భంలోనే, యౌమున్నహర్ (ఖుర్బానీ దినం) నాడు మినా లో ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇచ్చిన మరో ఖుత్బాను గూర్చి వినండి. 

యౌమున్నహర్ (ఖుర్బానీ దినం) ఖుత్బా 

అబూ బక్ర్ (రదియల్లాహు అను) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: 

“కాలం తిరుగుతూ మళ్ళీ భూమ్యాకాశాలు సృష్టించబడినప్పటి స్థితికి వచ్చేసింది. సంవత్సరంలో 12 నెలలు వున్నాయి. వాటిలో నాలుగు మాసాలు నిషిద్ధ మాసాలు. వరుసగా వచ్చే మూడు మాసాలు (జిల్ ఖాదా, జిల్ హిజ్జ, ముహర్రం) మరియు నాల్గవది జమాదిస్సానీ మరియు షాబాన్ మాసాల మధ్య వచ్చే ముజిర్ రజబ్ మాసం. 

వీడ్కోలు హజ్జ్ (హజ్జతుల్ విదా) సందర్భంలో అరాఫాత్ లో దైవప్రవక్త ﷺ ఇచ్చిన ఖుత్బా & వివరణ | జాదుల్ ఖతీబ్

[డౌన్ లోడ్ PDF]

జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అరాఫాత్ చేరుకున్నారు. అక్కడ ఆయన కోసం ‘నిమ్రా‘ లో ఒక గుడారం ఏర్పాటు చేయబడింది. సూర్యుడు (పశ్చిమం వైపుకు) వంగడం ప్రారంభించగానే, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన ఒంటె (ఖస్వ) ను సిద్ధం చేయమని ఆజ్ఞాపించారు. ఆయన ఆజ్ఞకనుగుణంగా దానిపై సీటు అమర్చబడింది. తదుపరి, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) దాని పైకెక్కి, లోయ మధ్య భాగంలోకి చేరుకొని ఖుత్బా ఇస్తూ ఇలా సెలవిచ్చారు. 

“నిశ్చయంగా ఈ దినం, ఈ మాసం, ఈ నగరం ఎంత గౌరవప్రదమైనవో అలాగే మీ రక్తం, సంపదలు కూడా అంతే గౌరవ ప్రదమైనవి. జాగ్రత్తగా వినండి! అజ్ఞాన కాలపు ఆచారాలన్నీ నా పాదాల క్రింద సమాధి చేయబడ్డాయి మరియు అజ్ఞాన కాలపు హత్యలు సమాప్తం గావించబడ్డాయి. బనూసాద్ లో ప్రాలు త్రాగుతూ హుజైల్ చేతిలో హత్యకు గురైన ‘ఇబ్నె రబియా బిన్ హారిస్’ హత్యను సమాప్తం చేస్తున్నాను. అజ్ఞాన కాలపు వడ్డీ సమాప్తం అయ్యింది. అందరికన్నా ముందుగా నా కుటుంబంలో వడ్డీని సమాప్తం చేస్తున్నట్లు ప్రకటిస్తున్నాను. అంటే, అబ్బాస్ బిన్ ముత్తలిబ్ (కు రావాల్సిన) వడ్డీ. అది పూర్తిగా సమాప్తం చేయబడింది. మీరు స్త్రీల విషయంలో అల్లాహ్ కు భయపడుతూ వుండండి. ఎందుకంటే, మీరు వారిని ‘అల్లాహ్ అమానతుల’ రూపంలో స్వీకరించారు మరియు అల్లాహ్ యొక్క కలిమా (సద్వచనం) ద్వారా వారి గుప్తాంగాలను హలాల్ చేసుకున్నారు. వారిపై మీకున్న హక్కు ఏమిటంటే మీరు ఇష్టపడని వారిని వారు మీ పడకలపై రానివ్వకూడదు. ఒకవేళ వారు ఇలా చేయకపోతే మీరు వారిని మెల్లగా కొట్టవచ్చు. వారికి మీపై వున్న హక్కు ఏమిటంటే – మీరు వారికి న్యాయమైన రీతిలో భోజన, వస్త్రాలు కల్పించాలి. 

(బాగా గుర్తుంచుకోండి!) నేను మీ మధ్య ఎలాంటి వస్తువును విడిచి వెళుతున్నానంటే, దానిని గనక మీరు గట్టిగా పట్టుకుంటే ఎన్నటికీ మార్గ భ్రష్టులవ్వరు. అది అల్లాహ్ గ్రంథం. 

నా గురించి మిమ్మల్ని అడిగినప్పుడు మీరేం సమాధానం ఇస్తారు? సహాబాలు – ‘నిస్సందేహంగా మీరు ధర్మాన్ని చేరవేసారని మేము సాక్ష్యమిస్తాం. మీరు (దైవ దౌత్య బాధ్యతను నెరవేర్చారు మరియు అనుచర సమాజం శ్రేయస్సు కోసం ఏ ప్రయత్నమూ వదల్లేదు’ అని అన్నారు. తదుపరి, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం), తన సాక్ష్యం ఇచ్చే వ్రేలిని ఆకాశం వైపుకు పైకి లేపి ప్రజలవైపుకు త్రిప్పుతూ, “ఓ అల్లాహ్ ! నువ్వు కూడా సాక్షిగా వుండు, ఓ అల్లాహ్! నువ్వు కూడా సాక్షిగా వుండు, ఓ అల్లాహ్ ! నువ్వు కూడా సాక్షిగా వుండు” అని పలికారు. (ముస్లిం:1218) 

ఈ ఖుత్బాలో, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) పది విషయాలు తెలియజేశారు. 

ఈదుల్ అద్ హా  ఖుత్బా  | జాదుల్ ఖతీబ్

ఖుత్బా యందలి ముఖ్యాంశాలు 

1. ఖుర్బానీ: ఇబ్రాహీం ఖలీలుల్లాహ్ (అలైహిస్సలాం) సున్నత్
2. ఖుర్ఆన్ లో ఇబ్రాహీం (అలైహిస్సలాం) ప్రశంస. 
3. ఖుర్బానీ: ప్రవక్తల నాయకులైన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) సున్నత్. 
4. ఖుర్బానీకి సంబంధించిన కొన్ని ప్రముఖ విషయాలు, మర్యాదలు. 
5. పండుగ దినాలలో కొన్ని చెడు కార్యాలు చేయడం! 

ఇస్లామీయ సోదరులారా! 

ఈరోజు ఈదుల్ అద్ హా అంటే ఖుర్బానీ దినం. ఈ దినం ఎంత మహోన్నతమైనదంటే – ప్రపంచంలోని ముస్లిములు ఈ రోజు ఇబ్రాహీం ఖలీలుల్లాహ్ (అలైహిస్సలాం) సున్నతును బ్రతికిస్తూ, తమ ప్రియ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) పద్ధతిని ఆచరిస్తూ లక్షల కొద్దీ పశువులను కేవలం అల్లాహ్ పేరుతో ఖుర్బానీ చేస్తారు. 

ఇబ్రాహీం (అలైహిస్సలాం) అల్లాహ్ యొక్క గొప్ప ప్రవక్త, అల్లాహ్ ఆయనను తన మిత్రునిగా చేసుకున్నాడు. దీని గురించి అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

وَاتَّخَذَ اللَّهُ إِبْرَاهِيمَ خَلِيلً
ఇబ్రాహీం (అలైహిస్సలాం) ను అల్లాహ్ తన మిత్రునిగా చేసుకున్నాడు.” (నిసా 4:125)