ప్రవక్త యూసుఫ్ (అలైహిస్సలాం) కథ – The Story of Yusuf (Peace be upon him)

the-story-of-yusufపుస్తకం నుండి: ఖురాన్ కథామాలిక
మూలం: షేఖ్ అబూ బకర్ నజార్
అనువాదం: అబ్దుల్ వాహెద్,హాఫిజ్  ఎస్.ఎం.రసూల్ షర్ఫీ
పబ్లిషర్స్: శాంతిమార్గం పబ్లికేషన్ ట్రస్ట్ , హైదరాబాద్

[ఇక్కడ చదవండి / డౌన్లోడ్ చేసుకోండి]

క్లుప్తంగా ఇమామ్ బుఖారీ & ఇమామ్ ముస్లిం గురుంచి | అల్-లూలు వల్ మర్జాన్

nature-bukhari-muslim

Brief Biography of Imam Bukhari & Imam Muslim

[ఇక్కడ చదవండి / PDF డౌన్లోడ్ చేసుకోండి]

రచయిత :సయ్యిద్ షబ్బీర్ అహ్మద్
మూలం:మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) గ్రంధ పరిచయం నుండి

కరుణామయుడు, కృపాసాగరుడయిన అల్లాహ్ పేరుతో

అల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదుల్ ముర్సలీన్, అలా ఆలిహీ వ అస్ హాబిహీ అజ్మయీన్. ఈ గ్రంథం అసలు పేరు అరబీ భాషలో “అల్ లూలు వల్ మర్జాన్”. ఇందులోని పదావళి దివ్యఖుర్ఆన్లో ఈ విధంగా ప్రస్తావించబడింది:

مَرَجَ الْبَحْرَيْنِ يَلْتَقِيَانِ بَيْنَهُمَا بَرْزَخٌ لَّا يَبْغِيَانِ فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ يَخْرُجُ مِنْهُمَا اللُّؤْلُؤُ وَالْمَرْجَانُ فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ

“ఆయన రెండు సముద్రాలను పరస్పరం కలిసిపోయేలా వదలి పెట్టాడు. అయినా వాటిమధ్య ఒక అడ్డుతెర ఉంది. దానివల్ల అవి ఒకదానిలోకొకటి చొచ్చుకుపోలేవు. కనుక (మానవులారా! జిన్నులారా!!) మీ ప్రభువు శక్తి పరిధిలోని ఏ మహిమను మీరు నిరాకరించగలరు? ఈ సముద్రాలలో ముత్యాలు, పగడాలు కూడా లభిస్తాయి. కనుక (మానవులారా! జిన్నులారా!!) మీ ప్రభువులోని ఏ ఔన్నత్యాన్ని మీరు కాదనగలరు?”(55:19-23)

ఈ గ్రంథంలో మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) సంప్రదాయాల (హదీసుల)కు సంబంధించిన సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లిం అనే రెండు హదీసు గ్రంథాలను రెండు సముద్రాలతో పోల్చడంజరిగింది. అయితే ప్రస్తుత సంకలన కర్త అల్లామా ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ హదీసుల మూలం (Text) ని బుఖారీ గ్రంథం నుండి గ్రహించి స్కంధాలు, అధ్యాయాల క్రమాన్ని, శీర్షికలపేర్లను మాత్రం ముస్లిం గ్రంథం నుండి స్వీకరించారు. అదీగాక పై రెండు గ్రంథాలలోనూ ఒకే ఉల్లేఖకుడు తెలిపిన ఉమ్మడి హదీసుల్ని మాత్రమే ఈ గ్రంథం కోసం ఎంచుకున్నారు. వీటిని “ముత్తఫఖున్ అలైహ్” (ఉభయోకీభవిత) హదీసులని అంటారు. వీటినే ఈ సంకలనకర్త ముత్యాలు,పగడాలుగా అభివర్ణించి, దాన్నే తన గ్రంథానికి నామకరణం చేశారు.

అంతిమ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి ప్రవచనాలు, ఆచార వ్యవహారాలు, ఆజ్ఞలు, అనుజ్ఞలు, అలవాట్లు, అభిరుచులు, కదలికలు, కథనాలు, సలహాలు, సూచనలు, స్వరూప స్వభావాలు -ఒక్కటేమిటి, ఆ మహనీయుని జీవితంలోని ప్రతి అంశానికి, ప్రతి కోణానికి సంబంధించిన హదీసుల్ని సేకరించి, సంకలనం చేసి పకడ్బందీగా భద్రపరిచారు హదీసు వేత్తలు. ఈ మహాకార్యం వెనుక వారి అవిరళ కృషి, అవిశ్రాంత శ్రమ, అసామాన్య సాహసం మనకు స్పష్టంగా గోచరిస్తాయి.

హదీసువేత్తలు ఉల్లేఖకుల నుండి హదీసుల్ని సేకరిస్తున్నప్పుడు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గౌరవోన్నతుల పై అణుమాత్రం కూడా మచ్చరాని విధంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ మహానాయకుని పట్ల విశ్వాసం, ప్రేమాభిమానాలు ఇసుమంత సడలినట్లనిపించినాసరే అలాంటి హదీసుల్ని వారసలు స్వీకరించనే లేదు. హదీసుల సేకరణ తరువాత వారా హదీసుల్ని పరి పరి విధాల పరిశీలించి, శల్యపరీక్ష చేసి, క్షుణ్ణంగా వడపోసి వాటి నుండి పూర్తిగా నమ్మకమయినవని, నిజమయినవని ధృవీకరించుకున్న హదీసుల్ని మాత్రమే ఎంచుకొని సంకలనం చేశారు. హదీసులు ప్రామాణికత విషయంలో వారి దైవభీతి పరాయణత, నిజాయితీ, విశ్వసనీయలతో పాటు, హదీసుల ప్రామాణికతను పరిశీలించడానికి వారు నిర్దేశించిన కొలమానాలు యావత్తు ముస్లిం జగత్తులో ఎంతో గుర్తింపు పొందాయి. ఇలా సంకలనం చేసిన గ్రంథాలలో సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లిం, తిర్మిజి, అబూదావూద్, నసాయి. ఇబ్ను మాజా, ఇమాం మాలిక్ గారి మువత్తా, ఇమాం ముహమ్మద్ గారి మువత్తా, ముస్నద్ అహ్మద్, దార్మి, దారెఖత్ని, బైహఖీ మొదలైనవెన్నో ఉన్నాయి. వీటిలో హదీసుల ఆరోగ్యస్థితి, ప్రామాణికతల రీత్యా మొదటి ఆరు గ్రంథాలు అత్యున్నత స్థాయికి చెందిన గ్రంథాలుగా ఖ్యాతి చెందాయి. ఈ ఆరు గ్రంథాలను “సహీ సిత్తా” (షడ్నీజాలు) అంటారు.

వీటిలో మన సంకలనకర్త తన గ్రంథం కోసం ఎంచుకున్న రెండు గ్రంథాలు సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లింలను గురించి, వాటిని సంకలనం చేసిన ప్రముఖ హదీసు వేత్తలు ఇమాం బుఖారీ (రహిమహుల్లాహ్), ఇమాం ముస్లిం (రహిమహుల్లాహ్) గార్ల జీవిత చరిత్రలను గురించి ఇక్కడ సంక్షిప్తంగానయినా తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

సహీహ్ బుఖారీ గ్రంథాన్ని సంకలనం చేసిన ఇమామ్ అబూ అబ్దుల్లా ముహమ్మద్ బిన్ ఇస్మాయీల్ బిన్ ఇబ్రాహీమ్ అల్ బుఖారీ (రహిమహుల్లాహ్) హిజ్రీ శకం 194, షవ్వాల్ మాసం 13వ తేదీ శుక్రవారం నాడు బుఖారాలో ఒక పేద కుటుంబంలో జన్మించారు. ఆయన పదేళ్ళ ప్రాయంలో విద్యాభ్యాసం ప్రారంభించారు. స్వగ్రామంలో ప్రాథమిక విద్యనభ్యసించిన తరువాత ఉన్నత విద్యకోసం ముస్లిం జగత్తులోని యావత్తు ప్రధాన విద్యా కేంద్రాలన్నీ పర్యటించారు. ఈ సుదీర్ఘ పర్యటనలో ఆయన 1080 మంది ధర్మవేత్తల నుండి హదీసు విద్య నేర్చుకున్నారు. పదేళ్ళ ప్రాయంలోనే ఆయన బుఖారాలో ఆనాటి హదీసు విద్యాపారంగతులు ఇమామ్ దాఖలీ (రహిమహుల్లాహ్) గారి పాఠశాలలో చేరారు.

ఒక రోజు ఇమామ్ దాఖలీ (రహిమహుల్లాహ్) ఒక హదీసు ప్రమాణాన్ని పేర్కొంటూ “సుఫ్యాన్ అన్ అబీజుబైర్ అన్ ఇబ్రాహీం” అని అన్నారు. అప్పుడు ఇమాం బుఖారీ (రహిమహుల్లాహ్) కల్పించుకొని “ఈ హదీసు ప్రమాణం ఈ విధంగా లేదండీ! అబూజుబైర్ ఈ హదీసుని ఇబ్రాహీం నుండి ఉల్లేఖించ లేదు”అని అన్నారు.

అతి పిన్న వయస్సులో ఉన్న ఒక శిష్యుడు తనను ఇలా తప్పుబట్టడంతో గురువు గారుఉలిక్కిపడ్డారు. ఆయన కోపంతో కొర కొర చూశారు. ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) గురువు గారి పట్లఎంతో వినయ విధేయతలతో వ్యవహరిస్తూ “మీ దగ్గర అసలు గ్రంథం ఉంటే అందులో ఓసారిచూసుకోండి” అని ప్రశాంతంగా అన్నారు.

ఇమామ్ దాఖలీ (రహిమహుల్లాహ్) ఇంటికి వెళ్ళి అసలు గ్రంథాన్ని పరిశీలించి ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) చేసిన విమర్శ సహేతుకమయినదేనని గ్రహించారు. ఆయన తిరిగి వచ్చి “అయితే సరయిన ప్రమాణం ఏమంటావు?” అని అడిగారు. ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) తక్షణమే సమాధానమిస్తూ “సుఫ్యాన్ అనిజ్జుబైరి వహు వన్బు అదియ్యి అన్ ఇబ్రాహీం (ఇబ్రాహీం నుండి జుబైర్ బిన్ అదీ రహిమహుల్లాహ్-ఉల్లేఖించారు; అబూజుబైర్ అనడం సరికాదు)” అని అన్నారు.

అప్పటికి ఇమామ్ బుఖారీ వయస్సు పదకొండేండ్లు కూడా నిండలేదు. పదహారు సంవత్సరాలవయస్సులో ఆయన హజ్రత్ అబ్దుల్లా బిన్ ముబారక్ (రహిమహుల్లాహ్), ఇమామ్ వకీ (రహిమహుల్లాహ్)లు సేకరించిన హదీసులన్నీ కంఠస్తం చేశారు. 18వ యేట చరిత్ర గ్రంథాన్ని రచించ నారంభించారు. ఇందులో సహాబీలు (ప్రవక్త ప్రత్యక్ష అనుచరులు), తాబయీల (ఆ తరువాతి అనుచరుల) జీవిత చరిత్ర, వారుచెప్పిన మాటలు, చేసిన నిర్ణయాలన్నీ సమీకరించబడ్డాయి. ఈ గ్రంథాన్ని ఆయన దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సమాధి దగ్గర కూర్చొని వెన్నెల రాత్రులలో రాశారు.

ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) అసామాన్య జ్ఞాపకశక్తి గల మేధా సంపన్నులు. ఎంత పెద్ద హదీసయినాసరే ఒక్కసారి చదివితే లేక వింటే చాలు కంఠస్తమయిపోయేది.

ఇమాం బుఖారీ (రహిమహుల్లాహ్) గారి సమకాలిక హదీసువేత్త హామిద్ బిన్ ఇస్మాయీల్ ఇలాతెలియజేస్తున్నారు: “ఇమామ్ బుఖారీ బస్రాలో మాతో పాటు హదీసు తరగతులకు హాజరవుతూ ఉండేవారు. అయితే ఆయన కేవలం వినేవారు. ఒక్క అక్షరం కూడా వ్రాసుకునేవారు కాదు. ఈవిధంగా 16 రోజులు గడిచిపోయాయి. చివరికి ఓ రోజు నేను, హదీసులు వ్రాసుకోకపోవడం పట్ల ఆయన్ని విమర్శించాను. దానికాయన సమాధానమిస్తూ “ఈ పదహారు రోజుల కాలంలో నీవు వ్రాసుకున్న విషయాలన్నీ తీసుకురా. వాటన్నిటినీ నేను చూడకుండా చదువుతాను విను” అని అన్నారు. ఆ విధంగా ఆయన పదిహేను వందలకు పైగా హదీసుల్ని ఒక్క పొల్లు పోకుండా ఉన్నది ఉన్నట్లు మాకు వినిపించారు. స్వయంగా మేము అనేక చోట్ల మా రాతల్లో దొర్లిన తప్పులను ఆయన నోట విని సవరించుకోవలసి వచ్చింది”.

ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) గారి జ్ఞాపకశక్తి గాధలు దశ దిశలా వ్యాపించిపోయాయి. ఆయనఏ ప్రాంతానికి బయలుదేరినా, ఆయనకు ముందే ఆ ప్రాంతానికి ఆయన పేరు ప్రఖ్యాతులు చేరుకునేవి. ప్రజలు వివిధ రకాలుగా ఆయన జ్ఞాపకశక్తిని పరీక్షించేవారు. చివరికి వారు ఆయన అసాధారణ జ్ఞాపకశక్తికి ఆశ్చర్యచకితులయి ఎంతో అభినందించేవారు. ఆ కాలంలోనే షేఖ్ అబూ జరఆ (రహిమహుల్లాహ్), అబూ హాతిం (రహిమహుల్లాహ్), ముహమ్మద్ బిన్ నస్ర్ (రహిమహుల్లాహ్), ఇబ్ను ఖుజైమా (రహిమహుల్లాహ్), ఇమామ్ తిర్మిజి (రహిమహుల్లాహ్), ఇమామ్ ముస్లిం (రహిమహుల్లాహ్)లు ఆయనకు శిష్యులయిపోయారు.

ఇమాం బుఖారీ (రహిమహుల్లాహ్) ని ప్రశంసిస్తూ కొందరు ప్రముఖులు వెలిబుచ్చిన అభిప్రాయాలు వినండి:

“బుఖారీ (రహిమహుల్లాహ్) హదీసు విద్యలో నాకంటే ఎక్కువ వివేకం, దూరదృష్టి కల వ్యక్తి. ఆయన దైవదాసుల్లోకెల్లా ఎక్కువ వివేచనాపరుడు. నిజం చెప్పాలంటే బుఖారీని మించిన వారే లేరు.”- ఇమామ్ దార్మి (రహిమహుల్లాహ్)

“ఖురాసాన్ భూభాగంలో ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) లాంటి మహోన్నత వ్యక్తి మరొకరుజన్మించ లేదు.”-ఇమామ్ అహ్మద్ (రహిమహుల్లాహ్)

“స్వయంగా ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) కూడా తన లాంటి వ్యక్తిని చూడలేదు.”- ఇబ్నుల్ మదీనీ (రహిమహుల్లాహ్)

“ఇమామ్ ముస్లిం బిన్ అల్ హిజాజ్ (రహిమహుల్లాహ్) ఓ సారి ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) సన్నిధికివెళ్ళి ఆయన రెండు కళ్ళ మధ్య (నుదుటిని) ముద్దాడుతుండగా నేను కళ్ళారా చూశాను. ఆ తరువాతఆయన ‘గురువులకు గురువూ! హదీసువేత్తల నాయకా! మీ పాదాలు చుంబించడానికి నాకు అనుమతి ఇవ్వండి’ అని అన్నారు.’- అహ్మద్ బిన్ హమ్డాన్ (రహిమహుల్లాహ్)

“ఆకాశం క్రింద ఈ ధరిత్రిపై ముహమ్మద్ బిన్ ఇస్మాయీల్ బుఖారీ (రహిమహుల్లాహ్)ని మించిన హదీసు పండితుడు, పారంగతుడు మరొకరు లేరు.” – ఇబ్నె ఖుజైమా (రహిమహుల్లాహ్)

ఇమామ్ జీవిత విశేషాల్లో ముఖ్యంగా చెప్పుకోదగిన ఒక విశేషం ఉంది. ఆయన తనజీవితంలో ఏనాడూ ఎవరినీ నిందించలేదు, దూషించలేదు, బాధించనూలేదు. ఆయన స్వయంగా ఈవిషయాన్ని ప్రస్తావిస్తూ “పరలోక విచారణ దినాన పరోక్ష నిందను గురించి నన్ను ప్రశ్నించడం జరగదనినేను ఆశిస్తున్నాను” అని అప్పుడప్పుడు అంటుండేవారు.

ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) ఎంతో ఆత్మాభిమానం గల వ్యక్తి. దీన్ని గురించి ఉమర్ బిన్ హఫ్స్(రహిమహుల్లాహ్) ఇలా తెలియజేస్తున్నారు: “బస్రాలోని హదీసు పాఠశాలలో నేను, ఇమామ్ బుఖారీ సహవిద్యార్థులంగా ఉండేవాళ్ళం. ఒక రోజు ఇమామ్ పాఠశాలకు రాలేదు. విచారిస్తే ఆ రోజు ఇమామ్ బుఖారీ దగ్గర ధరించి బయటికి రావడానికి సరిపడ్డ బట్టలు కూడా లేవని తెలిసింది. ఈ విషయం ఇతరుల ముందు బహిర్గతం కావడం ఆయనకు ఏ మాత్రం ఇష్టంలేదు. అందువల్ల ఆయన ఆ రోజు ఇంటి నుంచి బయటికే రాలేదు. ఆ తరువాత మేము ఆయన కోసం బట్టలు సంపాదించి తీసికెళ్ళి ఇచ్చాము. దాంతో ఆయన మరునాటి నుంచి పాఠశాలకు రావడం ప్రారంభించారు.

ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) రాజులకు, పాలకులకు ఎల్లప్పుడూ దూరంగా ఉండేవారు.అయితే ఓ రోజు బుఖారా గవర్నర్, తన దర్బారుకు వచ్చి తనకు హదీసులు వినిపించవలసిందిగా ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్)కి విజ్ఞప్తి చేశాడు. దాంతో పాటు, ఇతరులెవరూ పాల్గొనకుండా ఉండే ఓ ప్రత్యేక సమావేశంలో తన పిల్లలకు హదీసు విద్య నేర్పవలసిందిగా కూడా అతను ఇమామ్ని కోరాడు.ఇమామ్ ఈ రెండు కోర్కెలను తిరస్కరిస్తూ “విద్యను గురువు దగ్గరకెళ్ళి నేర్చుకోవలసి ఉంటుంది.నా సమావేశంలో ధనికుడు-పేద అనే తారతమ్యం లేదు. ఇక్కడికొచ్చి హదీసు విద్య నేర్చుకోవడానికిప్రతి ఒక్కరికీ హక్కుంది” అని సమాధానమిచ్చారు.

ఈ సమాధానం విని బుఖారా గవర్నర్ ఆగ్రహోదగ్రుడయ్యాడు. ఆ తరువాత వారిద్దరి మధ్య దూరం మరింత పెరిగిపోయింది. గవర్నర్ ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) మీద పగబూని బుసలు కొట్టడం ప్రారంభించాడు. దాంతో ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) బుఖారా పట్నం వదలి ఖర్తుంగ్ అనే ప్రాంతానికివెళ్ళి తలదాచుకోవలసి వచ్చింది. అక్కడకు వెళ్ళిన తరువాత ఆయన వ్యాధిగ్రస్తులయ్యారు. చివరికి హిజ్రి శకం 256లో ఈదుల్ ఫిత్ర్ నాడు 62 సంవత్సరాల వయస్సులో ఆయన తనువు చాలించారు. -రహ్మతుల్లా అలై-

ఇది ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) జీవితాంతం శ్రమించి, అనేక ప్రాంతాలు పర్యటించి సంకలనం చేసిన హదీసు గ్రంథం. ఆయన వివిధ ప్రాంతాల నుండి మొత్తం ఆరు లక్షల హదీసులు సేకరించి, వాటిలో ఈ గ్రంథం కోసం అత్యంత ప్రామాణికమైన 7,397 హదీసుల్ని ఎంపిక చేసి సంకలనం చేశారు. ఈ 7,397 హదీసుల్లో నుండి పునరావృత్త హదీసుల్ని తీసివేస్తే 2,602 హదీసులు మాత్రమే మిగిలి ఉంటాయి. ఇవన్నీ పటిష్ఠమైన ఆధారాలు గల నిజమైన హదీసులు. వీటిని ఆయన వివిధ శీర్షికల క్రింద ప్రకరణలుగా, అధ్యాయాలుగా విభజించి ఒక క్రమ పద్ధతిలో సంకలనం చేశారు.

ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) ఈ మహాకార్యాన్ని నిరంతరాయంగా 16 సంవత్సరాల పాటు అహోరాత్రులు చెమట ధారపోసి పూర్తి చేశారు. ఆయన ప్రతి హదీసు గ్రంథస్తం చేయడానికి ముందుగా స్నానం చేసి, రెండు రకాతులు నఫిల్ నమాజ్ చేసేవారు. ఆ తరువాతనే ఆ హదీసు రాయడానికి ఉపక్రమించేవారు. ఈ విధంగా ఆయన మొత్తం హదీసుల్ని పూర్తి పరిశుద్ధావస్థలో, ఎంతో భక్తిభావంతో గ్రంధస్తం చేశారు.

ప్రసిద్ధి చెందిన వందలాది మంది హదీసువేత్తలు ఈ గ్రంథం ప్రామాణికతను పరీక్షించడానికివివిధ రకాలుగా ప్రయత్నించారు. కాని ఏ ఒక్కరూ ఇందులోని ఏ ఒక్క హదీసు ప్రామాణికతతో కూడా విభేదించలేకపోయారు. కనీసం దానిపట్ల సందేహం కూడా వెలిబుచ్చలేకపోయారు. చివరికి వారంతా దివ్యఖుర్ఆన్ తరువాత పటిష్ఠమైన ప్రామాణికతతో కూడిన నిజగ్రంథం ఏదయినా ఉందంటే అది సహీహ్ బుఖారీ మాత్రమేనని తీర్మానించారు. ఈ విధంగా ఇస్లామీయ గ్రంథాలలో సహీహ్ బుఖారీ ద్వితీయ స్థానం పొందగలిగింది.

ఈ గ్రంథ ప్రాశస్త్యం, ప్రత్యేకతలను గురించి చెప్పాలంటే ఎన్నో విషయాలున్నాయి. ఇక్కడరెండు విషయాలను మాత్రం ప్రస్తావిస్తున్నాం. ఇందులోని హదీసుల్ని స్వయంగా ఇమామ్ బుఖారీ(రహిమహుల్లాహ్) నోట తొంభై వేల మంది హదీసువేత్తలు విన్నారు. ఈ గ్రంథానికి 53 వివరణ గ్రంథాలువెలువడ్డాయి. వాటిలో కొన్ని వివరణ గ్రంథాలు పద్నాలుగేసి సంపుటాలలో వెలువడ్డాయి. దీన్ని బట్టిసహీహ్ బుఖారీ ఎంత జనాదరణ పొందిన గ్రంథమో ఊహించవచ్చు.

సహీహ్ ముస్లిం గ్రంధాన్ని సంకలనం చేసిన ఇమామ్ అబుల్ హుసైన్ ముస్లిం బిన్ హిజాజ్(రహిమహుల్లాహ్) హిజ్ర శకం 204లో నీషాపూర్లో జన్మించారు. బాల్యం నుండే హదీసు విద్యార్జనలో నిమగ్నులయిపోయారు. హదీసుల అన్వేషణ కోసం ఆయన ఇరాఖ్, హిజాజ్, ఈజిప్టు దేశాలు పర్యటించి, అక్కడి పండితుల దగ్గర హదీసులు నేర్చుకున్నారు. అలాంటి పండితులలో ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) గారి గురువులు కూడా ఉన్నారు. చివరికి ఆయన నీషాపూర్లో ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్)ని కలుసుకొని, ఆయన దగ్గర కూడా శిష్యరికం చేశారు.

ఆ కాలంలో గొప్ప గొప్ప హదీసువేత్తలు సయితం తరచుగా ఇమామ్ ముస్లిం (రహిమహుల్లాహ్) దగ్గరకొచ్చి హదీసులు వినిపోతుండేవారు. వారిలో అబూ హాతిం రాజి (రహిమహుల్లాహ్), మూసాబిన్ హారూన్(రహిమహుల్లాహ్), అహ్మద్ బిన్ సల్మ (రహిమహుల్లాహ్), ఇమామ్ తిర్మిజీ (రహిమహుల్లాహ్) ప్రభృతులు కూడా ఉన్నారు.ఆయన బాల్యం నుండి అంతిమ శ్వాస వరకు ఎంతో దైవభీతి, ధర్మపరాయణతలతో కూడిన పవిత్ర జీవితం గడిపారు. ఆయన ఏనాడూ ఒకరిని నిందించడం గాని, బాధించడం గాని చేయలేదు.

ఇమామ్ ముస్లిం మరణ సంఘటన చాలా విచిత్రంగా జరిగింది. ఒక సారి ఓ పండిత గోష్ఠిలో ఒక వ్యక్తి ఏదో హదీసుని గురించి సమాచారం అడిగాడు. అయితే ఆ సమయంలో ఇమామ్ గారికి ఆ హదీసు గురించిన సరయిన వివరాలు తెలియకపోవడం వల్ల సమాధానం ఇవ్వలేకపోయారు.తరువాత ఆయన ఇంటికి వెళ్ళి ఆ హదీసుని అన్వేషించడం ప్రారంభించారు. గ్రంథ పుటలను తిరగేస్తూ ప్రక్కనే ఉన్న ఖర్జూరపండ్ల బుట్టలో నుంచి ఒక్కొక్క ఖర్జూరాన్ని తీసి తింటూ పోయారు.హదీసు అన్వేషణలో తానెన్ని ఖర్జూర పండ్లు తిన్నానన్న సంగతిని కూడా గమనించలేదు. చివరికి అన్వేషిస్తున్న హదీసు లభించిన తరువాత బుట్ట వైపు చూస్తే అది దాదాపు ఖాళీ అయిపోయింది.అప్పుడర్ధమైంది ఆయనకు తాను బుట్టలోని పండ్లన్నీ తిన్నానని. కాని ఇక చేసేదేమీ లేదు; జరగవలసింది జరిగిపోయింది. ఎక్కువ పండ్లు తినడం వల్ల ఆయన వ్యాధిగ్రస్తులయ్యారు. ఆ వ్యాధితోనే ఆయన హిజ్రీ శకం 261, రజబ్ నెల 24వ తేదీ ఆదివారం నాడు సాయంత్రం శాశ్వతంగా ఇహలోకం వీడిపోయారు. చనిపోయే నాటికి ఆయన వయస్సు 55 సంవత్సరాలు మాత్రమే. స్వగ్రామమైన నీషాపూర్లోనే ఆయన్ని ఖననం చేశారు.

అబూహాతిం (రహిమహుల్లాహ్) ఇలా తెలియజేస్తున్నారు: “ఇమామ్ ముస్లిం (రహిమహుల్లాహ్) చనిపోయిన తరువాత ఓ రాత్రి నేను ఆయన్ని కలలో చూశాను. ఆయన దగ్గరికెళ్ళి మీ పరిస్థితి ఎలా ఉందని అడిగాను. దానికి ఇమామ్ ముస్లిం (రహిమహుల్లాహ్) అల్లాహ్ తనకు మంచి స్థితి కల్పించాడని, స్వర్గంలో తాను కోరుకున్న ప్రదేశానికి వెళ్ళే, కోరుకున్న చోట ఉండే అనుమతినిచ్చాడ’ని అన్నారు.”

ఈ గ్రంథం కూడా హదీసుల ప్రామాణికత రీత్యా, వాటి ఆరోగ్యస్థితి రీత్యా సహీహ్ బుఖారీకిఏ మాత్రం తీసిపోదు. సహీహ్ ముస్లిం కూడా సహీహ్ బుఖారీతో సమానమైన విలువ గల గ్రంథమన్న విషయంతో ధర్మవేత్తలంతా ఏకీభవించారు.

ఇమామ్ ముస్లిం (రహిమహుల్లాహ్) ఈ గ్రంథాన్ని ఎంతో నేర్పుతో, వివేకంతో సంకలనం చేశారు.అందువల్ల దీన్ని చాలా సులభంగా అధ్యయనం చేయడానికి, అర్థం చేసుకోవడానికి అవకాశం కలిగింది. ఇమామ్ ముస్లిం (రహిమహుల్లాహ్) ఈ గ్రంథంలో ఇంచుమించు ఒకే భావం గల హదీసులన్నీ ఒకచోట చేర్చారు. దాంతో పాటు హదీసుల ప్రమాణ పద్ధతుల్ని, వాటి పదజాలాల్లోని వ్యత్యాసాలను కూడా సంక్షిప్త వాక్యాలలో కడు జాగ్రత్తగా తెలియజేశారు.

ఇమామ్ ముస్లిం (రహిమహుల్లాహ్) యావత్తు ముస్లిం జగత్తులో జరిపిన తన సుదీర్ఘ పర్యటన సందర్భంగా నాలుగు లక్షల హదీసుల్ని సేకరించారు. మొదట వాటిలో ఒక లక్ష పునరావృత హదీసుల్ని ఏరివేసి మూడు లక్షల హదీసుల్ని సంకలనం చేశారు. ఆ తరువాత ఓ సుదీర్ఘ కాలం పాటు వాటిని నిశితంగా పరిశీలించి చివరికి అన్ని విధాల నమ్మకమైనవని, ప్రామాణికమైనవని, భావించినహదీసుల్ని మాత్రమే ఆయన ఈ గ్రంథానికి ఎంచుకున్నారు. ఇలా మూడు లక్షల హదీసుల్లో 7,275హదీసులు మాత్రమే గ్రంథస్తం చేయబడ్డాయి. అయితే వాటిలోనూ పునరావృత హదీసుల్ని తొలగిస్తే నాలుగు వేల హదీసులు మాత్రమే మిగులుతాయి.

ఇమామ్ ముస్లిం (రహిమహుల్లాహ్) స్వయంగా తన గ్రంథం గురించి ఇలా అన్నారు: “నేనీ గ్రంథంలోఏ హదీసుని గ్రంథస్తం చేసినా క్షుణ్ణంగా ఆలోచించిన మీదట తగిన ఆధారాలతోనే దాన్ని గ్రంథస్థం చేశాను. అలాగే ఈ గ్రంథంలో నుంచి ఏ హదీసుని తొలగించినా క్షుణ్ణంగా ఆలోచించిన తరువాత తగిన ఆధారాలతోనే దాన్ని తొలగించాను. అందువల్ల ప్రపంచంలోని జనమంతా రెండొందల యేండ్లపాటు హదీసుల్ని పరిశీలించి రాసినా, చివరికి వారి నమ్మకం ఈ గ్రంథం మీదే ఉంటుంది.”

సహీహ్ ముస్లిం, సహీహ్ బుఖారీ గ్రంథాలలో ప్రామాణికత తదితర విషయాల రీత్యా ఏదిగొప్ప అనే విషయంలో ధర్మవేత్తల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. సహీహ్ బుఖారీ అన్నిటికంటేఉన్నతమైనదని కొందరు అభిప్రాయపడితే, సహీహ్ ముస్లిం అన్నటికంటే ఉన్నతమైన గ్రంథమని,మరి కొందరు అభిప్రాయపడ్డారు. ఈ రెండు అభిప్రాయాలకు భిన్నంగా ఇంకొందరు, కొన్ని విషయాలరీత్యా సహీహ్ బుఖారీ ఉన్నతమైనది, మరికొన్ని విషయాల రీత్యా సహీహ్ ముస్లిం ఉన్నతమైనదనిఅభిప్రాయపడ్డారు.

ఏమయినప్పటికీ ఈ గ్రంథకర్తలిద్దరూ గొప్ప ధర్మపరాయణులు, దైవభీతిపరులు, నిజాయితీపరులన్న విషయంలో మాత్రం ఎవరి మధ్యా ఎలాంటి భేదాభిప్రాయం లేదు. అలాంటి మహనీయులు సంకలనం చేసిన బుఖారీ, ముస్లిం గ్రంథాలలోని ఏకీభవిత (ముత్తఫఖుల్అలై) హదీసుల సంగతి ఇక చెప్పేదేముంది? పటిష్ఠమైన ప్రామాణిక గ్రంథాలలోని ఈ ‘ఏకీభవిత’ హదీసులు మరెంత ప్రామాణికమైనవో ప్రత్యేకంగా వివరించనవసరం లేదు.

సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లింలను రెండు సముద్రాలుగా, వాటిలో ఉన్న హదీసుల్నిముత్యాలు, పగడాలుగా ప్రస్తుత సంకలన కర్త ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ అభివర్ణించిన సంగతిప్రారంభంలో నేను ప్రస్తావించాను. అంటే ఒక సముద్రంలో ముత్యాలు ఉంటే, మరో సముద్రంలోపగడాలు ఉన్నాయన్నమాట. ఈ రెండు సముద్రాలలోని ముత్యాలు, పగడాలను ఏరి కూర్చిన హారం ఇంకెంత విలువైనదో ఊహించండి. ఆ అమూల్యమైన హారమే మీ ముందున్న ఈ గ్రంథం!

ఇందులో మొత్తం 1906 హదీసులున్నాయి. సహీహ్ బుఖారీలో పునరావృత హదీసులుతీసివేయగా 2602 హదీసులు ఉన్నాయి. అంటే ఈ గ్రంథంలో సహీహ్ బుఖారీలోని 696 హదీసులుతగ్గిపోయాయి. మరో మాటలో చెప్పాలంటే ఇమామ్ ముస్లిం (రహిమహుల్లాహ్) గారి గ్రంథంలో లేని 696 హదీసులు ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) గారి గ్రంథంలో చోటు చేసుకున్నాయన్నమాట. వేరొక రకంగాచెప్పాలంటే ఈ 696 హదీసుల విషయంలో ఇరువురు ఇమాముల మధ్య పూర్తిగా ఏకీభావం లేదన్నమాట.

దీన్ని బట్టి మన ముందున్న ఈ గ్రంథంలో ఆ ఇరువురు ఇమాములు పూర్తిగా ఏకీభవించినహదీసులే ఉన్నాయని అర్థమవుతుంది. ఇలాంటి హదీసులున్న గ్రంథం వెలకట్టలేని వినూత్న ఉద్గ్రంధం అనడంలో ఇక సందేహమేముంది? కనుక దీన్ని పాఠకులు ఆదరిస్తారని ఆశిస్తూ ఈ గ్రంథం అనువాదంలో నాకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

-సయ్యిద్ షబ్బీర్ అహ్మద్(ఉర్దూ అనువాదకుడు, లాహోర్)

రాజస రాబిన్స్ సత్యాన్వేషణ వృత్తాంతం (Rajasa Robbins Story of her reversion to Islam)

women-accepting-islamఅనువాదకులు : ముహమ్మద్ కరీముల్లాహ్
క్లుప్త వివరణ: ఒక నాస్తికురాలైన మహారాష్ట్ర మహిళ, అమెరికన్ క్రైస్తవుడిని పెళ్ళి చేసుకుని, అమెరికాలో స్థిరపడి, ఆ తర్వాత సత్యాన్వేషణలో ఇస్లాం ధర్మం గురించి పరిశోధించి, దానిలోని స్వచ్ఛతను గ్రహించారు. ఆ తర్వాత కుటుంబసమేతంగా ఇస్లాం ధర్మం స్వీకరించి, ఆనందంగా అమెరికాలో జీవితం గడపుతున్నారు. తన జీవిత ప్రయాణం గురించి ఆవిడ వివరంగా ఈ తన స్వీయకథలో తెలిపారు.

[ఇక్కడ చదవండి / డౌన్లోడ్ చేసుకోండి]

Rajasa Robbins Story of her reversion to Islam

ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహుఅలైహివసల్లం) అంతిమ హజ్ యాత్రలో చేసిన ప్రసంగం (The Last sermon of the Prophet)

అనంత కరుణామయుడూ, అపార కృపాశీలుడూ అయిన అల్లాహ్ పేరుతో,

623 A.D వ సంవత్సరం, మక్కా నగరం దగ్గర ఉన్న అరాఫాత్ మైదానంలో చేసిన ప్రసంగంలోని భాగం

అల్లాహ్ ను ప్రశంసించి, కృతజ్ఞతలు తెలిపిన తర్వాత, అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సంబోధించారు (ప్రపంచం నలుమూల నుండి వచ్చిన దాదాపు లక్షన్నర స్త్రీపురుషుల సమూహానికి చేసిన ఉపదేశం):

“ఓ ప్రజలారా! శ్రద్ధగా వినే చెవిని నాకు అప్పుగా అప్పగించండి, ఎందుకంటే నేను ఈ సంవత్సరం తర్వాత మీ మధ్యన జీవించి ఉంటానో లేదో నాకు తెలియదు. కాబట్టి, నేను మీకు చెబుతున్న దానిని చాలా జాగ్రత్తగా వినండి మరియు  ఈ పదాలను (సందేశాన్ని) నేడు ఇక్కడ హాజరు కాలేకపోయిన వారికి కూడా చేర్చండి.

ఓ ప్రజలారా! మీరు ఈ నెలను, ఈ దినమును పవిత్రమైనదిగా పరిగణించినట్లే,  ప్రతి ముస్లిం యొక్క జీవితాన్ని (ప్రాణాన్ని) మరియు సంపదను(ఆస్తిని) పవిత్రమైన విశ్వాస నిక్షేపంగా (నమ్మికగా) పరిగణించవలెను. మీ వద్ద నమ్మకంతో ఉంచిన వస్తువుల్ని, వాటి అసలైన యజమానులకు తిరిగి వాపసు చెయ్య వలెను.  మీరు ఎవ్వరికీ హాని కలిగించ కూడదు, దాని వలన మీకెవ్వరూ హాని కలిగించరు. ‘నిశ్చయంగా మీరు మీ రబ్ (ప్రభువు) ను కలుసుకోబోతున్నారు మరియు ఆయన నిశ్చయంగా మీ కర్మల లెక్క తీసుకోబోతున్నాడు’ అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచు కోవలెను.

మీరు వడ్డీ తీసుకోవటాన్ని అల్లాహ్ నిషేధించాడు; కాబట్టి ఇక మీదట వడ్డీ వ్యాపారానికి సంబంధించిన నియమనిబంధనలన్నీ, హక్కులన్నీ రద్దు చేయబడినవి. మీ యొక్క అసలు మూలధనం మాత్రం మీరు తీసుకోవచ్చును. మీరు అసమానత్వాన్ని (హెచ్చుతగ్గులను, భేదాలను, వైషమ్యాలను) బలవంతంగా రుద్దకూడదు మరియు సహించకూడదు. వడ్డీ నిషేధించబడినదని అల్లాహ్ తీర్పునిచ్చినాడు మరియు అబ్బాస్ ఇబ్నె అబ్దుల్ ముత్తలిబ్ కు చెల్లించ వలసి ఉన్న మొత్తం వడ్డీ ఇక మీదట రద్దు చేయబడినది.

షైతాన్ నుండి మీ ధర్మాన్ని కాపాడుకునేందుకు అప్రమత్తంగా (జాగ్రత్తగా) ఉండవలెను. అతడు పెద్ద పెద్ద విషయాలలో మిమ్ముల్ని తప్పు దారి పట్టించే శక్తి తనకు ఏ మాత్రం లేదని తెలుసుకుని, తన ఆశలన్నీ వదులుకున్నాడు. కాబట్టి చిన్న చిన్న విషయాలలో కూడా అతడిని అనుసరించకుండా అప్రమత్తంగా ఉండవలెను.

ఓ ప్రజలారా! మీ స్త్రీలపై మీకు కొన్ని ప్రత్యేక హక్కులు ఉన్నమాట వాస్తవమే కాని వారికి కూడా మీ పై హక్కులు ఉన్నాయి. జ్ఞాపకం ఉంచుకోండి, కేవలం అల్లాహ్ పై ఉన్న విశ్వాసం ఆధారంగానే మరియు అల్లాహ్ యొక్క అనుమతి మూలంగానే మీరు వారిని తమ తమ భార్యలుగా చేసుకున్నారు.

మీ స్త్రీలతో మంచిగా ప్రవర్తించండి మరియు దయాదాక్షిణ్యాలతో వ్యవహరించండి ఎందుకంటే వారు మీ జీవిత భాగస్వాములు మరియు శ్రద్ధాభక్తులతో, సేవానిరతితో సహాయ సహకారాలందించే అంకితమైన సహాయకులు. ఒకవేళ వారు స్థిరంగా మీ హక్కులను పూర్తిచేస్తున్నట్లయితే, మీ నుండి దయతో ఆహారం (అన్నపానీయాలు) మరియు దుస్తులు పొందే హక్కు వారి స్వంతమవుతుంది. ఇంకా మీరు అనుమతించని(ఇష్టపడని) వారితో, వారు స్నేహంగా మెలగకూడదనేది మరియు తమ శీలాన్ని అస్సలు కోల్పోకూడదనేది (వ్యభిచరించకూడదు, తుంటరిగా ప్రవర్తించకూడదు) వారిపై మీకున్న హక్కు.

ఓ ప్రజలారా! అత్యావశ్యకంగా నా మాట వినండి. కేవలం అల్లాహ్ నే ఆరాధించండి, ప్రతి దినపు ఐదు తప్పని సరి నమాజులను పూర్తిచేయండి, రమదాన్ నెలలో తప్పనిసరిగా ఉపవాసం ఉండండి మరియు తప్పనిసరి అయిన విధిదానం (జకాత్) పేదలకు పంచిపెట్టండి. ఒకవేళ మీకు తగిన శక్తిసామర్ధ్యాలు ఉన్నట్లయితే, హజ్ యాత్ర పూర్తిచేయండి.

మొత్తం మానవజాతి ఆదం (అలైహిస్సలాం) సంతతి యే మరియు అరబ్ వాసులకు ఇతరులపై ఎటువంటి ఆధిక్యం లేదు, మరియు ఇతరులకు అరబ్ వాసులపై ఎటువంటి ఆధిక్యం లేదు; అలాగే నల్లవారి పై తెల్లవారికి ఎటువంటి ఆధిక్యం లేదు మరియు తెల్లవారి పై నల్లవారికి ఎటువంటి ఆధిక్యం లేదు, కేవలం దైవభక్తి మరియు మంచి నడవడికలో తప్ప.

ప్రతి ఒక్క ముస్లిం, ప్రతి ఒక్క ఇతర ముస్లింకు సోదరుడని మరియు ముస్లింలు సోదర భావాన్ని తప్పక స్థాపించాలని గ్రహించవలెను. తోటి ముస్లింలకు చెందిన వాటిపై, మీకు ఎటువంటి అధీనం (ఔరసత్వం) లేదు, కాని స్వతంత్రంగా మరియు మనస్పూర్తిగా వారు ఇష్టపడి మీకిస్తే తప్ప. కాబట్టి, ఈ విధంగా మీకు మీరే  (ఇతరుల హక్కును గౌరవించకుండా) అన్యాయంచేసుకోవద్దు.

జ్ఞాపకం ఉంచుకోండి, ఒకరోజు మీరు అల్లాహ్ ముందు హాజరవబోతున్నారు. మీరు చేసిన ప్రతి పనికి, ప్రతి ఆచరణకు ఆ రోజున సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. కాబట్టి, జాగ్రత్త! నేను ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోయిన తర్వాత మీరు సత్యమార్గానికి  దూరం కావద్దు.

ఓ ప్రజలారా! నా తర్వాత వేరే ప్రవక్త లేక వేరే సందేశహరుడు రారు. మరియు ఏ క్రొత్త ధర్మమూ పుట్టదు. కాబట్టి వివేకంతో, జ్ఞానంతో, బుద్ధితో సరిగ్గా వ్యవహరించండి.

ఓ ప్రజలారా! ఇంకా, నేను మీకు తెలియజేస్తున్న ఈ పదాలను మంచిగా అర్థం చేసుకోవలెను – నేను నా వెనుక (నా తర్వాత) రెండు విషయాలను వదిలి వెళ్ళుతున్నాను, ఒకటి దివ్యఖుర్ఆన్ మరియు రెండోది నా నిదర్శనం (దృష్టాంతం, ఉదాహరణ (సున్నత్) మరియు మీరు ఈ రెండింటినీ గనుక అనుసరిస్తే, ఎట్టి పరిస్థితిలోను నశించిపోరు.

నా వాక్కులు వింటున్నమీరందరూ, వీటిని ఇతరులకు చేర్చవలెను, ఇంకా ఆ ఇతరులు వేరే ఇతరులకు చేర్చవలెను. అలా విన్నవారిలో చిట్టచివరి తరం వారు, ఇప్పుడు నా నుండి ప్రత్యక్షంగా వింటున్న మీకంటే ఇంకా మంచిగా అర్థం చేసుకోవటానికి కూడా ఆస్కారం ఉన్నది.

ఓ అల్లాహ్ (ఏకైక దైవారాధకుడు ), నేను నా కివ్వబడిన దివ్యసందేశాన్ని నీ ప్రజలకు అందజేసానని సాక్ష్యంగా ఉండవలెను.

Source

కవిత ఎలా నూర్ ఫాతిమాగా మారిపోయినది? (How Kavita converted to fatima?)

కవిత ఎలా నూర్ ఫాతిమాగా మారిపోయినది?
(ఇంటర్వ్యూ: బింత్ అర్షద్ సాహీ)

ఒక ఉగ్రవాద శివసేన హిందూ కుటుంబానికి చెందిన, ఒక అమ్మాయి కథ ఇది. ‘కవిత’ అనే ఆ అమ్మాయి స్వయంగా ఇచ్చిన ఇంటర్వ్యూ ఇది.  ఇస్లాం స్వీకరణ తరువాత ఆమె పేరు ‘నూర్ ఫాతిమా’ గా మార్చుకున్నది.

ప్రశ్న: ఇస్లాం స్వీకరణకు ముందు మీ పేరేమిటి?

జవాబు: ఇస్లాం స్వీకరణకు పూర్వం నా పేరు ‘కవిత’, నన్ను అందరూ ముద్దుగా పేరు ‘పూనమ్’ అని పిలిచేవారు.

ప్రశ్న: మరి ఇస్లాం స్వీకరించిన తరువాత ఇప్పుడు మీ పేరేమిటి?

జవాబు: ఇస్లాం స్వీకరించిన తరువాత నాకు ‘నూర్ ఫాతిమా’ అని పేరు పెట్టడం జరిగింది.

ప్రశ్న: మీరెక్కడ జన్మించారు, ఇప్పుడు మీ వయసెంత?

జవాబు: నేను ముంబాయి లో జన్మించాను.  ఇప్పుడు నా వయసు 30 సంవత్సరాలు. కానీ, నావరకు నేను, నావయసు ఐదు సంవత్సరాలే అనుకుంటాను. ఎందుకంటే, ఇస్లాంకు సంబంధించి నా ఙ్ఞానమూ, అవగాహనా, ఒక ఐదు సంవత్సరాల ముస్లిం పిల్లవాడి కంటే మించదు.

ప్రశ్న: మీ విద్యాభ్యాసాన్ని గురించి చెబుతారా?

జవాబు: ఇండియాలో స్కూలు విద్య పూర్తి చేసిన తరువాత, పై చదువుల కోసం నేను కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి వెళ్ళాను.  మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన తరువాత, అక్కడే ఎన్నో కంప్యూటర్ కోర్సులు చేసాను. నిజంగా నేను విచారిస్తున్నాను, ప్రాపంచిక జీవితం కోసం చాలా డిగ్రీలు సంపాదించాను.  కానీ పరలోక జీవితం కోసం ఏమీ చేయలేక పోయాను.  ఈ ఆశయం సాధించడం కొరకు ఇప్పుడు సాధ్యమైనంత చేయాలని కోరుకుంటున్నాను.

ప్రశ్న: మీ జీవితానికి సంబంధించి ఇంకా వివరాలు చెప్పండి?

జవాబు: నా చదువులు పూర్తయిన తరువాత, ముంబాయిలో నేను ఒక స్కూల్లో టీచరుగా చేరాను. అది చాలా పెద్ద స్కూల్.  కోటీశ్వరుల పిల్లలే అక్కడ చదవడానికి వస్తారు.

ప్రశ్న: మీ వివాహం ఎక్కడ జరిగింది, మీకెంత మంది పిల్లలు?

జవాబు: నా వివాహం ముంబాయిలో జరిగింది.  కానీ తరువాత నేను నా భర్త వెంట బహ్రెయిన్ వచ్చాను.  నాకు ఇద్దరు మగపిల్లలు.

ప్రశ్న: మీరు ఇస్లాం స్వీకరించటం ఏ విధంగా జరిగింది?

జవాబు: అన్నింటికన్నా ముందుగా నాపై కురిపించిన అనుగ్రహాలకు గాను నేను అల్లాహ్ కు కృతఙ్ఞతలు అర్పించుకుంటున్నాను.  ఆయన ప్రవక్త, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అన్నట్లు “ఎవరికైతే అల్లాహ్ మంచి చేయాలని తలపోస్తాడో, వారికి ధర్మానికి సంబంధించిన అవగాహనను కలుగజేస్తాడు” అని, నాపై అల్లాహ్ ఎంతగానో తన కారుణ్యాన్నీ, అనుగ్రహాన్నీ కురిపించాడని అనుకుంటున్నాను. ముస్లిములు అంటేనే విపరీతంగా అసహ్యించుకునే, ఉగ్రవాద హిందూ వాతావరణంలో పెరిగాను నేను.  నేను ఇస్లాం స్వీకరించటం నా వివాహం అయిన తరువాత జరిగింది. కానీ, చిన్నప్పటినుంచే విగ్రహాలకు పూజ చేయటం అంటే ఇష్టం ఉండేది కాదు నాకు.  ఇప్పటికీ బాగా గుర్తు నాకు – ఒక సారి, మా ఇంట్లో ఉన్న ఒక విగ్రహాన్ని తీసుకెళ్ళి స్నానాలగదిలో పడేసాను.  దాంతో మా అమ్మ నన్ను బాగా తిట్టిపోసింది. దానికి నేను మా అమ్మతో “తనను తాను కూడా రక్షించుకోలేని ఆ విగ్రహానికి ఎందుకమ్మా మీరు తలలు వంచి దండాలు పెడతారు.  అది మీకేం ఇస్తుందనీ?” అన్నాను.  మా కుటుంబంలో ఒక సాంప్రదాయం ఉంది.  ఆడపిల్లకు పెళ్ళైనపుడు, ఆ అమ్మాయి తన భర్త కాళ్ళు కడిగి, ఆ నీళ్ళను తాగాలి.  కానీ ఆ మొట్టమొదటి రోజే, నేను అలా చేయడానికి నిరాకరించాను. దానికి అందరూ నన్ను విపరీతంగా తిట్టారు.  నేను మీకు ముందే చెప్పాను కదూ, నేను ఒక స్కూల్లో టీచరుగా చేరానని – స్కూలుకు నేను ఒక్కదాన్నే వెళ్ళి వస్తూ ఉండటం, కారును నేను స్వయంగా డ్రైవ్ చేయటం వల్ల, దార్లోనే ఉన్న, ఒక ఇస్లామిక్ సెంటర్ కు వెళ్ళడం ప్రారంభించాను. నేను వారి సంభాషణ విన్నాను.  వారు విగ్రహాలను పూజించరన్న విషయం నాకు అర్థమైంది.  వారు, అనుగ్రహాలను, ఆశీర్వాదాలను కోరుకునేది వేరే ఇంకెవరి నుంచో.  వారి దేవుడు విగ్రహాలు కాదు – వేరే ఇంకెవరో.  వారి అభిప్రాయాలు నచ్చాయి నాకు.  తరువాత నాకు అర్థమైంది ఆ ‘వేరే ఇంకెవరో’ –  ‘అల్లాహ్’ అనీ, సమస్త కార్యాలనూ పరిపూర్తి చేసేది ఆయనే అనీ.

ప్రశ్న: ఇస్లాం వైపునకు మీరు ఎలా ఆకర్షించబడ్డారు?

జవాబు: వారి ఆరాధనా విధానం, అదే ‘నమాజు’ నన్ను బాగా ప్రభావితం చేసింది.  అది ‘ఆరాధన’ అన్న విషయం అంతకు ముందు తెలియదు నాకు.  అయితే ముస్లిములందరూ అలా చేస్తారని మాత్రం తెలుసు.  అదేదో ఒకరకం వ్యాయామం కాబోలు అనుకునే దాన్ని. ఇస్లామిక్ సెంటర్ కి వెళ్ళి రావడం మొదలు పెట్టిన తరువాత, అది ఒక ‘ఆరాధన’ అనీ, దానిని ‘నమాజు’ అంటారనీ తెలిసింది నాకు.  నేనెప్పుడూ కలలో ఒక రకమైన ఆకారాన్ని చూస్తూ ఉండే దాన్ని.  అది నలుచదరపు గదిలా ఉండేది.  ప్రతి రోజూ కలలో చూస్తూ ఉండే దానిని.  కలత చెంది నిద్ర నుంచి లేచి పోయేదానిని.  చెమటలు పట్టేవి. పడుకుంటే మళ్ళీ కలలోకి వచ్చేది. నా కలలో కనిపించిన ఆ గదిని గురించి, తరువాత చాలా తెలుసుకున్నాను నేను.

ప్రశ్న:  మీరు ఇస్లాం స్వీకరించడం గురించి మీ కుటుంబానికి ఎలా తెలిసింది?

జవాబు: పెళ్ళయింతర్వాత, నా భర్తతో పాటు బహ్రెయిన్ కు వెళ్ళటం, ఇస్లాం పట్ల అవగాహన పెంచుకోవాటానికి బాగా ఉపకరించింది. అదొక ముస్లిం దేశం కావటం వల్ల, మా ఇంటి చుట్టుపక్కల అందరూ ముస్లిములే ఉండేవారు.  అలా ఒక ముస్లిమం అమ్మాయితో నాకు స్నేహం అయ్యింది.  ఆ అమ్మాయి ఎపుడో కానీ మాయింటికి వచ్చేది కాదు.  చాలాసార్లు నేనే ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళుతూ ఉండే దానిని.  ఒకసారి, అది రమదాన్ నెల కావటంతో, ఒకరోజు నాతో వాళ్ళ ఇంటికి ఇక రావద్దని కరాఖండిగా చెప్పేసింది.  నేను ఆశ్చర్యపోయాను.  “నువ్వు మా ఇంటికి రావడం వల్ల, నా ఆరాధనలకు అతరాయం కలుగుతున్నది” అంది తను. నాకు, ఇస్లాం యొక్క ఆరాధనలు, ఆచరణలు, సాంప్రదాయాలు తెలుసుకోవాలని బాగా కోరికగా ఉండటంతో, ఆ అమ్మాయి మాటలు నాలో మరింత ఉత్సుకతను రేపాయి.  నేను ఆ అమ్మాయిని బతిమాలాను “ప్లీజ్! అలా అనకు.  నువ్వు ఏ ఆరాధన చేయాలనుకుంటావో, చెయ్యి.  ఎలా ఆచరిస్తావో అలా ఆచరించు. నేను ఒక్క మాట కూడా మాట్లాడను.  కేవలం చూస్తూ ఉంటానంతే.  నువ్వు ఏం చదువుతావో, జస్ట్ వింటూ ఉంటానంతే.  నావల్ల నీకు ఎలాంటి అంతరాయం, ఆటంకం కలుగకుండా మసలుకుంటాను.” అన్నాను.  ఆ అమ్మాయి సరేనంది.  నేను ఎప్పుడైనా ఆ అమ్మాయిని ఏదో ఒక ఆరాధనలో మునిగి ఉండగా చూస్తే, దానికి బాగా ఆకర్షితమై పోయే దానిని – నేను కూడా అలా చేయాలనీ, అలా ఆచరించాలనీ బలంగా అనిపించేది నాకు.  ఒకసారి ఆ అమ్మాయిని అడిగాను ఆ ‘యోగా వంటి వ్యాయామాన్ని’ గురించి.  తను చెప్పింది దానిని ‘నమాజు’ అంటారనీ, తను పఠించే ఆ గ్రంథాన్ని ‘దివ్య ఖుర్’ఆన్’ అంటారనీ.  నేను కూడా అవన్నీ చేయాలనీ ఆశపడేదానిని.  ఇంటికి తిరిగి వెళ్ళినపుడు, ఒక గదిలోకి దూరి, లోనుంచి గడియ పెట్టుకుని, నాకు అంతగా ఏమీ తెలియక పోయినా, ఆ ఏకాంతంలో నా స్నేహితురాలు ఆచరించినట్లుగా అన్ని పనులూ ఆచరిస్తూ ఉండే దానిని. ఒకరోజు, గది తలుపులు లోపలి నుంచి గడియ పెట్టడం మరిచిపోయి, నమాజు ఆచరించటం ప్రారంభించాను.  నా భర్త గదిలోనికి ప్రవేశించటప్పటికి నేను నమాజులో ఉన్నాను.

‘ఏం చేస్తున్నావ్?’ అని అడిగాడు నన్ను.
‘నమాజు చేస్తున్నాను’ అన్నాన్నేను.

‘నీకేమన్నా మతి పోయిందా?  తెలివుండే మాట్లాడ్తున్నావా నువ్వూ? ఏమంటున్నావో అర్థమవుతున్నదా నీకసలు?’ కోపంతో ఊగిపోతూ అడిగాడు.

ముందు నేను కొద్దిగా వణికాను, భయంతో నాకళ్ళు మూసుకుపోతున్నాయి. కానీ అంతలోనే, నాలో అంతరంగా ఉన్న శక్తి, ఆ పరిస్థితిని ఎదుర్కోవడానికి నాకు ధైర్యాన్నిచ్చింది.  అంతే, నేను గట్టిగా అరిచి మరీ చెప్పాను ‘అవును, నేను ఇస్లాం స్వీకరించాను. అందుకే నమాజు చేస్తున్నాను’.

‘ఏంటీ? ఏమన్నావ్? ఏదీ మళ్ళొకసారి అను?’ కోపంతో ఊగిపోతూ, రెట్టించి అడిగాడు అతను.

‘అవును, నేను ఇస్లాం స్వీకరించాను’ అన్నాన్నేను.

అంతే, నన్ను పశువును కొట్టినట్లు, కొట్టడం మొదలు పెట్టాడు.  మా అరుపులు, ఆ దెబ్బల చప్పుళ్ళు విని, మా అక్క పరుగెత్తుకు వచ్చింది. ఆవిడ నన్ను విడిపించటానికి ప్రయత్నించింది.  కానీ, నా భర్త చిప్పిందంతా విని, తాను కూడా నాపై చేయి చేసుకోవడం ప్రారంభించింది. నేను తనని ఆపి అన్నాను “అక్కా! దయచేసి, నాదారికి అడ్డు రావద్దు. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు.  నా కొరకు ఏది మంచో, ఏది చెడో నాకు తెలుసు.  నేను ఎంచుకున్న మార్గం పై నేను నడిచి తీరుతాను.’ ఇది విని, నా భర్త ఉగ్ర రూపం దాల్చాడు.  నన్ను ఎంతగా హింసించాడంటే – నేను స్పృహ తప్పి పడిపోయాను.

ప్రశ్న: మరి అప్పుడు మీ పిల్లలు ఎక్కడున్నారు? ఎంత వయసు ఉండి ఉంటుంది వాళ్ళకపుడు?  అక్కడినుంచి ఎలా తప్పించుకో గలిగారు మీరు?

జవాబు: ఈ భయానకమైన డ్రామా అంతా జరుగుతున్నపుడు నా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు.  నా పెద్ద కొడుకు 9 వ సంవత్సరంలోనూ, నా చిన్న కొడుకు 8 వ సంవత్సరంలోనూ ఉన్నారు.  కానీ ఈ సంఘటన జరిగిన తరువాత నేను ఎవరినీ కలువకుండా కట్టడి చేసారు, చివరికి నా పిల్లలను కూడా.  నన్ను ఒక గదిలో వేసి తాళం వేసారు.  సాంప్రదాయబధ్ధంగా నేను ఇస్లాం స్వీకరించక పోయినప్పటికీ, నేను ఆవిధంగా అనేసాను ‘నేను ఇస్లాం స్వీకరించాను’ అని.  ఒక రోజు రాత్రి, నేను ఆ గదిలో పడిఉండగా, నా పెద్దకొడుకు నావద్దకు వచ్చాడు. అంతే, నన్ను చూస్తూనే, నా చేతుల్లో వాలిపోయి, గట్టిగా ఏడ్వడం మొదలుపెట్టాడు.  లోనుంచి తన్నుకు వస్తున్న ఏడుపును దిగమింగుకుని, ‘వాళ్ళందరూ లేరా?’ అని అడిగాను.  ఎవరూ ఇంట్లో లేరనీ, వాళ్ళందరూ ఏదో ఫంక్షన్ ఉందని వెళ్ళారనీ చెప్పాడు  (ఏదో హిందూ పండుగ సందర్భంగా జరుగుతున్న ఫంక్షన్ అది). నా పెద్దకొడుకు ‘అమ్మా! వాళ్ళంతా నిన్ను చంపాలనుకుంటున్నారు.  నువ్విక్కడినుంచి పారిపోమ్మా’ అన్నాడు.  నేను వాడిని సముదాయించాను ‘కన్నా! నాకేమీ జరుగదు.  వాళ్ళు నన్నేమీ చేయలేరు. నువ్వు జాగ్రత్త, నీ తమ్ముడ్ని కూడా జాగ్రత్తగా చూసుకో.’ అన్నాను.  కానీ వాడు నన్ను పోరుతున్నట్లుగా, సముదాయిస్తూ మళ్ళీ అడగటం మొదలుపెట్టాడు ‘అమ్మా! నువ్విక్కడి నుంచి పారిపోమ్మా!’ అని.  నేను వాడిని మళ్ళీ సముదాయించాను ‘నాకేమీ జరుగదని, తనను జాగ్రత్తగా ఉండమనీ, తమ్ముడ్ని జాగ్రత్తగా చూసుకోమనీ’. కానీ వాడు ఏడుస్తూ ఎక్కిళ్ళమధ్య మళ్ళీ నన్ను పోరడం మొదలుపెట్టాడు.  నేను వాడికి అర్థమయ్యేలా చెప్పాను ‘నేను వెళ్ళలేననీ, వెళ్ళితే తననీ, తమ్ముడ్నీ చూసే అవకాశం కోల్పోతాననీ’.  వాడన్నాడు ‘నువ్వు బ్రతికి ఉంటే కదమ్మా మమ్మల్ని చూసేదీ!  వెళ్ళిపోమ్మా ఇక్కడినుంచి, వాళ్ళు నిన్ను హత్య చేస్తారు, చంపేస్తారమ్మా నిన్నూ, – ప్లీజ్, ఇక్కడినుంచి వెళ్ళిపో ……..’ వాడు ఏడుస్తూ అంటూనే ఉన్నాడు.  నా కన్నీళ్ళను నేను కళ్ళలోనే ఇంకించుకుంటున్నాను. చివరికి నేను నిర్ణయించుకున్నాను ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని. ఆ నిర్ణయం తీసుకున్న కఠినమైన క్షణాలను నేను ఎన్నటికీ మరిచిపోలేను.  నా పెద్దకొడుకు, నిద్రపోతున్న నా చిన్న కొడుకు దగ్గరికి వెళ్ళి ‘నానీ ! లేవరా ! అమ్మ వెళ్ళిపోతున్నది. మళ్ళీ మనల్ని కలుస్తుందో లేదో, లేవరా!’ అని లేపుతున్నాడు. వాడు కళ్ళు నులుముకుంటూ లేచాడు.  నన్ను చాలా రోజుల తరువాత చూస్తున్నాడు వాడు. ఒకడుగు ముందుకు వేసి ఏడుస్తూ నన్ను అల్లుకు పోయాడు. నేను మనసులోనే రోదిస్తున్నాను.  బహుశా, పిల్లలకు అన్ని విషయాలూ ముందుగానే తెలుసులా ఉంది.  వాడు నన్ను ఒక్కటే మాట అడిగాడు ‘అమ్మా! వెళ్ళిపోతున్నావా నువ్వూ?’  కళ్ళలో నీళ్ళు తిరుగుతుండగా ‘అవును’ అన్నట్లుగా తలాడించాను ‘మనం తప్పకుండా మళ్ళీ కలుస్తాంరా నానీ’ అంటూ.  నేను మోకాళ్ళపై కూర్చుని, పిల్లలిద్దర్నీ హత్తుకుని తనివితీరా ఏడుస్తున్నాను. ఒకవైపు పిల్లలపై ప్రేమ, వారిని విడిచి వెళ్ళిపోతున్నాని బాధ, మరోవైపు దానిని అధిగమిస్తూ ఇస్లాం పట్ల ప్రేమ.  ఆ చలిచీకటి రాత్రిలో, నేను వెళ్ళిపోతూఉంటే, నా ఇద్దరు కొడుకులూ వీడ్కోలు చెబుతున్నట్లుగా నన్నే చూస్తూ నిలబడ్డారు.  వాళ్ళపై, లోనుంచి పెల్లుబికి వస్తున్న మమతానురాగాలనూ, ప్రేమనూ అతి కష్టంగా అదుపు చేసుకుంటూ వెళ్తున్నాన్నేను. నా వంటిపై గాయాలు పచ్చిగా ఉన్నాయి.  నడవడం కూడా రావడం లేదు.  గేటు దగ్గర నిలబడి పిల్లలిద్దరూ కన్నీళ్ళతో చేతులూపుతున్నారు.  ఆ దృశ్యాన్నీ, ఆ క్షణాలనూ నేను ఎన్నటికీ మరిచిపోలేను. ఆ క్షణాలు నాకెప్పుడు గుర్తుకు వచ్చినా, ముస్లిములు ఇస్లాం కొరకు, తమ కుటుంబాలనూ, భార్యాపిల్లలనూ, తమ సొంత ఊళ్ళనూ వదిలి వలస వెళ్ళిన సంఘటనలను గుర్తు చేసుకునేదానిని.

ప్రశ్న: అప్పుడు మరి ఎక్కడికి వెళ్ళారు మీరు? ఇస్లాం ఎక్కడ స్వీకరించారు?

జవాబు: ఇంటినుంచి తిన్నగా పోలిస్ స్టేషన్ కు వెళ్ళాను. పెద్ద చిక్కు ఏమిటంటే, అక్కడెవరికీ, నేను మాట్లాడే భాష ఏమిటో తెలియదు.  అందులో కొద్దిగా ఇంగ్లీషు అర్థం చేసుకోగలిగే ఒకతను ఉన్నాడు.  నేనున్న ఆందోళణకర స్థితిలో శ్వాస తీసుకోవటానికి కూడా కష్టంగా ఉంది నాకు.  నన్ను కొద్ది సేపు విశ్రాంతి తీసుకోనివ్వమని అతడ్ని రిక్వెస్ట్ చేసి, ఆ ప్రక్కన కూర్చుండి పోయాను.  కొద్దిగా కుదుటపడిన తరువాత, అతనికి చెప్పాను ‘నేను ఇల్లు విడిచి వచ్చేసాననీ, నేను ఇస్లాం స్వీకరించాలనీ’. నేను కంగారు-కంగారుగా అన్ని విషయాలూ అతనికి చెప్పేసాను.  అతడు నన్ను ఓదార్చాడు. తను కూడా ముస్లిమేననీ, తనకు చేతనైనంత సహాయం తప్పనిసరిగా చేస్తాననీ అన్నాడు. అతడు నన్ను తన ఇంటికి తీసుకువెళ్ళి, తన ఇంట్లో అందరికీ పరిచయం చేసాడు.  ఆ రాత్రికి నాకు వాళ్ళ ఇంట్లోనే ఆసరా కల్పించాడు.  ప్రొద్దున్నే నా భర్త పోలీస్ స్టేషన్ కు వచ్చి, తన భార్య కిడ్నాప్ కు గురైందనీ, పోలీసుల సహాయం కోసం వచ్చినట్లుగా చెప్పాడు.  కానీ వాళ్ళు,  నేను కిడ్నాప్ కు గురి కాలేదనీ, నా అంతట నేనే అక్కడికి వచ్చాననీ అతడికి తెలియజేసారు.  నేను ఇస్లాం స్వీకరించలని కోరుకుంటున్నందున, అతడికి (ముస్లిం కానందున) నాపై ఎటువంటి అధికారం లేదనీ, నాతో ఎటువంటి సంబంధమూ లేదనీ కూడా తెలియజేసారు.  కానీ అతడు మొండిగా నేను తనతో రావల్సిందేనని పట్టుబట్టి, బెదిరించడం ప్రారంభించాడు.  నేను అతడితో వెళ్ళడానికి నిరాకరించాను.  ‘కావాలంటే, నా నగలు, బాంకులో ఉన్న డబ్బూ, ఆస్తీ మొత్తం తీసుకో’ అని, అతడితో వెళ్ళనని తెగేసి చెప్పాను.  అయినా మొదట్లో అతడు ఆశ వదులుకోలేదు.  కానీ తరువాత, ఆశలు వదులుకుని, ఆస్తికి సంబంధించి, నాతో ఒక వ్రాత ఒప్పందం మీద సంతకాలు తీసుకుని వెళ్ళిపోయాడు.

ఆ పోలీసు ‘ఇప్పుడు నీకు ఏ ప్రమదమూ లేదు, నీ వాళ్ళెవరూ నిన్నేమీ చేయలేరు.  నీవు నిర్భయంగా ఇస్లాం స్వీకరించవచ్చు’ అని అన్నాడు. తరువాత  చికిత్స కొరకు కొద్ది రోజుల పాటు నేను హాస్పిటల్ లోనే ఉండి పోవలసి వచ్చింది.  ఒకసారి ఒక డాక్టర్ అడిగాడు ‘ఎక్కడి నుంచి వచ్చావమ్మా నువ్వు? ఇన్ని రోజులైంది, నిన్ను చూడ్డానికి ఒక్కరైనా రాలేదే’ అని.  నేను మౌనంగా ఉండిపోయాను.  ఒకేఒక్క విషయాన్ని అణ్వేశిస్తూ నేను ఇంటిని విదిలేసాను.  ఇప్పుడు నాకు ఇల్లూ లేదూ, ఒక కుటుంబమూ లేదు. నాకు ఉన్న ఒకేఒక బంధం ‘ఇస్లాం’.  ఇంటిని విడిచి బయటకు అడుగు వేసిన మొదటి దశలోనే నన్ను ఆదుకుంది, ఆత్మీయంగా అక్కున చేర్చుకున్నది .  ఆ ముస్లిమ్ పోలీసతను నన్ను ‘చెల్లీ’ అని పిలిచాడు. తన ఇంట్లో చోటిచ్చాడు. నాకున్న బంధుత్వాలన్నీ తెగిపోయిన, ఆ చలిచీకటి రాత్రి బంధువై నాకు ఆశ్రయం కల్పించాడు.  ఆ సహాయాన్ని నేను ఎన్నటికీ మరిచిపోలేను.

హాస్పిటల్ లో ఉండగా, ‘తరువాత ఏమిటి’ అని ఆలోచిస్తూ ఆందోళనకు గురయ్యే దానిని. మనశ్శాంతీ, రక్షణ కోసం ఎక్కడికెళ్ళాలీ?  హాస్పిటల్ నుంచి డిస్చార్జ్ అయిన తరువాత నేరుగా ఇస్లామిక్ సెంటర్ కు వెళ్ళాను.  అప్పుడక్కడ ఎవరూ లేరు, వయసు మీరిన ఒకాయన తప్ప, బహుశా అందులోనే అతని నివాసం కూడానేమో. నేను ఆయన దగ్గరికి వెళ్ళి, నా కథంతా చెప్పాను.  ఆయన సలహా మేరకు ముస్లిం స్త్రీలు ధరించే సాంప్రదాయక దుస్తులు ధరించాను. నమాజు ఆచరించటానికి ముందు ముస్లిములు తమ ముఖమూ, చేతులూ, కాళ్ళూ, ఏవిధంగా శుభ్రపర్చుకుంటారో ఆ విధంగా నన్ను శుభ్రపరుచుకోమన్నాడు. (ఆ విధంగా శుభ్ర పరచుకోవటాన్ని ‘వుదూ’ అంటారు). ఆయన వుదూ చేసి చూపించాడు.  తరువాత ఒక గదిలోకి తీసుకెళ్ళాడు నన్ను.  అక్కడ గది గోడకు వేళ్ళాడ్తూ ఉన్న పటాన్ని చూసి అధాట్టుగా అరిచాన్నేను ‘అదే – అదే, ఆ నలుచదరపు గదినే నేను కలలో చూసింది’.  ఆయన నా వైపు చిరునవ్వుతో చూసి అన్నాడు ‘అది అల్లాహ్ గృహం. ప్రపంచం నలుమూలల నుంచీ ముస్లిములు ఉమ్రా, హజ్జ్ ఆచరించటానికి అక్కడికి వస్తూ ఉంటారు. దానిని ‘బైతుల్లాహ్’ అంటారు.’ అది విని, ఆశ్చర్యంతో ‘అల్లాహ్ ఆ గదిలో ఉంటాడా?’ అని అడిగాను ఆయన నా అన్ని ప్రశ్నలకూ ఎంతో వాత్సల్యంగా, ఓర్పుగా సమాధానాలిస్తున్నాడు. బహుశా ఆయనకు ఇస్లాం గురించి చాలా తెలుసు. నేనూ ఆయనతో ఎటువంటి జంకూ లేకుండా మాట్లాడుతూ ఉన్నాను.  ఆయన నా భాషలోనే ఎన్నో విశయాలను విశదీకరిస్తున్నాడు. ఏదో అర్థంకాని అనిర్వచనీయమైన సంతోషాన్ని అనుభవిస్తున్నాన్నేను.  ఆయన నాతో ‘కలిమా’ చదివించాడు.  ఇస్లాం గురించీ, ముస్లిముల గురించీ ఎన్నో విషయాలు చెప్పాడు. నాకిపుడు ఏ ఆందోళనా లేదు, నా హృదయం పై ఎటువంటి భారమూ లేదు.   నాకిపుడు ఎంతో తేలికగా ఉంది. దుర్గంధపూరిత మురికి నీళ్ళల్లో నుంచి స్వచ్ఛమైన జలాలలోనికి ఈదుకు వచ్చినట్లుగా ఉంది నాకు.  ఆ ఇస్లామిక్ సెంటర్ యజమాని, నన్ను తన కూతురిగా చేసుకున్నాడు.  నన్ను తన ఇంటికి తీసుకువెళ్ళాడు.  తరువాత ఒక ముస్లిం కుటుంబంలో నా వివాహం జరిపించాడు. అవకాశం లభించగానే, మొట్టమొదట ‘బైతుల్లాహ్’ చూడాలనీ, ఉమ్రా చేయాలనీ నా కోరిక.

ప్రశ్న: ఇస్లాం స్వీకరించిన తరువాత మీరెపుడైనా ఇండియా వెళ్ళారా?

జవాబు: లేదు, నేను ఎప్పుడూ, ఇండియా వెళ్ళనూ లేదు, ఇకముందు వెళ్ళాలనే కోరిక కూడా లేదు. అక్కడ నా కుటుంబం వారికి రాజకీయాలలో, హిందూ ధార్మిక వర్గాలలో బాగా పలుకుబడి ఉంది. నన్ను చంపటానికి బహుమతిని కూడా ప్రకటించారు వాళ్ళు. ఇప్పుడు నేనొక ముస్లింను, ఒక ముస్లిమునకు కూతురిని, నాకింకేం కావాలి? నేను ముస్లింను అయినందుకు గర్వపడుతున్నాను. ఇస్లాం వెలుగులో నేను నా శేషజీవితాన్ని గడపాలనుకుంటున్నాను.

ప్రశ్న: ఇస్లాం స్వీకరించటానికి ముందు ‘ముజాహిదీన్’ల గురించి మీ ఆలోచనలు ఏవిధంగా ఉండేవి?

జవాబు: వాళ్ళు దౌర్జన్య పరులనీ, దౌర్జన్యపు అన్ని హద్దులనూ దాటిపోయిన వారనీ మాకు నూరిపోయడం జరిగేది. వాళ్ళ పేరు వింటేనే అసహ్యించుకునేలా తయారు చేసేవారు మమ్మల్ని. కానీ మీడియా తప్పుడు ప్రచారంలోని సత్యాసత్యాలు గ్రహించి తరువాత, నేను వారిని అభిమానిస్తున్నాను.  ప్రపంచ శాంతియే లక్ష్యంగా పని చేస్తున్న వారి విజయం కొరకు ప్రార్థిస్తున్నాను. ఇంకా నేను అల్లాహ్ ను వేడుకుంటున్నాను ‘ఒకవేళ ఆయన నాకు కుమారులను ప్రసాదిస్తే, ‘ముజాహిదీన్’ ల  మొదటి వరుసలో వారిని నిలబెడతాను.  వారిని ఇస్లాం యొక్క ఔన్నత్యం కొరకు అంకితం చేస్తాను.  ఇన్షాఅల్లాహ్!

source