ఇస్లాంలో మొదటి జుమా ఖుత్బా | ప్రవక్త ﷺ ఇచ్చిన చారిత్రాత్మక ప్రఖ్యాత ప్రసంగం

చివరకు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు హిజ్రత్ అనుమతి లభించింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నబవీ శకం 13వ యేట (27 సఫర్), క్రీ.శ 621 సెప్టంబర్ 12వ తేదీన మక్కా వదిలి మదీనాకు పయనమయ్యారు. మూడు పగళ్లు రాత్రుళ్ళు మక్కాకు సమీపంలోని సౌర్ గుహలో గడిపారు. ఆ తరువాత సుదీర్ఘ ప్రయాణం చేస్తూ చివరకు నబవీ శకం 13వ యేట రబీవుల్ అవ్వల్ 8వ తేదీ సోమవారం (అంటే క్రీ.శ 622 సెప్టెంబర్ 23వ తేదీ) మదీనా సమీపంలో గల కుబా ప్రాంతానికి చేరారు. అక్కడే బస చేసి తిరిగి 12 రబీవుల్ అవ్వల్ ఒకటవ హిజ్ర శకం శుక్రవారం అక్కడ నుంచి పయనమయ్యారు. బనీసాలిమ్ వాడకు చేరేవరకు జుమా సమయం అయ్యింది. అక్కడే దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వంద మంది అనుచరులతో జుమా ప్రార్థన చేశారు. అదే ఇస్లాంలో మొదటి జుమా. 

ప్రియ సోదరులారా..! 

జుమా సుభదినాన దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇచ్చిన ఆ ప్రసంగం చారిత్రాత్మకంగా చాలా గొప్పస్థానాన్ని కలిగి ఉంది. ఆనాటి ఆ ఖుత్బాను ఈనాటి జుమా ప్రసంగంలో వినిపించాలనుకుంటున్నాను. ఈ చారిత్రక ప్రఖ్యాత ప్రసంగాన్ని చాలా శ్రద్ధగా వినండి అల్లాహ్ ఈ ఖుత్బాను శుభకరంగా చేయుగాక… ఆమీన్. 

(రహ్మతుల్లిల్ ఆలమీన్ 1:92-93) 

ఇస్లామీయ సోదరులారా..! 

ఎంతటి మహత్తర ప్రసంగం! ఎంతటి మహాభాగ్యం!! ఆనాడు ఆరంభమైన ఈ వారంవారం పండుగ ప్రళయం వరకు జారి చేయబడింది. ఇస్లామీయ చరిత్రలోని తొలి ఖుత్బాలో పాల్గొన్న ఆ సహాబాలు ఎంతటి ధన్యజీవులో ఇప్పటికి కూడా బనూ సాలీం వీధి ఖుబాలో ఉంది. అక్కడే ఒక మహాన్నతమైన మస్జిద్ నిర్మించడం జరిగింది గత చరిత్ర వైభవానికి నిదర్శనంగా. 

అల్లాహ్ మనందరికి పవిత్ర మక్కా యాత్ర చేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక. 

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి ప్రసంగాన్ని కంఠస్తంచేసి, వాటిపై ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించు గాక!. ఆమీన్. 

ఈ పోస్ట్ హిజ్రత్ తరువాత తొలి చారిత్రక ప్రసంగం [PDF] [6p] అనే ఖుత్బా నుండి తీసుకోబడినది.
పుస్తకం: ఖుత్ బాతే నబవీ ﷺ (పార్ట్ 1) – మర్కజ్ దారుల్ బిర్ర్ పబ్లికేషన్స్