రెండవ ఖలీఫా హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హావారి సోదరి జీవిత చరిత్ర మస్జిదె హరామ్ లో హజ్రత్ అబూబక్ర్ (రదియల్లాహు అన్హు) గారి మీద దాడి జరిగిన తర్వాత ఉమ్మె జమీల్ ఫాతిమా బిన్తె ఖత్తాబ్ ఎలా సహాయపడ్డారు? తన అన్నయ్య హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఇస్లాం స్వీకరించడానికి ఆమె ఎలా కారణం అయ్యారు?
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
తప్పక వినండి, కన్నీటి పర్యంతం అవుతారు. ఈమె భర్త జాఫర్ ఇబ్న్ అబీ తాలిబ్ (రదియల్లాహు అన్హు) మరణించినప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఎటువంటి శుభవార్త ఇచ్చారో తెలుసుకోండి..ఆమె ప్రవక్త యొక్క ముగ్గురు సహచరులను వివాహం చేసుకున్నందుకు ప్రసిద్ధి చెందింది: జాఫర్ ఇబ్న్ అబీ తాలిబ్ , అబూ బకర్ మరియు అలీ ఇబ్న్ అబి తాలిబ్ (రదియల్లాహు అన్హుమ్)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఇస్లాంలో తొలి షహీదా (అమరవీరురాలు) – Sumayyah (radhiyallaahu anha) వీరి గురించి ప్రవక్త “ఓపిక వహించండీ, మీకు స్వర్గవాగ్దానం ఉంది“ అని అన్నారు
సుమయ్య (రజియల్లాహు అన్హా) జీవిత చరిత్ర | ఇస్లాంలో తొలి షహీదా (అమరవీరురాలు) https://youtu.be/0RpTYePDBes [38 నిముషాలు] వక్త: హబీబుర్ రహ్మాన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో, ఇస్లాం ధర్మంలో మొట్టమొదటి మహిళా షహీద్ అయిన సుమయ్య (రది యల్లాహు అన్హా) జీవిత చరిత్రను వివరించబడింది. ఆమె జీవితంలోని మూడు ముఖ్యమైన గుణపాఠాలు- ఈమాన్ (విశ్వాసం), సబర్ (సహనం), మరియు ఇస్తిఖామత్ (స్థిరత్వం) – ఎలా మనకు ఆదర్శంగా నిలుస్తాయో చర్చించబడింది. సూరహ్ అల్-అహ్జాబ్ మరియు సూరహ్ అల్-ముల్క్ నుండి ఆయతులను ఉటంకిస్తూ, ఒక విశ్వాసి యొక్క లక్షణాలను మరియు జీవితం యొక్క ఉద్దేశ్యాన్ని స్పష్టం చేయబడింది. యాసిర్ (రది యల్లాహు అన్హు) కుటుంబం ఇస్లాం ప్రారంభ రోజులలో ఎదుర్కొన్న కఠినమైన హింసలు, మరియు అబూ జహల్ చేతిలో సుమయ్య (రది యల్లాహు అన్హా) యొక్క దారుణమైన షహాదత్ (అమరగతి) గురించి వివరించబడింది. చివరగా, విశ్వాసం యొక్క మాధుర్యాన్ని పొందడానికి అవసరమైన మూడు లక్షణాల గురించిన హదీసును వివరిస్తూ, సుమయ్య (రది యల్లాహు అన్హా) జీవితం నుండి ప్రేరణ పొంది మన విశ్వాసాన్ని, సహనాన్ని మరియు స్థిరత్వాన్ని బలోపేతం చేసుకోవాలని ప్రబోధించబడింది.
అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్. వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్. వమన్ తబిఅహుమ్ బి ఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్. అమ్మాబాద్.
సర్వ స్తోత్రాలు, అన్ని విధాల పొగడ్తలు సర్వలోక ప్రభువైన, పాలకుడైన అల్లాహ్ కే శోభిస్తాయి. అనంత కరుణా శుభాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన అనుగ్రహాలను వర్షింపజేయుగాక. అభిమాన సోదరులారా! మీకందరికీ నా ఇస్లామీయ అభివాదం, అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.
సుమయ్య (రది యల్లాహు అన్హా) – ఇస్లాంలో మొదటి మహిళా షహీద్
ఈరోజు నా ప్రసంగాంశం, ఇస్లాం ధర్మంలో షహీద్ అయిన మొదటి మహిళ సుమయ్య రది యల్లాహు అన్హా.
ఆవిడ జీవిత చరిత్రలో ముఖ్యమైన మూడు విషయాలు మనకు ఆదర్శం. అన్నిటికంటే విశిష్టమైనది, ప్రాముఖ్యమైనది, దానికి మించినది ఏదీ లేదు అనే విషయం ఈమాన్, విశ్వాసం. అలాగే రెండవది సబర్, సహనం. మూడవది ఇస్తిఖామత్, స్థిరత్వం. ముఖ్యమైన ఈ మూడు విషయాలు మనకి సుమయ్య రది యల్లాహు అన్హా యొక్క జీవిత చరిత్రలో బోధపడుతుంది.
ఒక విశ్వాసి యొక్క గుణాలు
ఒక విశ్వాసిలో ఉండవలసిన గుణాలు, గుణాలలో కొన్ని గుణాలను అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూర అహ్జాబ్, సూరహ్ నంబర్ 33, ఆయత్ నంబర్ 35లో ఇలా సెలవిచ్చాడు.
“నిశ్చయంగా, ముస్లిం పురుషులు, ముస్లిం స్త్రీలు, విశ్వాసులైన పురుషులు, విశ్వాసులైన స్త్రీలు, విధేయులైన పురుషులు, విధేయులైన స్త్రీలు, సత్యసంధులైన పురుషులు, సత్యసంధులైన స్త్రీలు, సహనశీలురైన పురుషులు, సహనవతులైన స్త్రీలు, అణకువ గల పురుషులు, అణకువ గల స్త్రీలు, దానధర్మాలు చేసే పురుషులు, దానధర్మాలు చేసే స్త్రీలు, ఉపవాసం ఉండే పురుషులు, ఉపవాసం ఉండే స్త్రీలు, తమ మర్మాంగాలను కాపాడుకునే పురుషులు, కాపాడుకునే స్త్రీలు, అల్లాహ్ ను అత్యధికంగా స్మరించే పురుషులు, స్మరించే స్త్రీలు- వీరిందరి కోసం అల్లాహ్ మన్నింపును, గొప్ప పుణ్యఫలాన్ని సిద్ధం చేసి ఉంచాడు.”
ప్రియ సోదరులారా! ఈ సూర అహ్జాబ్ ఆయత్ నంబర్ 35 కి ఇది అర్థం.
కాకపోతే ఇక ఈ ఆయత్ యొక్క వివరము, తఫ్సీర్ లో నేను వెళ్ళదలచలేదు. కేవలం ఈ ఆయత్ లో వివరించబడిన గుణాలలో ఒక్క ముఖ్యమైన గుణం – వస్సాబిరీన వస్సాబిరాత్. సహనశీలురైన పురుషులు, సహనవతులైన స్త్రీలు. సబర్ గురించి. సబర్ అంటే సహనం. సాబిర్, సహనం చేసేవారు, వహించేవారు.
సాబిరహ్ (సహనశీలి) యొక్క నిర్వచనం
సహనశీలి అయిన స్త్రీ జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎంతో సహనంతో ఎదుర్కొంటూ దైవధర్మంలో స్థిరంగా ఉండే స్త్రీని సాబిరహ్ అంటారు. మరొకసారి నేను ఈ అర్థానికి రిపీట్ చేస్తున్నాను. సహనశీలి అయిన స్త్రీ అంటే ఏమిటి? సాబిరహ్ అంటే ఏమిటి? జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎంతో సహనంతో ఎదుర్కొంటూ దైవధర్మంలో స్థిరంగా ఉండే స్త్రీని సాబిరహ్ అంటారు. నిరాశ చెంది దైవాభిష్టానికి వ్యతిరేకమైన ఎటువంటి పనులకు పాల్పడకూడదు. తూఫాను భీభత్సంలో చిక్కుకొని భయంకరమైన కెరటాలకు ఊగిపోయే జీవిత నౌకను సహన స్థైర్యాలు కలిగిన నావికురాలు అల్లాహ్ మీద భారం వేసి అంతిమ శ్వాస వరకు దాన్ని తీరానికి తీర్చడానికే ప్రయత్నిస్తుంది. ఇటువంటి స్త్రీయే సుమయ్య రది యల్లాహు అన్హా.
యాసిర్ (రది యల్లాహు అన్హు) కుటుంబం యొక్క త్యాగం
సత్య ధర్మాన్ని నమ్మి దాని ప్రకారం నడుచుకునే ధృఢ మనస్కులు సహన స్థైర్యాలతో శత్రువుల దౌర్జన్యాలను తట్టుకుంటూ ఇస్లామీయ ఉద్యమంలో పురోగమిస్తున్న సాహసవతులలో యాసిర్ రది యల్లాహు అన్హు, ఆయన యొక్క అర్ధాంగి సుమయ్య రది యల్లాహు అన్హా, తనయుడు అమ్మార్ బిన్ యాసిర్ రది యల్లాహు అన్హు కూడా ఉన్నారు.
సుమయ్య రది యల్లాహు అన్హా యొక్క భర్త యాసిర్ రది యల్లాహు అన్హుని మిట్టమధ్యాహ్నం మండుటెండలో ఇసుక నేల మీద నగ్నంగా పడేసి కొరడాలతో ఒళ్ళు హూనం చేశారు. నిప్పుతో వాతలు పెట్టేవారు. మక్కాలో ఇస్లాం ప్రారంభ కాలంలో ఆ యాసిర్ రది యల్లాహు అన్హు, భార్య సతీమణి సుమయ్య రది యల్లాహు అన్హా, తనయుడు అమ్మార్ రది యల్లాహు అన్హు, ఆ కుటుంబం యొక్క దయనీయ స్థితిని చూసి మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ కళ్ళారా చూసి, ఏమీ చేయలేని సమయం అది. ఆ సమయంలో మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నోట వచ్చిన మాట: “ఇస్బిరూ యా ఆల యాసిర్, ఫ ఇన్న మౌయిదకుముల్ జన్నహ్.” ఓ యాసిర్ కుటుంబీకులారా, సహనం వహించండి ఎందుకంటే మీ నివాస స్థలం స్వర్గం. చివరికి యాసిర్ రది యల్లాహు అన్హు అవిశ్వాసులు పెడుతున్న బాధలు అనుభవిస్తూ ప్రాణం విడిచారు.
సతీమణి సుమయ్య రది యల్లాహు అన్హా గాథ కూడా దయనీయమైనదే. పరమ దుర్మార్గుడైన అబూ జహల్ ఆవిడను బాధించడమే కాకుండా ఒక రోజు అనరాని మాటలు అని తన చేతిలో ఉన్న ఈటెను ఎత్తి సుమయ్య రది యల్లాహు అన్హా మీదికి బలంగా విసిరాడు. ఆ దెబ్బకు ఆ సాధీమణి విలవిల్లాడుతూ నేల కొరిగారు. ఈ విధంగా ఇస్లాం ధర్మంలో షహీద్ అయిన, అమరగతి నొందిన మొదటి మహిళ సుమయ్య రది యల్లాహు అన్హా.
జీవితం మరియు మరణం – ఒక పరీక్ష
అభిమాన సోదరులారా! అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూర ముల్క్ లో ఇలా సెలవిచ్చాడు, ఆయత్ నంబర్ రెండు సూర ముల్క్ లో:
الَّذِي خَلَقَ الْمَوْتَ وَالْحَيَاةَ لِيَبْلُوَكُمْ أَيُّكُمْ أَحْسَنُ عَمَلًا وَهُوَ الْعَزِيزُ الْغَفُورُ (అల్లదీ ఖలఖల్ మౌత వల్ హయాత లియబ్లు వకుమ్ అయ్యుకుమ్ అహ్సను అమలా, వహువల్ అజీజుల్ గఫూర్) “మీలో ఎవరు ఉత్తమమైన కర్మలు చేస్తారో పరీక్షించడానికి, ఆయనే మరణాన్ని, జీవితాన్ని సృష్టించాడు. మరియు ఆయనే సర్వశక్తిమంతుడు, క్షమాశీలుడు.”
అంటే ఈ జీవన్ మరణాలను అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పరీక్షించే నిమిత్తం మీలో ఎవరు మంచి పనులు చేస్తారు, సదాచరణ చేస్తారు, సత్కార్యాలు చేస్తారు, మంచి పనులు, మంచి వారు ఇవి చూడటానికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ చావుని, ఈ బ్రతుకుని, ఈ జీవితాన్ని, ఈ మరణాన్ని సృష్టించాడు. కనుక ఈ ప్రపంచంలో సుఖ సంతోషాలతో పాటు దుఃఖాలు, విచారాలు కూడా ఉన్నాయి. ఆనందము ఉంది. బాధా ఉంది. ప్రశాంతత, అప్రశాంతతలు రెండూ ఉన్నాయి. ఏ కష్టాలు వచ్చినా, ఏ కడగండ్లు ఎదురైనా నిరాశ చెందకుండా ధైర్యంతో, సంపూర్ణ విశ్వాసంతో సహనంతో ఏది పోగొట్టుకున్నా, ఏది నష్టం అయిపోయినా విశ్వాసాన్ని మాత్రం పోగొట్టుకోకూడదు అనే పాఠం మనకు బోధపడుతుంది సుమయ్య రది యల్లాహు అన్హా యొక్క జీవితంలో.
సుమయ్య (రది యల్లాహు అన్హా) యొక్క పూర్వ చరిత్ర
అభిమాన సోదరులారా! సుమయ్య రది యల్లాహు అన్హా అసలు ఆవిడ ఎవరు? ఒకసారి మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో ఇది ప్రారంభ కాలం. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నబువ్వత్ వచ్చిన ప్రారంభంలో మక్కాలో ఒక వీధి ఉంది. దాని పేరు బనూ మఖ్జూమ్ వీధి. ఆ మక్కాలో బనూ మఖ్జూమ్ ఆ వాడ నుండి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పోతుండగా ఒక ముసలావిడని ఇనుముతో తయారు చేసిన ఆ వస్త్రాలలో, దానికి ఉర్దూలో జిరాహ్ అంటారు. దాంట్లో బాగా కట్టేసి మండుటెండలో పడేశారు. ఆవిడే సుమయ్య రది యల్లాహు అన్హా.
అంటే ఒక సందర్భంలో మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా వీధులలోని ఒక వీధి, వాడలోని ఒక వాడ బనూ మఖ్జూమ్ లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పోతుండగా మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా తమ శుభప్రదమైన, పవిత్రమైన తమ కళ్ళతో చూసిన దృశ్యం ఇది. ఒక ముసలావిడను ఇనుముతో తయారు చేసిన దానితో బాగా కట్టేసి భగభగ బాగా విపరీతమైన వేడిలో పడేశారు. ఆవిడే సుమయ్య రది యల్లాహు అన్హా.
అసలు సుమయ్య రది యల్లాహు అన్హా ఎవరంటే అజ్ఞాన కాలంలో మక్కాలో ధనవంతులలో ఒక ధనవంతుడైన అబూ హుజైఫా బిన్ అల్ ముగైరా మఖ్జూమి అనే వ్యక్తి యొక్క బానిసరాలు సుమయ్య రది యల్లాహు అన్హా. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కు ప్రవక్త పదవి లభించక, అంటే బేసతే నబవి, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ప్రవక్త పదవి లభించక 45 సంవత్సరాల ముందు, అంటే ఇంకా అప్పుడు మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టనే లేదన్నమాట, 45 సంవత్సరాల ముందు యమన్ నుంచి యాసిర్ బిన్ ఆమిర్ అనే వ్యక్తి మక్కాకు వచ్చారు. ఎందుకు వచ్చారు? ఆ యాసిర్ బిన్ ఆమిర్ అనే వ్యక్తి యొక్క ఒక తమ్ముడు వ్యాపార నిమిత్తమో, ఏదో నిమిత్తమో యమన్ నుంచి వేరే దేశాలకి వచ్చి మళ్ళీ తిరిగి ఇంటికి పోలేదు. తప్పిపోయారన్నమాట. తన తప్పిపోయిన తమ్ముడిని వెతుక్కుంటూ మక్కాకి వచ్చారు యాసిర్ బిన్ ఆమిర్ అనే వ్యక్తి. ఆ విధంగా వచ్చి మక్కాలోనే ఉండిపోయారు. తమ నివాసంగా మార్చుకున్నారు.
ఆ యాసిర్ బిన్ ఆమిర్ తో అబూ హుజైఫా బిన్ అల్ ముగైరా అంటే సుమయ్య రది యల్లాహు అన్హా యొక్క యజమాని, ఆ అబూ హుజైఫా తన బానిస అయిన సుమయ్య రది యల్లాహు అన్హా యొక్క వివాహం యమన్ నుంచి తమ్ముడిని వెతుక్కుంటూ వచ్చిన యాసిర్ బిన్ ఆమిర్ తో జరిపించాడు. ఈ విధంగా సుమయ్య రది యల్లాహు అన్హా యొక్క వివాహం యాసిర్ బిన్ ఆమిర్ తో జరిగింది.
ఆ విధంగా వారి జీవితం కొనసాగింది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా. కాకపోతే యాసిర్ రది యల్లాహు అన్హు వేరే దేశం నుంచి వచ్చారు గనుక, సుమయ్య రది యల్లాహు అన్హా ఒక దగ్గర బానిసగా ఉన్నారు గనుక, వారికి ఆదుకోవటానికి, వారికి కష్ట సమయాలలో సహాయం చేయటానికి, ఆర్థిక పరంగా వారికి సహాయం చేయటానికి, సుఖదుఃఖాలలో పాల్గొనటానికి వారికి రక్త సంబంధీకులు మక్కాలో ఎవరూ లేరు.
మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తగా ఎన్నుకోబడ్డారు. తౌహీద్ సందేశం మొదలెట్టారు మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాహ్ గురించి, ఇస్లాం ధర్మం గురించి, విశ్వాసం గురించి, వాస్తవాల గురించి, జీవన విధానం గురించి మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రారంభ కాలంలోనే ఇస్లాం స్వీకరించే వారిలో ముందున్న వారు ఆల యాసిర్. అంటే యాసిర్ రది యల్లాహు అన్హు, సతీమణి సుమయ్య రది యల్లాహు అన్హా, తనయుడు అమ్మార్ రది యల్లాహు అన్హు.
ఇస్లాం ప్రారంభంలో కఠిన పరీక్షలు
ఇక ఆ తర్వాత మనము మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవిత చరిత్ర చదివితే మక్కాలో వహీ వచ్చిన తర్వాత ప్రారంభ కాలంలో ఎవరెవరైతే ఇస్లాం స్వీకరిస్తారో వారి స్థితి ఎలా ఉన్నిందో మనకు అర్థం అవుతుంది. రకరకాలుగా, ముఖ్యంగా ఎవరైతే బానిసలుగా ఉన్నారో, పేదవారిగా ఉన్నారో, ఆర్థికంగా కొంచెం తక్కువ స్థాయిలో ఉన్నారో, బంధువులు లేని వారు, రక్త సంబంధం లేని వారు, అటువంటి వారికి ఎక్కువగా ఇబ్బందులు వచ్చాయి. వారిలో ఈ కుటుంబం కూడా, ఆల యాసిర్.
చాలా విధాలుగా హింసించబడ్డారు. వారిని కొట్టటం, వారిని తిట్టటం, హింసించటం, బట్టలు తీసేసి విపరీతమైన వేడి కాలంలో మిట్ట మధ్యాహ్నం బట్టలు తీసి ఇసుక మీద పడుకోబెట్టేవారు. అల్లాహు అక్బర్. తండ్రి ఓ పక్కన, తల్లి ఓ పక్కన, కొడుకు ఓ పక్కన, ఒకరి ముందర ఒకరికి శిక్ష ఇస్తున్నారు.
కాస్త మనము గమనించాలి. ఈ రోజు మనం అల్హందులిల్లాహ్, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనకి ఆరోగ్యాన్ని ప్రసాదించాడు. ఆర్థికంగా కూడా పస్తులు ఉండే సమయం కాదు. రెండు రోజులు, మూడు రోజులు తినటానికి తిండి లేదు అనేది లేదు. అల్హందులిల్లాహ్, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పుష్కలంగా మనకి వరాలు ప్రసాదించాడు. అయినా కూడా ఇస్లాం పరంగా జీవించటానికి మనకు ఎటువంటి ఇబ్బందులు లేవు. అయినప్పటికీ మనము చాలా విషయాలలో నిర్లక్ష్యం పాటిస్తున్నాం, చేస్తున్నాం.
మన కళ్ళ ముందర కూడా చెడు జరిగితే మనకెందుకేలే అని చెప్పి మౌనం వహిస్తున్నాం. ఒకవేళ మనలో కొందరు దీన్ పరంగా నడుచుకున్నా వారి కుటుంబంలో ఎంత మంది? భార్య, పిల్లలు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, అమ్మా నాన్న వారు దీన్ పరంగా ఉన్నారా? తౌహీద్ లో ఉన్నారా? షిర్క్ లేకుండా ఉన్నారా? బిద్అత్ చేయకుండా ఉన్నారా? దీన్ ప్రకారం నడుచుకుంటున్నారా?
దీన్ పరంగా నడుచుకోవటానికి, తౌహీద్ పైన నిలకడగా ఉండటానికి, షిర్క్ చేయకుండా ఉండటానికి, తౌహీద్ విశిష్టత తెలుసుకోవటానికి, దాని అనుగుణంగా జీవితం గడపటానికి, అల్లాహ్ ను స్మరించటానికి, నమాజులు నెలకొల్పటానికి మనకు ఎవరైనా అడ్డు వస్తున్నారా? చేతిలో కర్ర తీసుకొని కొడుతున్నారా? ఆ విధంగా మనము పోల్చుకుంటే లెక్కలేని అనేక వరాలు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనకు ప్రసాదించాడు. ఈ విషయం గురించి మనందరమూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
అభిమాన సోదరులారా, నేను ప్రారంభంలోనే చెప్పాను. అవిశ్వాసులు పెడుతున్న బాధలు అనుభవిస్తూ చనిపోయారు సుమయ్య రదియల్లాహు అన్హా యొక్క భర్త యాసిర్ రదియల్లాహు అన్హు. చనిపోయారు. అలాగే సతీమణి సుమయ్య రదియల్లాహు అన్హాను కూడా పరమ దుర్మార్గుడైన అబూ జహల్ ఆవిడను బాధించడమే కాకుండా ఒక రోజు అనరాని మాటలు అని తన చేతిలో ఉన్న ఈటెను ఎత్తి సుమయ్య రదియల్లాహు అన్హా మీదికి, అంటే కొంతమంది చరిత్రకారులు కడుపు మీద అంటారు, కొందరు నాభి కింద అంటారు, అక్కడ బలంగా విసిరాడు. ఆ దెబ్బకు ఆ సాధీమణి విలవిల్లాడుతూ నేలకొరిగారు. ఇంత దారుణంగా ఇస్లాం ప్రారంభ కాలంలో, ఎందుకంటే అప్పుడే వారి పెద్ద వయసు వారిది, వృద్ధాప్యానికి చేరుకున్నారు యాసిర్ రదియల్లాహు అన్హు, సుమయ్య రదియల్లాహు అన్హా. ఆర్థికంగా చాలా తక్కువగా ఉండేవాళ్ళు. బంధువులు ఎవరూ లేరు, రక్త సంబంధీకులు ఎవరూ లేరు. ఇస్లాం ప్రారంభం. ఆ సమయంలో ఎన్ని బాధలు వచ్చినా, అవిశ్వాసుల తరపు నుండి, బహుదైవారాధకుల తరపు నుండి, ఇస్లాం శత్రువుల తరపు నుండి రకరకాల బాధలు వచ్చినా, వారి యొక్క విశ్వాసంలో కొంచెం కూడా మార్పు రాలేదు, బలహీనతకి వారు గురి కాలేదు. ఇది మనకోసం ఉన్న గుణపాఠం.
అబూ జహల్ మరణం
చివరికి బద్ర్ యుద్ధంలో అబూ జహల్ చంపబడ్డాడు కదా? అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, అప్పుడు సుమయ్య మరియు యాసిర్ లేరు కదా రది యల్లాహు అన్హుమా, తనయుడు కొడుకు అమ్మార్ ఉన్నారు కదా. అప్పుడు ఎప్పుడైతే బద్ర్ యుద్ధంలో అబూ జహల్ చంపబడ్డాడో అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అమ్మార్ బిన్ యాసిర్ రది యల్లాహు అన్హును ఉద్దేశించి ఇలా అన్నారు: “ఖద్ ఖతలల్లాహు ఖాతిల ఉమ్మిక్.” ఓ అమ్మార్! నీ తల్లిని చంపినవాడు ఈరోజు చంపబడ్డాడు.
సుమయ్య (రది యల్లాహు అన్హా) జీవితం నుండి గుణపాఠాలు
అభిమాన సోదరులారా, సుమయ్య రది యల్లాహు అన్హా ఇస్లాం ప్రారంభ కాలంలోనే ఇస్లాం స్వీకరించారు. ఆ తర్వాత ఎన్నో సంవత్సరాలు ఆవిడ జీవించలేదు. అంటే అనేక మంది తండోపతండాలుగా ముస్లింలు అయిపోయారు, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుంచి మదీనా హిజ్రత్ చేశారు, అది ఆ జీవితము, ఆ సమయము సుమయ్య రది యల్లాహు అన్హా జీవితంలో రాలేదు. ప్రారంభంలోనే ఆవిడ ఇస్లాం స్వీకరించారు, ప్రారంభంలోనే ఆవిడ అమరగతులయ్యారు, షహీద్ అయ్యారు.
నేను ఈరోజు నా ప్రసంగానికి సారాంశం ఏమిటంటే సుమయ్య రది యల్లాహు అన్హా యొక్క జీవితంలోని మనకోసము ఉండే అనేక గుణపాఠాలలో మూడు విషయాలు, వారు మాకోసం ఆదర్శం. ఈమాన్, సబర్, సాబిత్ ఖద్మీ. ఈమాన్ – విశ్వాసం, సబర్ – సహనం, సాబిత్ ఖద్మీ – నిలకడ, స్థైర్యం. ఇవి మూడు ముఖ్యమైనవి. ఎందుకంటే సుమయ్య రది యల్లాహు అన్హాకి భర్త తరపు నుంచి పరీక్ష. ఎందుకంటే తన కళ్ళ ముందర భర్తని కొడుతున్నారు. భర్త శరీరం నుంచి బట్టలు తీసేసి మిట్ట మధ్యాహ్నం ఇసుకలో ఎడారిలో పడుకోబెడుతున్నారు, కళ్ళతో చూస్తున్నారు భర్త పడే, భరించే ఆ బాధలు. స్వయంగా సుమయ్య రది యల్లాహు అన్హాని కూడా ఆ ఐరన్ తో తయారు చేసిన ఆ సంకెళ్ళతో బాగా బిగించి ఆవిడని కూడా, అల్లాహు అక్బర్, ముసలావిడ. ఆ ముసలావిడని ఈ విధంగా బంధించడం. కొడుకు అమ్మార్ ని కొట్టటం. ఆ తల్లికి, ఆ విశ్వాసమూర్తికి, ఆ విశ్వాసమూర్తి పడిన బాధ కొంచెం ఊహించుకోండి. ఓ పక్క భర్త, ఓ పక్క కొడుకు, ఓ పక్క స్వయంగా ఆవిడ, అన్ని విధాల అవిశ్వాసుల, ముష్రికుల, ఖురైషుల, కుఫ్ఫార్ల తరపు నుంచి బాధలు పడతా ఉంటే, ఆమె ఎంత స్థిరంగా, ధైర్యంగా, సహనంతో, ఓర్పుతో, తన విశ్వాసంలో మార్పులు ఏ విధంగా కూడా రాకుండా, రానివ్వకుండా ఆవిడ ఉన్నిందంటే, అర్థమవుతుంది
ఈమాన్ అంటే ఏమిటి, తౌహీద్ అంటే ఏమిటి. ఈ జీవితం శాశ్వతం కాదు, ఈ కొన్ని రోజుల జీవితం కోసం మనము మాటిమాటికి విశ్వాసాన్ని లెక్క చేయకుండా ఇష్టమైన జీవితాన్ని గడుపుతున్నాం. చిన్న చిన్న సమస్యలు వచ్చినా విశ్వాసాన్ని మనము అమ్మేస్తున్నాం. చిన్న కారణాల వల్ల నమాజ్ చేయటం ఆలస్యం చేస్తాం మనం. మనలో చాలా మంది. ప్రతి ఒక్కరు కాదు, చాలా మంది. మనం గమనిస్తున్నాము. ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చిన్న కారణం ఉంటుంది, అది తర్వాత కూడా చేసుకోవచ్చు. అంత పెద్ద నష్టం జరిగేది ఏమీ లేదు. అయినా కూడా ఆ ప్రాపంచిక చిన్న లబ్ధి కోసము మనము నమాజ్ వదిలేస్తాము, జమాత్ వదిలేస్తాము, తర్వాత నమాజ్ చేస్తాం. ఇది మన జీవితం.
అంటే కొంచెం ప్రాపంచిక కొంత లాభం కోసం మన ఈమాన్ లో ఎంత మార్పు వస్తా ఉంది. ఇది చిన్న ఉదాహరణ ఇచ్చాను నేను. కానీ వారు అన్ని కష్టాలు వారికి వచ్చినా వారి విశ్వాసంలో ఎటువంటి తేడా జరగలేదు.
విశ్వాసం యొక్క మాధుర్యం (హదీసు)
అభిమాన సోదరులారా, ఇక మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక హదీస్ సెలవిచ్చారు, ఆ హదీస్ మనం తెలుసుకొని నేను ముగిస్తాను. అదేమిటంటే ఈ హదీస్ బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలో ఉంది:
ثَلَاثٌ مَنْ كُنَّ فِيْهِ وَجَدَ حَلَاوَةَ الْإِيْمَانِ (సలాసున్ మన్ కున్న ఫీహి వజద హలావతల్ ఈమాన్) “మూడు విషయాలు ఎవరిలోనైతే ఉంటాయో, ఆ వ్యక్తి విశ్వాసం యొక్క మాధుర్యాన్ని పొందాడు.”
మూడు విషయాలు ఎవరిలోనైతే ఉంటే, ఏ వ్యక్తిలో మూడు విషయాలు, మూడు గుణాలు ఉంటే ఆ వ్యక్తి విశ్వాసం యొక్క మాధుర్యాన్ని పొందాడు. ఇప్పుడు మనము విశ్వాసం యొక్క మాధుర్యాన్ని పొందామా లేదా అనేది ఈ హదీస్ తెలుసుకొని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆ మూడు విషయాలలో మొదటిది ఏమిటి?
أَنْ يَكُونَ اللَّهُ وَرَسُولُهُ أَحَبَّ إِلَيْهِ مِمَّا سِوَاهُمَا (అన్ యకూనల్లాహు వ రసూలుహు అహబ్బ ఇలైహి మిమ్మా సివాహుమా) “అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించాలి.”
మొదటి విషయం ఇది. అంటే ప్రతి వ్యక్తి, ప్రతి విశ్వాసి, ప్రతి ముస్లిము అన్నిటికంటే ఎక్కువ, అంటే తన భార్య కంటే, పిల్లల కంటే, స్త్రీ అయితే భర్త కంటే, పిల్లల కంటే, అమ్మా నాన్న కంటే ఎక్కువ, బంధుమిత్రుల కంటే ఎక్కువ, ఈ ధనం కంటే ఎక్కువ, ఆస్తుల కంటే ఎక్కువ, ఆప్తుల కంటే ఎక్కువ, హోదా కంటే ఎక్కువ, ఉద్యోగం కంటే ఎక్కువ, చివరికి తన ప్రాణం కంటే ఎక్కువ అల్లాహ్ ను, అల్లాహ్ ప్రవక్తను ప్రేమించాలి. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాలి. ఇది మొదటిది.
రెండవది:
وَأَنْ يُحِبَّ الْمَرْءَ لَا يُحِبُّهُ إِلَّا لِلَّهِ (వ అన్ యుహిబ్బల్ మర్అ లా యుహిబ్బుహు ఇల్లా లిల్లాహ్) “ఇతరులను కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసమే ప్రేమించాలి.”
అంటే ఇతరులను స్వార్థం కోసం కాకుండా, అల్లాహ్ ప్రసన్నత కోసం ప్రేమించాలి. ఉర్దూలో ఒక కవి ఇలా అంటాడు, ఉర్దూలో ఒక కవిత్వం ఉంది, ఒక పద్యము, దాంట్లో ఒక షేర్, ఒక వాక్యం ఇలా ఉంటుంది: “దిల్ మే ఆగ్, లబోం పే గులాబ్ రఖ్తే హైఁ, హమ్ అప్నే చెహ్రే పే దోహ్రీ నఖాబ్ రఖ్తే హైఁ.” మనసులో మాత్రం, హృదయంలో మాత్రం ప్రేమ లేదు, ద్వేషం ఉంది, మంట రగిలిపోతుంది. పెదవులపై నటిస్తాము. పువ్వులు ఉంటాయి, పెదవుల పైన పువ్వు ఉంది, కానీ లోపల మంట ఉంది. అంటే మన జీవితం ఈ విధంగా ఉంది. స్వార్థం ఉంటే మాట్లాడతాము, లాభం ఉంటే మాట్లాడతాము, అవసరం ఉంటే మాట్లాడతాము. ఆ అవసరాన్ని బట్టి మనము చేసే సలాం కూడా అలాగే ఉంటుంది. సలాం చేసే పద్ధతి, సలాం చేసే విధానము అది మన అవసరాన్ని బట్టి ఉంటుంది. అల్లాహు అక్బర్. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు? రెండవ గుణం అంటే విశ్వాసం యొక్క మాధుర్యాన్ని ఎవరు పొందారు? ఆ పొందటానికి రెండవ గుణం ఏమిటి? ఇతరులను కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసమే ప్రేమించాలి.
అంటే నరకాగ్ని భయంతో మళ్ళీ అవిశ్వాసిగా మారటాన్ని ఇష్టపడరు. అంటే ఇస్లాం స్వీకరించాము లేకపోతే పుట్టుకతోనే ముస్లింగా ఉన్నాము, కొన్ని కారణాల వల్ల మళ్ళీ అవిశ్వాసిగా పోవటం అతని దృష్టిలో “నాకు భగభగ మండే అగ్నిలో వేసేస్తున్నారు. నేను భగభగ మండే ఆ అగ్నిలో నాకు వేసేస్తే అది నాకు ఇష్టమా? ఇష్టం ఉండదు. ఆ విధంగా విశ్వాసం నుంచి అవిశ్వాసం వైపునకి మరటం కూడా నాకు ఇష్టం ఉండదు”.
ఈ విధంగా ఈ మూడు గుణాలు ఉంటే అటువంటి వ్యక్తి విశ్వాసం యొక్క మాధుర్యాన్ని పొందినట్లే. ఈ మూడు విషయాలు మనలో ఉన్నాయా లేవా అనేది మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
ముగింపు
అభిమాన సోదరులారా, ఈ విధంగా మొదటి విషయం సుమయ్య రది యల్లాహు అన్హా యొక్క జీవితంలోని ఈమాన్, దాని ప్రాముఖ్యత ఏమిటి, విశిష్టత ఏమిటి? ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, చివరికి భర్త చనిపోయినా, భార్య చనిపోయినా, అమ్మ విషయంలో, నాన్న ఏ విధంగానైనా, అన్ని విధాల కుడి వైపు నుంచి, ఎడమ వైపు నుంచి, వెనుక నుంచి, ముందు నుంచి, కింద నుంచి, పైన నుంచి, అన్ని విధాల ఆర్థిక పరంగా, మానసికంగా, అన్ని విధాలా కూడా బాధలు వచ్చినా, హింసలు పెట్టినా, విశ్వాసంలో లోపం రానివ్వకూడదు. తౌహీద్ లో తేడా రానివ్వకూడదు. షిర్క్ కి పాల్పడకూడదు. ఇది సుమయ్య రది యల్లాహు అన్హా యొక్క జీవితంలోని మొదటి పాఠం. రెండో పాఠం ఏమిటి? సబర్, సహనం. మూడవది స్థిరత్వం, నిలకడ.
ఒక వ్యక్తి మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఇలా అడిగాడు: ఓ దైవ ప్రవక్తా, నాకు ఇస్లాం గురించి ఏమైనా బోధించండి అన్నాడు. అంటే ఇస్లాం గురించి బోధనలు చాలా ఉన్నాయి కదండీ. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగే వ్యక్తి యొక్క మానసిక స్థితిని గమనించి, దానికి తగిన విధంగా, సమయ సందర్భాన్ని బట్టి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానాలు ఇచ్చేవారు. ఒక వ్యక్తి వచ్చి అడిగారు, ఓ దైవ ప్రవక్తా నాకు ఇస్లాం గురించి ఏమైనా బోధించండి అంటే, అయితే దాని గురించి నేను మిమ్మల్ని తప్ప వేరొకరిని అడగవలసిన అవసరం రాకూడదు. ఇస్లాం గురించి ఒక విషయం చెప్పండి. మీరు చెప్పిన తర్వాత నాకు ఇంకెవ్వరికీ అడిగే అవసరం రాకూడదు. దానికి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చిన సమాధానం ఏమిటంటే: “ఆమంతు బిల్లాహి సుమ్మస్తఖిమ్.” అంటే నేను అల్లాహ్ ను నమ్ముకున్నాను, నేను విశ్వసించాను, నేను ముస్లింగా ఉన్నాను, నేను మోమిన్ గా ఉన్నాను అని చెప్పు, ఆ తర్వాత ఆ మాట పైనే నిలకడగా ఉండు. చెప్పటమే కాకుండా నిలకడగా ఉండు, స్థిరంగా ఉండు అని మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.
అభిమాన సోదరులారా, ఈ విధంగా సుమయ్య రది యల్లాహు అన్హా యొక్క జీవితాన్ని అల్లాహ్ మనందరికీ ఆదర్శంగా తీసుకొని, కష్టాలలో కూడా మొదటి విషయము అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ ప్రతి కష్టం నుండి, ప్రతి నష్టం నుండి, ప్రతి కీడు నుండి, ప్రతి బాధ నుండి కాపాడుగాక. ఒకవేళ అల్లాహ్ ఇష్టం నిమిత్తం ఏదైనా సమస్య, బాధ వస్తే సుమయ్య రది యల్లాహు అన్హాని ఆదర్శంగా తీసుకొని మనము కూడా మన విశ్వాసాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి, సహనంతో ఉండాలి, స్థిరత్వాన్ని కలిగి ఉండాలి. సుమయ్య రది యల్లాహు అన్హాని ఆదర్శంగా తీసుకొని జీవించే భాగ్యాన్ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ప్రసాదించుగాక. ఆమీన్.
వ ఆఖిరు దావానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
సులైమాన్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర – వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
[క్రింది విషయం ఖురాన్ కథామాలికఅనే పుస్తకం నుండి తీసుకోబడింది]
ప్రవక్త సులైమాన్ (అలైహిస్సలాం) (970-931 క్రీ.పూ.)
“చివరకు సులైమాన్ సైన్యమంతా ఒక చీమల లోయకు చేరుకున్నప్పుడు ఒక చీమ ఇలా ప్రకటించింది: “ఓ చీమల్లారా! సులైమాను, అతని సైన్యాలు తెలీకుండా మిమ్మల్ని నలిపివేసే స్థితి ఏర్పడకుండా ఉండేందుకు, మీరు మీ మీ పుట్టలలోనికి దూరిపోండి.” ” (ఖుర్ఆన్ 27: 18)
ప్రవక్త దావూద్ (అలైహిస్సలాం) వివేకం మూర్తీభవించిన పాలకులు. ఆయన కుమారుడు సులైమాన్ మరింత తెలివి, వివేకసంపద కలిగినవారు. ఆయన చిన్న పిల్లవానిగా ఉన్నప్పుడే తెలివితేటలు, వివేక విచక్షణలు ప్రదర్శించారు. రాజ దర్బారులో వివాదాల, ఫిర్యాదుల తీర్పులు జరుగుతున్నప్పుడు ప్రవక్త దావూద్ (అలైహిస్సలాం) తన కుమారుణ్ణి కూడా దర్బారులో పిలిచి కూర్చుండబెట్టేవారు.
ఒకసారి ఒక రైతు ఓ ఫిర్యాదు తీసుకుని వచ్చాడు. ఆ రైతు తన పొలంలో గోధుమ, మొక్కజొన్న పండించే వాడు. పొలంలో ఫలవృక్షాలు కూడా ఉండేవి. ఈ రైతుకు పొరుగున మరో వ్యక్తి ఉన్నాడు. ఈ పొరుగు వ్యక్తి గొర్రెలు పెంచేవాడు. రైతు పొలంలో పంట బాగా ఏపుగా పెరిగినప్పుడు పొరుగువాని గొర్రెలు పొలంలో పడి పంట మొత్తం ఆగం చేసి వెళ్ళేవి. ఈ వివాదం దర్బారుకు వచ్చింది. పొరుగువాడు రైతు చేసిన ఫిర్యాదు నిజమేనని ఒప్పుకున్నాడు. ఇద్దరి వాంగ్మూలాలు విన్న తర్వాత ప్రవక్త దావూద్ (అలైహిస్సలాం) తన తీర్పు చెబుతూ, రైతుకు జరిగిన నష్టానికిగాను పొరుగు వ్యక్తి తన గొర్రెలను రైతుకు ఇచ్చి నష్ట పరిహారం చెల్లించాలని అన్నారు. తన గొర్రెలు విచ్చలవిడిగా తిరగడానికి వదలి వేసిన పొరుగువాడు ఈ విధంగా గుణపాఠం కూడా నేర్చుకుంటాడని దావూద్ (అలైహిస్సలాం) అన్నారు. అప్పటికి సులైమాన్ వయసు కేవలం పదకొండు సంవత్సరాలు మాత్రమే. ఆయన ఈ తీర్పు విని లేచి నిలబడి మాట్లాడడానికి తండ్రి అనుమతి కోరారు. తండ్రి ఆయనకు అనుమతి ఇచ్చారు. సులైమాన్ మాట్లాడుతూ తాను ఈ తీర్పుతో ఏకీభవించడం లేదని, ఈ శిక్ష చాలా తీవ్రంగా ఉందని అన్నారు. బాల సులైమాన్ ధైర్యంగా చెప్పిన ఈ మాటలు విని పూర్తి దర్బారు నిర్ఘాంతపోయింది. దర్బారులో గుసగుసలు వ్యాపించాయి. దావూద్ ప్రవక్త చిరునవ్వుతో తన కుమారుడిని చూస్తూ ఈ వివాదానికి నీ తీర్పు ఏమిటో చెప్పు అన్నారు. అప్పుడు సులైమాన్ మాట్లాడుతూ, గొర్రెలను కొంతకాలం వరకు రైతుకు అధీనం చేయాలని, ఆ విధంగా రైతు వాటి ఉత్పత్తుల ద్వారా అంటే పాలు, ఉన్ని, వగైరాలతో లాభం పొంది తన నష్టాన్ని పూడ్చుకుంటాడని, ఈ లోగా గొర్రెల యజమాని ఒక సంవత్సరం పాటు రైతు పొలాన్ని సాగుచేసి పంట పండించి పంట కోయకుండా రైతుకు అప్పగించాలని, రైతు తన అధీనంలో ఉన్న గొర్రెలను, ఎన్ని గొర్రెలయితే పొరుగువాడు తన అధీనం చేశాడో అన్ని గొర్రెలను తిరిగి అతనికి అప్పగించాలని, వాటికి పుట్టిన గొర్రెపిల్లలను ఇవ్వనవసరం లేదని అన్నారు. ఈ విధంగా గొర్రెల యజమాని నిర్లక్ష్యానికి తగిన శిక్ష కూడా పడుతుందని, అతను ఒక సంవత్సరం పాటు ఎలాంటి ప్రతిఫలం లేకుండా పొలంలో పని చేసి పంట పండించి రైతుకు అప్ప గించవలసి ఉంటుందని, అలాగే అతను పూర్తిగా తన గొర్రెలను కోల్పోయే పరిస్థితి కూడా ఉండదని చెప్పారు. పంట సిద్ధంగా ఉన్న పొలాన్ని అతను అప్పగించిన తర్వాత రైతు దానిని కోసుకోవచ్చు. ఈ తీర్పును రాజదర్బారు నిశ్శబ్దంగా వింటూ ఉండిపోయింది.
రాజు దావూద్ (అలైహిస్సలాం) తన తీర్పును ఉపసంహరించుకుంటున్నానని, తన కుమారుని తీర్పును అమలు చేయాలని ఆదేశించారు. కుమారుని తీర్పు నిష్పక్ష పాతంగా, న్యాయసమ్మతంగా, వివేకవంతంగా, తన తీర్పు కన్నా ఉత్తమంగా ఉందని ప్రకటించారు. రైతు, గొర్రెల యజమాని ఇద్దరూ కూడా తీర్పు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. (చదవండి దివ్యఖుర్ఆన్ : 21:78-82)
కుమారుని ద్రోహం
ప్రవక్త దావూద్ (అలైహిస్సలాం) తన తర్వాత తన కుమారుడు సులైమాన్ ను రాజుగా చేయాలని నిర్ణయించారు. కాని దావూద్ (అలైహిస్సలాం) గారి మరో కుమారుడు అబ్సాలోమ్ పెద్దవాడు. పెద్దవాడయినప్పటికీ రాజబాధ్యతలు నిర్వర్తించే యోగ్యతలు అతనికి లేవు. తన తండ్రి సులైమాన్ ను రాజుగా చేయాలని నిర్ణయించడం అబ్సాలోమ్ కు నచ్చలేదు. అతనిలో ఈర్ష్యాద్వేషాలు బుసలు కొట్టాయి. ఎలాగైనా రాజ సింహాసనాన్ని హస్తగతం చేసుకోవాలని అతను కుట్రపన్నాడు.
ముందుగా అతడు ప్రజలను మభ్యపుచ్చి తన పక్షానికి వచ్చేలా చేయాలనుకున్నాడు. ప్రజలను తన వైపు త్రిప్పుకోవడానికి ఒక పథకం వేశాడు. ప్రజలు తమ వివాదాల పరిష్కారానికి సులైమాన్ దర్బారుకు వస్తున్నప్పుడు వారిని అక్కడకు వెళ్ళకుండా అడ్డుకుని తన వద్దకు వచ్చేలా చేశాడు. ఆ విధంగా తాను చాలా వివేకవంతుడినన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించడానికి ప్రయత్నించాడు. ఆ పిదప తన కుట్రకు పనికివచ్చే కొంతమంది దుర్మార్గులను తన అనుచరులుగా చేర్చుకున్నాడు. ఒక రోజు అతను తన తండ్రితో గిబియన్ పట్టణానికి వెళ్తాను అనుమతించమని కోరాడు. గిబియన్ పట్టణంలో తాను చేయవలసిన పని ఉందని సాకులు చెప్పాడు. తనతో పాటు తన అనుచరులను తీసుకుని వెళ్ళాడు. గిబియన్ పట్టణానికి వెళ్ళిన వెంటనే బనీ ఇస్రాయీల్లోని వివిధ తెగలకు రహస్య సందేశాలు పంపాడు. నగారా శబ్దం వినగానే తనను రాజుగా ప్రకటించాలని వారందరికీ సూచనలు పంపించాడు. కాని దావూద్ (అలైహిస్సలాం) పట్ల విశ్వాసం కలిగిన ప్రజలు ఈ ఆదేశాన్ని లక్ష్యపెట్టలేదు. అబ్సాలోమ్ అనుచరులకు, వివిధ తెగలకు మధ్య తీవ్రమైన పోరాటం జరిగింది. జెరుసలేమ్ పట్టణం దాదాపుగా నాశనం అయ్యింది.
తన కుమారుని ద్రోహం గురించి దావూద్ ప్రవక్తకు తెలిసింది. తన స్వంత కుమారుడు ఇలా వ్యవహరించాడని తెలిసి ఆయన చాలా బాధకు గురయ్యారు. అయినా ఆయన సంయమనాన్ని కోల్పోలేదు. తన రాజ్యంలో రక్తపాతాన్ని ఆయన ఇష్టపడలేదు. అబ్సాలోమ్ పట్టణాన్ని బలవంతంగా వశపరచుకోవచ్చని ఆయన భయపడ్డారు. అందువల్ల ఆయన తన వారికి వెంటనే పట్టణాన్ని వదిలి వేయాలని సందేశం పంపించారు. హాని కలుగకముందే అక్కడి నుంచి తప్పించుకొమ్మని చెప్పారు. చాలా మంది పట్టణాన్ని వదలి జోర్డాన్ నదిని దాటి వచ్చేశారు. దావూద్ (అలైహిస్సలాం) ఆలివ్ కొండను ఎక్కి అల్లాహ్ ను ప్రార్థించారు. ప్రజలను ఈ ప్రమాదం నుంచి కాపాడమని వేడుకున్నారు. కొంతమంది ప్రజలు తమ దుస్థితికి రాజుగారే కారణమని విమర్శించారు. కాని చాలా మంది దావూద్ పక్షాన విశ్వాసంగా నిలబడ్డారు. ఆయన వారితో, “నా స్వంత కుమారుడు నాకు ద్రోహం చేసినప్పుడు పరులు నాకు వ్యతిరేకమయ్యారని నేను ఎలా చెప్పగలను” అన్నారు.
దావూద్ (అలైహిస్సలాం) కొందరు అధికారులను అక్కడికి పంపి పరిస్థితి చక్క దిద్దమన్నారు. అబ్సాలోమ్కు ఎలాంటి హాని చేయవద్దని వారిని ఆదేశించారు. దావూద్ (అలైహిస్సలాం) పంపిన అధికారులు కఠినంగా అక్కడి తిరుగుబాటును అణచి వేశారు ఈ పోరాటంలో అబ్సాలోమ్ హతమయ్యాడు. జెరుసలేమ్ మళ్ళీ శాంతిభద్రతలు పునరుద్ధరించబడ్డాయి. దావూద్ (అలైహిస్సలాం) రాజుగా పరిపాలించడం కొనసాగింది.
సులైమాన్ రాజరికం
తన తండ్రి మరణానంతరం సులైమాన్ (అలైహిస్సలాం) రాజుగా పాలనాపగ్గాలు చేపట్టారు. తన రాజ్యం వంటి మరో రాజ్యం లేనంత చక్కగా పాలించే అనుగ్రహం ప్రసాదించాలని ఆయన అల్లాహ్ ను ప్రార్థించారు. అల్లాహ్ ఆయన కోరికను మన్నించాడు. సులైమాన్ (అలైహిస్సలాం) మహావివేకవంతుడు మాత్రమే కాదు, అల్లాహ్ ఆయనకు అనేక వరాలు ప్రసాదించాడు. ఆయన గాలులను తన అదుపులో ఉంచుకోగలిగేవారు. పశుపక్ష్యాదులతో మాట్లాడగలిగేవారు. భూగర్భంలో ఉన్న ఖనిజాలను త్రవ్వి బయటకు తీసి వాటితో ఉపకరణాలు, ఆయుధాలు తయారు చేసే విద్యను మనుష్యులకు, జిన్నాతులకు (అగ్నితో సృష్టించబడిన బుద్ధిజీవులైన ప్రాణులకు) నేర్పాలని అల్లాహ్ ఆయనకు ఆదేశించాడు. అల్లాహ్ ఆయనకు ఒక రాగి గనిని కూడా ప్రసాదించాడు. ఆ కాలంలో రాగి అరుదైన లోహంగా ఉండేది.
ఒక రోజు సులైమాన్ (అలైహిస్సలాం) తన సైన్యాన్ని సమావేశపరచారు. అదొక విచిత్రమైన సైన్యం. అందులో మనుష్యులు, పశుపక్ష్యాదులు, జిన్నాతులు ఉన్నారు. సైన్యాన్ని తీసుకుని ఆయన అష్కెలాన్ రాజ్యానికి బయలుదేరారు.
వారు ఒక లోయ నుంచి వెళుతున్నప్పుడు ఒక చీమ ఈ సైన్యం రావడాన్ని చూసింది. మిగిలిన చీమలను హెచ్చరిస్తూ, ”పారిపోండి. పుట్టల్లో తలదాచు కోండి. లేకపోతే మనల్ని చూడకుండా సులైమాన్ సైన్యం మనల్ని తొక్కేస్తుంది” అని అరిచింది. ఈ అరుపు సులైమాన్ చెవులకు సోకింది. ఆయన నవ్వుకున్నారు. ఒక ప్రవక్తగా తాను కావాలని అల్లాహ్ సృష్టి దేనికీ హాని తలపెట్టనన్న విషయాన్ని ఆ చీమ గుర్తించినందుకు సంతోషించారు. చీమలను కాపాడినందుకు ఆయన అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలిపారు.
రాతి గుమ్మటం
జెరుసలేమ్ ఒక పెద్ద శిలపై సులైమాన్ (అలైహిస్సలాం) ఒక అందమైన ఆరాధనాలయాన్ని నిర్మించారు. ప్రజలు అల్లాహ్ ను ఆరాధించడానికి వచ్చేలా ఈ ఆరాధనాలయాన్ని కట్టారు. నేడు దీనిని “మస్జిదుల్ అక్సా” లేదా “మస్జిదుల్ ఖుద్స్” లేదా ”డోమ్ ఆఫ్ రాక్” అని పిలుస్తున్నారు. ఇక్కడి నుంచి సులైమాన్ (అలైహిస్సలాం) వెంట పెద్ద సంఖ్యలో అనుచరులు మక్కాలోని పవిత్ర గృహానికి యాత్రకు బయలు దేరారు. వారు తమ హజ్ యాత్ర పూర్తి చేసుకుని అక్కడి నుంచి యమన్ చేరుకుని సనా పట్టణానికి వచ్చారు. ఇక్కడ తెలివిగా పట్టణాల్లో నీటిపారుదల సదుపాయాన్ని ఏర్పాటు చేసిన పద్ధతి చూసి ఆయన చాలా ప్రభావితులయ్యారు. తన రాజ్యంలో కూడా అలాంటి నీటిపారుదల సదుపాయం ఏర్పాటు చేసుకోవాలని భావించారు. కాని తన రాజ్యంలో అందుకు అవసరమైన నీటివనరులు లేవు. ఆయన వెంటనే హూపో పక్షి కోసం కబురంపారు. ఆ పక్షి భూగర్భంలో జనవనరులను పసిగట్టగలదు. ఆయన హూపో పక్షి కోసం నాలుగు చెరగులా సందేశాలు పంపారు. కాని ఆ పక్షి ఎక్కడా లేదు. ఆయన కోపంగా ఆ పక్షి కనుక సరియైన కారణం లేకుండా గైర్హాజరైతే దానిని కఠినంగా శిక్షిస్తానని అన్నారు.
షీబా రాణి బిల్కిస్
చివరకు హూపో పక్షి సులైమాన్ వద్దకు వచ్చింది. తన ఆలస్యానికి కారణాన్ని వివరించింది. “మీకు తెలియని ఒక విషయాన్ని నేను కని పెట్టి వచ్చాను. నేను సబా (షీబా) నుంచి ఒక శుభవార్త తీసుకుని వచ్చాను” అంది. ఈ మాటలు విన్న సులైమాన్ ఆగ్రహం మాయమై ఆయనలో కుతూహలం చోటుచేసుకుంది. ”సబా రాజ్యాన్ని బిల్కిస్ అనే రాణి పాలిస్తోంది. ఆమెకు అన్ని సౌభాగ్యాలు పుష్కలంగా ఉన్నాయి. ఆమె సింహాసనం చాలా అద్భుతంగా ఉంది. కాని ఇంత సంపద ఉన్నప్పటికీ, ఆమె హృదయంలో, ఆ రాజ్య ప్రజల హృదయాల్లో షైతాన్ తిష్ఠవేసుకుని ఉన్నాడు. ప్రజలు ఆమె పట్ల చాలా విశ్వాసంగా ఉన్నారు. వారంతా విశ్వప్రభువైన అల్లాహ్ కు బదులు సూర్యుణ్ణి పూజించడం చూసి నేను నిర్ఘాంతపోయాను” అని ఆ పక్షి వివరించింది.
హూపో పక్షి చెప్పిన మాటలు నిర్ధారించుకోవడానికి సులైమాన్ (అలైహిస్సలాం) ఆ పక్షితో సబా రాణికి ఒక లేఖ పంపారు. రాణికి లేఖ చేరవేసి అక్కడే రహస్యంగా ఉండి రాణి ఏం చేస్తుందో చూడమని పక్షికి సూచనలిచ్చారు.
హూపో పక్షి ఆ లేఖను సబా రాణి ముందు పడవేసి ఎగిరిపోయింది. వెళ్ళి ఓ మూలన దాక్కుని చూడసాగింది. సబా రాణి ఆ లేఖను ఆశ్చర్యంగా తీసుకుని చదివింది. “ఈ లేఖ సులైమాన్ నుంచి పంపబడింది. అనంత కరుణా మయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభం. నాకు వ్యతిరేకంగా బలప్రదర్శనకు దిగవద్దు. లొంగిపోయిన మనిషి మాదిరిగా నా వద్దకు రావాలి…..” ఈ లేఖ చూసి రాణి చాలా ఆందోళనకు గురయ్యింది. వెంటనే తన సలహాదారులను పిలిపించింది. వారు ఆమెతో తాము కేవలం సలహా మాత్రమే ఇవ్వగలమని, ఆదేశాలిచ్చి చర్యలు తీసుకోవలసినది రాణిగారేనని విన్నవించు కున్నారు. వారి ఉద్దేశ్యాన్ని ఆమె గ్రహించింది. వారంతా సులైమాన్తో యుద్ధరంగంలో ఢీకోవాలని భావిస్తున్నారు. కాని ఆమె వారితో, ”స్నేహం, శాంతి యుద్ధం కన్నా మంచివి. వివేక వంతమైనవి. యుద్ధం వల్ల పరాభవాలు వాటిల్లుతాయి. ప్రజలు బానిసలవుతారు. సంపద నాశనం అవుతుంది. నేను సులైమాన్కు కానుకలు పంపాలని భావిస్తున్నాను. మన ఖజానాలోని విలువైన వస్తువుల్ని పంపుదాం. ఈ కానుకలు తీసుకుని వెళ్ళే రాజప్రతినిధులు సులైమాన్ గురించి కూడా తెలుసుకోవచ్చు, అతని సైనిక బలాన్ని కూడా అంచనా వేయవచ్చు” అని చెప్పింది.
కాని ఆమెకు తన మాటలన్నింటినీ హూపో పక్షి వింటుందన్న విషయం తెలియదు. హూపో వెంటనే సులైమాన్ వద్దకు వెళ్ళి ఈ విషయాలు చేరవేసింది.
కానుకలా? లంచాలా?
సులైమాన్ (అలైహిస్సలాం) వెంటనే తన అధీనంలో ఉన్న ఒక జిన్నుతో ఒక మహా ప్రాసాదాన్ని నిర్మించమని ఆదేశించారు. ఆ మహాసౌధంలో రాబోయే అతిథులను స్వాగతిస్తానని చెప్పారు. సబా రాణి వద్ద నుంచి వచ్చిన రాజప్రతినిధులను ఆయన చాలా ఆదరంగా స్వాగతించారు. అద్భుతమైన ఆ భవనాలను చూసి వారు దిగ్భ్రాంతికి గురయ్యారు. వారు తమ రాణి పంపిన విలువైన కానుకలను సులైమాన్ (అలైహిస్సలాం)కు అందజేశారు. స్నేహానికి గుర్తులుగా వాటిని తమ రాణి పంపిందని, వాటిని స్వీకరించాలని కోరారు. కాని సులైమాన్ ఆ కానుకలను విప్పి చూడకుండానే వారిని ఉద్దేశించి, “అల్లాహ్ నాకు పుష్కలంగా ప్రసాదించాడు. ఒక పెద్ద రాజ్యాన్ని ఇచ్చాడు. ప్రవక్త పదవిని ఇచ్చాడు. కాబట్టి నేను లంచాలకు లొంగే అవకాశం లేదు. నా లక్ష్యం ఒక్కటే, తౌహీద్ (ఏకదైవారాధన)ను వ్యాపింప జేయడం” అన్నారు. అంతేకాదు, ఆ కానుకలను తిరిగి తీసుకువెళ్ళాలని ఆదేశించారు. మీ రాణి తన ఆరాధనా పద్ధతిని మార్చుకోనట్లయితే రాజ్యాన్ని వశపరచు కుంటానని, ప్రజల్ని అక్కడి నుంచి వెళ్ళగొడతానని కఠినంగా చెప్పారు.
రాణి ప్రతినిధులు ఆ కానుకలు తీసుకుని ఆమె వద్దకు చేరుకుని సులైమాన్ (అలైహిస్సలాం) చెప్పిన మాటలు చెప్పారు. అంతేకాదు, సులైమాన్ రాజ్యంలో తాము చూసిన అద్భుతాలను కూడా వివరించారు. సులైమాన్ సందేశం పట్ల ఆమె ఆగ్రహం ప్రదర్శించే బదులు సులైమాన్ రాజ్యాన్ని సందర్శించాలని నిర్ణయించుకుంది. తనకు విశ్వాసపాత్రులైన నౌకర్లతో ఆమె సబా రాజ్యాన్ని వదలి బయలుదేరింది. ఒక సందేశహరుడితో సులైమాన్ (అలైహిస్సలాం) వద్దకు తాను వస్తున్న వర్తమానం ముందుగానే పంపించింది.
సులైమాన్ ఆదేశపాలన కోసం జిన్నుల పోటీ
సులైమాన్ (అలైహిస్సలాం) తన అధీనంలో ఉన్న జిన్నులను పిలిచి సబా రాణి రాక ముందే ఆమె సింహాసనాన్ని తన వద్దకు ఎవరు తీసుకువస్తారని అడిగారు. ఒక జిన్ను, ”ఈ సమావేశం ముగిసేలోపే ఆ సింహాసనాన్ని మీ ముందు ఉంచుతాను. నేను నిస్సందేహంగా బలం కలవాడిని. ఇలాంటి పనులు చేయడానికి నమ్మక స్తుడిని” అన్నాడు. కాని ఈ పని చేయడానికి జిన్నులు పోటీపడ్డారు. ఇంతలో ప్రత్యేక జ్ఞానం కలిగిన ఒక జిన్ను, “నేను రెప్పపాటులో ఆ సింహాననాన్ని మీ ముందు ఉంచుతాను” అంటూ మాట పూర్తయ్యేలోపే సింహాసనాన్ని ముందు ఉంచాడు. సులైమాన్ (అలైహిస్సలాం) ఆశ్చర్యంగా, ”ఇదంతా అల్లాహ్ అనుగ్రహం నేను కృతజ్ఞత చూపుతానో లేదో అని ఆయన పరీక్షిస్తున్నాడు” అన్నారు. ఆ తర్వాత ఆయన ఆ జిన్నుతో ఆ సింహాసనం ఆకారాన్ని మార్చమన్నారు.
సబా రాణి ఆగమనం
బిల్కీస్ సులైమాన్ రాజప్రాసాదంలోకి వచ్చినప్పుడు ఆమెను ఘనంగా స్వాగతించడం జరిగింది. ఆ తర్వాత సులైమాన్ (అలైహిస్సలాం) తన వద్ద ఆకారం మార్చి ఉన్న సింహాసనాన్ని ఆమెకు చూపించి ఆమె సింహాసనం కూడా అలాంటిదేనా అని ప్రశ్నించారు. ఆమె ఆ సింహాసనాన్ని పదే పదే చూసింది. తాను చూస్తున్న సింహాసనం తన సింహాసనం అయ్యే అవకాశం లేదని భావించింది. ఎందుకంటే, తన సింహాసనం తన రాజభవనంలో ఉంది. కాని తన సింహాసనానికి ఈ సింహాసనానికి పోలికలు చాలా ఉండడం చూసి ఆమె ఆశ్చర్యంగా, “ఈ సింహాసనం నా సింహాసనాన్ని చాలా విధాలుగా పోలి ఉంది” అంటూ జవాబిచ్చింది. ఆమె చాలా తెలివైన, దౌత్యపరమైన నైపుణ్యం ఉన్న మహిళగా సులైమాన్ (అలైహిస్సలాం) గుర్తించారు.
ఆ తర్వాత ఆయన అమెను ఒక పెద్ద హాలులోకి ఆహ్వానించారు. ఆ గది లో నేల అంతా గాజుతో పరచబడి ఉంది. ఆమె గాజు నేలను చూసి అదంతా నీరుగా భ్రమపడింది. ఆమె అక్కడ అడుగుపెట్టేటప్పుడు తన దుస్తులు తడవకుండా కొద్దిగా కాలిమడమల పైకి లాక్కుంది. సులైమాన్ (అలైహిస్సలాం) ఆమెను చూస్తూ ఇక్కడ నీరు లేదు, గాజుతో చేసిన నేల అని చెప్పారు. ఆమె ఆశ్చర్య పోయింది. అలాంటి నిర్మాణాన్ని ఆమె అంతకుముందు ఎన్నడూ చూడలేదు. తన ముందు ఉన్నది విజ్ఞానవివేకాలు మూర్తీభవించిన అసాధారణ వ్యక్తి అని ఆమె గుర్తించింది. ఆయన కేవలం ఒక రాజ్యానికి పాలకుడు మాత్రమే కాదని, అల్లాహ్ ప్రవక్త కూడా అని తెలుసుకుంది. ఆమె తన ఆరాధనా పద్ధతులలోని తప్పులకు పశ్చాత్తాపపడింది. సూర్యుణ్ణి పూజించే అలవాటు మానుకుంది. అల్లాహ్ ను ఒకే ఒక్క దేవునిగా విశ్వసించింది. తన రాజ్యంలోని ప్రజలను కూడా అదే విధంగా చేయాలని కోరింది. (చదవండి దివ్యఖుర్ఆన్ : 6:84, 21:81-82, 34:12-14, 27:15-44, 2-103, 38:32-40)
అశ్వప్రేమికుడు సులైమాన్ (అలైహిస్సలాం)
సులైమాన్ (అలైహిస్సలాం) కాలంలో ప్రజలు గుర్రాలపై ప్రయాణాలు చేసేవారు. యుద్ధరంగంలో సైనికులకు యుద్ధ సామగ్రిని, ఆయుధాలను చేరవేయడానికి గుర్రాలనే ఉపయోగించేవారు. వస్తురవాణాకు, వాహనాలు లాగడానికి కూడా గుర్రాలనే వాడేవారు. గుర్రాల పట్ల చాలా శ్రద్ధ చూపేవారు. వాటికి చక్కని శిక్షణ ఇచ్చేవారు. సులైమాన్ (అలైహిస్సలాం) గుర్రపుశాలలో చాలా గుర్రాలు ఉండేవి. గుర్రాలంటే ఆయనకు చాలా శ్రద్ధ ఉండేది. ఒకసారి ఆయన తన గుర్రపుశాలలో గుర్రాలను చూస్తూ వాటిని ప్రేమగా నిమురుతూ చాలాసేపు గడిపారు. సూర్యుడు అస్తమించే సమయం అయిపోయింది. అస్ర్ నమాజు సమయం దాటిపోతోంది. ఆయన తాను చేస్తున్న ఆలస్యాన్ని గుర్తించి వెంటనే, “నేను ఈ సంపదను నా ప్రభువు సంస్మరణార్థం ప్రేమించాను.”…..”వాటిని నా వద్దకు తిరిగి తీసుకు రండి” అన్నారు. (చదవండి దివ్యఖుర్ఆన్: 38:32-33)
సులైమాన్ (అలైహిస్సలాం) విచిత్ర మృతి
సులైమాన్ (అలైహిస్సలాం) పాలనలో అనేక పనులను జిన్నులే చేస్తుండేవి. జిన్నులు చేసిన పాపాలకు శిక్షగా వాటితో ఈ పనులు చేయించడం జరిగేది. అగ్నితో సృష్టించబడిన జిన్నులు తమకు సమస్త శక్తులున్నాయని, తాము అగోచరాలను కూడా చూడగలమని, భవిష్యత్తును తెలుసుకోగలమని ప్రజలను నమ్మించడం వంటి పాపాలకు పాల్పడేవారు. తన అనుచరుల్లో ఇలాంటి తప్పుడు విశ్వాసాలు చోటుచేసుకోకుండా చూడవలసిన బాధ్యత ఒక ప్రవక్తగా సులైమాన్ (అలైహిస్సలాం) పై ఉంది. భవిష్యత్తు తెలుసుకునే శక్తి జిన్నులకు గాని, ప్రవక్తలకు గాని ఎవరికీ లేదని, కేవలం అల్లాహ్ కు తప్ప అలాంటి శక్తి మరెవ్వరికీ లేదని ప్రజలు తెలుసుకునేలా చేయడం ఆయన బాధ్యత. ఈ దిశగా ఆయన చేసిన ప్రయత్నాలు ఆయన మరణానంతరం కూడా కొనసాగడం చెప్పుకోదగిన విశేషం.
ఒక గనిలో జిన్నుల పనిని పర్యవేక్షిస్తూ ఆయన తన చేతికర్రకు ఆనుకుని కూర్చుని ఉన్నారు. ఆ విధంగా కూర్చున్న స్థితిలోనే ఆయన తుదిశ్వాసను విడిచారు. చాలా సమయం వరకు ఆయన (అలైహిస్సలాం) మరణం గురించి ఎవరికీ తెలియదు. ఆయన (అలైహిస్సలాం) అక్కడ కూర్చున్నట్లే చాలా మందికి కనబడ్డారు. సులైమాన్ (అలైహిస్సలాం) చూస్తున్నారన్న భయంతో జిన్నులు విరామం లేకుండా పని కొనసాగిస్తూ పోయారు. ఈ సంఘటనను దివ్యఖుర్ఆన్ ఇలా వివరించింది. “ఆ తరువాత సులైమాన్ పై మేము మరణ నిర్ణయాన్ని అమలు జరిపినప్పుడు, జిన్నాతులకు అతని మరణం గురించి తెలియజేసిన వస్తువు అతని చేతి కర్రను తింటూ ఉన్న చెదపురుగు తప్ప మరొకటేదీ కాదు, ఈ విధంగా సులైమాన్ పడిపోగా, తమకు అగోచర విషయాలు తెలిసి ఉంటే అవమానకరమైన ఈ బాధకు గురి అయి ఉండేవారము కాము అని జిన్నాతులకు స్పష్టంగా తెలిసి పోయింది.”
ఆ విధంగా ఆయన మరణం కూడా ఆయన అనుచరులకు ఒక పాఠంగా మిగిలింది. జిన్నులేకాదు, ఎవరూ కూడా భవిష్యత్తును గురించి తెలుసుకునే అవకాశం లేదన్నది అందరికీ తెలిసివచ్చింది. (చదవండి దివ్యఖుర్ఆన్ : 34:14)
గ్రహించవలసిన పాఠాలు
సరియైన విధంగా న్యాయం చేయాలంటే, తీర్పు చెప్పేముందు ఇరు పక్షాల వాదనను పూర్తిగా వినాలి. న్యాయం జరిగిందని ప్రజలు తెలుసుకునేలా ఉండాలి.
వయసులో చిన్నవాడైన తన కుమారుడి వివేకాన్ని గుర్తించి తండ్రి తన స్వంత నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాడు.
ప్రార్థనలతో సహా వివిధ పనులకు తగిన విధంగా సమయాన్ని విభజించు కోవాలి. ప్రవక్తలు, చాలామంది పాలకులు ఇహపరలోకాల విధులు నిర్వర్తించడానికి తగిన విధంగా సమయాన్ని విభజించుకునేవారు.
మనిషి ఆధ్యాత్మిక శక్తి అతని ధార్మిక విశ్వాసంలో ఉంది.
మంచి పనులు జాతిని పతనానికి గురికాకుండా కాపాడుతాయి. అయితే విదేశీ దాడుల నుంచి కాపాడుకోవడానికి సైనిక ఏర్పాట్లు అవసరం.
ఆత్మసమీక్ష : మనిషి తన ఆచరణల విషయంలో ఏమాత్రం అనుమానం వచ్చినా తక్షణం అల్లాహ్ వైపునకు మరలి మార్గదర్శనం కోసం ప్రార్థించాలి.
అల్లాహ్ సృష్టి పట్ల సులైమాన్ (అలైహిస్సలాం) చాలా శ్రద్ధ తీసుకునేవారు, చివరకు ఒక చీమకు కూడా హాని కలుగడాన్ని ఇష్టపడలేదు.
వివేకజ్ఞానాలు ఉన్న సులైమాన్ (అలైహిస్సలాం) కూడా ఒక పక్షి నుంచి నేర్చుకు న్నారు. ఆ పక్షి సలహా తీసుకుని ఆ ప్రకారం వ్యవహరించారు.
పరస్పర సంప్రదింపులు: బిల్కిస్ ఒక స్త్రీ, ఆమె ఒక పాలకురాలు కూడా. అయినప్పటికీ అల్లాహ్ ఆమె పాలనాశైలిని గుర్తించాడు. ఆమె ఇతరులతో సంప్రదింపులు జరిపింది, కాని వారిచ్చిన తప్పుడు సలహాలను పాటించ లేదు.
శాంతి అన్నది సంతోషాన్ని, సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. యుద్ధాలు, పోరాటాలు వినాశానికి కారణమవుతాయి.
లంచాలకు, అవినీతికి ఎన్నడూ లొంగరాదు.
సులైమాన్ (అలైహిస్సలాం) మరణం కూడా మానవాళికి గుణపాఠం వంటిది. మనిషి జిన్నులను కూడా పాలించగలడు. అవి మనిషిపై ఆధిపత్యాన్ని సాధించలేవు. వాటికి భవిష్యత్తును తెలుసుకునే శక్తి కాని, అగోచరాలను గ్రహించే శక్తి కాని లేవు.
బైబిలులో కింగ్స్.. చాప్టర్ 2లో సులైమాన్ (అలైహిస్సలాం) దేవుని ఆదేశాలకు విరుద్ధంగా 700 మంది మహిళలను వివాహం చేసుకున్నారని, 300 మంది మహిళలను ఉంచుకున్నారని, ఆ మహిళలు ఆయన్ను విగ్రహారాధన చేసేలా ప్రలోభపెట్టారని, ఆయన అనేక విగ్రహారాధనాలయాలు కట్టించాడని, తన భార్యల కోసం బలిపీఠాలు కట్టించాడని ఇలాంటి అనేక అసత్య ఆరోపణలు ఉన్నాయి. కాని దివ్యఖుర్ఆన్ ఈ అసత్య ఆరోపణలను, అలాగే బ్లాక్ మ్యాజిక్కు పాల్పడ్డాడన్న ఆరోపణలన్నింటినీ ఖండిస్తోంది. (చదవండి దివ్యఖుర్ఆన్ 2-102)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.