దివ్యఖుర్ఆన్ – అల్లాహ్ నుండి ఒక మహాద్భుత మహిమ

The Noble Quran – a Miracle from Allah (Subhanahu wa Ta’ala)
రచయిత : ముహమ్మద్ ముహ్సిన్ ఖాన్ – తఖీయుద్దీన్ అల్ హిలాలీ
అంశాల నుండి : కింగ్ ఫహద్ దివ్యఖుర్ఆన్ ప్రింటింగ్ ప్రెస్ (ముద్రణాలయం) సంస్థ
అనువాదకులు : ముహమ్మద్ కరీముల్లాహ్ ,పునర్విచారకులు : షేఖ్ నజీర్ అహ్మద్

క్లుప్త వివరణ: దివ్యఖుర్ఆన్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం పై అల్లాహ్ అవతరింపజేసిన ఒక మహాద్భుత మహిమ. ఇదే విషయాన్ని ఖుర్ఆన్ ఆయత్ లు మరియు హదీథ్ బోధనల నుండి ఈ వ్యాసంలో వివరించబడెను

(సర్వలోక సృష్టికర్తైన అల్లాహ్ , తన చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరింపజేసిన అంతిమ సందేశం) – ఖుర్ఆన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం బోధనల వెలుగులో………

[وَمَـا  كَانَ  هـٰــذَا  الْــقُــرْآَنُ   أَنْ  يُــفْــتَــرَى  مِـنْ دُوْنِ  اللهِ  وَلـٰـكِــنْ  تَــصْـدِيْـقَ  الَّذِي   بَــيْـنَ  يَــدَيْــهِ  وَتَــفْـصِـيْـلَ الْـكِـتـٰـبِ  لَا  رَيْــبَ فِــيْــهِ  مِـنْ  رَّبِّ  الْعـٰـلَـمِـيْـنَ] (3710:)

“మరియు అల్లాహ్ తప్ప మరొకరి ద్వారా ఈ ఖుర్ఆన్ అవతరణ సంభవం కాదు: వాస్తవానికిది పూర్వగ్రంథాలలో మిగిలి ఉన్న దానిని సత్యాన్ని ధృవపరుస్తోంది: మరియు ఇది ముఖ్య సూచనలను వివరించే గ్రంథం: ఇది సమస్త లోకాల పోషకుడైన అల్లాహ్ తరుపు నుండి వచ్చింది అనటంలో ఎలాంటి సందేహం లేదు!”

{ఖుర్ఆన్ 10వ అధ్యాయం ‘యూనుస్’ లోని 37వ ఆయత్ యొక్క భావపు అనువాదం}

[وَ مَـنْ  يَـبْـتَـغِ  غَـيْـرَ الْإِسْـلَامِ  دِيْـنًا  فَـلَـنْ  يُـقْـبَـلَ  مِـنْـهُ  وَهُـوَ  فِــيْ  الْأَخِـرَ ةِ   مِـنَ  الْـخَـٰـسِـرِيْـنَ ]  (853:)

“మరియు ఎవరైనా అల్లాహ్ కు విధేయత (ఇస్లాం) తప్ప ఇతర ధర్మాన్ని అవలంబించగోరితే అది ఏ మాత్రమూ స్వీకరించ బడదు మరియు అతను పరలోకంలో నష్టపోయే వారిలో చేరుతాడు”

{ఖుర్ఆన్ 3వ అధ్యాయం ‘ఆలె ఇమ్రాన్’ (మర్యం తండ్రి అయిన ఇమ్రాన్ కుటుంబం) లోని 85వ ఆయత్ యొక్క భావపు అనువాదం}

حدثنا عبدُ الله بنُ يُوسفَ : حدثنا الليث :حدثنا سعيد الـمقبري، عن أبيه، عن أبي هريرة قال:قال النبي ^ :(( ما مِنَ الأنبياءِ نَبيٌّ إلا أعطي من الآيات ما مِثله آمن عليهِ البَشرُ، وَإنَّمـا كان الَّذي أوتيتُـه وحيا أوحاهُ الله إليَّ،  فأرجُو أن أكُونَ أكثرَهُم تَابعاً يوم القِيامَـةِ)).

సహీహ్ బుఖారీ హదీథ్ సంకలనంలోని 9వ గ్రంథపు 379వ హదీథ్ లో నమోదు చేయబడిన అబుహురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖన ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఇలా తెలిపారు:

“ప్రవక్తలలో అద్భుతాలు ఇవ్వబడని ప్రవక్తలు లేరు, వేటి వలనైతే ప్రజలు విశ్వసించేవారో. అలాగే నాకు ఈ దివ్యవాణి (ఒక మహిమగా) ఇవ్వబడినది దేనినైతే అల్లాహ్ నా పై అవతరింపజేసాడో. కాబట్టి, పునరుత్థాన దినమున వేరే ఇతర ప్రవక్తల అనుచరుల సంఖ్య కంటే నా అనుచరుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని ఆశిస్తున్నాను”

حدثنا محمد بن عبادة : أخبرنا يزيد : حدثنا سليم بن حيان، وأثنى عليه : حدثنا سعيد بن ميناء: حدثنا أو سمعت جابر بن عبدالله يقول: جاءت ملا ئكة إلى النبي ^  و هو نائم، فقال بعضُهم : إنه نائم ، وقال بعضهم :إن العين نائمة والقلب يقظان، فقالوا : إنَّ لصا حبكم هذا مثلاً، فاضربوا له مثلاً، فقال بعضهم : إنه نائم، و قال بعضهم : إنَّ العين نائمةٌ، والقلب يقظان، فقالوا: مثله كمثل رجل بنى داراً، وجعل فيها مأدبة وبعث داعياً، فمن أجاب الداعي دخل الدار وأكل من المأدبة، ومن لم يجب الداعي لم يدخل الدار و لم يأكل من المأدبة. فقالوا : أوَّلوها  له يفقهها، فقال بعضهم : إنه نائم، وقال بعضهم إن العين نائمة والقلب يقظان، فقالوا : فالدار، الجنة، والداعي محمد ^ ،  فمن أطاع محمداً  ^ فقد أطاع الله، ومن عصى محمداً   ^    فقد عصى الله،  و محمد ^  فرق بين الناس.  تابعه قتيبة، عن ليثٍ، عن خالدٍ، عن سعيد بن أبي هلالٍ، عن جابرٍ: حرج علينا النبي ^.

సహీహ్ బుఖారీ హదీథ్ సంకలనంలోని 9వ గ్రంథపు 385వ హదీథ్ లో నమోదు చేయబడిన జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఇలా తెలిపారు-

ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పండుకుని ఉన్నప్పుడు కొందరు దైవదూతలు ఆయన వద్దకు వచ్చారు. వారిలో కొందరు ఇలా పలికారు “ఆయన నిద్ర పోతున్నారు”. అప్పుడు మిగిలిన వారు ఇలా వ్యాఖ్యానించారు “ఆయన కళ్ళు నిద్ర పోతున్నాయి, కాని ఆయన హృదయం మేలుకునే ఉన్నది”. అప్పుడు వారిలా పలికారు “మీ యొక్క ఈ సహచరుడిలో ఒక నిదర్శనం ఉన్నది”. ఆ తర్వాత వారిలోని ఒక దైవదూత ఇలా పలికారు “ఆయన లోని నిదర్శనాన్ని కనిబెడదాం” అప్పుడు వారిలోని మరొక దైవదూత ఇలా జవాబిచ్చారు “ఆయన నిద్రపోతున్నారు” మరొక దైవదూత మళ్ళీ “ఆయన కళ్ళు నిద్రపోతున్నాయి, కాని ఆయన హృదయం మేలుకునే ఉన్నది” అని తిరిగి పలికారు.

అప్పుడు వారిలా పలికారు “ఆయనలోని నిదర్శనం (ఉదాహరణ) ఇలా ఉన్నది – క్రొత్తగా ఇల్లు కట్టిన ఒక వ్యక్తి, విందు భోజనం ఏర్పాటు చేసి, ప్రజలను ఆహ్వానించటానికి దూతను (వార్తాహరుడిని) పంపినాడు. అప్పుడు ఎవరైతే ఆ దూత యొక్క ఆహ్వానాన్ని స్వీకరించి, ఆ ఇంటిలో ప్రవేశించారో, వారు విందు భోజనం ఆరగించారు (తిన్నారు). ఇంకా ఎవరైతే ఆ వార్తాహరుని యొక్క ఆహ్వానాన్ని స్వీకరించలేదో, వారు ఆ ఇంటిలో ప్రవేశించనూ లేదు మరియు విందు భోజనం తిననూ లేదు” అప్పుడు మిగిలిన దైవదూతలు ఇలా పలికారు “ఈ దృష్టాంతాన్ని (ఉదాహరణను) ఆయనకు వివరించినట్లయితే, ఆయన కూడా దీనిలోని నిగూఢార్థాన్ని తెలుసుకోగలరు” అప్పుడు వారిలోని ఒక దైవదూత ఇలా పలికారు “ఆయన నిద్రపోతున్నారు” మిగిలిన వారు మళ్ళీ ఇలా పలికారు “ఆయన కళ్ళు నిద్రపోతున్నాయి, కాని ఆయన హృదయం మేలుకునే ఉన్నది” అప్పుడు వారు మళ్ళీ ఇలా పలికారు “ఉదాహరణలోని క్రొత్త ఇల్లు స్వర్గానికి ఉపమానంగా మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విందు భోజనానికి పిలిచిన దైవదూత (వార్తాహరుడు) కు ఉపమానంగా మరియు ఎవరైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను విధేయతగా అనుసరిస్తారో, వారు అల్లాహ్ ను విధేయతగా అనుసరించినట్లే. మరియు ఎవరైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కు అవిధేయత చూపుతారో, వారు అల్లాహ్ కు అవిధేయత చూపినట్లే. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దివ్యసందేశం ద్వారా ప్రజలలోని దైవభక్తులను వేరు చేసారు, చెడు నుండి మంచిని వేరుపర్చారు మరియు అవిశ్వాసుల నుండి విశ్వాసులను విడదీశారు”

حدَّثنا مُحَمَّد بن سِنانٍ: حدَّثنا فليح بن سليمان: حدَّثنا هلال بن علي‘ عن عبد الرَّحمنِ بنِ أبي عمرة، عن أبي هريرة قال : قال رسول الله^: أنا أوْلى النَّاسِ بعيسى ابنِ مريم في الدُّنيا والآخرة، والأنبِـياء إخوةٌ لعَلاَّت، أُمَّهاتهم شتَّى ودينهم واحد. وقال إبراهيم بن طهمان، عن موسى بن عُقبة، عن صفوان بن سُليم، عن عطاء بن يسار، عن أبي هريرة رضي الله عنه قال :قال رسول الله ^

సహీహ్ బుఖారీ హదీథ్ సంకలనంలోని 4వ గ్రంథపు 652వ హదీథ్ లో నమోదు చేయబడిన అబు హురైరాహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఇలా తెలిపారు:

“ఈ లోకంలోను మరియు పరలోకంలోను మర్యం కుమారుడైన ఈసా-యేసు (అలైహిస్సలాం) కు మొత్తం మానవజాతిలో నేనే అత్యంత దగ్గరి వాడిని. ప్రవక్తలు తండ్రి తరుపున సోదరులు, వారి తల్లులు వేరు, కాని వారి ధర్మం ఒక్కటే (అదే ఏకైక దైవారాధన)

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సందేశహరుడనే సత్యాన్ని  (Prophethood ను) తప్పక విశ్వసించవలెను.

حدَّثني يونس بن عَبدالأعلى: أخبرنا ابنُ وهْب قال: وأخبرني عمرو أنَّ أبا يونس حدَّثه عن أبي هُريرة عن رسول الله صلّى الله عليه و سلَّم أنَّه قال: والذي نَفْس مُحمَّد بِيده لا يَسمَعُ بِي أحدٌ من هذه الأُمَّةِ يهودي ولا نصراني ثمَّ يموت ولم يؤمن بالذي أُرسلْتُ بِه إلاَّ كان من أصحاب النَّار. (رواه مسلم في كتاب الإيمان)

సహీహ్ ముస్లిం హదీథ్ సంకలనంలోని – విశ్వాసమనే మొదటి హదీథ్ గ్రంథపు 24వ భాగంలో నమోదు చేయబడిన అబు హురైరాహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఇలా తెలిపారు:

“ఎవరి చేతిలో ముహమ్మద్ యొక్క ఆత్మ ఉన్నదో ఆయన (అల్లాహ్) సాక్షిగా, యూదులలో మరియు క్రైస్తవులలో నా గురించి విని, ఏ దివ్యసందేశంతో (ఏకైక దైవారాధనా సందేశం) నేను పంపబడినానో, దానిని విశ్వసించకుండా చనిపోయే వారెవరూ ఉండరు. కాని వారిలో ఎవరైతే అలా విశ్వసించక చనిపోతారో, వారు నరకాగ్ని నివాసులుగా మిగిలిపోతారు.”

(ఖుర్ఆన్ లోని 3:116వ వచనం కూడా చూడండి)