దైవ మార్గంలో ఖర్చు (Spending in the way of Allah)

sadaqah

పుస్తకం నుండికలామే హిక్మత్ – 1(వివేక వచనం)
రచన: సఫీ అహ్మద్ మదనీ,
అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్
ప్రకాశకులు: జమీ అతే అహ్ లె హదీస్, ఆంధ్రప్రదేశ్

[ఇక్కడ చదవండి / డౌన్ లోడ్ చేసుకోండి]

బలవంతుడైన విశ్వాసి – బలహీనుడైన విశ్వాసి (Strong Believer – Weak Believer)

strong-believer-weak-believer-telugu-islam

పుస్తకం నుండికలామే హిక్మత్ – 1(వివేక వచనం)
రచన: సఫీ అహ్మద్ మదనీ
అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్
ప్రకాశకులు: జమీ అతే అహ్ లె హదీస్, ఆంధ్రప్రదేశ్

 [ఇక్కడ చదవండి / PDF డౌన్ లోడ్ చేసుకోండి]

అంతిమ దైవప్రవక్త ప్రవచించారని హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:

“బలవంతుడైన విశ్వాసి బలహీనుడైన విశ్వాసికంటే మేలైనవాడు. ఇంకా – అతను-అల్లాహ్ కు ప్రీతిపాత్రుడు. ఇంకా, ప్రతివాని లోనూ మంచి ఉంటుంది. మీ కొరకుప్రయోజనకరమయిన వాటిని ఆశించండి. ఇంకా, దైవ సహాయం కోరండి, నిస్పృహకులోనవబాకండి. మీకు ఏదయినా బాధ కలిగితే, ‘ఒకవేళ నేను అలాచేసి ఉంటేఇలా జరిగేది’ అని అనబాకండి. దానికి బదులు, ‘ఇది అల్లాహ్ నిర్ణయించిన విధి.ఆయన తలచినదే అయింది’ అని అనండి. ఎందుకంటే, ‘ఒకవేళ అలా జరిగిఉంటే…..’ (అనే ఊహాగానాలు) షైతాన్ మార్గాన్ని తెరచివేస్తాయి.’ (ముస్లిం)

ఈ హదీసులో దైవప్రవక్త (సఅసం) మూడు ముఖ్య విషయాలను ప్రబోధించారు :

“ఇక్కడ బలం అంటే అన్ని రకాల బలం అని భావం. ఇమామ్ నవవి (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు – “ఇక్కడ బలం అంటే మనో నిబ్బరం కలిగి ఉండి, పరలోక విషయాలలో ముందంజ వేయడం అని భావం. ఈ గుణాలున్న వ్యక్తి ధర్మ పోరాటంలో అందరికంటే ముందుకు పోయి శత్రువుపై దాడి జరుపుతాడు.అందరికంటే ముందు దైవాన్వేషణలో మునుముందు ఉంటాడు, మంచిని పెంచడంలో, చెడులను నిర్మూలించడంలో, సహనం వహించటంలో వజ్ర సంకల్పుడై ఉంటాడు. దైవ మార్గంలో ఎన్ని ఆపదలు ఎదురైనా ఓరిమిని ప్రదర్శిస్తాడు. నమాజ్, రోజా, జకాత్ తదితర ఆరాధనలకై, ఇంకా వాటి రక్షణకై అందరికంటే ఎక్కువగా చురుకుదనం కలిగి ఉంటాడు.”

శారీరక బలం లేదా శరీర దారుఢ్యం కూడా దైవానుగ్రహమే. హజ్రత్ దావూద్ (అలైహిస్సలాం) గురించి చెబుతూ అల్లాహ్ ఇలా అన్నాడు:

అల్లాహ్ ఆయనకు బుద్ధిబలాన్ని, కండబలాన్ని సమృద్ధిగా ప్రసాదించాడు.” (అల్ బఖర : 247)

జ్ఞానశక్తి కూడా మహదానుగ్రహమే. తన అంతిమ గ్రంథంలో సర్వోన్నతప్రభువు ఏమన్నాడో చూడండి –

మీరు (వారితో) అనండి, జ్ఞానులు, అజ్ఞానులు ఇద్దరూ ఒకటేనా? కేవలం బుద్ధిమంతులే హితబోధను స్వీకరిస్తారు.” (అజ్జుమర్ : 9)

ధనబలం కూడా దైవప్రసాదితమైన వరమే. అల్లాహ్ సెలవిచ్చాడు :

ఇంకా చూడండి. అల్లాహ్ మీలో కొందరికి కొందరికంటే ఉపాధివిషయంలో ఆధిక్యత ప్రసాదించాడు. అయితే ఎవరికయితే ఈ ఆధిక్యతఇవ్వబడిందో, వారు తమ ఉపాధిని తమ బానిసల వైపునకు మళ్ళించేవారు కాదు. ఇద్దరూ ఈ ఉపాధిలో సమానమైన భాగస్థులు అయ్యేందుకు.అయితే అల్లాహ్ ఉపకారాన్నే ఒప్పుకోవటానికి వీరు తిరస్కరిస్తున్నారా?” (అన్ నహ్ల్ – 71)

ఒక మనిషికి రెండో మనిషిపై ఆధిక్యతను ఇచ్చే, ఇంకా అతని వ్యవహారాలలో సరళతను సృష్టించే ప్రతిదీ బలంగానే పరిగణించ బడుతుంది. అటువంటి బలం గనక దైవ విధేయతలో, దైవ ప్రసన్నతను పొందే పనుల్లో వినియోగమైతే అది ఎంతో ప్రశంసనీయమైన దవుతుంది. ఈమాన్ (విశ్వాసం) అనేది ఎలాంటి ప్రేరణంటే అది మనిషి శక్తి సామర్థ్యాలు సరైన మార్గంలో వ్యయమయ్యేలా చేస్తుంది. తద్వారా మేలును, శుభాన్ని కలిగిస్తుంది. అందుకనే, “బలవంతుడైన విశ్వాసి బలహీనుడైన విశ్వాసి కన్నా మేలైనవాడు, అల్లాహ్ కు ప్రీతిపాత్రుడు” అని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రబోధించారు.

(2). “ప్రతి వానిలోనూ మంచి ఉంది.”

అంటే విశ్వాసి బలవంతుడైనా, బలహీనుడైనా అతను మంచివాడే. ఎందుకంటేఅతనిలో విశ్వాసం ఉంది. విశ్వాసం స్వతహాగా బలమైనది. అన్ని రకాల శక్తులు క్షీణించినా కనీసం విశ్వాస బలమైతే ఉండనే ఉంటుంది. కనుక ఏ విశ్వాసినైనా హీనుడుగా, అల్పుడుగా పరిగణించడం సమ్మతం కాదు.

(3). “మీ కొరకు మేలైన వాటిని ఆశించండి.”

ఇక్కడ ఆశించడమంటే భావం ప్రయత్నించడం, దానికోసం శక్తియుక్తులన్నీ ఒడ్డటం.ప్రాపంచికంగా నయినా, పారలౌకికంగా నైనా శ్రేయస్కరమైన ప్రతిదాన్నీ పొందమని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆదేశించారు. విశ్వాసి ప్రతి మంచినీ పొందే ప్రయత్నంలో ఉంటాడు. ఎందుకంటే అతను తన ప్రభువు అనుగ్రహానికి అతీతుడు కాలేడు. అల్లాహ్ సెలవిచ్చాడు:

(ఓ ప్రవక్తా! అనండి) నాకే గనక అగోచరాల జ్ఞానం ఉండి ఉంటే,ప్రయోజనకరమైన వాటిని నేను పుష్కలంగా పొందేవాడిని. నాకు నష్టమే వాటిల్లేది కాదు.”(అల్ ఆరాఫ్ – 188)

  1. “దైవ సహాయం అడగండి”

లాభదాయకమైన వాటిని పొందమని ఆదేశించిన తరువాత మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం),’లాభకరమైన వస్తువు దైవ ప్రమేయంతోనే ప్రాప్తిస్తుంద’ని కూడా చెప్పారు. అందుకే లక్ష్య సాధన కొరకు దైవ సహాయాన్నే వేడుకోవాలి. ప్రతి మేలు, ప్రతి సహాయంఆయన అనుగ్రహంతోనే లభిస్తుంది. అల్లాహ్ తలచనంతవరకూ ఏ కారణాలూఏమీ చేయలేవు. ఎందుకంటే కారణాలను పర్యవసానాలను సృష్టించిన వాడు అల్లాహ్ యే గనక. ధర్మసమ్మతమైన కోర్కెల సాధనకై విశ్వాసి ధర్మ సమ్మతమైనఒనరులనే వినియోగిస్తాడు. అయితే నమ్మకం మాత్రం లాభనష్టాలను చేకూర్చగలశక్తిని కలిగిఉన్న దైవంపై పెట్టుకుంటాడు.

  1. “నిస్పృహకు లోనవబాకండి”

అంటే దైవవిధేయతలో, దైవ సహాయం కోరే విషయంలో అలసత్వం, బద్దకంపనికిరావు. దానికి బదులు దైవాన్ని ఆశతో వేడుకోవాలి. వేడుకోవటంతో పాటు’సాధన’ చేయాలి. దైవానుగ్రహాలను పొందే విషయంలో మందకొడిగా ఉండటం, విముఖతను చూపటం ఎంతకీ మంచిది కాదు. అలా చేస్తే దైవానుగ్రహాలనుఆక్షేపించినట్లవుతుంది. విశ్వసించిన వ్యక్తి దైవానుగ్రహాలను ఎన్నడూ ఆక్షేపించడు.

  1. మీకేదయినా బాధ కలిగినపుడు, ‘మేము గనక అలాచేసి ఉంటే ఇలా జరిగిఉండేది’ అని అనటం ఎంతమాత్రం భావ్యం కాదు.

విశ్వాసి సమస్త ప్రయత్నాలను చేసిన తరువాత కూడా అనుకున్నది నెరవేరకపోతే,దాని నష్టం నుండి బయటపడకపోతే, అప్పుడు దైవ నిర్ణయానికి రాజీపడిపోవాలి.దైవచిత్తం కాని దాన్ని సాధించలేనని తెలుసుకోవాలి. ఫలానా కారణంగా ఈ పనికాలేదని నిందమోపటం, లేదా ఒకవేళ ఆ చర్య గైకొని ఉంటే అది నెరవేరేది అనికాకి లెక్కలు వేయటం మోమిన్ (విశ్వాసి) స్థాయికి ఎంతమాత్రం తగదు.

  1. ఈ హదీసులో “ఒకవేళ” అనే పదం ఉపయోగించరాదని చెప్పబడింది. అయితే కొన్ని ఇతర హదీసుల్లో ఈ “పదం” వాడినట్లు కూడా ఉంది. అంతిమ హజ్సందర్భంగా మహాప్రవక్త (సఅసం), ‘ఒకవేళ ఇప్పుడు నా దృష్టికి వచ్చిన విషయం ముందే తెలిసి ఉంటే ఖుర్బానీ పశువుల్ని తెచ్చేవాడ్ని కాను’ అని అన్నారు. అలాగేదివ్య ఖుర్ఆన్,

“ఒకవేళ నాకే గనక అగోచర విషయజ్ఞానం ఉంటే ప్రయోజనకరమైనవాటినెన్నో పొందేవాడిని, నాకు కష్టనష్టాలే రాకుండా ఉండేవి (అని ఓప్రవక్తా వారితో చెప్పివేయండి)” అని అనబడింది.

దీని భావం ఏమంటే భవిష్యత్తులో ఏదైనా మంచి పని చేయాలన్న సంకల్పం ఉంటే, ఉదాహరణకు, ‘ఒకవేళ వచ్చే సంవత్సరం దాకా నేను బ్రతికి వుంటే హజ్ చేస్తాను’ అనవచ్చు. అందులో తప్పులేదు. లేదా గత జీవితంలో దైవవిధేయత విషయంలో జరిగిన లోటుపాట్లను తల్చుకుని సిగ్గుపడుతూ, ‘ఒకవేళ నేను నమాజ్ను క్రమం తప్పకుండా చేసివుంటే ఎంత బాగుండేది!’ అని అనవచ్చు. ఇంకా, అల్లాహు అయిష్టం కాని రీతిలో ఏదన్నా వాక్యం పలికినా దోషం లేదు. ఉదాహరణకు హిజ్రత్సందర్భంగా హజ్రత్ అబూబకర్ (రజిఅన్) సూర్ గుహలో, ఓ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)!బహు దైవారాధకులలో ఎవరయినా తల ఎత్తాడంటే చాలు, మిమ్మల్ని చూసేస్తాడు”అని అన్నారు.

అయితే గతంలో జరిగిపోయిన నష్టాన్ని తలచుకుని ‘అరె అలా చేసే బదులు ఇలాచేసి ఉంటే లాభదాయకంగా ఉండేదేమో!’ అని మాత్రం అనకూడదు. అలా అనటం వల్ల దైవంపై నమ్మకం సడలి పోయిన భావం వ్యక్తమవుతుంది. ఉదాహరణకు,“నేను ఫలానా వస్తువు తిని ఉంటే స్వస్థత చేకూరేదేమో” అని అనడం విశ్వాసరాహిత్యానికి ఆనవాలుగా ఉంటుంది.

ఈ హదీసులో ఎన్నో ముఖ్యమైన విషయాలు చెప్పబడ్డాయి. మొదటి విషయమేమంటే విశ్వాసులలో ఒకటికి రెండు కోవలకు చెందిన వారుంటారు. అయితే వారిలోనిబలవంతుడంటే అల్లాహ్ కు ఇష్టం. ఎందుకంటే దైవాజ్ఞాపాలనలో అతను తన బలాన్నిశక్తిని ధారపోస్తాడు. బలహీనుడైన విశ్వాసికన్నా సక్రమంగా ఎక్కువగా దైవాన్నిసేవిస్తాడు. అందుకే బలాన్ని, శక్తిని పొందడానికి ప్రయత్నించమని దైవప్రవక్త నొక్కిపలికారు. ఎందుకంటే ప్రతిదీ ప్రయత్నం ద్వారానే హస్తగతమవుతుంది. అలసత్వం సోమరితనాలవల్ల ఏదీ ప్రాప్తించదు. సోమరితనం, బద్దకాలను దూరంచేసి ధర్మసమ్మతమయిన ఒనరులను వినియోగించుకోవాలని చెప్పబడింది.

అయితే ఒక విశ్వాసి ప్రత్యేకత ఏమంటే అతని మనసు ఎంతసేపటికీ భౌతికవనరుల పైకాక, దైవ ప్రోద్బలంపై ఆధారపడి ఉంటుంది. మనిషి ఎన్ని ఒనరుల్నిసమకూర్చుకున్నా, ఎన్ని జాగ్రత్తలు గైకొన్నా నిర్ణీత లక్ష్యం నెరవేరి తీరుతుందన్ననమ్మకం లేదు. మనిషి విఫలుడవటం సంభవమే. ఒక్కోసారి అతను నిర్ణయించుకున్నలక్ష్యాన్ని అందుకోకపోవటంలోనే అతని శ్రేయస్సు ఇమిడి ఉండవచ్చు. ఎందులోఏం మేలుందో దైవానికే తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో విశ్వాసి నిరాశకుగురికాకుండా తన ప్రభువేచ్ఛతో రాజీపడిపోతాడు. విధిని విదిలించే, ఒనరులనుతప్పుపట్టే బదులు ‘దైవచిత్తం ఇలా ఉంది కాబోలు. కనుక ఇది నాకు ఆమోదమే’అని అంటాడు. అలాగే అతని ఆంతర్యం ఈర్ష్య, అసూయ, కపటత్వం, ద్వేషంవంటి నకారాత్మక భావనల నుడి, తుచ్ఛమైన భావాల నుండి సురక్షితంగా ఉంటుంది.ఇంకా అతని ఆంతర్యంపై దైవ కారుణ్యం ప్రశాంతత అవతరిస్తాయి.

పశ్చాత్తాపం (Repentance)

repentance-telugu-islam

పుస్తకం నుండికలామే హిక్మత్ – 1(వివేక వచనం)
రచన: సఫీ అహ్మద్ మదనీ
అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్
ప్రకాశకులు: జమీ అతే అహ్ లె హదీస్, ఆంధ్రప్రదేశ్

[ఇక్కడ PDF డౌన్ లోడ్ చేసుకోండి]

క్లుప్తంగా ఇమామ్ బుఖారీ & ఇమామ్ ముస్లిం గురుంచి | అల్-లూలు వల్ మర్జాన్

nature-bukhari-muslim

Brief Biography of Imam Bukhari & Imam Muslim

[ఇక్కడ చదవండి / PDF డౌన్లోడ్ చేసుకోండి]

రచయిత :సయ్యిద్ షబ్బీర్ అహ్మద్
మూలం:మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) గ్రంధ పరిచయం నుండి

కరుణామయుడు, కృపాసాగరుడయిన అల్లాహ్ పేరుతో

అల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదుల్ ముర్సలీన్, అలా ఆలిహీ వ అస్ హాబిహీ అజ్మయీన్. ఈ గ్రంథం అసలు పేరు అరబీ భాషలో “అల్ లూలు వల్ మర్జాన్”. ఇందులోని పదావళి దివ్యఖుర్ఆన్లో ఈ విధంగా ప్రస్తావించబడింది:

مَرَجَ الْبَحْرَيْنِ يَلْتَقِيَانِ بَيْنَهُمَا بَرْزَخٌ لَّا يَبْغِيَانِ فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ يَخْرُجُ مِنْهُمَا اللُّؤْلُؤُ وَالْمَرْجَانُ فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ

“ఆయన రెండు సముద్రాలను పరస్పరం కలిసిపోయేలా వదలి పెట్టాడు. అయినా వాటిమధ్య ఒక అడ్డుతెర ఉంది. దానివల్ల అవి ఒకదానిలోకొకటి చొచ్చుకుపోలేవు. కనుక (మానవులారా! జిన్నులారా!!) మీ ప్రభువు శక్తి పరిధిలోని ఏ మహిమను మీరు నిరాకరించగలరు? ఈ సముద్రాలలో ముత్యాలు, పగడాలు కూడా లభిస్తాయి. కనుక (మానవులారా! జిన్నులారా!!) మీ ప్రభువులోని ఏ ఔన్నత్యాన్ని మీరు కాదనగలరు?”(55:19-23)

ఈ గ్రంథంలో మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) సంప్రదాయాల (హదీసుల)కు సంబంధించిన సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లిం అనే రెండు హదీసు గ్రంథాలను రెండు సముద్రాలతో పోల్చడంజరిగింది. అయితే ప్రస్తుత సంకలన కర్త అల్లామా ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ హదీసుల మూలం (Text) ని బుఖారీ గ్రంథం నుండి గ్రహించి స్కంధాలు, అధ్యాయాల క్రమాన్ని, శీర్షికలపేర్లను మాత్రం ముస్లిం గ్రంథం నుండి స్వీకరించారు. అదీగాక పై రెండు గ్రంథాలలోనూ ఒకే ఉల్లేఖకుడు తెలిపిన ఉమ్మడి హదీసుల్ని మాత్రమే ఈ గ్రంథం కోసం ఎంచుకున్నారు. వీటిని “ముత్తఫఖున్ అలైహ్” (ఉభయోకీభవిత) హదీసులని అంటారు. వీటినే ఈ సంకలనకర్త ముత్యాలు,పగడాలుగా అభివర్ణించి, దాన్నే తన గ్రంథానికి నామకరణం చేశారు.

అంతిమ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి ప్రవచనాలు, ఆచార వ్యవహారాలు, ఆజ్ఞలు, అనుజ్ఞలు, అలవాట్లు, అభిరుచులు, కదలికలు, కథనాలు, సలహాలు, సూచనలు, స్వరూప స్వభావాలు -ఒక్కటేమిటి, ఆ మహనీయుని జీవితంలోని ప్రతి అంశానికి, ప్రతి కోణానికి సంబంధించిన హదీసుల్ని సేకరించి, సంకలనం చేసి పకడ్బందీగా భద్రపరిచారు హదీసు వేత్తలు. ఈ మహాకార్యం వెనుక వారి అవిరళ కృషి, అవిశ్రాంత శ్రమ, అసామాన్య సాహసం మనకు స్పష్టంగా గోచరిస్తాయి.

హదీసువేత్తలు ఉల్లేఖకుల నుండి హదీసుల్ని సేకరిస్తున్నప్పుడు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గౌరవోన్నతుల పై అణుమాత్రం కూడా మచ్చరాని విధంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ మహానాయకుని పట్ల విశ్వాసం, ప్రేమాభిమానాలు ఇసుమంత సడలినట్లనిపించినాసరే అలాంటి హదీసుల్ని వారసలు స్వీకరించనే లేదు. హదీసుల సేకరణ తరువాత వారా హదీసుల్ని పరి పరి విధాల పరిశీలించి, శల్యపరీక్ష చేసి, క్షుణ్ణంగా వడపోసి వాటి నుండి పూర్తిగా నమ్మకమయినవని, నిజమయినవని ధృవీకరించుకున్న హదీసుల్ని మాత్రమే ఎంచుకొని సంకలనం చేశారు. హదీసులు ప్రామాణికత విషయంలో వారి దైవభీతి పరాయణత, నిజాయితీ, విశ్వసనీయలతో పాటు, హదీసుల ప్రామాణికతను పరిశీలించడానికి వారు నిర్దేశించిన కొలమానాలు యావత్తు ముస్లిం జగత్తులో ఎంతో గుర్తింపు పొందాయి. ఇలా సంకలనం చేసిన గ్రంథాలలో సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లిం, తిర్మిజి, అబూదావూద్, నసాయి. ఇబ్ను మాజా, ఇమాం మాలిక్ గారి మువత్తా, ఇమాం ముహమ్మద్ గారి మువత్తా, ముస్నద్ అహ్మద్, దార్మి, దారెఖత్ని, బైహఖీ మొదలైనవెన్నో ఉన్నాయి. వీటిలో హదీసుల ఆరోగ్యస్థితి, ప్రామాణికతల రీత్యా మొదటి ఆరు గ్రంథాలు అత్యున్నత స్థాయికి చెందిన గ్రంథాలుగా ఖ్యాతి చెందాయి. ఈ ఆరు గ్రంథాలను “సహీ సిత్తా” (షడ్నీజాలు) అంటారు.

వీటిలో మన సంకలనకర్త తన గ్రంథం కోసం ఎంచుకున్న రెండు గ్రంథాలు సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లింలను గురించి, వాటిని సంకలనం చేసిన ప్రముఖ హదీసు వేత్తలు ఇమాం బుఖారీ (రహిమహుల్లాహ్), ఇమాం ముస్లిం (రహిమహుల్లాహ్) గార్ల జీవిత చరిత్రలను గురించి ఇక్కడ సంక్షిప్తంగానయినా తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

సహీహ్ బుఖారీ గ్రంథాన్ని సంకలనం చేసిన ఇమామ్ అబూ అబ్దుల్లా ముహమ్మద్ బిన్ ఇస్మాయీల్ బిన్ ఇబ్రాహీమ్ అల్ బుఖారీ (రహిమహుల్లాహ్) హిజ్రీ శకం 194, షవ్వాల్ మాసం 13వ తేదీ శుక్రవారం నాడు బుఖారాలో ఒక పేద కుటుంబంలో జన్మించారు. ఆయన పదేళ్ళ ప్రాయంలో విద్యాభ్యాసం ప్రారంభించారు. స్వగ్రామంలో ప్రాథమిక విద్యనభ్యసించిన తరువాత ఉన్నత విద్యకోసం ముస్లిం జగత్తులోని యావత్తు ప్రధాన విద్యా కేంద్రాలన్నీ పర్యటించారు. ఈ సుదీర్ఘ పర్యటనలో ఆయన 1080 మంది ధర్మవేత్తల నుండి హదీసు విద్య నేర్చుకున్నారు. పదేళ్ళ ప్రాయంలోనే ఆయన బుఖారాలో ఆనాటి హదీసు విద్యాపారంగతులు ఇమామ్ దాఖలీ (రహిమహుల్లాహ్) గారి పాఠశాలలో చేరారు.

ఒక రోజు ఇమామ్ దాఖలీ (రహిమహుల్లాహ్) ఒక హదీసు ప్రమాణాన్ని పేర్కొంటూ “సుఫ్యాన్ అన్ అబీజుబైర్ అన్ ఇబ్రాహీం” అని అన్నారు. అప్పుడు ఇమాం బుఖారీ (రహిమహుల్లాహ్) కల్పించుకొని “ఈ హదీసు ప్రమాణం ఈ విధంగా లేదండీ! అబూజుబైర్ ఈ హదీసుని ఇబ్రాహీం నుండి ఉల్లేఖించ లేదు”అని అన్నారు.

అతి పిన్న వయస్సులో ఉన్న ఒక శిష్యుడు తనను ఇలా తప్పుబట్టడంతో గురువు గారుఉలిక్కిపడ్డారు. ఆయన కోపంతో కొర కొర చూశారు. ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) గురువు గారి పట్లఎంతో వినయ విధేయతలతో వ్యవహరిస్తూ “మీ దగ్గర అసలు గ్రంథం ఉంటే అందులో ఓసారిచూసుకోండి” అని ప్రశాంతంగా అన్నారు.

ఇమామ్ దాఖలీ (రహిమహుల్లాహ్) ఇంటికి వెళ్ళి అసలు గ్రంథాన్ని పరిశీలించి ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) చేసిన విమర్శ సహేతుకమయినదేనని గ్రహించారు. ఆయన తిరిగి వచ్చి “అయితే సరయిన ప్రమాణం ఏమంటావు?” అని అడిగారు. ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) తక్షణమే సమాధానమిస్తూ “సుఫ్యాన్ అనిజ్జుబైరి వహు వన్బు అదియ్యి అన్ ఇబ్రాహీం (ఇబ్రాహీం నుండి జుబైర్ బిన్ అదీ రహిమహుల్లాహ్-ఉల్లేఖించారు; అబూజుబైర్ అనడం సరికాదు)” అని అన్నారు.

అప్పటికి ఇమామ్ బుఖారీ వయస్సు పదకొండేండ్లు కూడా నిండలేదు. పదహారు సంవత్సరాలవయస్సులో ఆయన హజ్రత్ అబ్దుల్లా బిన్ ముబారక్ (రహిమహుల్లాహ్), ఇమామ్ వకీ (రహిమహుల్లాహ్)లు సేకరించిన హదీసులన్నీ కంఠస్తం చేశారు. 18వ యేట చరిత్ర గ్రంథాన్ని రచించ నారంభించారు. ఇందులో సహాబీలు (ప్రవక్త ప్రత్యక్ష అనుచరులు), తాబయీల (ఆ తరువాతి అనుచరుల) జీవిత చరిత్ర, వారుచెప్పిన మాటలు, చేసిన నిర్ణయాలన్నీ సమీకరించబడ్డాయి. ఈ గ్రంథాన్ని ఆయన దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సమాధి దగ్గర కూర్చొని వెన్నెల రాత్రులలో రాశారు.

ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) అసామాన్య జ్ఞాపకశక్తి గల మేధా సంపన్నులు. ఎంత పెద్ద హదీసయినాసరే ఒక్కసారి చదివితే లేక వింటే చాలు కంఠస్తమయిపోయేది.

ఇమాం బుఖారీ (రహిమహుల్లాహ్) గారి సమకాలిక హదీసువేత్త హామిద్ బిన్ ఇస్మాయీల్ ఇలాతెలియజేస్తున్నారు: “ఇమామ్ బుఖారీ బస్రాలో మాతో పాటు హదీసు తరగతులకు హాజరవుతూ ఉండేవారు. అయితే ఆయన కేవలం వినేవారు. ఒక్క అక్షరం కూడా వ్రాసుకునేవారు కాదు. ఈవిధంగా 16 రోజులు గడిచిపోయాయి. చివరికి ఓ రోజు నేను, హదీసులు వ్రాసుకోకపోవడం పట్ల ఆయన్ని విమర్శించాను. దానికాయన సమాధానమిస్తూ “ఈ పదహారు రోజుల కాలంలో నీవు వ్రాసుకున్న విషయాలన్నీ తీసుకురా. వాటన్నిటినీ నేను చూడకుండా చదువుతాను విను” అని అన్నారు. ఆ విధంగా ఆయన పదిహేను వందలకు పైగా హదీసుల్ని ఒక్క పొల్లు పోకుండా ఉన్నది ఉన్నట్లు మాకు వినిపించారు. స్వయంగా మేము అనేక చోట్ల మా రాతల్లో దొర్లిన తప్పులను ఆయన నోట విని సవరించుకోవలసి వచ్చింది”.

ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) గారి జ్ఞాపకశక్తి గాధలు దశ దిశలా వ్యాపించిపోయాయి. ఆయనఏ ప్రాంతానికి బయలుదేరినా, ఆయనకు ముందే ఆ ప్రాంతానికి ఆయన పేరు ప్రఖ్యాతులు చేరుకునేవి. ప్రజలు వివిధ రకాలుగా ఆయన జ్ఞాపకశక్తిని పరీక్షించేవారు. చివరికి వారు ఆయన అసాధారణ జ్ఞాపకశక్తికి ఆశ్చర్యచకితులయి ఎంతో అభినందించేవారు. ఆ కాలంలోనే షేఖ్ అబూ జరఆ (రహిమహుల్లాహ్), అబూ హాతిం (రహిమహుల్లాహ్), ముహమ్మద్ బిన్ నస్ర్ (రహిమహుల్లాహ్), ఇబ్ను ఖుజైమా (రహిమహుల్లాహ్), ఇమామ్ తిర్మిజి (రహిమహుల్లాహ్), ఇమామ్ ముస్లిం (రహిమహుల్లాహ్)లు ఆయనకు శిష్యులయిపోయారు.

ఇమాం బుఖారీ (రహిమహుల్లాహ్) ని ప్రశంసిస్తూ కొందరు ప్రముఖులు వెలిబుచ్చిన అభిప్రాయాలు వినండి:

“బుఖారీ (రహిమహుల్లాహ్) హదీసు విద్యలో నాకంటే ఎక్కువ వివేకం, దూరదృష్టి కల వ్యక్తి. ఆయన దైవదాసుల్లోకెల్లా ఎక్కువ వివేచనాపరుడు. నిజం చెప్పాలంటే బుఖారీని మించిన వారే లేరు.”- ఇమామ్ దార్మి (రహిమహుల్లాహ్)

“ఖురాసాన్ భూభాగంలో ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) లాంటి మహోన్నత వ్యక్తి మరొకరుజన్మించ లేదు.”-ఇమామ్ అహ్మద్ (రహిమహుల్లాహ్)

“స్వయంగా ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) కూడా తన లాంటి వ్యక్తిని చూడలేదు.”- ఇబ్నుల్ మదీనీ (రహిమహుల్లాహ్)

“ఇమామ్ ముస్లిం బిన్ అల్ హిజాజ్ (రహిమహుల్లాహ్) ఓ సారి ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) సన్నిధికివెళ్ళి ఆయన రెండు కళ్ళ మధ్య (నుదుటిని) ముద్దాడుతుండగా నేను కళ్ళారా చూశాను. ఆ తరువాతఆయన ‘గురువులకు గురువూ! హదీసువేత్తల నాయకా! మీ పాదాలు చుంబించడానికి నాకు అనుమతి ఇవ్వండి’ అని అన్నారు.’- అహ్మద్ బిన్ హమ్డాన్ (రహిమహుల్లాహ్)

“ఆకాశం క్రింద ఈ ధరిత్రిపై ముహమ్మద్ బిన్ ఇస్మాయీల్ బుఖారీ (రహిమహుల్లాహ్)ని మించిన హదీసు పండితుడు, పారంగతుడు మరొకరు లేరు.” – ఇబ్నె ఖుజైమా (రహిమహుల్లాహ్)

ఇమామ్ జీవిత విశేషాల్లో ముఖ్యంగా చెప్పుకోదగిన ఒక విశేషం ఉంది. ఆయన తనజీవితంలో ఏనాడూ ఎవరినీ నిందించలేదు, దూషించలేదు, బాధించనూలేదు. ఆయన స్వయంగా ఈవిషయాన్ని ప్రస్తావిస్తూ “పరలోక విచారణ దినాన పరోక్ష నిందను గురించి నన్ను ప్రశ్నించడం జరగదనినేను ఆశిస్తున్నాను” అని అప్పుడప్పుడు అంటుండేవారు.

ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) ఎంతో ఆత్మాభిమానం గల వ్యక్తి. దీన్ని గురించి ఉమర్ బిన్ హఫ్స్(రహిమహుల్లాహ్) ఇలా తెలియజేస్తున్నారు: “బస్రాలోని హదీసు పాఠశాలలో నేను, ఇమామ్ బుఖారీ సహవిద్యార్థులంగా ఉండేవాళ్ళం. ఒక రోజు ఇమామ్ పాఠశాలకు రాలేదు. విచారిస్తే ఆ రోజు ఇమామ్ బుఖారీ దగ్గర ధరించి బయటికి రావడానికి సరిపడ్డ బట్టలు కూడా లేవని తెలిసింది. ఈ విషయం ఇతరుల ముందు బహిర్గతం కావడం ఆయనకు ఏ మాత్రం ఇష్టంలేదు. అందువల్ల ఆయన ఆ రోజు ఇంటి నుంచి బయటికే రాలేదు. ఆ తరువాత మేము ఆయన కోసం బట్టలు సంపాదించి తీసికెళ్ళి ఇచ్చాము. దాంతో ఆయన మరునాటి నుంచి పాఠశాలకు రావడం ప్రారంభించారు.

ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) రాజులకు, పాలకులకు ఎల్లప్పుడూ దూరంగా ఉండేవారు.అయితే ఓ రోజు బుఖారా గవర్నర్, తన దర్బారుకు వచ్చి తనకు హదీసులు వినిపించవలసిందిగా ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్)కి విజ్ఞప్తి చేశాడు. దాంతో పాటు, ఇతరులెవరూ పాల్గొనకుండా ఉండే ఓ ప్రత్యేక సమావేశంలో తన పిల్లలకు హదీసు విద్య నేర్పవలసిందిగా కూడా అతను ఇమామ్ని కోరాడు.ఇమామ్ ఈ రెండు కోర్కెలను తిరస్కరిస్తూ “విద్యను గురువు దగ్గరకెళ్ళి నేర్చుకోవలసి ఉంటుంది.నా సమావేశంలో ధనికుడు-పేద అనే తారతమ్యం లేదు. ఇక్కడికొచ్చి హదీసు విద్య నేర్చుకోవడానికిప్రతి ఒక్కరికీ హక్కుంది” అని సమాధానమిచ్చారు.

ఈ సమాధానం విని బుఖారా గవర్నర్ ఆగ్రహోదగ్రుడయ్యాడు. ఆ తరువాత వారిద్దరి మధ్య దూరం మరింత పెరిగిపోయింది. గవర్నర్ ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) మీద పగబూని బుసలు కొట్టడం ప్రారంభించాడు. దాంతో ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) బుఖారా పట్నం వదలి ఖర్తుంగ్ అనే ప్రాంతానికివెళ్ళి తలదాచుకోవలసి వచ్చింది. అక్కడకు వెళ్ళిన తరువాత ఆయన వ్యాధిగ్రస్తులయ్యారు. చివరికి హిజ్రి శకం 256లో ఈదుల్ ఫిత్ర్ నాడు 62 సంవత్సరాల వయస్సులో ఆయన తనువు చాలించారు. -రహ్మతుల్లా అలై-

ఇది ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) జీవితాంతం శ్రమించి, అనేక ప్రాంతాలు పర్యటించి సంకలనం చేసిన హదీసు గ్రంథం. ఆయన వివిధ ప్రాంతాల నుండి మొత్తం ఆరు లక్షల హదీసులు సేకరించి, వాటిలో ఈ గ్రంథం కోసం అత్యంత ప్రామాణికమైన 7,397 హదీసుల్ని ఎంపిక చేసి సంకలనం చేశారు. ఈ 7,397 హదీసుల్లో నుండి పునరావృత్త హదీసుల్ని తీసివేస్తే 2,602 హదీసులు మాత్రమే మిగిలి ఉంటాయి. ఇవన్నీ పటిష్ఠమైన ఆధారాలు గల నిజమైన హదీసులు. వీటిని ఆయన వివిధ శీర్షికల క్రింద ప్రకరణలుగా, అధ్యాయాలుగా విభజించి ఒక క్రమ పద్ధతిలో సంకలనం చేశారు.

ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) ఈ మహాకార్యాన్ని నిరంతరాయంగా 16 సంవత్సరాల పాటు అహోరాత్రులు చెమట ధారపోసి పూర్తి చేశారు. ఆయన ప్రతి హదీసు గ్రంథస్తం చేయడానికి ముందుగా స్నానం చేసి, రెండు రకాతులు నఫిల్ నమాజ్ చేసేవారు. ఆ తరువాతనే ఆ హదీసు రాయడానికి ఉపక్రమించేవారు. ఈ విధంగా ఆయన మొత్తం హదీసుల్ని పూర్తి పరిశుద్ధావస్థలో, ఎంతో భక్తిభావంతో గ్రంధస్తం చేశారు.

ప్రసిద్ధి చెందిన వందలాది మంది హదీసువేత్తలు ఈ గ్రంథం ప్రామాణికతను పరీక్షించడానికివివిధ రకాలుగా ప్రయత్నించారు. కాని ఏ ఒక్కరూ ఇందులోని ఏ ఒక్క హదీసు ప్రామాణికతతో కూడా విభేదించలేకపోయారు. కనీసం దానిపట్ల సందేహం కూడా వెలిబుచ్చలేకపోయారు. చివరికి వారంతా దివ్యఖుర్ఆన్ తరువాత పటిష్ఠమైన ప్రామాణికతతో కూడిన నిజగ్రంథం ఏదయినా ఉందంటే అది సహీహ్ బుఖారీ మాత్రమేనని తీర్మానించారు. ఈ విధంగా ఇస్లామీయ గ్రంథాలలో సహీహ్ బుఖారీ ద్వితీయ స్థానం పొందగలిగింది.

ఈ గ్రంథ ప్రాశస్త్యం, ప్రత్యేకతలను గురించి చెప్పాలంటే ఎన్నో విషయాలున్నాయి. ఇక్కడరెండు విషయాలను మాత్రం ప్రస్తావిస్తున్నాం. ఇందులోని హదీసుల్ని స్వయంగా ఇమామ్ బుఖారీ(రహిమహుల్లాహ్) నోట తొంభై వేల మంది హదీసువేత్తలు విన్నారు. ఈ గ్రంథానికి 53 వివరణ గ్రంథాలువెలువడ్డాయి. వాటిలో కొన్ని వివరణ గ్రంథాలు పద్నాలుగేసి సంపుటాలలో వెలువడ్డాయి. దీన్ని బట్టిసహీహ్ బుఖారీ ఎంత జనాదరణ పొందిన గ్రంథమో ఊహించవచ్చు.

సహీహ్ ముస్లిం గ్రంధాన్ని సంకలనం చేసిన ఇమామ్ అబుల్ హుసైన్ ముస్లిం బిన్ హిజాజ్(రహిమహుల్లాహ్) హిజ్ర శకం 204లో నీషాపూర్లో జన్మించారు. బాల్యం నుండే హదీసు విద్యార్జనలో నిమగ్నులయిపోయారు. హదీసుల అన్వేషణ కోసం ఆయన ఇరాఖ్, హిజాజ్, ఈజిప్టు దేశాలు పర్యటించి, అక్కడి పండితుల దగ్గర హదీసులు నేర్చుకున్నారు. అలాంటి పండితులలో ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) గారి గురువులు కూడా ఉన్నారు. చివరికి ఆయన నీషాపూర్లో ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్)ని కలుసుకొని, ఆయన దగ్గర కూడా శిష్యరికం చేశారు.

ఆ కాలంలో గొప్ప గొప్ప హదీసువేత్తలు సయితం తరచుగా ఇమామ్ ముస్లిం (రహిమహుల్లాహ్) దగ్గరకొచ్చి హదీసులు వినిపోతుండేవారు. వారిలో అబూ హాతిం రాజి (రహిమహుల్లాహ్), మూసాబిన్ హారూన్(రహిమహుల్లాహ్), అహ్మద్ బిన్ సల్మ (రహిమహుల్లాహ్), ఇమామ్ తిర్మిజీ (రహిమహుల్లాహ్) ప్రభృతులు కూడా ఉన్నారు.ఆయన బాల్యం నుండి అంతిమ శ్వాస వరకు ఎంతో దైవభీతి, ధర్మపరాయణతలతో కూడిన పవిత్ర జీవితం గడిపారు. ఆయన ఏనాడూ ఒకరిని నిందించడం గాని, బాధించడం గాని చేయలేదు.

ఇమామ్ ముస్లిం మరణ సంఘటన చాలా విచిత్రంగా జరిగింది. ఒక సారి ఓ పండిత గోష్ఠిలో ఒక వ్యక్తి ఏదో హదీసుని గురించి సమాచారం అడిగాడు. అయితే ఆ సమయంలో ఇమామ్ గారికి ఆ హదీసు గురించిన సరయిన వివరాలు తెలియకపోవడం వల్ల సమాధానం ఇవ్వలేకపోయారు.తరువాత ఆయన ఇంటికి వెళ్ళి ఆ హదీసుని అన్వేషించడం ప్రారంభించారు. గ్రంథ పుటలను తిరగేస్తూ ప్రక్కనే ఉన్న ఖర్జూరపండ్ల బుట్టలో నుంచి ఒక్కొక్క ఖర్జూరాన్ని తీసి తింటూ పోయారు.హదీసు అన్వేషణలో తానెన్ని ఖర్జూర పండ్లు తిన్నానన్న సంగతిని కూడా గమనించలేదు. చివరికి అన్వేషిస్తున్న హదీసు లభించిన తరువాత బుట్ట వైపు చూస్తే అది దాదాపు ఖాళీ అయిపోయింది.అప్పుడర్ధమైంది ఆయనకు తాను బుట్టలోని పండ్లన్నీ తిన్నానని. కాని ఇక చేసేదేమీ లేదు; జరగవలసింది జరిగిపోయింది. ఎక్కువ పండ్లు తినడం వల్ల ఆయన వ్యాధిగ్రస్తులయ్యారు. ఆ వ్యాధితోనే ఆయన హిజ్రీ శకం 261, రజబ్ నెల 24వ తేదీ ఆదివారం నాడు సాయంత్రం శాశ్వతంగా ఇహలోకం వీడిపోయారు. చనిపోయే నాటికి ఆయన వయస్సు 55 సంవత్సరాలు మాత్రమే. స్వగ్రామమైన నీషాపూర్లోనే ఆయన్ని ఖననం చేశారు.

అబూహాతిం (రహిమహుల్లాహ్) ఇలా తెలియజేస్తున్నారు: “ఇమామ్ ముస్లిం (రహిమహుల్లాహ్) చనిపోయిన తరువాత ఓ రాత్రి నేను ఆయన్ని కలలో చూశాను. ఆయన దగ్గరికెళ్ళి మీ పరిస్థితి ఎలా ఉందని అడిగాను. దానికి ఇమామ్ ముస్లిం (రహిమహుల్లాహ్) అల్లాహ్ తనకు మంచి స్థితి కల్పించాడని, స్వర్గంలో తాను కోరుకున్న ప్రదేశానికి వెళ్ళే, కోరుకున్న చోట ఉండే అనుమతినిచ్చాడ’ని అన్నారు.”

ఈ గ్రంథం కూడా హదీసుల ప్రామాణికత రీత్యా, వాటి ఆరోగ్యస్థితి రీత్యా సహీహ్ బుఖారీకిఏ మాత్రం తీసిపోదు. సహీహ్ ముస్లిం కూడా సహీహ్ బుఖారీతో సమానమైన విలువ గల గ్రంథమన్న విషయంతో ధర్మవేత్తలంతా ఏకీభవించారు.

ఇమామ్ ముస్లిం (రహిమహుల్లాహ్) ఈ గ్రంథాన్ని ఎంతో నేర్పుతో, వివేకంతో సంకలనం చేశారు.అందువల్ల దీన్ని చాలా సులభంగా అధ్యయనం చేయడానికి, అర్థం చేసుకోవడానికి అవకాశం కలిగింది. ఇమామ్ ముస్లిం (రహిమహుల్లాహ్) ఈ గ్రంథంలో ఇంచుమించు ఒకే భావం గల హదీసులన్నీ ఒకచోట చేర్చారు. దాంతో పాటు హదీసుల ప్రమాణ పద్ధతుల్ని, వాటి పదజాలాల్లోని వ్యత్యాసాలను కూడా సంక్షిప్త వాక్యాలలో కడు జాగ్రత్తగా తెలియజేశారు.

ఇమామ్ ముస్లిం (రహిమహుల్లాహ్) యావత్తు ముస్లిం జగత్తులో జరిపిన తన సుదీర్ఘ పర్యటన సందర్భంగా నాలుగు లక్షల హదీసుల్ని సేకరించారు. మొదట వాటిలో ఒక లక్ష పునరావృత హదీసుల్ని ఏరివేసి మూడు లక్షల హదీసుల్ని సంకలనం చేశారు. ఆ తరువాత ఓ సుదీర్ఘ కాలం పాటు వాటిని నిశితంగా పరిశీలించి చివరికి అన్ని విధాల నమ్మకమైనవని, ప్రామాణికమైనవని, భావించినహదీసుల్ని మాత్రమే ఆయన ఈ గ్రంథానికి ఎంచుకున్నారు. ఇలా మూడు లక్షల హదీసుల్లో 7,275హదీసులు మాత్రమే గ్రంథస్తం చేయబడ్డాయి. అయితే వాటిలోనూ పునరావృత హదీసుల్ని తొలగిస్తే నాలుగు వేల హదీసులు మాత్రమే మిగులుతాయి.

ఇమామ్ ముస్లిం (రహిమహుల్లాహ్) స్వయంగా తన గ్రంథం గురించి ఇలా అన్నారు: “నేనీ గ్రంథంలోఏ హదీసుని గ్రంథస్తం చేసినా క్షుణ్ణంగా ఆలోచించిన మీదట తగిన ఆధారాలతోనే దాన్ని గ్రంథస్థం చేశాను. అలాగే ఈ గ్రంథంలో నుంచి ఏ హదీసుని తొలగించినా క్షుణ్ణంగా ఆలోచించిన తరువాత తగిన ఆధారాలతోనే దాన్ని తొలగించాను. అందువల్ల ప్రపంచంలోని జనమంతా రెండొందల యేండ్లపాటు హదీసుల్ని పరిశీలించి రాసినా, చివరికి వారి నమ్మకం ఈ గ్రంథం మీదే ఉంటుంది.”

సహీహ్ ముస్లిం, సహీహ్ బుఖారీ గ్రంథాలలో ప్రామాణికత తదితర విషయాల రీత్యా ఏదిగొప్ప అనే విషయంలో ధర్మవేత్తల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. సహీహ్ బుఖారీ అన్నిటికంటేఉన్నతమైనదని కొందరు అభిప్రాయపడితే, సహీహ్ ముస్లిం అన్నటికంటే ఉన్నతమైన గ్రంథమని,మరి కొందరు అభిప్రాయపడ్డారు. ఈ రెండు అభిప్రాయాలకు భిన్నంగా ఇంకొందరు, కొన్ని విషయాలరీత్యా సహీహ్ బుఖారీ ఉన్నతమైనది, మరికొన్ని విషయాల రీత్యా సహీహ్ ముస్లిం ఉన్నతమైనదనిఅభిప్రాయపడ్డారు.

ఏమయినప్పటికీ ఈ గ్రంథకర్తలిద్దరూ గొప్ప ధర్మపరాయణులు, దైవభీతిపరులు, నిజాయితీపరులన్న విషయంలో మాత్రం ఎవరి మధ్యా ఎలాంటి భేదాభిప్రాయం లేదు. అలాంటి మహనీయులు సంకలనం చేసిన బుఖారీ, ముస్లిం గ్రంథాలలోని ఏకీభవిత (ముత్తఫఖుల్అలై) హదీసుల సంగతి ఇక చెప్పేదేముంది? పటిష్ఠమైన ప్రామాణిక గ్రంథాలలోని ఈ ‘ఏకీభవిత’ హదీసులు మరెంత ప్రామాణికమైనవో ప్రత్యేకంగా వివరించనవసరం లేదు.

సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లింలను రెండు సముద్రాలుగా, వాటిలో ఉన్న హదీసుల్నిముత్యాలు, పగడాలుగా ప్రస్తుత సంకలన కర్త ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ అభివర్ణించిన సంగతిప్రారంభంలో నేను ప్రస్తావించాను. అంటే ఒక సముద్రంలో ముత్యాలు ఉంటే, మరో సముద్రంలోపగడాలు ఉన్నాయన్నమాట. ఈ రెండు సముద్రాలలోని ముత్యాలు, పగడాలను ఏరి కూర్చిన హారం ఇంకెంత విలువైనదో ఊహించండి. ఆ అమూల్యమైన హారమే మీ ముందున్న ఈ గ్రంథం!

ఇందులో మొత్తం 1906 హదీసులున్నాయి. సహీహ్ బుఖారీలో పునరావృత హదీసులుతీసివేయగా 2602 హదీసులు ఉన్నాయి. అంటే ఈ గ్రంథంలో సహీహ్ బుఖారీలోని 696 హదీసులుతగ్గిపోయాయి. మరో మాటలో చెప్పాలంటే ఇమామ్ ముస్లిం (రహిమహుల్లాహ్) గారి గ్రంథంలో లేని 696 హదీసులు ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) గారి గ్రంథంలో చోటు చేసుకున్నాయన్నమాట. వేరొక రకంగాచెప్పాలంటే ఈ 696 హదీసుల విషయంలో ఇరువురు ఇమాముల మధ్య పూర్తిగా ఏకీభావం లేదన్నమాట.

దీన్ని బట్టి మన ముందున్న ఈ గ్రంథంలో ఆ ఇరువురు ఇమాములు పూర్తిగా ఏకీభవించినహదీసులే ఉన్నాయని అర్థమవుతుంది. ఇలాంటి హదీసులున్న గ్రంథం వెలకట్టలేని వినూత్న ఉద్గ్రంధం అనడంలో ఇక సందేహమేముంది? కనుక దీన్ని పాఠకులు ఆదరిస్తారని ఆశిస్తూ ఈ గ్రంథం అనువాదంలో నాకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

-సయ్యిద్ షబ్బీర్ అహ్మద్(ఉర్దూ అనువాదకుడు, లాహోర్)

రెండు ఉత్తమ వచనాలు (సుబహానల్లహి వబిహందిహీ, సుబహనల్లహిల్ అజీం)

subahanallahరెండు ఉత్తమ వచనాలు (సుబహానల్లహి వబిహందిహీ, సుబహనల్లహిల్ అజీం)
పుస్తకం నుండి:  కలామే హిక్మత్ – 1(వివేక వచనం)
రచన: సఫీ అహ్మద్ మదనీ
అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్
ప్రకాశకులు: జమీ అతే అహ్ లె హదీస్, ఆంధ్రప్రదేశ్

[ఇక్కడ చదవండి / డౌన్ లోడ్ చేసుకోండి]

ఫిక్రే ఆఖిరత్ (పరలోక చింత) మాసపత్రిక (Fikre-Akhirat Monthly Magazine)

fikhre_aakhira-imageఫిక్రే ఆఖిరత్ (పరలోక చింత) మాసపత్రిక  (Fikre-Akhirath Telugu Monthly )
సంకలనం : మౌలాన అబ్దుస్సలాం ఉమ్రీ
అనువాదం : మౌలానా ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ
ప్రకాశకులు :ఐదార ఫిక్రే ఆఖిరత్
చీఫ్ ఎడిటర్ : ముహమ్మద్ హారూన్ అన్సారీ గారు
Masjid-e-Farooqiyah, Hakeempet, Toli Chowki,Hyderabad

పరలోక చింత మాసపత్రిక – సంచిక 1 – [Download PDF]
క్లుప్త వివరణ: దేవుడు ఒక్కడే, ఇస్లాం, ఏకదైవారాధన గొప్పతనం, ఆరాధన, లాయిలాహ ఇల్లల్లాహ్, సజ్దా (సాష్టాంగం) కేవలం అల్లాహ్ కొరకే సమ్మతం, సహాయం కొరకు అల్లాహ్ నే అర్థించాలి, అగోచర జ్ఞానం, జిన్నాతులకు అగోచర జ్ఞానం లేదు, దైవదూతలకు అగోచర జ్ఞానం లేదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కు అగోచర జ్ఞానం ఉండేది కాదు, మరణం ప్రతి ఒక్కరికీ ఉంది, అల్లాహ్ ఒక్కడే సర్వశక్తిమంతుడు, అల్లాహ్ పై నమ్మకం, అల్లాహ్ యే సర్వాధికారి అనటానికి సాక్ష్యం, బహుదైవారాధన

పరలోక చింత మాసపత్రిక – జులై 2007 – [Download PDF]
క్లుప్త వివరణ: ఖుర్ఆన్ వెలుగులో సున్నత్, సున్నత్ విశిష్ఠత, ప్రవక్త సహచరుల దృష్టిలో సున్నత్, సున్నత్ ప్రాధాన్యత, ఇమాముల దృష్టిలో సున్నత్ ప్రాముఖ్యత, సున్నత్ పాటించటం తప్పనిసరి విధి, సున్నత్ ఉండగా సొంత అభిప్రాయం అనవసరం

పరలోక చింత మాసపత్రిక – సంచిక 3 ఆగష్టు 2007 – [Download PDF]
క్లుప్త వివరణ: ఖర్ఆన్ లోని మొట్ట మొదటి అధ్యాయమైన సూరతుల్ ఫాతిహా యొక్క శుభాలు, ప్రత్యేకతలు, మరియు షఅబాన్ నెలలోని కల్పితాచారాలు.

పరలోక చింత మాసపత్రిక – సంచిక 4 సెప్టెంబరు 2007 – [Download PDF]
క్లుప్త వివరణ: రోజా (విధి ఉపవాసాలు), ఉపవాసాల ప్రాముఖ్యత, ఉపవాసం ఖుర్ఆన్ వెలుగులో, రమజాన్ నెలవంక చూచే నియమాలు, సంకల్పము, సహ్ రీ మరియు ఇఫ్తారీ (ఉపవాస విరమణ) నియమాలు, తరావీహ్ నమాజు సిద్ధాంతాలు, ఉపవాసాలు వదిలే సందర్భాలు, తప్పిపోయిన రోజాలను పూర్తి చేసుకునే సిద్ధాంతాలు, ఉపవాస స్థితిలో చేయగల పనులు, లైలతుల్ ఖదర్ (మహా శుభరాత్రి) ప్రత్యేకతలు, సమస్యలు, ఫిత్రా దానధర్మాలు, ఈద్ పండుగ నమాజుల సిద్ధాంతాలు, పండుగల తక్బీర్లు, ఉపవాసకులు చేయకూడని పనులు, ఉపవాసాన్ని భంగం చేసే పనులు, ఉపవాసం పాటించకూడని దినములు, అదనపు ఉపవాసాలు.

పరలోక చింత మాసపత్రిక – అక్టోబర్ నవంబర్ 2007 – [Download PDF]
క్లుప్త వివరణ: హజ్ మరియు ఉమ్రా వివరాలు

పరలోక చింత మాసపత్రిక – డిసెంబరు 2007 – [Download PDF]
క్లుప్త వివరణ: జుల్ హిజ్జహ్ మాస శుభాలు ప్రత్యేకతలు, ఖుర్ బానీ వివరాలు, హదీసు వెలుగులో పండుగ నమాజు పద్ధతి

పరలోక చింత మాసపత్రిక – జనవరి 2008 – [Download PDF]
క్లుప్త వివరణ: ముహర్రం నెల మరియు దాని శుభాలు మరియు దాని గురించిన మూఢనమ్మకాలు

పరలోక చింత మాసపత్రిక – ఫిబ్రవరీ 2008[Download PDF]
క్లుప్త వివరణ: సఫర్ నెల మరియు దాని గురించిన మూఢనమ్మకాలు

పరలోక చింత మాసపత్రిక – మార్చి 2008 – [Download PDF]
క్లుప్త వివరణ: రబీఉల్ అవ్వల్ మాస ప్రత్యేకత, ఈదె మీలాద్ వాస్తవికత

పరలోక చింత మాసపత్రిక – ఏప్రిల్ 2008 – [Download PDF]
క్లుప్త వివరణ: షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ మరియు గ్యారవీ గురించిన వాస్తవాలు

రాజస రాబిన్స్ సత్యాన్వేషణ వృత్తాంతం (Rajasa Robbins Story of her reversion to Islam)

women-accepting-islamఅనువాదకులు : ముహమ్మద్ కరీముల్లాహ్
క్లుప్త వివరణ: ఒక నాస్తికురాలైన మహారాష్ట్ర మహిళ, అమెరికన్ క్రైస్తవుడిని పెళ్ళి చేసుకుని, అమెరికాలో స్థిరపడి, ఆ తర్వాత సత్యాన్వేషణలో ఇస్లాం ధర్మం గురించి పరిశోధించి, దానిలోని స్వచ్ఛతను గ్రహించారు. ఆ తర్వాత కుటుంబసమేతంగా ఇస్లాం ధర్మం స్వీకరించి, ఆనందంగా అమెరికాలో జీవితం గడపుతున్నారు. తన జీవిత ప్రయాణం గురించి ఆవిడ వివరంగా ఈ తన స్వీయకథలో తెలిపారు.

[ఇక్కడ చదవండి / డౌన్లోడ్ చేసుకోండి]

Rajasa Robbins Story of her reversion to Islam

దివ్యఖుర్ఆన్ పరిచయం – ముహమ్మద్ తఖీయుద్దీన్

దివ్యఖుర్ఆన్ పరిచయం - Introduction to the Noble Qur'anరచయిత : ముహమ్మద్ తఖీయుద్దీన్
అనువాదకులు : ముహమ్మద్ అజీజుర్రహ్మాన్

బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం
అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో

మానవాళికి విశ్వప్రభువు లెక్కించలేనన్నిశుభాలను ప్రసాదించాడు. ఆయన మనిషి జీవితానికి అవసరమయ్యే అన్న పానీయాలను ఇవ్వటమే గాక, మనోభావాల్ని ప్రకటించే శక్తియుక్తులను కూడా ప్రసాదించాడు. జీవించే ఉపాయాలను ప్రసాదించాడు. ఇంకా మనిషి సంస్కృతీ నాగరికతలకు దోహదపడే సామగ్రిని భూమండలంలో పుష్కలంగా పొందుపరచాడు.

సృష్టికర్త ఇచ్చిన ఈ భౌతికానుగ్రహాలన్నీ ఒక ఎత్తయితే, అధ్యాత్మికంగా మానవాళికి మార్గదర్శకత్వం వహించటం ఇంకో ఎత్తు. సర్వవిధాల మానవత్వం పై దయదలచిన సృష్టికర్త, మానవులకు సన్మార్గం చూపే ఏర్పాటు కూడా చేశాడు. దాని ద్వారా ప్రపంచంలో శాంతి స్థాపన, అల్లకల్లోల నిర్మాలన, మంచి, మానవత్వం, నీతి నియమాలతో కూడిన సమాజ నిర్మాణ ప్రయత్నాలు యుగయుగాలుగా జరుగుతున్నవి.  మానవ సమాజాల్లో అశాంతి, అరాచకం ప్రబలిపోవడాన్ని సృష్టికర్త ఎంతమాత్రం ఇష్టపడడు. వాస్తవమేమిటంటే తన దాసులయిన మానవులంటే ఆయనకు అమితమైన  ప్రేమ. అందుకే అసంఖ్యాకమైన తన వరాలను వారిపై కురిపించడంతో పాటు వారి ఇహపర సాఫల్యాల కోసం మార్గదర్శక ఏర్పాటు కూడా చేశాడు. తన ప్రవక్తల ద్వారా సమస్త మానవజాతికి మార్గ దర్శక నియమావళిని ప్రసాదించాడు. దైవ ప్రవక్తలందరికీ ఆయా కాలాలను, అవసరాలను బట్టి దివ్యగ్రంథాలను, ప్రవర్తనా నియమావళుల (సహీఫాల) ను ఇచ్చాడు. వాటి ఆధారంగా ప్రవక్తలు మానవ సంస్కరణా కార్యానికి పూనుకునేవారు. ప్రజల జీవితాలను తీర్చిదిద్దేవారు. దైవభీతి, పరలోక చింతన ప్రాతిపదికగా మానవసమాజాల్లో నైతిక విప్లవం తెచ్చేవారు.

ఈ మార్గదర్శక గ్రంథాలలో చిట్టచివరిదే దివ్యఖుర్ఆన్. దీనికి పూర్వం దివ్యగ్రంథాలెన్నో అవతరించాయి. ఉదాహరణకు తౌరాత్, జబూర్, ఇంజీల్ కూడా మానవాళి మార్గదర్శకత్వం కోసం సృష్టికర్త పంపిన దివ్యగ్రంథాలే. కాని ఆ పవిత్ర గ్రంథాల పట్ల ప్రదర్శించిన నిర్లక్ష్యం, ఆయా మతాధిపతులు, స్వప్రయోజనాల కోసం చేసిన మార్పుల వల్ల, అవి తమ స్వచ్ఛతను, ప్రామీణికతను, అసలు స్థితిని కోల్పోయి కలుషితమైపోయాయి. క్రమంగా దివ్యసందేశంలో మానవ కల్పితాలు చోటు చేసుకున్నాయి. సత్యమార్గాన్ని పెడత్రోవ పట్టించారు. మానవజాతి ఇలా అపమార్గానికి లోనైనప్పుడల్లా సృష్టికర్త మరో ప్రవక్తను, మరో జీవన విధానాన్ని పంపి, మరచిపోయిన దైవాజ్ఞలను తిరిగి జ్ఞాపకం చేసుకునేటట్లు ఏర్పాటు చేశాడు. ఆటువంటి దివ్యమైన మార్గదర్శక పరంపరలో చిట్టచివరి దైవగ్రంథమే, ఈ దివ్యఖుర్ఆన్.

దివ్యఖుర్ఆన్ మానవజాతి పట్ల ఓ గొప్ప అనుగ్రహం. ప్రపంచంలోని మరే అనుగ్రహమూ దీనితో సరితూగలేదు. మనిషి ఇహపర సాఫల్యాలు, సభ్యతా సంస్కారాలు, గౌరవోన్నతులు, నీతి నడవడికలు – అన్నీ ఈ దివ్యగ్రంథంలో ఇమిడి ఉన్నాయి. ఇది ఒక మహా సాగరం. దీనిని ఎంత శోధించినా తనివి తీరదు.  దీని లోతుల్లోకి పోయిన కొద్దీ విలువైన ముత్యాలు దొరుకుతూనే ఉంటాయి. క్రొత్త క్రొత్త విషయాలు ముందుకు వస్తూనే ఉంటాయి. దీని అధ్యయనం వలన హృదయం జ్యోతిర్మయమవుతుంది అంటే జ్ఞానకాంతితో నిండిపోతుంది.

విజ్ఞానం పేరుతో నేడు ఆకాశాలలో స్వైరవిహారం చేస్తున్న మనిషికి నేలపై నిలిచి సాటి మనిషులతో సహజీవనం చేయడం చేతకావడం లేదు. కమ్యూనికేషన్ల ప్రగతి వలన వివిధ దేశాల మధ్య దూరం తరిగిపోయి ప్రపంచం కుంచించుకు పోతున్నా, మనుషుల మనసులు మాత్రం ఒక్కటి కావటం లేదు. జాతి, రంగు పేరిట నేటికీ ప్రపంచంలో విద్వేషం పెరిగి రక్తం చిందుతూనే ఉన్నది. ఒక్కమాటలో చెప్పాలంటే నేడు ప్రపంచమంతా రోగగ్రస్తమై ఉన్నది. దానికి చికిత్స చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖుర్ఆన్ ఒక దివ్య ఔషధం! అది సర్వరోగ నివారిణి! అది మానవులందరికీ మార్గదర్శిని! హృదయానికి హత్తుకుని, దానిని అనుసరించేవారికి అది మోక్షం పొందే మార్గాన్ని సూచిస్తుంది. మొత్తం మానవజాతి కోసం పంపబడిన అటువంటి దివ్యఔషధాన్ని మనం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాం?  మనకు తెలిసిన భాషలో అందుబాటులో ఉన్న దాని భావాన్ని కనీసం ఒక్కసారైనా చదవటానికి, అర్థం చేసుకోవటానికి ఎందుకు ప్రయత్నించటం లేదు? దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దు కోవాలనే సామెతను మరచిపోయారా? ఈ జీవితకాలంలో దానిని చదవక, మరణించగానే ఎదురయ్యే కఠినాతి కఠినమైన నరకశిక్ష అనుభవిస్తూ, పశ్చాత్తాపం పడటంలో ఏమైనా వివకమున్నదా? సృష్టికర్త ప్రసాదించిన అద్భుతమైన, అపూర్వమైన మన తెలివితేటలను ప్రపంచ మాయాజాలం నుండి కనీసం ఒక్కసారైనా తప్పించి, ఇహపరలోకాల సాఫల్యానికి దారి చూపించగలిగే ఏకైక, స్వచ్ఛమైన, సత్యమైన అంతిమ దివ్యగ్రంథాన్ని నేటి నుండే చదవటానికి దయచేసి ప్రయత్నించండి. మరణం ఏ క్షణంలోనైనా సంభవించవచ్చు. లేదా హఠాత్తుగా మన పంచేంద్రియాలు పనిచేయటం మానివేయవచ్చు. లేదా కోలుకోలేని దీర్ఘకాల అనారోగ్యానికి గురికావచ్చు. ‘ఇన్నేళ్ళపాటు మనం సురక్షితంగా, క్షేమంగా జీవిస్తామని’ చెప్పగలిగే స్థితికి సైన్సు పరిజ్ఞానం ఏనాడూ చేరలేదు. ఆ జ్ఞానం కేవలం సర్వలోక సృష్టికర్త వద్దనే ఉన్నది. కాబట్టి మన తెలివితేటలు సరిగ్గా పనిచేస్తున్నప్పుడే, మన పంచేంద్రియాలు సరైన స్థితిలో ఉన్నప్పుడే అంటే సరిగ్గా గ్రహిస్తున్నప్పుడే మరియు ఆరోగ్యంగా ఉన్న ఈ వయస్సులోనే ప్రతిరోజు దివ్యఖుర్ఆన్ లోని కొంతభాగాన్నైనా చదివి, అర్థం చేసుకోవటానకి ప్రయత్నించవలెను. ఈ ప్రయత్నంలోని నిజాయితీ పైనే సృష్టికర్త తోడ్పాడు ఆధారపడి ఉంటుందనేది మరచిపోవవద్దు. ఖుర్ఆన్ ద్వారా సరైన మార్గదర్శకత్వం పొందగలిగితే లాభపడేది మీరే. అలాగే ఖుర్ఆన్ ను నిర్లక్ష్యం చేసి, ఇహపరలోకాల సాఫల్యపు స్వచ్ఛమైన, సత్యమైన మార్గాన్ని తెలుసుకోలేకపోతే నష్టపోయేది కూడా మీరే. ఇది మరణించగానే ప్రతి ఒక్కరి ముందుకు రాబోయే ఒక నగ్నసత్యం. అన్ని మతాలు, ధర్మాలు మంచివైపుకే పిలుస్తున్నాయని, దైవాన్ని ఏ రూపంలోనైనా ఆరాధించవచ్చని, తాము అనుసరిస్తున్న అంధవిశ్వాసాల, ప్రాచీన గ్రంథాల ద్వారా కూడా ముక్తి పొందవచ్చని చాలా మంది అపోహలు పడుతున్నారు. కొంతకాలం ఆ భ్రమలను ప్రక్కన పెట్టి, అంతిమ దైవసందేశమైన దివ్య ఖుర్ఆన్ చదివితే కలిగే నష్టమేమిటి? వారు భ్రష్టపడిపోతారా? తమ మతం, ధర్మం నుండి వెలివేయబడతారా? ప్రతి ధర్మం సత్యాన్వేషణను ప్రోత్సహిస్తుందే తప్ప నిరుత్సాహపరచదు. కాబట్టి నిజాయితీగా చూసినట్లయితే, కేవలం మనలోని అహంభావం, నిర్లక్ష్యం, ప్రస్తుత జీవన విధానం పై హద్దుమీరిన విశ్వాసం, ఇతర ధర్మాలపై ముఖ్యంగా ఇస్లాం ధర్మం పై అపనమ్మకం మొదలైన కారణాల వలన మాత్రమే మన ముందున్న అత్యున్నతమైన అంతిమ దివ్యగ్రంథం పట్ల మనకు ఆసక్తి, కుతూహలం కలగటం లేదు.

“ఓ మనిషీ! ప్రతి వైద్యుడూ నీ రోగాన్ని మరింత తీవ్రతరమే చేశాడు. నువ్వు నా వైపుకు రా!  నీ రోగాన్ని నేను నయం చేస్తాను” అని పిలుస్తోంది ఖుర్ఆన్. కనుక మనం ఖుర్ఆన్ వైపుకు మరలాలి. దాన్ని లోతుగా అధ్యయనం చేయాలి. మనకు అత్యవసరమైన మోక్షానికి, ఇహపర సాఫల్యాలకు ఈ గ్రంథమార్గదర్శకత్వం తప్పని సరి.

జమ్ జమ్ నీటి పవిత్రత మరియు ప్రాముఖ్యత (Zamzam Water)

well-of-zam-zam

[ఇక్కడ చదవండి / డౌన్లోడ్ చేసుకోండి]

చరిత్ర

హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం తన జేష్ఠ పుత్రుడైన ఇస్మాయీల్ ను, సతీమణి అయిన హజ్రత్ హాజిరా అలైహస్సలాం ను కాబా ఎగువ భాగాన వదలివెళ్లిన తర్వాత ఉన్న ఆ కాసిన్ని ఖర్జూరాలు, నీళ్ళూ అయిపోయాయి. ఏ ప్రాణి నివసించని ఆ రాతి నేలలో తీవ్రమయిన దాహంతో నాలుక పీక్కుపోయింది. చివరికి పసికందుని తాపించేందుకు పాలు కూడా లేకుండా ఇంకిపోయాయి. ఏం చేయాలో, ఎలా దాహం తీర్చుకోవాలో, ఏ విధంగా బాలుడ్ని రక్షించుకోవాలో తోచని అయోమయ స్థితిలో పడిఉన్నారు హజ్రత్ హాజిరా అలైహస్సలాం.

అయినా తాను నిరాశ చెందలేదు. నిస్పృహకు లోనవ్వలేదు. తమ వంతు కృషి ప్రారంభించారు. ఒకసారి సఫా కొండపైకి ఎక్కి చూస్తే, మరోసారి మర్వా కొండపైకెక్కి ‘నీళ్ళు లభించే మార్గం దొరక్కపోతుందా!’ అని ఎదురు చూపులు చూస్తున్నారు. ఇలా సఫా నుండి మర్వా వరకు, మర్వా నుండి సఫా వరకు ఏడు సార్లు దౌడు తీశారు హజ్రత్ హాజిరా అలైహస్సలాం చివరికి మర్వా కొండపై ఉండగా ఏదో అలికిడి …! ఏమై ఉంటుందా…!! అని బాల ఇస్మాయీల్ వద్దకు చేరుకున్నారు. పసికందు మండుటెండల్లో భరించలేని ఆకలితో అల్లాడిపోతున్నాడు పాపం! అప్పుడే దైవదూత ప్రత్యక్షమై తన రెక్కలతో నేలలో రాజేయంగా చుక్క నీరు కూడా లభ్యం కాని ఆ నల్లరాతి నేల నుండి జలనిధి పెల్లుబికింది. హజ్రత్ హాజిరా అలైహస్సలాం గారు ముందు బాల ఇస్మాయీల్ దాహాన్ని తీర్చి తర్వాత తానూ దాహం తీర్చుకున్నారు. తన అన్వేషణ ఫలించినందుకు, తన శ్రమకు మించిన వరాన్ని అల్లాహ్ అనుగ్రహించినందుకు దైవానికి మనసారా కృతజ్ఞతాభివందనలు తెలుపుకున్నారు.

జమ్ జమ్ పేరు ఎలా పడింది?

ఆ పిదప పారే ఆ జలనిధిని చూసి “ఇది ఇలానే పారుతూ ఉంటే అతి తొందరగా అంతమైపోతుంద”ని భావించి, దాని చుట్టూ మట్టితో గట్టు వేస్తూ ఈ జలనిధిని ఎలాగైనా కాపాడుకోవాలన్న తీవ్ర తపనతో ఆమె నోట అప్రయత్నంగా వెలువడిన అమృత వాక్కు ‘జమ్ జమ్’ (అంటే అప్పటి భాషలో ఆగిపో, ఆగిపో అని అర్ధం). ఆ చిన్నపాటి గట్టులో ఆ మహత్తర జలనిధిని ఆపే శక్తి లేకపోయినా ఆమె నోట అపూర్వ విశ్వాసంతో వెలువడిన పలుకు మహిమతో ఆ జలం జలనిధిగా ఓ చోట నిలిచిపోయింది. అదే జమ్ జమ్ బావిగా ప్రసిద్ధి చెందింది.

ఓ సందర్భాన దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “అల్లాహ్ ఇస్మాయీల్ తల్లిని కరుణించుగాక! ఆమె గనక ఈ జలనిధికి గట్టు వేసి ఆపి ఉండకపోతే ప్రళయం వరకూ జమ్ జమ్ జలం పారే సెలయేరయ్యేది.”

జమ్ జమ్ జల నిధి

జమ్ జమ్ బావి స్వర్గపు సెలయేర్లలోని ఓ సెలయేరు. ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం మక్కా కోసం చేసిన దుఆ తర్వాత అల్లాహ్ అనుగ్రహించి ప్రసాదించిన తొలి బహుమతి ఈ జలం. మక్కా అంతటి పవిత్ర నగరం ఉనికిలోకి రావడానికి, జనవాహినితో, దైవదాసుల రాకపోకలతో అలరారడానికి కారణమయ్యింది ఈ మహత్తర జలం. కొన్ని వేల సంవత్సరాలుగా లభ్యమవుతున్న అల్లాహ్ మహిమ ఈ జలం. ఇహలోకంలో దైవ సూచనల్లోని ఓ సూచన ఈ జలం. ఇక్కడికి వచ్చే ప్రతీ యాచకుడు, ప్రతీ బాటసారి తనివితీరా సేవించే అద్భుత ద్రవం ఈ జలం. ఇంతటి మధురమైన నీరు లోకంలో మరో చోట లేదు. ఈ నీటిలో గొప్ప శుభం ఉంది. అది త్రాగే ప్రతీ వారికి ప్రాప్తమవుతుంది. పరిశుద్ధాత్మ అయిన దైవదూత జిబ్రయీల్ అలైహిస్సలాం ద్వారా ఉనికిలోకి వచ్చిన అనంత జల సంపద ఈ జమ్ జమ్. ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హృదయం పలుమార్లు ఈ పవిత్ర జలంతో కడగబడింది. ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం కాలం నుండి అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం వరకు వచ్చిన ప్రవక్తలందరూ త్రాగాలని తహతహలాడిన జలం జమ్ జమ్. ఏ జలానికీ లేని ప్రత్యేకత ఈ జలానికి ఏమిటంటే – ఇది ఆకలి గొన్న వ్యక్తి ఆకలిని తీరుస్తుంది, రోగాన్ని నయం చేస్తుంది, తలనొప్పి, కడుపునొప్పికి ఇది దివ్య ఔషధం. ఈ జలం వల్ల కoటి చూపు మెరుగవుతుంది. అందుకే దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా ప్రవచించారు: “మావు జమ్ జమ్ లిమా షరిబ లహూ” (ఏ సదుద్దేశంతో జమ్ జమ్ త్రాగుతారో వారి ఆ ఉద్దేశం సిద్ధిస్తుంది).

జమ్ జమ్ విశేషాలు

ఈ జలాన్ని కడుపు నిండా త్రాగటం విశ్వాసానికి చిహ్నం. కాపట్యానికి విరుగుడు. ఇది పుణ్యాత్ముల కోసం మహోన్నత పానీయం. బంధు మిత్రుల కోసం గొప్ప బహుమానం. అతిథుల అతిథ్యం కోసం అద్వితీయ ద్రవ పదార్థం. శరీరానికి శక్తినీ, హాయినీ ఇచ్చే అద్భుత వరప్రసాదం. ఎంత వాడినా అది తరగదు. దాదాపు నాలుగు వేల సంవత్సరాల నుండి ఈ జలం ఇలానే నిర్విరామంగా పెల్లుబుకుతూనే ఉంది. ప్రస్తుతం యావత్ ప్రపంచంలో అతి ప్రాచీనమైన బావి ఇదేనన్న నానుడీ ఉంది.

జమ్ జమ్ సేవించే సున్నత్ విధానం

జమ్ జమ్ జలాన్ని సేవించే సున్నత్ విధానం; ఈ జలాన్ని కుడి చేత్తో బిస్మిల్లాహ్ అని త్రాగాలి. ఈ శుభప్రదమైన జలాన్ని నిలబడి త్రాగటం ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం వారి సంప్రదాయం. తనివితీరా ఈ జలాన్ని త్రాగాలి. త్రాగే ముందు మంచి సంకల్పం చేసుకొని మరీ త్రాగాలి. త్రాగిన తరువాత కృతజ్ఞతగా ‘అల్ హందులిల్లాహ్’ అనాలి. ఈ జలాన్ని కనీసం మూడు శ్వాసల్లో త్రాగాలి. ఈ జలాన్ని సేవించిన పిదప ఇహపరాల సాఫల్యం, సౌభాగ్యం, శుభం కోసం దుఆ చేయాలి. ఆ సమయంలో చేసే ఏ మంచి దుఆ అయినా స్వికరించబడుతుంది.

జమ్ జమ్ జలం త్రాగే ఓ సౌభాగ్యవంతుడా!

శుభాకాంక్షలు!!

అల్లాహ్ అర్ష్ నీడలో.. (In the Shade of Allah’s Throne)

shade-of-allah

దైవ సింహాసనపు నీడలో..
పుస్తకం నుండి:  కలామే హిక్మత్ – 1(వివేక వచనం)
రచన: సఫీ అహ్మద్ మదనీ,
అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్
ప్రకాశకులు: జమీ అతే అహ్ లె హదీస్, ఆంధ్రప్రదేశ్

[ఇక్కడ చదవండి / డౌన్ లోడ్ చేసుకోండి]

English version of this hadeeth:

The Prophet said: “There are seven whom Allah will shade in His Shade on the Day when there is no shade except His Shade: a just ruler; a youth who grew up in the worship of Allah, the Mighty and Majestic; a man whose heart is attached to the mosques; two men who love each other for Allah’s sake, meeting for that and parting upon that; a man who is called by a woman of beauty and position [for illegal intercourse], but be says: ‘I fear Allah’, a man who gives in charity and hides it, such that his left hand does not know what his right hand gives in charity; and a man who remembered Allah in private and so his eyes shed tears.”

Narrated by Abu Hurairah & collected in Saheeh al-Bukhari (english trans.) vol.1, p.356, no.629 & Saheeh Muslim (english trans.) vol.2, p.493, no.2248