‘హదీసు’వేత్తల జీవిత విశేషాలు – మిష్కాతుల్ మసాబీహ్

‘హదీసు’వేత్తల సంక్షిప్త జీవిత గాథలను బస్తవీ గారు ”రియాదుల్ముహద్దిసీన్”లో పేర్కొన్నారు. ఇక్కడ కేవలం రచయిత తన ముందుమాటలో పేర్కొన్న ‘హదీసు’వేత్తలను గురించి పేర్కొనబడింది.

మిష్కాతుల్ మసాబీహ్ [హదీసులు] – టెక్స్ట్ రూపంలో [Text]

బు’ఖారీ పేరు, ముహమ్మద్‌ – అబూ అబ్దుల్లాహ్. బిరుదు ఇమాముల్‌ ము’హద్దిసీ’న్‌, అమీరుల్‌ ము’హద్దిసీ’న్‌. ఇతని వంశ పరంపర ముహమ్మద్బిన్ఇస్మాయీల్బిన్ఇబ్రాహీమ్బిన్అల్ముగీరహ్.

జన్మం, ఖరసాన్ సమర్ఖంద్, ఇప్పటి ఉజ్బెకిస్తాన్, 13-10-194 హిజ్రీ (19-7-810 క్రీ.శ.). మరణం, 1-10-256 హి (1-9-870 క్రీ.శ.), 60 సం. వయస్సులో సమర్ఖందులో. ఇతను అబ్బాసీయ పరిపాలనా కాలంలో ఉన్నారు. ఇతని శిక్షకులు, అహ్మద్ బిన్ హంబల్, అలీ బిన్ మదీనీ, ఇస్హాఖ్ బిన్ రహ్వే. ఇతని శిశ్యులు ముస్లిం బిన్ హజ్జాజ్, ఇబ్నె అబీ ఆసిం. సహీహ్ బుఖారీ ఇతని ముఖ్య పుస్తకం.

బు’ఖారీ తండ్రి పేరు ఇస్మా’యీల్‌, బిరుదు అబుల్‌ ‘హసన్‌. ఇతను మలిక్ బిన్ అనస్ శిశ్యులు. ఇతను చాలా పెద్ద ‘హదీసు’వేత్త. ఇస్మా’యీల్‌ చాలా పరిశుద్ధులు మరియు ధర్మ సంపాదకులు. ఒకసారి మాట్లాడుతూ ‘నా సంపాదనలో ఒక్క దిర్‌హమ్‌ అయినా అధర్మ సంపాదన లేదు,’ అని అన్నారు. (అస్‌’ఖలానీ)

బు’ఖారీలో ఎన్నో గొప్ప గుణాలు ఉండేవి. ఇవే కాక మరో గొప్పతనం ఏమిటంటే, తండ్రి కొడుకులు ఇద్దరూ ‘హదీసు’వేత్తలే. బు’ఖారీ తల్లి చాలా భక్తురాలు, మహత్మ్యాలు కలిగి ఉండేది. ఎల్లప్పుడూ దైవాన్ని ప్రార్థించడం, దైవ భీతితో కన్నీళ్ళు కార్చటం, దీనంగా మొర పెట్టుకోవటం చేసేది. బు’ఖారీ కళ్ళు చిన్నతనంలోనే అస్వస్థతకు గురయ్యాయి. దృష్టి క్రమంగా పోసాగింది. వైద్యులు ఇక నయం కాదని చేతులెత్తేశారు. బు’ఖారీ తల్లి ఇబ్రాహీమ్‌ (అ)ను కలలో చూశారు. ‘నీ ప్రార్థన మరియు ఏడ్వటం వల్ల అల్లాహ్‌ నీ కొడుకు కళ్ళకు స్వస్థత ప్రసాదించాడు,’ అని అతను అంటున్నారు. ఉదయం లేచి చూసే సరికి బు’ఖారీ కళ్ళు నయం అయి ఉన్నాయి. కంటి చూపు తిరిగి వచ్చి ఉంది. అయితే అంతకు ముందు కంటి చూపు ఎందుకు పోయిందో కారణం తెలియలేదు. కంటి చూపు తిరిగి వచ్చిన తర్వాత వెన్నెల రాత్రుల్లో కూర్చొని ”తారీఖ్కబీర్” అనే పుస్తకం వ్రాశారు.