మరణాంతర జీవితం – పార్ట్ 16: సిఫారసు కు సంబంధించిన మూఢ నమ్మకాలు, చెడు విశ్వాసాలు [ఆడియో, టెక్స్ట్]

బిస్మిల్లాహ్

మరణాంతర జీవితం – పార్ట్ 16 [ఆడియో]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

పార్ట్ 16. ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [ 21:24 నిముషాలు]

అస్సలామ్ అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలామ్ అలా రసూలుల్లాహ్ అమ్మాబాద్.

ఈనాటి మన శీర్షిక సిఫారసుకు సంబంధించిన మూఢ నమ్మకాలు, దుర విశ్వాసాలు. ఈ రోజుల్లో కొన్ని సామెతలు, కొన్ని ఉదాహరణలు చాలా ప్రఖ్యాతిగాంచి ఉన్నాయి మన అనేక మంది ప్రజల మధ్యలో. అవేమిటంటే మనం ఇహలోకంలో చీఫ్ మినిస్టర్ వద్దకు పోవాలంటే, ప్రైమ్ మినిస్టర్ వద్దకు పోవాలంటే వారి యొక్క P.A లేదా వారి యొక్క సెక్రటరీ యొక్క సిఫారసు ద్వారా అక్కడికి చేరుకుంటాము. అలాగే అల్లాహ్ వద్దకు మనం డైరెక్టుగా చేరుకోలేము గనక మనం పాపాత్ములము, మనతో చాలా తప్పిదాలు, పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. మనం ఎలా అల్లాహ్ కు ముఖం చూపించుకొని ఆయన వద్దకు వెళ్తాము? అందు గురించి ఆయన పుణ్యదాసులు, భక్తులు, విశ్వాసులు, ప్రవక్తలు, దైవ దూతలు అలాంటి వారితో మనం మొర పెట్టుకుంటే, అలాంటి వారి యొక్క సిఫారసు గురించి వారిని మనం కోరుతూ ఉంటే వారు మనల్ని అల్లాహ్ వద్దకు చేర్పిస్తారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజివూన్. మహాశయులారా! ఇలాంటి విషయం చాలా వరకు మీరు వింటారా లేదా? వింటూ ఉంటారు కానీ ఒక్కసారి అల్లాహ్ మనందరినీ క్షమించు గాక! గమనించండి. ఈలోకంలో ఉన్న నాయకులు వారితో అల్లాహ్ ను మనం పోల్చుతున్నామా? అవూదు బిల్లాహ్. ఎవరైతే ఇలాంటి ఒక సామెత ప్రైమ్ మినిస్టర్ వరకు చీఫ్ మినిస్టర్ వరకు వెళ్ళాలంటే మనకు వారి యొక్క సెక్రటరీ కింది అధికారుల సిఫారసుతో వెళ్ళాలి అని అంటూ ఉంటారో అలాంటి వారిని మీరు కూడా ఒక చిన్న ప్రేమ పూర్వకమైన ప్రశ్న అడగండి. అదేమిటంటే ఒకవేళ చీఫ్ మినిస్టర్ మరియు ప్రైమ్ మినిస్టర్ మీ క్లాసుమేట్, మీ ఇంటి పక్కన ఉండేవాడు, మీ యొక్క వాడలో ఉండేవాడు, మీ యొక్క చిన్ననాటి స్నేహితుడు అయితే అతనితో నీవు డైరెక్ట్ గా నీ సమస్యను ముందు పెట్టి నువ్వు మాట్లాడుతావా? లేక వేరే వాళ్లను అతని వద్దకు సిఫారసుకు తీసుకెళ్తావా? ప్రతి బుద్ధిమంతుడు ఏమి సమాధానం ఇస్తాడు? ప్రైమ్ మినిస్టర్ నాకు తెలిసిన వాడై ఉంటే, నాకు దగ్గరి వాడై ఉంటే నేను ఇతరులను ఎందుకు సిఫారసుగా తీసుకెళ్తాను? నేనే డైరెక్ట్ గా అతనితో మాట్లాడుకుంటాను. అవునా లేదా? మరి అల్లాహ్. అవూదు బిల్లాహ్. నేను అల్లాహ్ కు ఎలాంటి పోలికలు ఇవ్వడం లేదు. ఎవరైతే ఇలాంటి పోలికలు ఇస్తున్నారో వారి యొక్క ఆ పోలికకు సమాధానంగా ఇలాంటి ఒక విషయం చెప్పి, అల్లాహ్ గురించి మన విశ్వాసం ఏమిటి? అల్లాహ్ గురించి మన నమ్మకమేమిటి? మనం ఎంత పాపాత్ములమైనా, ఎన్ని దుష్కార్యాల్లో పడి ఉన్నా, ఆ అల్లాహ్ మనల్ని ఎలా సంబోధిస్తున్నాడు?

۞ قُلْ يَـٰعِبَادِىَ ٱلَّذِينَ أَسْرَفُوا۟ عَلَىٰٓ أَنفُسِهِمْ لَا تَقْنَطُوا۟ مِن رَّحْمَةِ ٱللَّهِ ۚ إِنَّ ٱللَّهَ يَغْفِرُ ٱلذُّنُوبَ جَمِيعًا ۚ إِنَّهُۥ هُوَ ٱلْغَفُورُ ٱلرَّحِيمُ

(ఓ ప్రవక్తా! నా తరఫున వారికి ఇలా) చెప్పు: “తమ ఆత్మలపై అన్యాయానికి ఒడిగట్టిన ఓ నా దాసులారా! మీరు అల్లాహ్‌ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా అల్లాహ్‌ పాపాలన్నింటినీ క్షమిస్తాడు. నిజంగా ఆయన అమితంగా క్షమించేవాడు, అపారంగా కరుణించేవాడు. (సూరా అజ్-జుమర్ 39:53)

“ఓ నా దాసులారా!” గమనించండి ఎవరిని అంటున్నాడు? నా దాసులారా అని అల్లాహు తఆలా ఇక్కడ దైవదూతలను అంటున్నాడా? ప్రవక్తలను అంటున్నాడా? పుణ్యపురుషులను అంటున్నాడా? మహా భక్తులని అంటున్నాడా? ఔలియా అల్లాహ్ ఇంకా మంచి మంచి సత్కార్యాలు చేసేవారిని అంటున్నాడా? కాదు, ఎవరైతే పాపాల మీద పాపాలు చేసుకొని తమ ఆత్మల మీద అన్యాయం చేసుకున్నారో, అల్లాహ్ యొక్క కారుణ్యం నుండి మీరు ఏమాత్రం నిరాశ చెందకండి.

అల్లాహు అక్బర్. అల్లాహ్ మనకు ఎంత దగ్గర ఉన్నాడు. అల్లాహు తఆలా డైరెక్ట్ మనలో ఎవరు ఎంత పాపాత్ములు అయినా కానీ నా దాసుడా! నా కారుణ్యం పట్ల నిరాశ చెందకు.

وَقَالَ رَبُّكُمُ ٱدْعُونِىٓ أَسْتَجِبْ لَكُمْ ۚ إِنَّ ٱلَّذِينَ يَسْتَكْبِرُونَ عَنْ عِبَادَتِى سَيَدْخُلُونَ جَهَنَّمَ دَاخِرِينَ

మరి మీ ప్రభువు ఏమంటున్నాడంటే, “మీరు నన్నే ప్రార్థించండి. నేను మీ ప్రార్థనలను ఆమోదిస్తాను. నా దాస్యం పట్ల గర్వాహంకారం ప్రదర్శించేవారు త్వరలోనే అవమానితులై నరకంలో ప్రవేశించటం తథ్యం.” (సూరా అల్ మూమిన్ 40:60)

మీ ప్రభువు మీతో చెబుతున్నాడు. నాతో డైరెక్ట్ మీరు దువా చేయండి, నేను మీ దుఆను అంగీకరిస్తాను. ఖురాన్ యొక్క ఆయతులు కదా ఇవి శ్రద్ద వహించండి. వీటి యొక్క భావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి.

మరో చిన్న ఉదాహరణ ఇస్తాను. ఈ ఉదాహరణ అల్లాహ్ విషయంలో కాదు, అల్లాహ్ గురించి కాదు. మన అల్ప జ్ఞానులకు మరియు మన బుర్రలో ఈ విషయాలు కొంచెం దిగి అర్థం చేసుకోవడానికి. ఇక్కడి నుండి వెయ్యి కిలోమీటర్ల దూరంలో నేను ఏ బాబాను, ఏ వలీని, ఏ పుణ్యాత్ముడ్ని నమ్ముకుంటున్నానో అతని యొక్క సమాధి అక్కడ ఉంది. నేను ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు అల్లాహ్ ను మొరపెట్టుకొని ఓ అల్లాహ్! నా ఈ కష్టాన్ని దూరం చెయ్యి అని పలకాలా? లేకుంటే నాకు ప్రియమైన ఫలానా బాబా, ఫలానా వలి మరియు నాకు నేను మీ యొక్క మురీద్ ని, నేను ఈ కష్టంలో ఉన్నాను. నా ఈ కష్టాన్ని మీరు దూరం చేయడానికి అల్లాహ్ ను మొరపెట్టుకోండి అని అనాలా?. ఎలా చెప్పాలి? ఆలోచించండి కొంచెం. మన ఈ కష్టాన్ని ఎవరు చూస్తున్నారు? అల్లాహ్ మంచిగా చూస్తున్నాడా లేక అతనా? నా కష్టం దూరం చెయ్యి అని మనం నోట ఏదైతే చెప్పుకుంటున్నామో ఆ మాటను అల్లాహ్ స్పష్టంగా ఏ అడ్డు లేకుండా వింటున్నాడా? లేకుంటే మనకు ప్రియమైన ఆ పుణ్యాత్ముడా? గమనించండి. ప్రతి ఒక్కరి ద్వారా సమాధానం ఏం వస్తుంది? వెయ్యి కిలోమీటర్లు వదిలేయండి. మన పక్క సమాధిలో ఉన్నప్పటికీ మనం ఏ పుణ్యాత్మునికి మురీద్ గా, ఏ పుణ్యాత్మునికి శిష్యునిగా, ఏ పుణ్యాత్మునికి మనం ప్రియునిగా ఉంటిమో అతను అతని యొక్క సమాధి మన పక్కలో ఉన్నప్పటికీ అల్లాహ్ కంటే మంచి విధంగా నా కష్టాన్ని చూసేవారు ఎవరు లేరు, అల్లాహ్ కంటే మంచి విధంగా నేను నా కష్టాన్ని నోటితో చెప్పుకున్నప్పుడు వినేవారు అంతకంటే గొప్పవారు ఎవరూ లేరు. మరియు నా కష్టాన్ని తొలిగించే విషయంలో కూడా అల్లాహ్ కు ఉన్నటువంటి శక్తి ఎవరికీ లేదు. అలాంటప్పుడు ఎవరికి మనం మొరపెట్టుకోవాలి?

ఇంకా విషయం అర్ధం కాలేదా? ఉదాహరణకి 105 డిగ్రీలు నీకు జ్వరం ఉంది. నీ పక్కనే డాక్టర్ ఉన్నాడు. నీ చుట్టుపక్కల నీ భార్య లేదు, నీ పిల్లలు లేరు, ఎవరూ లేరు. నీవు ఒంటరిగా నీవు ఆ గదిలో ఉన్నావు. పక్క గదిలో డాక్టర్ ఉన్నాడు మరియు నీ కొడుకు లేదా నీ భార్య లేదా నీవు ఎవనికి శిష్యునివో ఆ పుణ్యాత్ముడు అతని యొక్క సమాధి ఎడమ పక్కన ఉంది. నువ్వు ఎవరిని పిలుస్తావు ఈ సందర్భంలో? ఓ డాక్టర్ సాబ్ వచ్చి నాకు ఇంజక్షన్ ఇవ్వు, నన్ను చూడు అని అంటావా? లేకుంటే ఓ పుణ్యాత్ములు, ఓ నా బాబా సాహెబ్ నాకు ఈ జ్వరం ఉన్నది. నా కష్టాన్ని దూరం చెయ్యి. నా జ్వరాన్ని దూరం చెయ్యి అని అంటామా? బహుశా ఈ చిన్నపాటి ఉదాహరణల ద్వారా మాట అర్థమైంది అనుకుంటాను.

విషయం ఏంటంటే సోదరులారా! సిఫారసు యొక్క సంపూర్ణ అధికారం అల్లాహ్ చేతిలో ఉందన్న విషయం మనం తెలుసుకున్నాం. అయితే ఇంకా ఎవరైనా మనకు సిఫారసు ప్రళయ దినాన చేయగలరు అని వారితో మొరపెట్టుకోవడం, వారితో సిఫారసు గురించి కోరడం, ఇది పాతకాలపు నుండి అవిశ్వాసులు, ముష్రికులు, బహు దైవారాధకులు పాటిస్తూ వస్తున్నటువంటి ఒక ఆచారం.

ఈ విషయాన్ని అల్లాహ్ (తఆల) సూరయే యూనుస్ ఆయత్ నెంబర్ 18 లో ఎంత స్పష్టంగా తెలిపాడో మీరు ఒకసారి గమనించండి.

وَيَعْبُدُونَ مِن دُونِ اللَّهِ مَا لَا يَضُرُّهُمْ وَلَا يَنفَعُهُمْ وَيَقُولُونَ هَٰؤُلَاءِ شُفَعَاؤُنَا عِندَ اللَّهِ ۚ قُلْ أَتُنَبِّئُونَ اللَّهَ بِمَا لَا يَعْلَمُ فِي السَّمَاوَاتِ وَلَا فِي الْأَرْضِ ۚ سُبْحَانَهُ وَتَعَالَىٰ عَمَّا يُشْرِكُونَ

వారు అల్లాహ్‌ను వదలి తమకు నష్టాన్నిగానీ, లాభాన్ని గానీ చేకూర్చలేని వాటిని పూజిస్తున్నారు. ఇంకా, “అల్లాహ్‌ సమక్షంలో ఇవి మాకు సిఫారసు చేస్తాయి” అని చెబుతున్నారు. “ఏమిటీ, ఆకాశాలలో గానీ, భూమిలో గానీ అల్లాహ్‌కు తెలియని దానిని గురించి మీరు ఆయనకు తెలియజేస్తున్నారా?” వారు కల్పించే భాగస్వామ్యాల నుంచి ఆయన పవిత్రుడు, ఉన్నతుడు అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు. (సూరా యూనుస్ 10:18)

అల్లాహ్ ఆ ముష్రికుల విషయంలో తెలుపుతున్నాడు. “వారు అల్లాహ్ ను వదిలి వారికి ఏ మాత్రం లాభాన్ని చేకూర్చే లేదా వారికి ఏ మాత్రం నష్టాన్ని చేకూర్చ లేని వారిని ఆరాధిస్తున్నారు. వారు అల్లాహ్ ను వదిలి వారికి ఏ మాత్రం నష్టం గాని, లాభం కానీ చేకూర్చలేని వారిని ఆరాధిస్తున్నారు. ఇలా ఆరాధిస్తూ వారు వారి యొక్క నమ్మకాన్ని ఇలా తెలుపుతున్నారు: “మేము ఎవరినైతే ఆరాధిస్తున్నామో, ఎవరి వద్దకైతే వెళ్లి కొన్ని ఆరాధనకు సంబంధించిన విషయాలు పాటిస్తున్నామో వారు మా గురుంచి అల్లాహ్ వద్ద సిఫారసులు అవుతారు. వీరు అల్లాహ్ వద్ద మాకు సిఫారసులు అవుతారు”. వారికి చెప్పండి – ఏమిటి? అల్లాహ్ కు ఆకాశాలలో, భూమిలో తెలియని ఒక విషయాన్ని మీరు అల్లాహ్ కు తెలియపరుస్తున్నారా? ఇలాంటి సిఫారసులు చేసేవారితో, ఇలాంటి భాగస్వాములతో, అల్లాహ్ ఎంతో అతి ఉత్తముడు, పవిత్రుడు. వారు ఈ షిర్క్ పనిచేస్తున్నారు. ఇలాంటి షిర్క్ కు అల్లాహు (తఆలా) కు ఎలాంటి సంబంధం లేదు. అన్ని రకాల షిర్క్ పనులకు అతను ఎంతో ఉన్నతుడు”. గమనించారా? స్వయంగా అల్లాహ్ సూరయే యూనుస్ ఆయత్ నెంబర్ 18 లో ఇలాంటి ఎవరినైనా సిఫారసు చేస్తారు అని నమ్ముకొని వారి వద్ద ఏదైనా కొన్ని కార్యాలు చేస్తూ వారు మా గురించి అల్లాహ్ వద్ద సిఫారసు చేయాలి అని నమ్ముకోవడం ఇది షిర్క్ అని అల్లాహ్ ఎంత స్పష్టంగా తెలియ పరుస్తున్నాడు.

మరి కొన్ని ఆధారాలు, మరికొన్ని విషయాలు ఉన్నాయి. సూరతుల్ జుమర్ ఆయత్ నెంబర్ 3 ను కూడా .

 أَلَا لِلَّهِ الدِّينُ الْخَالِصُ ۚ وَالَّذِينَ اتَّخَذُوا مِن دُونِهِ أَوْلِيَاءَ مَا نَعْبُدُهُمْ إِلَّا لِيُقَرِّبُونَا إِلَى اللَّهِ زُلْفَىٰ إِنَّ اللَّهَ يَحْكُمُ بَيْنَهُمْ فِي مَا هُمْ فِيهِ يَخْتَلِفُونَ ۗ إِنَّ اللَّهَ لَا يَهْدِي مَنْ هُوَ كَاذِبٌ كَفَّارٌ

జాగ్రత్త! నిష్కల్మషమైన ఆరాధన మాత్రమే అల్లాహ్‌కు చెందుతుంది. ఎవరయితే అల్లాహ్‌ను గాకుండా ఇతరులను సంరక్షకులుగా ఆశ్రయించారో వారు, “ఈ పెద్దలు మమ్మల్ని అల్లాహ్‌ సాన్నిధ్యానికి చేర్చటంలో తోడ్పడతారని భావించి మాత్రమే మేము వీళ్లను ఆరాధిస్తున్నామ”ని అంటారు. ఏ విషయం గురించి వారు భేదాభిప్రాయానికి లోనై ఉన్నారో దానికి సంబంధించిన (అసలు) తీర్పు అల్లాహ్‌ (స్వయంగా) చేస్తాడు. అబద్ధాలకోరులకు, కృతఘ్నులకు అల్లాహ్‌ ఎట్టి పరిస్థితిలోనూ సన్మార్గం చూపడు. (సూరతుల్ జుమర్ 39:3

మీరు గమనిస్తే వారు ఇలాంటి మూడ నమ్మకాలకి గురి అయ్యి షిర్క్ చేస్తున్నారు అని అల్లాహ్ (తఆలా) మరి ఎంతో స్పష్టంగా తెలియ చేస్తున్నాడు. “ఎవరైతే అల్లాహ్ ను కాదని, ఇంకా వేరే ఔలియాలను నిలబెట్టుకున్నారో, ఎవరైతే అల్లాహ్ ను కాదని, ఇంకా వేరే ఔలియాలను నమ్ముతున్నారో, ఆ ఔలియాల వద్ద వారు సంతోషించడానికి ఏఏ కార్యాలు చేస్తున్నారో, దానికి ఒక సాకు తెలుపుకుంటూ ఏమంటారు వారు? మేము అక్కడ వారి యొక్క ఆరాధన ఏదైతే చేస్తున్నామో, ఆరాధనకు సంబంధించిన కొన్ని విషయాలు ఏదైతే వారి వద్ద పాటిస్తున్నామో, వారు మమ్మల్ని అల్లాహ్ కు చేరువుగా చేయాలని, అంటే మేము స్వయంగా అల్లాహ్ వద్ద చేరుకోలేము అందుకు గురించి వీరిని మధ్యలో సిఫారసుగా పెడుతున్నాము. వారు అల్లాహ్ వద్ద మాకు సిఫారసు చేసి మమ్మల్ని అల్లాహ్ కుదగ్గరగా చేస్తారు. అల్లాహు అక్బర్. అయితే అల్లాహ్ ఏమంటున్నాడు? ఇలాంటి విభేదాలకు వారు ఏదైతే గురి అయ్యారో, ప్రవక్తల అందరిని ఏదైతే మేము పంపామో, ఇలాంటి షిర్క్ నుండి ఆపడానికే పంపాము. కానీ వారు ఈ సరైన మార్గాన్ని వదిలి ఏదైతే భిన్నత్వానికి, విభేదానికి గురి అయ్యారో, దానికి సంబంధించిన తీర్పులు అన్నీ కూడా మేము సమీపంలో చేస్తాము ప్రళయ దినాన.

మళ్ళీ ఆ తర్వాత ఆయత్ యొక్క చివరి భాగం ఎలా ఉందో గమనించండి. “ఎవరైతే అబద్ధాలకు మరియు కృతఘ్నత, సత్య తిరస్కారానికి గురి అవుతారో, వారికి అల్లాహ్ సన్మార్గం చూపడు“.

అంటే మాట ఏంటి? అల్లాహ్ మధ్యలో ఎవరిని కూడా ఇలా మధ్యవర్తిగా నియమించలేదు. వారిని మనం సిఫారసులుగా చేసుకోవాలని అల్లాహ్ ఎవరిని కూడా నిర్ణయించలేదు. చివరికి ప్రవక్త మహానీయ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అందరికంటే శ్రేష్ఠులు గొప్పవారు. వారు కూడా ప్రళయ దినాన ఏ సిఫారసు అయితే చేస్తారో, దాని విషయంలో మనం హదీసులు విన్నాము. ఈ విషయం సహచరులకు కూడా తెలుసు. అయినప్పటికీ ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క సహాబి కూడా ప్రవక్తా! ప్రళయదినాన మాకు మీరు సిఫారసుగా నిలబడి మా పాపాలను క్షమించి, క్షమించడానికి అల్లాహ్ తో చెప్పుకొని, మమ్మల్ని అల్లాహ్ కు చేరువుగా చేయాలి అని ఈవిధంగా ఎప్పుడూ కూడా మొర పెట్టుకోలేదు.

అందుగురించి మహాశయులారా! ఇక్కడ సూరయే యాసీన్ లో ఒక పుణ్యాత్ముని సంఘటన అల్లాహ్ (తఆలా) ఏదైతే ప్రస్తావించాడో, అతను తౌహీదు పై ఉండి, షిర్క్ ని ఏదైతే విడనాడాడో మరియు అతని జాతివారు అతన్ని అందుకని హత్య చేశారో ఆ సంఘటన మొత్తం సూరయే యాసీన్ లో ఉంది. ఆ పుణ్యాత్ముడు ఏమంటాడు?

أَأَتَّخِذُ مِن دُونِهِ آلِهَةً إِن يُرِدْنِ الرَّحْمَٰنُ بِضُرٍّ لَّا تُغْنِ عَنِّي شَفَاعَتُهُمْ شَيْئًا وَلَا يُنقِذُونِ

అట్టి (నిజ) దైవాన్ని వదిలేసి నేను ఇతరులను ఆరాధ్యులుగా ఆశ్రయించాలా? ఒకవేళ కరుణామయుడు (అయిన అల్లాహ్‌) నాకేదైనా నష్టం కలిగించదలిస్తే వారి సిఫారసు నాకెలాంటి లాభమూ చేకూర్చదు. వారు నన్ను కాపాడనూ లేరు”. (36:23)

“ఏమిటి? అల్లాహ్, రహ్మాన్ ను కాదని ఇంకా వేరే వారు ఎవరినైనా నేను, నాకు ఆరాధ్యనీయునిగా చేసుకోవాలా? ఒకవేళ అల్లాహ్, రహ్మాన్ నాకు ఏదైనా నష్టం చేకూర్చాలని అంటే వారు ఆ నష్టాన్ని ఏమైనా దూరం చేయగలుగుతారా? ఆ సందర్భంలో వారి యొక్క ఏ సిఫారసు కూడా నాకు పని చేయదు. వారి యొక్క ఏ సిఫారసు నాకు లాభాన్ని చేకూర్చదు”.

ఈ విధంగా మహాశయులారా! ఇహలోకంలో ఎవరినీ కూడా మనం ఫలానా అతను నాకు సిఫారసు చేస్తాడు పరలోక దినాన అని భావించి వారి వద్ద ఏదైనా ఆరాధనకు సంబంధించిన విషయాలు పాటిస్తూ ఉండడం ఇది అల్లాహ్ కు ఎంత మాత్రం ఇష్టం లేదు.

ప్రళయదినాన నరకవాసులు నరకంలో పోయిన తర్వాత, స్వర్గవాసులు ఆ నరకవాసులను అడుగుతారు. మీరు ఎందుకు నరకంలో పడి ఉన్నారు? కారణం ఏంటి? ఏ పాపం వల్ల మీరు ఇక్కడ వచ్చి పడి ఉన్నారు? అని అంటే వారు స్వయంగా ఏ సత్కార్యాలని విడనాడినందుకు నరకంలో వచ్చి పడ్డారో, మరి ఏ మూఢనమ్మకాల వల్ల నరకంలో చేరవలసి వచ్చిందో స్వయంగా వారి నోట వారు తెలుపుతున్నారు. అల్లాహ్ ఈవిషయాన్ని సూరయే ముద్దస్సిర్ లో తెలిపాడు.

 مَا سَلَكَكُمْ فِي سَقَرَ قَالُوا لَمْ نَكُ مِنَ الْمُصَلِّينَ وَلَمْ نَكُ نُطْعِمُ الْمِسْكِينَ وَكُنَّا نَخُوضُ مَعَ الْخَائِضِينَ وَكُنَّا نُكَذِّبُ بِيَوْمِ الدِّينِ حَتَّىٰ أَتَانَا الْيَقِينُ فَمَا تَنفَعُهُمْ شَفَاعَةُ الشَّافِعِينَ

“ఇంతకీ ఏ విషయం మిమ్మల్ని నరకానికి తీసుకు వచ్చింది?” (అని ప్రశ్నిస్తారు). వారిలా సమాధానమిస్తారు : “మేము నమాజు చేసే వారము కాము. నిరుపేదలకు అన్నం పెట్టే వారమూ కాము. పైగా, మేము పిడివాదన చేసే వారితో (తిరస్కారులతో) చేరి, వాదోపవాదాలలో మునిగి ఉండేవారం. ప్రతిఫల దినాన్ని ధిక్కరించేవాళ్ళం. తుదకు మాకు మరణం వచ్చేసింది.” మరి సిఫారసు చేసేవారి సిఫారసు వారికి ఏమాత్రం ఉపయోగపడదు. (74:42-48)

వారు అంటారు. మేము నమాజ్ చేసే వారిలో కాకుంటిమి. నిరుపేదలకు అన్నం పెట్టే వారిమి కాకుంటిమి. అలాగే కాలక్షేపాలు చేసి సమయాన్ని వృధా చేసే వారిలో మేము కలిసి ఉంటిమి. మరియు మేము ఈ పరలోక దినాన్ని తిరస్కరిస్తుంటిమి. చివరికి మాకు చావు వచ్చేసింది. చావు వచ్చిన తర్వాత మేము సజీవంగా ఉన్నప్పుడు ఎవరెవరినైతే సిఫారసు చేస్తారు అని అనుకుంటూ ఉంటిమో, ఏ సిఫారసు చేసేవారి సిఫారసు మాకు ఏ లాభాన్ని చేకూర్చలేదు.

అల్లాహు అక్బర్. గమనిస్తున్నారా! ఇలాంటి మూఢనమ్మకాల వల్ల ఎంత నష్టం చేకూరుస్తుందో, ఎలా నరకంలో పోవలసి వస్తుందో అల్లాహ్ ఎంత స్పష్టంగా మనకు తెలియపరిచాడో గమనించండి.

కొందరు మరో రకమైన తప్పుడు భావంలో పడి ఉన్నారు. ప్రళయదినాన ప్రజలందరూ కలిసి ప్రవక్తల వద్దకు సిఫారసు కోరుతూ ఏదైతే వెళ్తారో దాన్ని ఆధారంగా పెట్టుకున్నారు. దాన్ని ఆధారంగా పెట్టుకొని ఏమంటారు? ప్రళయదినాన ప్రవక్తల వద్దకు సిఫారసు కోరుతూ వెళ్తారు కదా! అయితే ఈ రోజు మేము ఇహలోకంలో ఇలా పుణ్యాత్ముల వద్దకు సిఫారసు కోరుతూ వెళ్తే ఏమి నష్టం అవుతుంది? అయితే మహాశయులారా! ఆ విషయం ఇక్కడ వీరు పాటిస్తున్న దానికి ఎంత మాత్రం ఆధారంగా నిలవదు. ఎందుకంటే ఇక్కడ సామాన్య ప్రజలు చనిపోయిన వారిని సిఫారసులుగా కోరుతున్నారు. సిఫారసులుగా వారికి నిలబెట్టుకొని వారి వద్ద కొన్ని ఆరాధనలు చేస్తున్నారు మరియు ఆరోజు ప్రవక్తలు సజీవంగా ఉండి వారితో మాట్లాడుతున్నారు. రెండవ విషయం అక్కడ ఏదైతే ప్రజలు సిఫారసు గురించి కోరుతున్నారో, దేని గురించి? మా పాపాలు క్షమించమని కాదు, మా కష్టాలు దూరం చేయమని కాదు, మేము మా ఇబ్బందులు మీరే డైరెక్టుగా దూరం చెయ్యాలి అని కాదు. దేని గురించి అల్లాహ్ తీర్పు చేయడానికి రావాలి. తీర్పు మొదలు కావాలి అని మీరు సిఫారసు చేయండి అంతే! కానీ ఈ రోజుల్లో దానిని సాకుగా పెట్టుకొని ఎవరినైతే సిఫారసు గా నిలబెట్టుకున్నారో వారితో అన్ని రకాల సంతానం లేకుంటే సంతానము కోరడం, అనారోగ్యాన్ని దూరం చేయడానికి వారితో కోరడం, ఇంకా ఎన్నో రకాల కష్టాలు దూరం చేయాలని వారితో డైరెక్టుగా దుఆ చేయడం ఇలాంటివన్నీ షిర్క్ పనులు జరుగుతున్నాయి కదా! మరి ఆ విషయం ఎలా ఆధారంగా ఉంటుంది? అగత్యపరుడు, మరీ కష్టంలో ఉన్నవాడు దుఆ చేసినప్పుడు దుఆను స్వీకరించి విని అతని కష్టాన్ని దూరం చేసేవాడు అల్లాహ్ తప్ప ఇంక ఎవరు లేరు.

అందుగురించి మహాశయులారా! ఇలాంటి మూఢనమ్మకాలను వదులుకోవాలి. కేవలం యోగ్యమైన రీతిలో అల్లాహ్ మరియు మనకు ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపిన రీతిలోనే సిఫారసు యొక్క మార్గాలను అవలంభించాలి. కానీ ఇలాంటి మూఢనమ్మకాలు, ఇలాంటి దురవిశ్వాసాలకు లోనైతే చాలా నష్టానికి కూరుకుపోతాము.

అయితే మహాశయులారా! ఇహలోకంలో మనం ఏ కష్టాల్లో, ఏ ఆపదలో, ఏ ఇబ్బందులు, ఎన్ని రకాల బాధలకు, చింతలకు మనం గురి అవుతామో వాటిలో మరి మనం ఏదైనా మధ్యవర్తిత్వాన్ని అవలంబించి దుఆలు చేయడానికి ఏదైనా ఆస్కారం ఉందా? అలాంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఇలా పుణ్యాత్ములని, మరి ఇంకా చనిపోయిన మహాపురుషులని మధ్యవర్తిత్వంగా పెట్టుకొని వారిని సిఫారసుగా నిలబెట్టుకొని వారితో ఎలాంటి దుఆలు చేయకూడదు అని అంటున్నారు కదా? మరి మనం ఏదైనా ఇబ్బంది లో ఉన్నప్పుడు ఏ మధ్యవర్తిత్వాన్ని అవలంబించి ఎలా దుఆ చెయ్యాలి? అనే విషయం ఇన్షా అల్లాహ్ దీని తరువాయి భాగంలో మనం తెలుసుకోబోతున్నాము. అల్లాహు తఆలా మనందరికీ సత్-భాగ్యం ప్రసాదించుగాక!

జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వ బరకాతుహు.


పూర్తి భాగాలు క్రింద వినండి 

పరలోకం (The Hereafter) మెయిన్ పేజీ:
https://teluguislam.net/hereafter/

మరణాంతర జీవితం – పార్ట్ 15: ప్రళయ దినాన సిఫారసు ఎప్పుడు ఏ సందర్భంలో ఎవరికి లభిస్తుంది (పార్ట్ 02) & సిఫారసులు పొందడానికి, సిఫారసులు చేయడానికి గల కండిషన్స్ [ఆడియో, టెక్స్ట్]

బిస్మిల్లాహ్

మరణాంతర జీవితం – పార్ట్ 15 [ఆడియో]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

పార్ట్ 15. ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [ 23:16 నిముషాలు]

అస్సలామ్ అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలామ్ అలా రసూలుల్లాహ్ అమ్మాబాద్.

ఈనాటి అంశం గత భాగం యొక్క తర్వాత విషయం. ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) కాకుండా, ఇంకా వేరే ప్రవక్తలకు, దైవదూతలకు, విశ్వాసులకు సిఫారసు చేసే హక్కు ఏదైతే లభిస్తుందో, దాని గురించి మనం తెలుసుకుంటున్నాం. దానితో పాటు వారి ఆ సిఫారసును పొందడానికి ఎలాంటి వారు అర్హులవుతారు? అనే విషయం కూడా మనం తెలుసుకుంటున్నాము.

అయితే ఇతర ప్రవక్తల మరియు పుణ్యాత్ముల సిఫారసు మరే సందర్భంలో వారికి లభిస్తుంది అంటే ఏ ప్రజల గురించి నరకంలో వారు పోవాలన్నటువంటి తీర్పు జరుగుతుందో, కానీ అల్లాహ్ యొక్క దయ తరువాత అల్లాహ్ కొందరు ప్రవక్తలకు, కొందరు విశ్వాసులకు సిఫారసు అధికారం ఇస్తాడు. వారు సిఫారసు చేస్తారు. ఆ తర్వాత అల్లాహు తఆలా వారిని నరకంలో ప్రవేశించకుండా నరకం నుండి తప్పించి స్వర్గంలో చేర్చుతాడు. అల్లాహు అక్బర్. ఇది కూడా చాలా గొప్ప విషయం.

సహీ ముస్లిం హదీత్ నెంబర్ 1577, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు. “ఒక ముస్లిం ఎవరైనా చనిపోయాడు అంటే అతని జనాజా నమాజ్ చేయడానికి నలబై మంది నిలబడ్డారు. ఎలాంటి వారు ఆ నలబై మంది? అల్లాహ్ తో ఎలాంటి షిర్క్ చెయ్యనివారు. అల్లాహ్ తో పాటు ఎలాంటి వేరే భాగస్వాములను నిలబెట్టని వారు. ఏ ముస్లిం జనాజా నమాజ్ లో నలబై మంది ఎలాంటి షిర్క్ చెయ్యనివారు నిలబడతారో అల్లాహ్ వారి సిఫారసును అతని గురించి స్వీకరిస్తాడు“. చూడడానికి హదీస్ ఇంతే ఉంది.

కానీ ఇందులో మనం గ్రహిస్తే, ఆలోచిస్తే ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఒకటి, ఈ నలబై మంది ఎలాంటి వారు ఉండాలి? అల్లాహ్ తో పాటు ఇంకెవరిని కూడా అల్లాహ్ ఆరాధనలో భాగస్వామిగా చేయకూడదు. రెండో విషయం ఏం తెలుస్తుంది మనకు? సిఫారసు చేసేవారు షిర్క్ చేయకూడదు అని అన్నప్పుడు, ఎవరి గురించి సిఫారసు చేయడం జరుగుతుందో, అతను షిర్క్ చేసి ఉంటే వీరి సిఫారసు స్వీకరింప బడుతుందా అతని పట్ల? కాదు, అతను కూడా షిర్క్ చేయకుండా ఉండాలి. జనాజా నమాజ్ దీనిని “ఫర్ద్ యే కిఫాయా” అంటారు. అంటే ముస్లిం సముదాయంలో కొంతమంది చేసినా గాని అందరిపై నుండి పాపం అనేది లేపబడుతుంది. చదివిన వారికి పుణ్యం లభిస్తుంది. చదవని వారికి పాపం కలగదు. కానీ ఎవరూ చేయకుంటే అందరూ పాపాత్ములు అవుతారు. ఇలాంటి విషయాన్ని “ఫర్ద్ యే కిఫాయా” అంటారు. ఇది ఫర్ద్ యే కిఫాయా.

ఇక ఎవరైతే “ఫర్ద్ యే అయీన్” అంటే ఐదు పూటల నమాజ్ లు, ఫర్ద్ యే అయీన్ లో లెక్కించబడతాయి. ఫర్ద్ యే అయీన్ చేయకుండా కేవలం ఫర్ద్ యే కిఫాయా చేస్తే సరిపోతుందా? లేదు, చనిపోయిన ఆ ముసలి వ్యక్తి, అతను నమాజీ అయి ఉండాలి మరియు ఈ నలబై మంది కూడా కేవలం జనాజా లో హాజరైనవారు కాదు. ఐదు పూటల నమాజ్ లు చేస్తూ ఉండాలి. ఈ విధంగా మహాశయులారా! ఒక సిఫారసు ఈ రకంగా కూడా ఉంటుంది. అల్లాహు తఆలా దీనిని కూడా స్వీకరిస్తాడు. ఈ షరతు, ఈ కండిషన్ లతో పాటు.

మూడో రకమైన సిఫారసు స్వర్గంలో చేరిన వారు స్వర్గంలో వారి యొక్క స్థానాలు ఉన్నతం కావడానికి, వారు ఏ పొజిషన్ లో ఉన్నారో అంతకంటే గొప్ప స్థితికి వారు ఎదగడానికి సిఫారసు. ఇలాంటి ఒక సిఫారసు కూడా ఉంటుంది. అల్లాహు తఆలా మనకు కూడా అలాంటి సిఫారసు ప్రాప్తం చేయు గాక. ఒకవేళ మనం హదీతులు వింటూ, ఈ ధర్మ భోదనలు వింటూ సిఫారసు పొందే వారిలో మనం కలిసే ప్రయత్నం చేయడం కంటే, ఎవరికైతే సిఫారసు చేసే హక్కు లభిస్తుందో, అలాంటి గొప్ప విశ్వాసంలో మనం కలిస్తే ఇంకా ఎంత మంచిగా ఉంటుంది. ఇంకా ఎంత మన అదృష్టం పెరుగుతుందో ఒకసారి ఆలోచించండి.

ముస్లిం షరీఫ్ లో ఉంది. హదీత్ నెంబర్ 1528. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు. “ఎప్పుడైతే అబూ సలమా (రదియల్లాహు తఆలా అన్హు) మరణించారో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అతని వద్దకు వచ్చారు. అతని గురించి ఇలా దుఆ చేశారు. ఓ అల్లాహ్! అబూ సలమాను క్షమించు, మన్నించు. సన్మార్గం పొందిన వారు ఎవరైతే ఉన్నారో, వారిలో ఇతని యొక్క స్థానం కూడా పెంచి, వారితో కలుపు. ఓ అల్లాహ్! అతని వెనక, అతని తరువాత ఎవరైతే మిగిలి ఉన్నారో, వారికి నీవే బాధ్యునిగా అయిపో. మమ్మల్ని మరియు అతన్ని మన్నించు ఓ సర్వ లోకాల ప్రభువా! ఆయన సమాధిని విశాలపరుచు మరియు అతని కొరకు అతని సమాధిని కాంతితో నింపు“.

గమనించారా! ఈవిధంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అబూ సలమా గురించి దువా చేశారు. మనం కూడా విశ్వాసులు మనలో ఎవరైనా చనిపోతే, “ఓ అల్లాహ్! ఇతనిని క్షమించు. ఇతని యొక్క స్థానం పెంచి, సన్మార్గం పొందిన వారిలో ఇతన్ని కలుపు మరియు అతని వెనక, అతని తర్వాత అతను వెనుక ఉన్న వారిలో నీవు వారికి ఒక బాధ్యునిగా అయిపో. అతన్ని మరియు మమ్మల్ని కరుణించు ఓ మా సర్వ లోకాల ప్రభువా! అతని సమాధిని విశాల పరుచు. అతని సమాధిని కాంతితో నింపు“. ఈ విధంగా దువా చేయాలి మనం. ఇది కూడా ఒక సిఫారసు. అల్లాహ్ దయతో స్వీకరించబడుతుంది.

ఈ విధంగా సోదరులారా! సిఫారసు ఏ ఏ సందర్బాలలో జరుగుతుందో, ఏ ఏ సందర్భాలలో సిఫారసు చేసేవారు సిఫారసు చేస్తూ ఉన్నారో, ఎవరి గురించి సిఫారసు చేయబడుతుందో వారిలో మనం కూడా కలవాలి. మన గురించి కూడా ఎవరైనా పుణ్యాత్ములు సిఫారసు చేయాలి, దైవ దూతలు సిఫారసు చెయ్యాలి, ప్రవక్తలు సిఫారసు చెయ్యాలి అన్నటువంటి ఈ కేటగిరీని మనం ఎన్నుకునే దానికి బదులుగా అంతకంటే గొప్ప స్థానం దైవదూతలు మరియు ప్రవక్తలతో పాటు ఏ విశ్వాసులకు ఇతరుల గురించి సిఫారసు చేసే హక్కు ఇవ్వబడుతుందో అలాంటి పుణ్యాత్ముల్లో మనం చేరేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇస్లాం నేర్పేది కూడా మనకు ఇదే.

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక సందర్భంలో మనకు తెలిపారు. “మీరు అల్లాహ్ తో స్వర్గాన్ని కోరుకున్నప్పుడు ఫిరదౌస్ గురించి మీరు దుఆ చేయండి. దానిని కోరుకోండి. స్వర్గాలలో అన్ని స్వర్గాల కంటే శ్రేష్టమైనది, అన్ని స్వర్గాల కంటే అతి ఉత్తమ, ఉన్నత స్థానంలో ఉన్నది మరియు మధ్యలో ఉన్నది ఆ ఫిరదౌస్“.

ఈవిధంగా ఎప్పుడూ కూడా మనం టాప్ లో కాదు, హై టాప్ లో ఉండే ప్రయత్నం చేయాలి. మనం హై టాప్ కు చేరకపోయినా కనీసం దానికి దగ్గరలోనైనా చేరవచ్చు. కానీ ముందే మనం టార్గెట్ చాలా చిన్నది పెట్టుకుంటే హై స్టేజ్ వరకు ఎప్పుడు చేరుకుంటాము?

ఈ సిఫారసులు పొందడానికి, సిఫారసులు చేయడానికి ఎలాంటి అధికారం ఉండాలి? ఎలాంటి కండిషన్స్ ఉండాలి? అల్లాహు తఆలా ఖురాన్ లో, హదీతుల్లో ఎలాంటి కండీషన్స్ మనకు నిర్ణయించాడు? వాటిని తెలుసుకోవడం కూడా మనకు చాలా ముఖ్యం.

గత కార్యక్రమంలో మరియు కార్యక్రమంలో ముందు వరకు మనం ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) కాకుండా వేరే ప్రవక్తలకు, దైవదూతలకు, విశ్వాసులకు ఏఏ సందర్భాలలో ఎలాంటి సిఫారసు చేసే హక్కు దొరుకుతుందో తెలుసుకోవడంతో పాటు ఆ సిఫారసును పొందడానికి ఏఏ సత్కార్యాలు పనికి వస్తాయో అవి కూడా మనం తెలుసుకున్నాము. అయితే సిఫారసు చేయడానికి, సిఫారసు పొందడానికి ఎలాంటి కండీషన్స్, నిబంధనలు అవసరమో అల్లాహు తఆలా వాటిని కూడా ఖురాన్ లో తెలిపి ఉన్నారు. ఆ కండీషన్స్, ఆ నిబంధనలు మనలో ఉన్నప్పుడే మనం ఒకరికి సిఫారసు చేయగలుగుతాము. ఆ కండీషన్స్ మనలో ఉన్నప్పుడే ఒకరి సిఫారసు మనం పొందగలుగుతాము. వాటిని తెలుసుకోవడం మనలో ఏదైనా ఒకటి దానిలో లేకుంటే అది మనలో వచ్చే విధంగా మనం ప్రయత్నం చేయడం కూడా తప్పనిసరి.

అందులో మొట్ట మొదటి విషయం. సిఫారసు యొక్క సర్వాధికారం కేవలం అల్లాహ్ చేతిలో ఉన్నదన్న విషయాన్ని మనం దృఢంగా నమ్మాలి. ఎందుకంటే మహాశయులారా! నమ్మకం ఎంత బలహీనం అయిపోతుందో, అంతే పుణ్యాత్ములను, బాబాలను, దర్గాలను ఇంకా వేరే ఎవరెవరినో మనం ఆశించి వారు మనకు సిఫారసు చేస్తారు అని వారి వద్దకు వెళ్లి కొన్ని పూజ పునస్కారాలు, కొన్ని ఉపాసనాలు, కొన్ని ఆరాధనలు వారి సంతోషానికి అక్కడ చేసే ప్రయత్నాలు ఈ రోజుల్లో ప్రజలు చేస్తున్నారు. అయితే ఆ ప్రళయ దినాన ఎవరి సిఫారసు చెల్లదు. ఎవరు కూడా ఏ సిఫారసు చేయలేరు. ఎవరికీ కూడా ఏ అధికారం ఉండదు. సర్వాధికారం సిఫారసు గురించి, అన్ని రకాల సిఫారసులకు ఏకైక అధికారుడు కేవలం అల్లాహ్ మాత్రమే.

రెండవ విషయం మనం తెలుసుకోవలసినది ప్రళయ దినాన ఎక్కడా కూడా, ఏ ప్రాంతంలో కూడా అల్లాహ్ అనుమతి లేనిది ఏ ఒక్కరు నాలుక విప్పలేరు, మాట మాట్లాడలేరు. ఆయతల్ కుర్సీ అని ఏదైతే మనం ఆయత్ చదువుతామో సూరయే బకరా లో ఆయత్ నెంబర్ 255. అందులో చాలా స్పష్టంగా ఈ విషయం అల్లాహు తఆలా తెలియజేసాడు. مَن ذَا الَّذِي يَشْفَعُ عِنْدَهُ إِلاَّ بِإِذْنِهِ మన్ జల్లజీ యష్ ఫవూ ఇన్ దహూ ఇల్లా బి ఇజ్నిహీ ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయగలవాడెవడు? .అరబీ గ్రామర్ ప్రకారంగా ఈ పదాల కూర్పును కూడా గమనించండి. చెప్పే విధానాన్ని కూడా గమనించండి. ఎవరు అతను? ఎవరికి అలాంటి అధికారం ఉన్నది? ఎవరు చేయగలుగుతారు ఈ కార్యం? అతని వద్ద సిఫారసు చేసేటటువంటి అధికారం ఎవరికి ఉన్నది? ఆయన అనుమతి లేకుండా, ఆయన పర్మిషన్ లేకుండా ఎవరు చేయగలుగుతారు? ఎవరికి అంతటి శక్తి, సామర్థ్యం ఉన్నది? రెండో విషయం ఏంటి? అల్లాహ్ అనుమతి లేనిది ఎవరు కూడా సిఫారసు చెయ్యలేరు, ఎవరు నోరు విప్పలేరు, మాట మాట్లాడలేరు.

మూడో విషయం మనం తెలుసుకోవలసినది. అల్లాహ్ అనుమతి ఇచ్చిన వారే సిఫారసు చేస్తారు అని కూడా మనకు రెండో విషయం ద్వారా తెలిసింది కదా! ఇక అల్లాహ్ ఎవరికి అనుమతి ఇస్తాడు? ఆయన ఇష్టపడిన వారికే సిఫారసు చేసే అనుమతి ఇస్తాడు. ఇక ఈ విషయము ఇహలోకంలో మనం ప్రత్యేకంగా ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం), సామాన్యంగా ఇతర ప్రవక్తలు తప్ప పేరు పెట్టి ఫలాన వ్యక్తి కూడా సిఫారసు చేయగలుగుతాడు, అల్లాహ్ అతనికి అనుమతి ఇస్తాడు అని మనం చెప్పలేము. ఎందుకంటే అలాంటి ఏ ఆధారము ఖురాన్ మరియు హదీత్ లో లేదు. విషయాన్ని గమనిస్తున్నారా! మూడో విషయం ఏంటి? అల్లాహ్ ఎవరి పట్ల సంతోషంగా ఉంటాడో వారికే అనుమతిస్తాడు. ముందు దీని యొక్క ఆధారం వినండి.

۞ وَكَم مِّن مَّلَكٍۢ فِى ٱلسَّمَـٰوَٰتِ لَا تُغْنِى شَفَـٰعَتُهُمْ شَيْـًٔا إِلَّا مِنۢ بَعْدِ أَن يَأْذَنَ ٱللَّهُ لِمَن يَشَآءُ وَيَرْضَىٰٓ

సూరా నజ్మ్ ఆయత్ నెంబర్ 26. “ఆయన ముందు ఎవరు కూడా సిఫార్సు చేసే అధికారం కలిగిలేరు. ఆయన అనుమతి ఇచ్చిన తర్వాత మాత్రమే ఎవరైనా సిఫారసు చేయగలుగుతారు. కానీ అల్లాహ్ ఎవరి పట్ల ఇష్టపడతాడో మరియు ఎవరి గురించి కోరుతాడో అతనికి మాత్రమే అల్లాహు తఆలా అనుమతి ఇస్తాడు“.

ఈ మూడో విషయం కూడా చాలా ముఖ్యమైనది. దీనిని తెలుసుకోకుంటే, దీనిని అర్థం చేసుకోకుంటే ఈరోజు చాలా నష్టం కలుగుతుంది. ప్రజలు తమ ఇష్టానుసారంగా ఇతను నాకు సిఫారసు చేస్తాడు. అంతే కాదు వారి యొక్క పేర్లతో వారి తాత ముత్తాతల పేర్లతో సంతకాలు చేయించుకొని, కాగితాలు భద్రంగా దాచుకొని సమాధుల్లో కూడా పెట్టుకుంటున్నారు. ఈవిధంగా మనకు వారి యొక్క సిఫారసు లభిస్తుంది అన్నటువంటివి ఇవన్నీ మూఢ నమ్మకాలు. అల్లాహ్ ఎవరిపట్ల ఇష్టపడతాడో, అల్లాహ్ ఎవరికి ఇష్టపడిన తర్వాత ఎవరిని కోరుతాడో వారికే అనుమతి ఇస్తాడు. ఈ ఆయత్ ద్వారా మనకు మరో విషయం కూడా బోధపడుతుంది. అల్లాహ్ ఎందరినో ఇష్టపడవచ్చు. కానీ సిఫారసు చేయడానికి అనుమతి కొందరికే ఇవ్వవచ్చు.

ఎందుకంటే నాలుగో కండీషన్, నాలుగో విషయం కూడా గుర్తుంచుకోండి. ఇప్పటివరకు ఏమి తెలుసుకున్నాం మనం? సిఫారసు చేయడానికి ఏదైతే అనుమతి కలగాలో, అల్లాహ్ ఇష్టపడిన వారికే అనుమతిస్తాడు. అయితే వీరు ఎవరి గురించి సిఫారసు చేయాలి? వారిపట్ల కూడా అల్లాహు తఆలా ఇష్టపడాలి. వారి యొక్క మాట, వారి యొక్క విశ్వాసం, వారి యొక్క జీవిత విధానం ఇదంతా కూడా అల్లాహ్ కు ఇష్టమైన రీతిలో ఉన్నప్పుడే అల్లాహ్ తెలియపరుస్తాడు నీవు సిఫారసు చేయాలి, ఇతని గురించి చేయాలి అని.

ఉదాహరణకు అల్లాహ్ ఒక వ్యక్తికి అనుమతి ఇచ్చాడు అనుకోండి. నీవు సిఫారసు చెయ్యి అని. అయితే తాను కోరిన వారందరికీ సిఫారసు చేసే అధికారం ఉండదు. అల్లాహు తఆలా కొన్ని హద్దులు నిర్ణయిస్తాడు. కొన్ని షరతులు నిర్ణయిస్తాడు. నిబంధనలు పెడతాడు. వాటిలో ఒకటి ముఖ్యమైనది ఏమిటి? ఎవరి గురించి సిఫారసు చెయ్యాలో వారిపట్ల కూడా అల్లాహు తఆలా సంతోషంగా ఉండాలి.

సూరయే మర్యమ్ ఆయత్ నెంబర్ 87. “అల్లాహ్ వద్ద ఎవరైతే తన ఒడంబడికను నిలుపుకున్నారో అలాంటి వారికే సిఫారసు లభిస్తుంది“. సిఫారసు చేసే హక్కు గాని, మరియు సిఫారసు పొందే హక్కు గాని. ఎందుకంటే అల్లాహ్ తో ఏ వాగ్దానం ఉన్నదో ప్రత్యేకంగా “కలిమె తయ్యిబా” కు సంబంధించిన వాగ్దానం. అందులో మనిషి ఏమాత్రం వెనక ఉండకూడదు.

మరియు సూరా తాహా ఆయత్ నెంబర్ 109 లో “ఆ రోజు ఎవరి సిఫారసు ఎవరికీ ఎలాంటి లాభం చేకూర్చదు. కేవలం అల్లాహ్, రహ్మాన్ అనుమతించిన వారికి మరియు ఎవరి మాట, ఎవరి పలుకుతో అల్లాహ్ ఇష్టపడ్డాడో వారు మాత్రమే“.

ఈవిధంగా మహాశయులారా! ఈ ఆయతులు అన్నింటినీ పరిశీలించండి. ఈ రోజుల్లో ఈ విషయాలు, ఈ సత్యాలు తెలియక సిఫారసు కు సంబంధించిన పెడ మార్గంలో, తప్పుడు భావంలో ఏదైతే పడి ఉన్నారో, వాటి నుండి మనం బయటికి రావడం తప్పనిసరి. ఆ తప్పుడు మార్గాలు ఏమిటి? సిఫారసు కు సంబంధించిన దుర నమ్మకాలు, మూడనమ్మకాలు, దుర విశ్వాసాలు ఏమిటి? ఇన్షా అల్లాహ్ తరువాయి భాగంలో మనం తెలుసుకుందాం.

43:86  وَلَا يَمْلِكُ الَّذِينَ يَدْعُونَ مِن دُونِهِ الشَّفَاعَةَ إِلَّا مَن شَهِدَ بِالْحَقِّ وَهُمْ يَعْلَمُونَ

అల్లాహ్‌ను వదలి వీళ్లు ఎవరెవరిని మొరపెట్టుకుంటున్నారో వారికి, సిఫారసుకు సంబంధించిన ఏ అధికారమూ లేదు. కాని సత్యం గురించి సాక్ష్యమిచ్చి, దానికి సంబంధించిన జ్ఞానమున్న వారు మాత్రం (సిఫారసుకు యోగ్యులు).” (సూరా అజ్ జుఖ్ రుఫ్ 43:86)

ఇక్కడ మనం సూరయే జుఖ్ రూఫ్ ఆయత్ నెంబర్ 86 లో కూడా పరిశీలించడం చాలా లాభదాయకం. “ఎవరైతే అల్లాహ్ ను వదిలి ఇతరులను పూజిస్తున్నారో, ఆరాధిస్తున్నారో, ఇతరులతో దుఆ చేస్తున్నారో, ఆరాధిస్తున్నారో వారు ఎలాంటి సిఫారసుకు అధికారులు కాజాలరు”. అల్లాహు అక్బర్.

సిఫారసుకు సంబంధించిన దురనమ్మకం, మూడ విశ్వాసం, ఎవరైతే అల్లాహ్ ను వదిలి అల్లాహ్ తో దుఆ చేయకుండా, ఇతరులతో దుఆ చేస్తున్నారో వారి యొక్క సిఫారసు పొందాలని కోరుతున్నారో వారికి ఎలాంటి సిఫారసు లభించదు. ఎవరైతే సత్యానికి సాక్ష్యం పలికి ఉంటారో ‘లా ఇలాహ ఇల్లల్లాహ్‘ కు సాక్ష్యం పలికి ఉంటారో, వారు దాని యొక్క భావాలను, అర్ధ భావాలను కూడా తెలుసుకొని ఉంటారో. లా ఇలాహ ఇల్లల్లాహ్ సాక్ష్యం పలకడం ఏంటిది? దాని అర్థ భావాలను తెలుసుకోవడం ఏంటిది? సాక్ష్యం పలకటం అంటే నోటితో పలకడం అని సామాన్యంగా మనం అనుకుంటాము కదా! కానీ దాని యొక్క అర్ధ భావాలను తెలుసుకోవడం అంటే అల్లాహ్ కు ఎవరినీ భాగస్వామిగా కలపకపోవడం. దుఆ లో, మొక్కుబడులలో, సజ్దాలో, సాష్టాంగ పడటంలో, రుకూ చేయడంలో ఇంకా వేరే ఎన్ని ఆరాధనకు సంబంధించిన ఎన్ని రకాలు ఉన్నాయో వాటిలో అల్లాహ్ తో పాటు ఇంకా ఎవరిని కూడా మనం భాగస్వామిగా చెయ్యకూడదు. ఆరాధనకు సంబంధించిన ఏ ఒక్క భాగం కూడా అల్లాహ్ తప్ప ఇతరులకు చేయకూడదు.

ఈరకంగా ఎవరైతే తన విశ్వాసం మరియు ఏకేశ్వరోపాసన లో షిర్క్ లేకుండా నమాజ్ యొక్క పాబంది చేస్తూ తన నాలుకను కూడా కాపాడుకుంటూ ఉంటాడో, ప్రజల్ని దూషిస్తూ, ప్రజల యొక్క పరోక్ష నింద చేస్తూ, చాడీలు చెప్పుకుంటూ ఇతరులలో ఎలాంటి అల్ల కల్లోలం జరపకుండా నాలుకను కాపాడుకుంటాడో అలాంటి వారే సిఫారసును పొందగలుగుతారు.

చివరిలో ఒక హదీత్ కూడా వినండి ప్రవక్త మహనీయ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు. “మాటిమాటికి ప్రజల్ని శపించేవారు, శాపనార్థాలు పెట్టేవారు ప్రళయ దినాన సాక్షానికి కూడా అర్హులు కారు, సిఫారసుకు కూడా అర్హులు కారు“. సహీ ముస్లింలోని హదీస్ నెంబర్ 4703. ఎంత గంభీర్యమైన విషయమో గమనించాలి. సిఫారసు ఎలాంటి వారు పొందలేరు అని ఇందులో తెలపడం జరుగుతుంది.

ఇన్షా అల్లాహ్ తరువాయి భాగంలో సిఫారసు కు సంబంధించిన మూడ నమ్మకాలు ఏంటి? దుర విశ్వాసాలు ఏంటి? మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.

జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వ బరకాతుహు.


పూర్తి భాగాలు క్రింద వినండి 

మరణాంతర జీవితం – పార్ట్ 14: ప్రళయ దినాన సిఫారసు ఎప్పుడు ఏ సందర్భంలో ఎవరికి లభిస్తుంది – పార్ట్ 01 [ఆడియో, టెక్స్ట్]

బిస్మిల్లాహ్

మరణాంతర జీవితం – పార్ట్ 14 [ఆడియో]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

పార్ట్ 14. ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [ 21:21 నిముషాలు]

అస్సలామ్ అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలామ్ అలా రసూలుల్లాహ్ అమ్మాబాద్.

ప్రళయ దినాన సిఫారసు ఎప్పుడు? ఏ సందర్భంలో? ఎవరికి లభిస్తుంది? అనే విషయాలు ఈనాటి శీర్షికలో మనం తెలుసుకుందాం.

మహాశయులారా! గత కార్యక్రమంలో మనం మహా మైదానంలో దీర్ఘ కాలాన్ని భరించలేక ప్రజలు అల్లాహ్ అతి త్వరలో తీర్పు చేయడానికి, రావడానికి సిఫారసు కోరుతూ ప్రవక్తల వద్దకు వెళ్తే చివరికి ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) సిఫారసు చేయడానికి ఒప్పుకుంటారు అన్న విషయాల వివరాలు మనం తెలుసుకున్నాము. అయితే సిఫారసుల విషయం వచ్చింది కనుక సిఫారసుకు సంబంధించిన ఇతర విషయాలు కూడా మనం కొన్ని తెలుసుకొని ఉంటే చాలా బాగుంటుంది.

ప్రవక్త మహనీయ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక సందర్భంలో తెలిపారు. “ప్రతి ప్రవక్తకు అల్లాహ్ (తఆలా) ఒక దుఆ చాన్సు ఇచ్చాడు. తప్పకుండా దానిని స్వీకరిస్తాను అని కూడా వారికి శుభవార్త తెలిపాడు. అయితే గత ప్రవక్తలందరూ కూడా ఆ దుఆ ఇహలోకంలోనే చేసుకున్నారు. అది వారికి స్వీకరించబడినది కూడా. అయితే ఇలాంటి దుఆ నాకు ఏదైతే ఇవ్వడం జరిగిందో నేను నా అనుచర సంఘం యొక్క సిఫారసు ప్రళయ దినాన చేయడానికి నేను అక్కడ గురించి దాచి ఉంచాను. ఇహలోకంలో ఆ దుఆ నేను చేసుకోలేదు. ప్రళయ దినాన నా అనుచర సంఘం యొక్క సిఫారసు చేయడానికి నేను దానిని అలాగే భద్రంగా ఉంచాను“. [సహీ బుఖారీ హదీస్ నెంబర్ 6305]

మహాశయులారా! అంతిమ ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి జీవితాన్ని చదవండి. ఆయన సర్వమానవాళి కొరకే కాదు, ఈ సర్వ లోకాల వైపునకు కారుణ్యమూర్తిగా ఏదైతే పంపబడ్డారో, ఆయన తన అనుచర సంఘం గురించి ఇహలోకం లోనే కాదు, పరలోకంలో కూడా ఎంతగా చింతిస్తారో, అక్కడ కూడా వారు నరకంలో పోకుండా ఉండడానికి సిఫారసులు చేయడానికి ఎలా సిద్దం అవుతున్నారో, ఆ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని ఈ రోజు ప్రజలు తెలుసుకోకుండా ఆయనపై బురద జల్లే ప్రయత్నము ఎందరో చేస్తున్నారు. కానీ మనం మన ముఖాన్ని మీదికి చేసి సూర్యుని వైపునకు ఉమ్మివేస్తే సూర్యునికి ఏదైనా నష్టం చేకూరుతుందా?

మహాశయులారా! ఇలాంటి దయామయ, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ని, ఆయన బాటను అనుసరించి, ఆయన చూపిన విధానాన్ని అనుసరించి మన జీవితం గడిపితే మనమే ధన్యులం అవుతాము. మరో సందర్భంలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు – “ప్రళయ దినాన ఎవరైతే ఇహలోకంలో విశ్వాసం ఉండి, కొన్ని ఘోర పాపాలకు గురి అయ్యారో వారికి కూడా నా సిఫారసు లభిస్తుంది“. [సునన్ అబూదావూద్ హదీత్ నెంబర్ 4739]

అయితే ఎవరెవరికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి యొక్క సిఫారసు లభించవచ్చునో మరికొన్ని హదీసుల ఆధారంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం.

రెండవ సందర్భం: సహీ ముస్లిం హదీత్ నెంబర్ 333 లో హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు – “ప్రళయదినాన తీర్పు మరియు ఆ మహా మైదానంలో జరిగే అటువంటి అన్ని మజిలీలు పూర్తి అయిన తర్వాత ఎప్పుడైతే స్వర్గంలోకి ప్రవేశం జరుగుతుందో, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు చెప్పారు: నేను స్వర్గం ద్వారానికి వస్తాను, స్వర్గము యొక్క ద్వారం తెరవండి అని అక్కడ నేను కోరతాను. అప్పుడు స్వర్గపు దారం పై ఉన్నటువంటి దాని యొక్క రక్షక భటుడు మీరు ఎవరు? అని అడుగుతాడు. నేను అంటాను “ముహమ్మద్”. అప్పుడు అతను అంటాడు – “నీ గురించే అందరికంటే ముందు ఈ ద్వారం తెరవాలి అని నాకు అనుమతించడం జరిగింది. నాకు చెప్పడం ఆదేశించడం జరిగింది. నీకంటే ముందు ఎవరికొరకు కూడా ఈ ద్వారం తెరవకూడదు“.

మరో ఉల్లేఖనంలో ఉంది. “స్వర్గ ప్రవేశానికై సిఫారసు చేసేవారిలో, అందరికంటే తొలిసారిగా నేనే సిఫారసు చేస్తాను”. ఈ విధంగా గొప్ప సిఫారసు కాకుండా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారికి ప్రత్యేకంగా స్వర్గపు ద్వారం తెరవడానికి కూడా సిఫారసు చేస్తారు. ఆ తరువాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అందరికంటే ముందు ప్రవేశిస్తారు. వారి తర్వాత వారి యొక్క అనుచరులు ప్రవేశిస్తారు.

మూడవ సందర్భం ఎక్కడైతే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు సిఫారసు చేస్తారో వాటిలో ఒకటి వారి యొక్క పినతండ్రి అబూ తాలిబ్ గురుంచి. వారి యొక్క పినతండ్రి అబూ తాలిబ్ చివరి ఘడియ వరకు కూడా, ఆయన మరణ వేదనకు గురి అయ్యే వరకు కూడా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కి ఆయన తోడు లభించింది. కానీ ఆయన ఇస్లాం ధర్మాన్ని స్వీకరించలేదు. ఇస్లాం ధర్మానికి సపోర్ట్ చేశారు. ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)ని ఆదుకున్నారు. అల్లాహ్ దయ తర్వాత, ఆయన ఉన్నంత కాలం వరకు ఎన్నో సందర్భాలలో మక్కా యొక్క ముష్రికులు ప్రవక్త గారిని హత్య చేద్దాం అన్నటువంటి దురాలోచనకు కూడా వెనకాడలేదు. కానీ అబూతాలిబ్ ని చూసి వారు ధైర్యం చెయ్యలేక పోయేవారు.

అయితే అబూతాలిబ్ చివరి సమయంలో, మరణ వేదనలో ఉన్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అప్పుడు కూడా పినతండ్రి వద్దకు వెళ్లి, మీరు తప్పకుండా ‘లా ఇలాహ ఇల్లల్లాహ్‘ చదవండి. కనీసం ఒక్కసారైనా చదవండి. నేను అల్లాహ్ వద్ద నీ గురించి సిఫారసు చేసే ప్రయత్నం చేస్తాను. కానీ ఆయన శ్వాస వీడేకి ముందు “నేను నా తాత ముత్తాతల ధర్మంపై ఉన్నాను” అని అంటారు. అందువల్ల ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారికి చాలా బాధ కలుగుతుంది. అల్లాహ్ (తఆలా) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారికి ఒక రకమైన ఓదార్పు ఇస్తారు. ఇది కూడా ఒక రకంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి గురించి ఒక గొప్ప విశిష్టత. అదేమిటంటే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి యొక్క సిఫారసు వల్ల అబూతాలిబ్ కి నరకంలోని శిక్షలో కొంచెం తగ్గింపు జరుగుతుంది కానీ నరకంలో నుండి మాత్రం బయటికి రాలేరు. ఆ తగ్గింపు ఏదైతే జరుగుతుందో, అది కూడా ఎంత ఘోరంగా ఉందో, ఒక్కసారి ఆ విషయాన్ని గమనించండి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన బంధువుల వారికి సిఫారసు చేసుకొని కాపాడుకున్నారు అన్నమాట కాదు, [అదే హదీస్ లో సహీ బుఖారీ హదీస్ నెంబర్ 1408 మరియు సహీ ముస్లిం 360] ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు తెలిపారు. “నేను సిఫారసు చేసినందుకు అల్లాహ్ (తఆలా) ఆయన్ని నరకంలోని తక్కువ శిక్ష ఉండే అటువంటి భాగంలో ఏదైతే వేశాడో, ఆ శిక్ష ఎలాంటిది? ఆయన చీలమండలాల వరకు నరకం యొక్క అగ్ని చేరుకుంటే, దాని మూలంగా మెదడు ఉడుకుతున్నట్లుగా, వేడెక్కుతున్నట్లుగా ఆయన భరించలేక పోతారు“.

మహాశయులారా! నాలుగో సందర్భం, ప్రవక్త మహానీయ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారికి ప్రత్యేకంగా ఒక సిఫారసు యొక్క హక్కు ఏదైతే ఇవ్వడం జరుగుతుందో, అది ఎలాంటి లెక్క, తీర్పు లేకుండా, శిక్ష లేకుండా స్వర్గంలో ప్రవేశించడానికి సిఫారసు చేయడం. దాని యొక్క వివరాలు సహీ బుఖారీ హదీత్ నెంబర్ 4343, సహీ ముస్లిం 287. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు. “ఆ రోజున నేను చాలా సేపటి వరకు సజ్దాలో పడి ఉంటాను. అల్లాహ్ (తఆలా) ఓ మహమ్మద్! నీ తల ఎత్తు అని అంటాడు. నేను తల ఎత్తుతాను. అప్పుడు అల్లాహ్ (తఆలా) ఇది మరోసారి నువ్వు అడుగు. నువ్వు అడుగుతున్న విషయం నీకు ఇవ్వబడుతుంది. మరి నీ సిఫారసు చెయ్యి నీ యొక్క సిఫారసు స్వీకరించబడుతుంది. అప్పుడు నేను నా తలెత్తి ఓ అల్లాహ్! ఓ నా ప్రభువా! నా అనుచర సంఘం, నా అనుచర సంఘం, నా అనుచర సంఘం అని నేను అంటాను. అప్పుడు ఓ మహమ్మద్! నీ అనుచర సంఘంలో ఇంత మందిని ఎలాంటి లెక్క తీర్పు, శిక్ష ఏమి లేకుండా స్వర్గపు యొక్క ద్వారాల్లోని కుడి ద్వారం గుండా వారిని ప్రవేశింప చేయి”. అల్లాహు అక్బర్. అల్లాహ్ నన్ను, మిమ్మల్ని, మనందరినీ కూడా ప్రవక్త సిఫారసు నోచుకొని ఆ స్వర్గములోని కుడివైపున ఉన్న మొదటి ద్వారం గుండా ప్రవేశించేటువంటి భాగ్యం ప్రసాదించు గాక.

మహాశయులారా! ఎంత గొప్ప విషయం. అయితే అక్కడే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు. “అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ మరో శుభవార్త ఇస్తాడు. అదేమిటంటే ఎలాంటి శిక్ష, తీర్పు లేకుండా ప్రవేశించేవారు వారికి ప్రత్యేకంగా ఈ ద్వారము, కానీ వారు తలచుకుంటే ఏ ద్వారం గుండానైనా వారు ప్రవేశించవచ్చు.”

ఈ విధంగా ప్రవక్త మహనీయ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారికి ప్రత్యేకంగా ఈ నాలుగు రకాల సిఫారసులు ఇవ్వబడతాయి.

ఇవే కాకుండా, ఇంకా వేరే ప్రవక్తలకు కూడా అల్లాహ్ (తఆలా) వేరే సందర్భాలలో సిఫారసు చేసేటటువంటి హక్కు ఇస్తాడు మరియు వారికి సిఫారసు విషయంలో ఒక హద్దును కూడా నిర్ణయించడం జరుగుతుంది. వారు సిఫారసు చేస్తారు, అల్లాహ్ వారి సిఫారసును అంగీకరిస్తాడు కూడా. అలాంటి సిఫారసుల్లో ఒకటి ఎవరైతే విశ్వాసం ఉండి, తౌహీద్ ఉండి మరియు నమాజ్ లు చేస్తూ ఉన్నారో, నమాజ్ ను వీడనాడలేదో, కానీ వేరే కొన్ని పాపాల వల్ల వారిని నరకంలో పడవేయడం జరిగిందో, అల్లాహ్ తలుచుకున్నన్ని రోజులు నరకంలో వారికి శిక్షలు పడిన తరువాత అల్లాహ్ ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారికి మరియు కొందరు ప్రవక్తలకు, మరికొందరు పుణ్యాత్ముల కు సిఫారసు హక్కు ఇస్తాడు. వారి సిఫారసు కారణంగా అల్లాహ్ (తఆలా) ఆ నరకవాసులను నరకం నుండి తీసి స్వర్గంలోకి పంపిస్తాడు. దీనికి సంబంధించిన హదీత్ లు ఎన్నో ఉన్నాయి.

కానీ సహీ ముస్లిం లో హదీత్ నెంబర్ 269, హజ్రత్ అబూ సయీద్ ఖుధ్రి (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు. ప్రళయ దినాన సిఫారసు హక్కు ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారికి లభిస్తుంది. ప్రవక్తలకు లభిస్తుంది. అంతేకాకుండా పుణ్యాత్ములైన విశ్వాసులు అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ తో సిఫారసు చేస్తూ ఉంటారు. “ఓ అల్లాహ్! నరకంలో కొంతమంది పడి ఉన్నారు. వారు మాతో ఉపవాసాలు పాటించేవారు. మాతో పాటు వారు నమాజ్ చేసేవారు. మాతో పాటు వారు హజ్ చేసేవారు. కాని వేరే కొన్ని కారణాల వల్ల, వేరే కొన్ని పాపాల వల్ల నరకంలో వచ్చి పడిఉన్నారు. ఓ అల్లాహ్! వారిని కూడా నీవు నీ దయతో బయటికి తీసేయ్యి అల్లాహ్” అని వారు కోరుతారు. అప్పుడు వారితో చెప్పడం జరుగుతుంది – వారు నమాజ్ చేస్తూ ఉండేవారు గనుక వారు చేసే సజ్దాల యొక్క గుర్తు వారి నొసటిపై ఉంటుంది. ఆ నొసటి భాగాన్ని నరకాగ్నిలో ఏమాత్రం నష్టపరచదు. అల్లాహ్ ఆ సందర్భంలో మీరు ఎవరిని వారిలో గుర్తుపట్ట గలుగుతారో వారిని బయటికి తీయండి. అయితే వారు ఎలా గుర్తుపడతారు? నరకంలో కాలిన తరువాత వారు మారిపోతారు కదా? కానీ తౌహీద్ యొక్క శుభం వల్ల, నమాజు సరైన విధంగా పాటిస్తూ ఉన్నందువల్ల వారి ముఖాలను మాత్రం అగ్ని ఏమాత్రం కాల్చదు. వారి యొక్క ఆ ముఖాలను అగ్ని పై నిషేధింపబడినది గనుక అగ్ని ఆ ముఖాలకు ఎలాంటి నష్టం చేకూర్చలేదు గనుక, వారు తమ స్నేహితులను ఈ విధంగా గుర్తుపడతారు“. [సహీ బుఖారీ లోని హదీత్ లో ఉంది]

అంటే ఏం తెలుస్తుంది దీని ద్వారా? కేవలం కలిమా చదువుకుంటే సరిపోదు, ఏ ఒక్క నమాజ్ ను కూడా విడనాడకూడదు. నమాజ్ యొక్క ప్రాముఖ్యత చాలా గొప్పగా ఉంది. అల్లాహ్ దయ తర్వాత, నమాజ్ యొక్క శుభాల వల్లనే వారి యొక్క ముఖాలు నరకములో కాలకుండా, నరకం అగ్నిలో ఉన్నా గానీ, నరక గుండంలో ఉన్నాగాని ఎలాంటి మార్పు అనేది వారి ముఖాల్లో రాదు. అల్లాహు అక్బర్.

ఈ విధంగా ప్రవక్తలు, పుణ్యాత్ములు, ఉత్తమ విశ్వాసులు వారందరూ కలిసి అల్లాహ్ తో సిఫారసు చేసి, ఎంతో పెద్ద సంఖ్యను నరకంలో నుండి బయటికి తీపిస్తారు. ఆ తర్వాత అల్లాహ్ అంటాడు – “దైవదూతలు సిఫారసు చేశారు. ప్రవక్తలు సిఫారసు చేశారు. విశ్వాసులు సిఫారసు చేశారు. ఇక మిగిలి ఉన్నది కేవలం ఆ కరుణామయుడైన, అందరికంటే ఎక్కువగా కరుణించే కృపాశీలుడు మాత్రమే మిగిలి ఉన్నాడు.” అప్పుడు అల్లాహ్ (తఆలా) తన పిడికిలిలో నరకంలో నుండి ఒక పెద్ద సంఖ్యను తీస్తాడు బయటికి. వారు వేరే ఇంకా ఏ సత్కార్యాలు చేయలేక ఉంటారు.

ఈ విధంగా మహాశయులారా! అల్లాహ్ (తఆలా) ప్రవక్తలకు, దైవదూతలకు, విశ్వాసులకు సైతం మిగతా విశ్వాసుల్లో ఎవరైతే పాపాలు చేసి ఉన్నారో వారికి సిఫారసు చేయడానికి అధికారం, హక్కు ఇచ్చి ఉంటాడు. మరియు వారి సిఫారసును స్వీకరించి ఎంతోమంది నరకవాసులను నరకం నుండి బయటికి తీస్తాడు. దీనికి సంబంధించిన మరొక హదీత్ మీరు గమనించండి అందులో ఎంత ముఖ్య విషయం ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) బోధించారో దానిపై దృష్టి వహించండి.

ఈ హదీత్ సునన్ తిర్మిదీ లో ఉంది. హదీస్ నెంబర్ 2441. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు. “నా ప్రభువు వైపు నుండి నా వద్దకు వచ్చే ఒక వ్యక్తి వచ్చాడు మరియు నాకు ఛాయస్ ఎన్నుకోండి అని చెప్పాడు. ఏమిటి? నీ అనుచర సంఘంలోని సగం మందిని స్వర్గం లో చేర్పిస్తానని లేదా నీకు సిఫారసు యొక్క హక్కు కావాలా? అని. అయితే నేను సిఫారసు యొక్క హక్కు లభిస్తే బాగుంటుంది అని దాన్ని ఎన్నుకున్నాను. ఆ తర్వాత ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు. అయితే ఈ నా సిఫారసు ఎవరికి లభిస్తుంది అంటే ఎవరైతే అల్లాహ్ తో పాటు ఎవరిని భాగస్వామిగా చేయకుండా ఉండే స్థితిలో చనిపోతాడో అలాంటి వానికే నా ఈ సిఫారసు ప్రాప్తమవుతుంది“. అల్లాహు అక్బర్.

ఇంతకు ముందు హదీస్ లో సహీ ముస్లిం లో గమనించారు కదా! వారి యొక్క ముఖాలను అగ్ని ఏమాత్రం కాల్చదు, మార్చదు అని. అది నమాజ్ యొక్క శుభం మరియు ఆ విశ్వాసులు అంటారు – “ఈ నరకవాసులు మాతో నమాజ్ చేసే వారు, హజ్ చేసేవారు, ఉపవాసాలు ఉండేవారు” అంటే ఈ ఇస్లాం యొక్క ఐదు పునాదులు ఏవైతే ఉన్నాయో “లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్” యొక్క సత్యమైన సాక్ష్యం నమాజ్ చేయడం, విధి దానం చెల్లించడం, ఉపవాసాలు పాటించడం, శక్తి ఉన్నవారు హజ్ చేయడం. ఇది ఎంత ప్రాముఖ్యత గల విషయమో గమనించండి.

ఈ శీర్షిక ఇంకా సంపూర్ణం కాలేదు. తర్వాత భాగంలో కూడా దీని కొన్ని మిగతా విషయాలు మనం విందాము. అల్లాహ్ (తఆలా) మనందరికీ ప్రవక్త సిఫారసు ప్రాప్తం చేయు గాక!

జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వ బరకాతుహు.


పూర్తి భాగాలు క్రింద వినండి 

మరణాంతర జీవితం – పార్ట్ 13: పరలోక దినాన మహా మైదానంలో జరిగే అతి గొప్ప సిఫారసు [ఆడియో, టెక్స్ట్]

బిస్మిల్లాహ్

మరణాంతర జీవితం – పార్ట్ 13 [ఆడియో]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

పార్ట్ 13. ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [ 21:58 నిముషాలు]

అస్సలామ్ అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలామ్ అలా రసూలుల్లాహ్ అమ్మాబాద్.

ఈనాటి మన శీర్షిక – పరలోక దినాన సిఫారసు అవసరం. మహాశయులారా! ఆ దినం యాభై వేల సంవత్సరాల పరిమాణం గల దినం. ప్రజలు అక్కడ ఒక మైలు దూరంలో ఉన్న సూర్యుని కింద ఉండి, పాపాల కారణంగా వారి చెమటలు కారుతూ, డెబ్బై గజాల దూరం వరకు కూడా వారి వెనక ఉండి, వారు స్వయంగా తమ చెమటల్లో కొందరు చీలమండలాల వరకు, మరి కొందరు మోకాళ్ళ వరకు, మరి కొందరు నడుము వరకు, మరికొందరు మెడ వరకు ఈ విధంగా ఏదైతే మునిగి ఉంటారో, కాలం చాలా దీర్ఘంగా గడుస్తూ పోతుంది. కొందరైతే ఈ దీర్ఘ సమయాన్ని భరించలేక మేము నరకంలో పోయినా, మా పట్ల తీర్పు నరకం గురించి అయినా సరే కానీ, ఇక్కడ ఏ కష్టాలు అయితే భరిస్తున్నామో ప్రభువు తీర్పు కొరకు రావాలి అని ఈ వేచించడం అనేది ఈ దీర్ఘకాలం అనేది భరించలేనిది అని కోరుకుంటారు.

ఆ సందర్భంలో ఎంతో మంది కలసి మనందరి తండ్రి, ఆదిమానవుడు ఆదం (అలైహిస్సలాం) వద్దకు వెళ్తారు. “ఓ నాన్న! అల్లాహ్ మిమ్మల్ని స్వయంగా తన శుభ హస్తాలతో పుట్టించాడు. ఆత్మ మీలో ఊదాడు. మరి నిన్ను స్వర్గంలో నివసింపచేశాడు. మేము ఈరోజు ఎంత కష్టతరం లో ఉన్నామో, ఈ దీర్ఘ కాలాన్ని భరించలేక నానా రకాల ఇబ్బందులకు గురి అవుతున్నాము. మీరు అల్లాహ్ ఎదుట సిఫారసు చేసి, అల్లాహ్ త్వరగా తీర్పు చేయడానికి రావాలి అన్నట్లుగా కోరండి.”

మహాశయులారా! గమనించండి. ఇది కూడా ఆ సమయంలో అల్లాహ్ యొక్క ఎంత గొప్ప కరుణ అది ఆలోచించండి. దీర్ఘకాలం ఉంది. ఇంకా వేరే రకాల కష్టాలు ఉన్నాయి. ఇవన్నీ విషయాలు ఏదైతే మనం గత భాగాల్లో విన్నామో అవన్నీ కూడా వాస్తవం. కానీ అల్లాహ్ కొందరికి ఇలాంటి ఆలోచన కలిగించి, వారు ప్రవక్తల వద్దకు వెళ్లి సిఫారసు గురించి కోరడం అనే విషయం కూడా అల్లాహ్ యొక్క గొప్ప కరుణ, గొప్ప దయ. కానీ ఆదం (అలైహిస్సలాం) “నేను దీనికి అర్హుడిని కాను. నాతో జరిగిన పొరపాటు గురించే నేను ఎంతో బాధ పడుతున్నాను. ఈరోజు అల్లాహ్ (తాఆలా) ఎంత ఆగ్రహం, ఎంత కోపంలో ఉన్నాడంటే నేను స్వయంగా నా గురించి తప్ప ఇంకా వేరే గురించి ఆలోచించలేను.” వాస్తవానికి ఆ జరిగిన పొరపాటు అది ఆయన యొక్క కర్మ పత్రంలో లేదు. అల్లాహ్ (తఆలా) ఎన్నడో క్షమించేశాడు, మన్నించేశాడు. ఆ తర్వాత ఆయన్ని ఎన్నుకున్నారు. కానీ ఆదం (అలైహిస్సలాం) గారికి ఆ యొక్క బాధ, ఆ యొక్క రంది ఎంత ఉంటుందంటే సిఫారసు చేయడానికి నేను ఎలా అర్హుడిని కాగలుగుతాను అని అంటారు.

ఇక్కడ గమనించండి! మనకు తండ్రి అయిన ఆదం (అలైహిస్సలాం) ఒక్క పొరపాటు జరిగింది చిన్న పాటిది. దానిని మన్నించి వేయడం కూడా జరిగింది. దాని వల్ల ఆయనకి ఏశిక్ష కూడా జరగదు. అయినా ఎంత భయపడుతున్నారు. మరి ఈ రోజుల్లో మన పరిస్థితి ఏమున్నది? పాపాల పై పాపాలు ఒక్క పాపం, ఒక్క తప్పు ఏంటి? ఎన్నో రకాల తప్పులు చేస్తున్నాము. అయినా మనకు ఎన్ని ఆశలు ఉన్నాయి? ఎంత ధైర్యంగా మనం ఉంటాము. మనకు అల్లాహ్ పట్ల భయం మనలో ఏదైనా ఉందా? స్వయంగా మనమే దాని గురించి అంచనా వేసుకోవాలి.

ఆదం (అలైహిస్సలాం) అంటారు – “నేను సిఫారసు చెయ్యలేను. కావాలంటే మీరు నూహ్ వద్దకు వెళ్ళండి. ఆయన తౌహీద్ ప్రచారం చేయడానికి, షిర్క్ నుండి ఆపడానికి పంపబడిన మొట్టమొదటి ప్రవక్త, మొట్టమొదటి రసూల్. ఆయన వద్దకు వెళ్ళండి. ఆయన్ని అల్లాహ్ (తఆలా) అబ్దన్ షకూరా అని పేర్కొన్నాడు. కృతజ్ఞతలు తెలిపే దాసుడు”.

అప్పుడు ప్రజలందరూ నూహ్ (అలైహిస్సలాం) వద్దకు వెళ్లి అల్లాహ్ ఆయనకు ప్రసాదించినటువంటి అనుగ్రహాల్ని ప్రస్తావించి “మేము ఏ కష్టంలో ఉన్నామో మీరు చూస్తున్నారు. ఈ దీర్ఘకాలాన్ని భరించలేక ఎంత ఇబ్బందికి గురి అవుతున్నామో మీరు చూస్తున్నారు. రండి అల్లాహ్ వద్దకు వచ్చి ఏదైనా మీరు సిఫారసు చేయండి” అని కోరుతారు. అల్లాహు అక్బర్. నూహ్ (అలైహిస్సలాం) రాత్రి అనకుండా, పగలు అనకుండా 950 సంవత్సరాలు ప్రజల్ని అల్లాహ్ వైపునకు ఆహ్వానించడంలో, ఏకేశ్వరోపాసన వైపునకు పిలవడంలో గడిపారు. అంత గొప్ప ప్రవక్త కూడా అల్లాహ్ ఎదుట సిఫారసు చేయడానికి ఒప్పుకోవడం లేదు. “నేను దానికి అర్హుడిని కాను. నాతో జరిగిన పొరపాటు వల్ల నాకు ఈ రోజు అల్లాహ్ యొక్క ఆగ్రహానికి గురి అవుతాను అన్న భయం ఉంది. ఈరోజు అల్లాహ్ (తఆలా) నన్ను క్షమించి, నన్ను మన్నించి, నేను సురక్షితంగా ఉన్నాను అంటే ఇదే ఎంత గొప్ప విషయం.” అని అంటారు. ఆనాటి భయం ఎలా ఉందో గమనించండి. మహాశయులారా!

“అయితే మీరు ప్రవక్త ఇబ్రాహీం వద్దకు వెళ్ళండి. అల్లాహ్ ఆయన్ని సన్నిహితులుగా చేశాడు. ఖలీల్ అన్న బిరుదు ప్రసాదించాడు”. ఆ తర్వాత ప్రజలు ఇబ్రాహీం (అలైహిస్సలాం) వద్దకు వస్తారు. ఇబ్రాహీం (అలైహిస్సలాం) కు అల్లాహ్ ప్రసాదించినటువంటి అనుగ్రహాలని గుర్తు చేస్తారు. మేము ఏ ఇబ్బంది లో ఉన్నామో మీరు చూస్తున్నారు. అల్లాహ్ (తఆలా) తీర్పు చేయడానికి రావాలని మీరు అల్లాహ్ ఎదుట సిఫారసు చేయండి అని కోరుతారు. కానీ ఇబ్రాహీం (అలైహిస్సలాం) ఆయన కూడా “సిఫారసు చేయడానికి నేను అర్హుడిని కాను” అని అంటారు. ఒప్పుకోరు. “నేను ఎలా సిఫారసు చేయగలను? మీరు కావాలంటే మూసా వద్దకు వెళ్ళండి.”

ప్రజలు మూసా (అలైహిస్సలాం) వద్దకు వస్తారు. “ఓ మూసా! అల్లాహ్ ఎలాంటి అడ్డూ లేకుండా డైరెక్టుగా మీతో మాట్లాడారు. అల్లాహ్ మీకు ఇంకా ఎన్నో అనుగ్రహాలు ప్రసాదించాడు వచ్చేసేయండి. కనీసం మీరైనా సిఫారసు చేయండి” అని అంటే, మూసా (అలైహిస్సలాం) కూడా తనతో జరిగిన ఒక చిన్న పొరపాటును గుర్తు చేసుకుంటారు. అది కూడా తప్పుగా జరిగింది. అల్లాహ్ (తఆలా) దానిని మన్నించివేశాడు. తర్వాత ఎన్నుకున్నాడు. ప్రవక్తగా చేశాడు. అయినా దాని పట్ల ఆయన ఎంత భయపడుతున్నారు అంటే “నేను సిఫారసు చేయడానికి అర్హుడిని కాను” అని అంటారు.

ఈ విధంగా మహాశయులారా! తరువాత మూసా (అలైహిస్సలాం) ఆ ప్రజలతో అంటారు: “మీరు ఈసా (అలైహిస్సలాం) వద్దకు వెళ్ళండి”. మూసా (అలైహిస్సలాం) అంటే ప్రవక్త మోషే అని, ఇబ్రాహీం (అలైహిస్సలాం) అంటే ప్రవక్త అబ్రహాం అని మరియు ఈసా (అలైహిస్సలాం) అంటే ప్రవక్త యేసు క్రీస్తు అని మీకు తెలిసే ఉండవచ్చు.

అయితే మహాశయులారా! ప్రజలు ఈసా (అలైహిస్సలాం) వద్దకు వస్తారు. అల్లాహ్ ఆయనపై కురిపించిన అనుగ్రహాల్ని గుర్తు చేసి సిఫారసు చేయడానికి ముందుకు రండి అని కోరుతారు. కానీ ఆయన కూడా సిఫారసు చేయడానికి ఒప్పుకోరు. ఇక ఏమిటి పరిస్థితి? మరి ఎవరు సిఫారసు చేయడానికి రావాలి? అల్లాహ్ (తఆలా) ప్రజల మధ్య లో తీర్పు చేయడానికి ఎప్పుడు వస్తారు? అయితే మహాశయులారా! ఆ సందర్భంలో ఈసా (అలైహిస్సలాం) చిట్ట చివరి ప్రవక్త, దయామయ, దైవప్రవక్త, సర్వ మానవాళి వైపునకు కారుణ్యమూర్తిగా పంపబడిన ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి వైపునకు పంపుతూ “మీరు ఆయన వద్దకు వెళ్ళండి. అల్లాహ్ (తఆలా) ఆయన పూర్వపు మరియు వెనకటి పాపాలు అన్నిటిని కూడా మన్నించేసాడు మరియు ఆయన్ని సర్వ ప్రవక్తలకు ముద్రగా చేసి, చిట్ట చివరి ప్రవక్తగా చేసి పంపారు. మీరు ఆయన వద్దకు వెళ్ళండి” అని అంటారు.

అప్పుడు ప్రజలు ఎక్కడికి వెళ్తారు? ఏమి జరుగుతుంది? ఇక ప్రజలందరూ ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు వస్తారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి మాట విని, “సరే అల్లాహ్ నన్ను దానికి అర్హునిగా చేసాడు” అని అంటారు.

కానీ ఇక్కడ ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఇక ముందుకు ఎలా చేస్తారు? ఈ విషయాలను చాలా శ్రద్ధగా వినండి. తర్వాత మనం విశ్వాసాల్లో ఏమైనా లోపాలు ఉంటే వాటిని మనం సరిచేసుకోవాలి. ఇక ఆ తరువాత ఆ ప్రళయదినాన మనము కూడా ప్రవక్త మహనీయ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి యొక్క సిఫారసులు పొందడానికి ఎలాంటి అర్హతలు కలిగి ఉండాలో వాటిని కూడా తెలుసుకొని వాటికి కూడా మనం సిద్ధం ఉండే ప్రయత్నం చేయాలి.

ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అంటారు: నేను దానికి అర్హుడుని. కానీ వెంటనే తన ఇష్టానుసారం సిఫారసు చెయ్యలేరు. ఎందుకంటే ఆనాటి పరిస్థితి ఎలాంటిది? దైవదూతలు, ప్రవక్తలు అందరూ ఆ మైదానంలో నిలబడి ఉన్నారు. ఏ ఒక్కరు కూడా నోరు విప్పి మాట్లాడలేరు. ఎప్పటివరకైతే కరుణామయుడైన అల్లాహ్ యొక్క అనుమతి రాదో. ఆ అనుమతి వచ్చిన తర్వాత కూడా సరియైన మాట, సత్యమైన మాట మాత్రమే వారి నోట వెళుతుంది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ తరువాత అల్లాహ్ అర్ష్ కింద సజ్దాలో పడిపోతారు.

సహీ బుఖారీ లో వచ్చిన హదీత్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలుపుతున్నారు. “చాలా దీర్ఘ సమయం వరకు నేను సజ్దాలో ఉంటాను. అల్లాహ్ యొక్క పొగడ్తలు, అల్లాహ్ యొక్క ప్రశంసలు, అల్లాహ్ యొక్క స్థుతులు స్తుతిస్తూ ఉంటాను. ఆ సందర్భంలో నేను అల్లాహ్ యొక్క స్థుతులు ఏఏ విధంగా స్తుతిస్తానో ఆ సందర్భంలో అల్లాహ్ నాకు వహీ ద్వారా తెలియజేస్తాడు. చాలా సేపటి వరకు సజ్దాలో ఉన్న తర్వాత యా మహమ్మద్! అని అల్లాహ్ వైపు నుండి మాట వినబడుతుంది. “ఓ మహమ్మద్! నీ తల ఎత్తు మరియు అడుగు. నీవు అడుగుతున్న విషయం నీకు ఇవ్వబడుతుంది. నీవు అడుగుతున్న విషయం మీకు ఇవ్వడం జరుగుతుంది మరియు నీవు సిఫారసు చెయ్యి. నీ సిఫారసు అంగీకరించబడింది”.

ఆ తరువాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు. ఒక హద్దు నిర్ణయించడం జరుగుతుంది. ఈ విధంగా ప్రవక్త మహనీయ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మరోసారి సజ్దాలో పడిపోతారు. అల్లాహ్ యొక్క స్తుతులు స్తుతిస్తారు. ప్రశంసలు చెల్లిస్తారు. ఈ విధంగా అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి యొక్క సిఫారసులు అంగీకరించి ప్రజల మధ్య తీర్పు చేయడానికి హాజరవుతారు. దైవ దూతలు అందరూ కూడా బారులుతీరి ఉంటారు. అల్లాహ్ కూడా ప్రజల మధ్యలో తీర్పు చేయడానికి హాజరు అవుతాడు.

అయితే ఈ సిఫారసు యొక్క సమస్య ఏదైతే ఉందో అల్లాహ్, కరుణామయుడైన అల్లాహ్ యొక్క గొప్ప కరుణ, గొప్ప దయ ఆ పరలోక దినాన ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి యొక్క సిఫారసు, ఇంకా ఇతర ప్రవక్తల సిఫారసు మరియు ఇంకా తర్వాత పుణ్యాత్ములు, మహా భక్తులు వారి యొక్క సిఫారసు కూడా స్వీకరించబతుంది. కానీ దానికి ఇంకా వేరే కొన్ని సందర్భాలు కూడా ఉన్నాయి.

అయితే ఈ మైదానంలో అల్లాహ్ తీర్పు గురించి రావాలి అని ఏ సిఫారసు అయితే ప్రజలందరూ ఆదం, నూహ్, ఇబ్రాహీం, మూసా, ఈసా (అలైహిముస్సలాతు వ తస్లీమ్) వారితో కోరడం జరిగిందో వారు నిరాకరించారో తరువాత ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) “సరే మంచిది, నేను దాని అర్హుడ్ని, నేను అల్లాహ్ ఎదుట సిఫారసు చేస్తాను” అని అర్ష్ కింద సజ్దాలో పడిపోతారో, తర్వాత సిఫారసు గురించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కి అనుమతి లభిస్తుందో, ఈ సిఫారసులు ఎన్ని రకాలుగా ఉన్నాయో, ఎన్ని సందర్భాలలో ఉన్నాయో వాటన్నిటిలో అతి గొప్ప సిఫారసు. దీని యొక్క అర్హత ప్రవక్త మహనీయ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)కు తప్ప ఇంకా వేరే ఎవరికీ లభించదు.

మరియు ఈ సందర్భంలో ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారికి ఏ సిఫారసు ఇవ్వడం జరిగిందో, సిఫారసు స్వీకరించడం జరుగుతుందో దానినే ఖురానే మజీద్ లోని ఆయత్ సూరయే ఇస్రాలో మఖామమ్ మహ్మూద అని చెప్పడం జరిగింది. ఏంటి భావం?

సూరత్ బనీ ఇస్రాయిల్ ఆయత్ నెంబర్ 79 లో – “రాత్రి వేళ నిలబడి నిద్ర నుండి మేలుకొని తహజ్జుద్ నమాజ్ పాటించు. ఇది నీ కొరకు అదనపు నమాజ్, నఫీల్ నమాజ్. ఈవిధంగా అల్లాహ్ (తఆలా) మీకు ప్రశంసింప బడిన, ప్రశంసించదగిన ఆ గొప్ప స్థానానికి (మఖామమ్ మహ్మూద) నిన్ను చేర్చుతాడు“. మఖామమ్ మహ్ మూద అని ఏదైతే అనపడిందో, అంటే ప్రశంసించదగిన స్థానం అని.

దీని గురించి సహీ బుఖారీ లో హదీస్ ఉంది. హదీస్ నెంబర్ 1748. ప్రవక్త మహనీయ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు. “ఆనాడు ప్రజలందరూ ప్రవక్తల వెంట వెళ్లి మీరు సిఫారసు చేయండి అని కోరుతారు. వారు దానిని ఒప్పుకోరు. చివరికి నా వద్దకు వస్తారు. అప్పుడు అల్లాహ్ (తఆలా) నన్ను మఖామే మహ్ మూద్ స్థానానికి చేర్చి నా యొక్క సిఫారసును అంగీకరిస్తాడు”.

సహీ బుఖారి లోని మరో ఉల్లేఖనంలో ఉంది. హదీస్ నెంబర్ 1475. “ఎప్పుడైతే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు వస్తారో ప్రజలు అప్పుడు ప్రజలందరూ కూడా ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ని ప్రశంసించి, ఈయన దీనికి అర్హులు, ఈయన చేయగలుగుతారు అని చెప్పుకుంటూ ఉంటారు“.

ఈ విధంగా ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఈ తర్వాత వేరే సందర్భాలు ఏవైతే ఉన్నాయో, ఇంకా సిఫారసు చేయడానికి వేరే సందర్భాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రస్తావన మరి కొంత సేపటి తరువాత వస్తుంది. కానీ ఇక్కడ ఒక విషయం మనం గమనిస్తాము. అదేమిటి ఈ మఖామె మహ్ మూద్ లో, ఈ ప్రళయ దినాన, పరలోక దినాన ఆ మహామైదానం లో అల్లాహ్ ప్రజల మధ్య తీర్పు చేయడానికి రావాలి అని ఏదైతే ప్రజలు కోరుకుంటారో దీర్ఘ సమయాన్ని భరించలేక, ఆ సందర్భంలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి యొక్క సిఫారసును పొందడానికి ఇహలోకంలో ఏదైనా సత్కార్యాలు ఉన్నాయా?

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు. “ప్రళయ దినాన నా సిఫారసు పొందే అదృష్టవంతుల్లో ఒకరు – ఎవరైతే లా ఇలాహ ఇల్లల్లాహ్ తన మనుసుతో మరియు స్వచ్ఛమైన మనసుతో చదువుతారో ,అంటే ఏమిటి?, అల్లాహ్ తో పాటు ఇంకా ఎవరిని కూడా ఆయన ఆరాధనలో ఎలాంటి భాగస్వామిగా చెయ్యరు. ఆ తరువాత నమాజులను స్థాపించడం, నమాజ్ కంటే ముందు అజాన్ ఏదైతే అవుతుందో దాని యొక్క సమాధానం పలకడం“. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు. సహీ బుఖారీ లోని హదీత్ “ఎవరైతే అజాన్ తర్వాత ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై దరూద్ చదువుతారో, ఆ తరువాత క్రింది దుఆ చదువుతారో ప్రళయ దినాన వారికి నా సిఫారసు లభిస్తుంది అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు”.

అల్లాహుమ్మ రబ్బ హాదిహిద్‌ దావతిత్‌ తామ్మతి వస్సలాతిల్‌ ఖాఇమతి ఆతి ముహమ్మదనిల్‌ వసీలత వల్‌ ఫదీలత వబ్‌అస్‌హు మఖామమ్‌ మహ్‌మూద నిల్లదీ వ అత్తహు

ఈ సంపూర్ణ పిలుపునకు మరియు స్థాపించబడు నమాజునకు ప్రభువైన ఓ అల్లాహ్‌! ముహమ్మద్‌ గారికి వసీలా మరియు ‘ఫజీలా’ అనుగ్రహాన్ని మరియు ఆయనకు వాగ్దానము చేసిన ఔన్నత్యము గల మఖామే మహ్‌మూద్‌ ప్రసాదించుము

(బుఖారీ, బైహఖి 1-410)

అయితే ఇలాంటి సత్కార్యాలు చేస్తూ ఉండే ప్రయత్నం చేయాలి. మరి కొన్ని విషయాల గురించి ఇన్షా అల్లాహ్ మనం వేరే సందర్భాలలో తెలుసుకుందాము. అల్లాహ్ (తఆలా) ఆ పరలోక దినాన దీర్ఘకాలంలో ఏ సిఫారసు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారికి చేయడానికి అనుమతించడం జరుగుతుందో, ఆ సిఫారసు మనం కూడా పొందేటువంటి సత్భాగ్యం ప్రసాదించుగాక.

జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వ బరకాతుహు.


పూర్తి భాగాలు క్రింద వినండి 

మరణాంతర జీవితం – పార్ట్ 12: పరలోకంలో మహా మైదానంలో పుణ్యాత్ముల పరిస్థితి [ఆడియో, టెక్స్ట్]

బిస్మిల్లాహ్

మరణాంతర జీవితం – పార్ట్ 12 [ఆడియో]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

పార్ట్ 12. ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [ 23:35 నిముషాలు]

అస్సలామ్ అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలామ్ అలా రసూలుల్లాహ్ అమ్మాబాద్.

ఈనాటి మన శీర్షిక విశ్వాసుల్లో మరీ ఉత్తమమైన వారు, పుణ్యాత్ములు, భక్తులు, అల్లాహ్ యొక్క భయభీతి కలిగి తమ జీవితం గడిపి పుణ్యాల్లో, సత్కార్యాల్లో తమ జీవితం గడిపిన వారు. వారి యొక్క స్థానం సమాధుల నుండి లేపబడిన తర్వాత పరలోకంలో, ఆ మహా మైదానంలో వారి పరిస్థితి ఎలా ఉంటుంది?

ఎప్పుడైతే ప్రజలందరూ సమాధులు నుండి లేపబడతారో, ఆకాశాల్లో, భూమిలో ఉన్నవారందరూ కూడా భయకంపితులు అయిపోతారు, సొమ్మసిల్లి పోతారు. వారి యొక్క పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంటుంది. కానీ విశ్వాసులు, పుణ్యాత్ములు, ఎల్లవేళల్లో సత్కార్యాల్లో జీవితం గడుపుతూ పాపాల నుండి దూరం ఉండే వారు, ఎంతో భయ భక్తితో తన జీవితం గడిపేవారు, వారి గురించి అల్లాహ్ సూరతుల్ అంబియా ఆయత్ నెంబర్ 101 నుండి 103 వరకు:

إِنَّ الَّذِينَ سَبَقَتْ لَهُم مِّنَّا الْحُسْنَىٰ أُولَٰئِكَ عَنْهَا مُبْعَدُونَ لَا يَسْمَعُونَ حَسِيسَهَا ۖ وَهُمْ فِي مَا اشْتَهَتْ أَنفُسُهُمْ خَالِدُونَ لَا يَحْزُنُهُمُ الْفَزَعُ الْأَكْبَرُ

అయితే ముందు నుంచే మా వద్ద ఎవరి కొరకు మేలు ఖరారై ఉందో వారంతా నరకానికి దూరంగానే ఉంచబడతారు.వారు నరకం సవ్వడి అయినా వినరు. తమ మనసు మెచ్చిన సుఖవిలాసాల మధ్య వారు శాశ్వతంగా ఉంటారు. ఆ మహాకలవరం (కూడా) వారిని వ్యాకుల పరచదు.

అల్లాహు అక్బర్!. ఎలాంటి అదృష్టవంతులు వారు గమనించండి. మనం కూడా వారిలో ఒకరు కావడానికి ప్రయత్నం చేయాలి. ఈలోకంలో ఒకేసారి మనకి ఈ అవకాశం దొరుకుతుంది.

సూరత్ జుక్రూఫ్ ఆయత్ 68 మరియు 69 లో వారి గురించి అల్లాహ్ ఇలా తెలిపాడు –

يَا عِبَادِ لَا خَوْفٌ عَلَيْكُمُ الْيَوْمَ وَلَا أَنتُمْ تَحْزَنُونَ الَّذِينَ آمَنُوا بِآيَاتِنَا وَكَانُوا مُسْلِمِينَ

ఓ నా దాసులారా! ఈ రోజు మీకెలాంటి భయంగానీ, దుఃఖంగానీ ఉండదు. మా ఆయతులను (సూచనలను) విశ్వసించి, విధేయులు (ముస్లింలు)గా ఉన్న వారినుద్దేశించి (ఈ విధంగా అనబడుతుంది:)

ఆయతులు అంటే ఖురాన్ ఆయతులు. అల్లాహ్ పంపిన మహిమలు. ఈ ప్రపంచంలో అల్లాహ్ ఏ సూచనలు అయితే చూపిస్తున్నాడో, వేటి ద్వారానైతే మనము ఆయన ఏకత్వాన్ని గ్రహించి, పరలోకం రానున్నది, ఆయనను ఆరాధించి ఆ పరలోకదిన గాంభీర్యం, వ్యాకులత, అక్కడి యొక్క కఠినాల నుండి మనము రక్షణ పొందగలుగుతామో అని విశ్వసిస్తారో. మరియు వారు ముస్లిములుగా ఇస్లాం ప్రకారంగా జీవించి ప్రాణం పోయేంత వరకు కూడా ఇస్లాంపై స్థిరంగా ఉంటారో వారు ప్రళయ దినాన ఎప్పుడైతే అల్లాహ్ (తఆలా) వారికి అన్ని రకాల సుఖశాంతులు ప్రసాదిస్తాడో స్వయంగా వారి నోట ఇహలోకంలో కూడా అల్లాహ్ (తఆలా) చెప్పించాడు. ఏమని?

సూరతుల్ ఇన్సాన్ మరొక పేరు దానిది సూరతు ద్దహ్ర్. ఆయత్ నెంబర్ పదిలో అల్లాహ్ ఇలా తెలియపరిచాడు –

76:10  إِنَّا نَخَافُ مِن رَّبِّنَا يَوْمًا عَبُوسًا قَمْطَرِيرًا

“నిశ్చయంగా మేము మా ప్రభువు తరఫున సంభవించే అత్యంత కఠినమైన, సుదీర్ఘమైన రోజు గురించి భయపడుతున్నాము.”

“నిశ్చయంగా మేము భయపడతాము. మా ప్రభువుతో చాలా సుదీర్ఘకాలం అయిన, మరి ఎంతో కఠినతరమైన ఆ పరలోక దినం ఏదైతే ఉందో ఆ రోజున మా ప్రభువు మాకు అన్ని రకాల సౌకర్యాలు ప్రసాదించాలి లేదా అంటే ఆ రోజు చాలా కష్టతరమైనది అని మేము మా ప్రభువుతో భయపడుతూ ఉండేవారము”. అలా భయపడుతూ జీవితం గడిపి సత్కార్యాల్లో, ఎళ్లవేళల్లో నిమగ్నులై పాపాలకు దూరం ఉన్నందువల్ల అల్లాహ్ తప్పకుండా అలాంటి వారిని ఆ రోజున ఏ వ్యాకులత, ఏ కఠినతరం ఉంటుందో దాని నుండి వారిని రక్షిస్తాడు.

ఒక హదీస్ లో ఉంది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు – షేక్ అల్బానీ (రహిమహుల్లా) సిల్ సిలతుల్ సహీహాలో దానిని హసన్ అని అన్నారు. సహీహాలో హదీత్ నెంబర్ 742. అల్లాహ్ ఇలా అంటున్నాడు – “స్వయంగా అల్లాహ్ (తఆలా) తాను అందరిపై అన్ని రకాల అధికారం కలిగి అందరికీ మానం, అవమానం పాలు చేసే అటువంటి శక్తిసామర్థ్యం గల ఆయన, ఎంతో గాంభీర్యం, ఔన్నత్యం గల ఆయన, తన ప్రమాణం చేస్తూ ఏమంటున్నాడు? నేను నా దాసునికి రెండు రకాల శాంతులు మరియు రెండు రకాల భయాలు కలిపి ఇవ్వను. అంటే ఏంటి? ఎవరైతే ఇహలోకంలో భయపడుతూ, పరలోకం నాటి గురించి భయపడుతూ ఉంటారో వారికి అల్లాహ్ (తఆలా) పరలోకంలో శాంతి, ప్రశాంతత, సుఖం ప్రసాదిస్తాడు. మరి ఎవరైతే ఇహలోకంలో పరలోకానికి సంబంధించిన విషయంలో ఎలాంటి భయం లేకుండా ఎంతో ప్రశాంతంగా జీవిస్తాడో అలాంటి వ్యక్తి తప్పకుండా ప్రళయదినాన భయకంపితులకు గురి అవుతాడు. ఒకవేళ అతను ఇహలోకంలో ప్రశాంతంగా జీవించాడు. ఎలాంటి భయ కంపితులకు గురికాలేదు. పరలోకం పట్ల రవ్వంత కూడా అతనిలో భయం అనేది కలగలేదు. అలాంటి వ్యక్తిని నేను ప్రళయ దినాన, పరలోకంలో అందరినీ సమీకరించినప్పుడు అతన్ని భయానికి గురి చేస్తాను. ఒకవేళ అతను ఇహలోకంలో నాతో భయపడి ఉన్నాడు అంటే, ఒకవేళ అతను ఇహలోకంలో నాతో భయపడుతూ జీవించాడు అంటే నేను ఏ రోజునైతే ప్రజలందరినీ సమీకరిస్తానో ఆ రోజు అతనికి ప్రశాంతత, సుఖము ప్రసాదిస్తాను“.

ఈ విధంగా మనం విశ్వాసాన్ని అవలంబించి, సత్కార్యాలు చేస్తూ పాపాలకు దూరంగా ఉండి మహా గొప్ప పుణ్యాత్ముల్లో కలిసే ప్రయత్నం చేస్తే ఆ పరలోకంలో ఎంతో సుఖం ఉంటుంది. ఇదే కాకుండా ఇంకా ఎన్నో రకాల పుణ్యాలు ఉన్నాయి.

మరియు ఆరోజు ఏ రోజైతే మైదానంలో కేవలం ఒకే ఒక మైలు దూరంలో సూర్యుడు ఉంటాడో దాని వేడితో ప్రజలు తమ యొక్క చెమటలో మునిగిపోతూ ఉంటారో అక్కడ ఏదైనా నీడ ఉంటె కేవలం అల్లాహ్ యొక్క అర్ష్ సింహాసనం నీడ ఉంటుంది. దాని కింద దాని యొక్క ఛాయ, నీడ పొందే వారిలో కలిసే అదృష్టవంతులు ఎవరో ప్రవక్త మహనీయ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు.

ఏడు రకాల వారిని అల్లాహ్ (తఆలా) ఆరోజు ఏ రోజునైతే ఆయన నీడ, ఛాయ తప్ప మరి ఎక్కడ ఏ నీడ లభించదో ఏడు రకాల వారిని తన నీడలో వారికి ఛాయ ప్రసాదిస్తాడు. ఎవరు ఆ ఏడు రకాల వారు?

1. న్యాయ వంతుడు అయిన నాయకుడు. ఇక్కడ ఇమామ్ అంటే ఇంటికి కూడా నాయకుడు. వీధికి కూడా నాయకుడు. కుటుంబానికి నాయకుడు. గల్లి నుండి ఢిల్లీ వరకు, గ్రామం నుండి మొత్తం దేశం వరకు ఏఏ లెవెల్లో ఎవరు నాయకత్వం వహిస్తున్నార్రో ఎవరు తమ నాయకత్వం లో ఉన్నవారి పట్ల న్యాయం వహిస్తారో వారికి కూడా ఆ రోజు నీడ లభిస్తుంది.

2. రెండో రకమైన వారు యువకుడు, ఏ యువకుడు అయితే తన యవ్వనాన్ని తన ప్రభువు యొక్క ఆరాధనలో గడిపాడో!. అల్లాహు అక్బర్ . యువకులారా ఆరాధనా అంటే ఇరవై నాలుగు గంటలు మస్జిద్ లో ఉండటమే కాదు, మన జీవితంలోని ప్రతి క్షణం ఎక్కడ ఉన్నా ఏది చేసినా అక్కడ ఆ సందర్భంలో, ఆ సమయంలో, ఆ స్థితిలో అల్లాహ్ యొక్క ఆదేశం ఏంటి తెలుసుకొని జీవించడమే అల్లాహ్ యొక్క ఆరాధన. ఇలాంటి యువకుడు ఎవరైతే అల్లాహ్ ఆరాధనలో తన యవ్వనాన్ని గడిపాడో.

3. మూడో వ్యక్తి, అతని మనస్సు మస్జిద్ లో లగ్నమై ఉంటుంది. ఒక నమాజ్ చేసి వచ్చాడు అంటే తన ఇహలోక పనుల్లో, తన యొక్క బాధ్యతల్లో, తన భార్య పిల్లల్లో ఎవరు ఎవరి పట్ల ఏ బాధ్యత నెరవేర్చాలో అన్నిటిలో ఉంటాడు. కానీ నమాజ్ సమయం గుర్తు పెట్టుకొని మరో నమాజ్ వచ్చింది అంటే వెళ్లి సామూహికంగా నమాజ్ పాటించే ప్రయత్నం చేస్తాడు. ఎక్కడ ఉన్నా గాని నమాజ్ సామూహికంగా చేస్తూ ఉండాలి అన్న విషయం అతని మదిలో నుండి బయటికి వెళ్ళదు. అతని హృదయం మస్జిద్ లో లగ్నమై ఉన్నది.

4. నాలుగో రకం వ్యక్తి ఎవరు? ఆ ఇద్దరు మనుషులు ఎవరైతే అల్లాహ్ గురించి పరస్పరం ప్రేమాభిమానాలు పాటించి కలిస్తే అల్లాహ్ సంతోషానికి, అల్లాహ్ ప్రేమను పొందడానికి కలుస్తారు. వేరే అయిపోయినప్పుడు, విడిపోయినప్పుడు కూడా అల్లాహ్ ప్రేమ పొందే ఉద్దేశంతోనే విడిపోతారు. కలిసినా అల్లాహ్ ప్రేమకు పాత్రులు అవ్వడానికి, విడిపోయినా, అల్లాహ్ యొక్క ప్రేమను పొందడానికి మాత్రమే.

5. ఐదవ రకం. ఐదవ మనిషి ఎలాంటి వాడు? ఒక అందమైన మరియు హోదా, అంతస్తులు గల ఒక స్త్రీ అతన్ని చెడు వైపునకు ఆహ్వానిస్తే అతనంటాడు, నేను కేవలం అల్లాహ్ తో భయపడతాను. ఇలాంటి చెడుకు నేను సమీపించను. అల్లాహు అక్బర్. గమనించారా? అల్లాహ్ యొక్క భయం.

6. ఆరో రకం. ఆరో రకమైన వ్యక్తి అతను దానధర్మాలు చేస్తాడు. కుడి చేయితో ఏదైనా దానం చేశాడు అంటే ఎడమ చెయ్యికి కూడా తెలియకుండా అంత గోప్యంగా, రహస్యంగా కేవలం అల్లాహ్ సంతోషాన్ని పొందడానికి. ప్రజల చూపుగోరు తనానికి కాదు. కేవలం అల్లాహ్ యొక్క సంతృష్టికి అతను ఖర్చు చేస్తూ ఉంటాడు.

7. ఏడో రకమైన వ్యక్తి. ఒంటరిగా ఉండి అల్లాహ్ ను గుర్తు చేసుకొని, కన్నీరు కార్చేటువంటి మనిషి. అల్లాహ్ ను గుర్తు చేస్తున్నప్పుడు అతని కళ్ల ద్వారా అశ్రువులు ప్రవహిస్తూ ఉంటాయి. అలాంటి వ్యక్తి.

ఈ ఏడు గుణాలు గల ఏడు రకాల మనుషులు ఆ ప్రళయ దినాన సుదీర్ఘ కాలాన్ని గానీ, ఆ కఠినతరమైన ఆ సమస్యలను కానీ ఎదుర్కోకుండా అల్లాహ్ యొక్క నీడలో ఉంటారు”.

సోదర సోదరీమణులారా! మనందరం కూడా విశ్వాస మార్గాన్ని అవలంభించి ఇలాంటి సత్కార్యాలు చేస్తూ ఉంటే, ఎంత గొప్ప లాభాన్ని పొందుతాము ఆ పరలోక దినాన. ఈ ఏడుగురే కాకుండా అల్లాహ్ యొక్క ఛాయ, నీడను పొందే అదృష్టవంతుల్లో మరొకరు. సహీ ముస్లిం షరీఫ్ హదీత్ నెంబర్ 3006 లో ఉంది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు:

ఎవరైతే తన నుండి అప్పు తీసుకున్న వ్యక్తికి మరి కొంత వ్యవధి ఇస్తాడో మరి కొంత సమయం ఇస్తాడో ఎక్కువగా. సరే మంచిది. మరో పదిహేను రోజుల తర్వాత ఇవ్వు. లేదా నీవద్ద పర్వాలేదు మరొక నెల తర్వాత ఇవ్వు. ఈ విధంగా వ్యవధి ఇస్తాడో లేదా ఆ వ్యక్తి అప్పు తీసుకున్న వ్యక్తి అతని వద్ద ఏమీ లేదు. అప్పు తిరిగి ఇవ్వడానికి అని తెలిసి అతని యొక్క అప్పు మాఫీ చేసేస్తాడు. కేవలం అల్లాహ్ సంతోషానికి ప్రళయ దినాన ఆయన యొక్క నీడ పొందడానికి నేను ఈ రోజు నీ యొక్క అప్పును తిరిగి తీసుకోను. ఇక మాఫీ చేసేస్తున్నాను. నువ్వు ఎలాంటి రంది పడకు అని తృప్తిని ఇస్తాడు. అలాంటి వ్యక్తికి కూడా అల్లాహ్ అతనికి కూడా ప్రళయ దినాన తన ఛాయలో స్థలం ఇస్తాడు“.

ఇంకా ఎవరు పరలోక దినాన ఆ సుదీర్ఘ కాలంలో ఆ కష్టతర సమయాల నుండి, ఆ స్థితిలో నుండి బయట పడతారు. ఎవరైతే విశ్వాస మార్గంలో నడుస్తూ ప్రజల పట్ల కూడా ఎంతో మృదువుగా మెలుగుతారో, వారి యొక్క కష్టాల్లో వారికి తోడుగా ఉండి, వారు ఇబ్బంది లో ఇరుక్కొని ఉన్నారో వాటి నుండి బయటికి తీసే ప్రయత్నం చేస్తారు. సహీ ముస్లిం షరీఫ్ లో ఈ భావం ఉంది. కానీ ఇప్పుడు నేను చదివే హదీత్ సునన్ అబూదావూద్ లోనిది. సునన్ అబూదావూద్ హదీత్ నెంబర్ 4946 ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు.

ఎవరైతే తన ముస్లిం సోదరుల యొక్క ఇహలోక కష్టాల్లోని ఏదైనా ఒక కష్టం దూరం చేస్తాడో అల్లాహ్ అతని పరలోక కష్టాల్లోని ఒక కష్టాన్ని దూరం చేస్తాడు. ఎవరైతే అప్పు తీసుకున్న వ్యక్తికి గానీ లేదా మరే రకమైన ఇబ్బందులు ఉన్న వ్యక్తికి గాని ఏదైనా సులభతరం కలిగిస్తాడో అల్లాహ్ అతనికి ఇహ, పరలోకాల్లో సులభతరాలు కలుగజేస్తాడు. మరి ఎవరైతే ఒక ముస్లిం లోపాల్ని కప్పిపుచ్చుతాడో అల్లాహ్ ఇహలోకంలో, పరలోకంలో అతన్ని కప్పిపుచ్చుతాడు“.

మరొక హదీత్ లో ఉంది. ఆ హదీత్ ను షేక్ అల్బానీ (రహిమహుల్లా) గారు కూడా సహీహాల్లో ప్రస్తావించారు. హదీత్ నెంబర్ 1217. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు తెలిపారు.

ఎవరైతే తన యొక్క సోదరునికి సహాయం దూరం నుండి, అతని వెనక ఉండి చేస్తాడో అల్లాహ్ ఇహ, పరలోకాల్లో ఇతనికి సహాయం చేస్తాడు.”

దగ్గర ఉన్నప్పుడు అయితే కనీసం చేయకుంటే ఎలా అని మనసులో వస్తుంది. సహాయం చేస్తాము. కానీ ఇక్కడ ఈ హదీస్ లో దూరం ఉండి అతను చూడకున్నా అతనికి ఎలాంటి సహాయం అవసరం ఉందో మనం చెప్పకుండా అతనికి సహాయం చేసేశాము. అల్లాహ్ అలాంటి వ్యక్తికి ఇహ, పరలోకాల్లో సహాయాలు చేస్తాడు”.

ఇంకా ఎలాంటి సత్కార్యాలు మనకు పనికి వస్తాయి పరలోకంలోని కష్టాలను మనం అనుభవించకుండా సుఖాలు పొందడానికి ఏ సత్కార్యాలు చేయాలి. వినండి మరొక హదీత్.

నిశ్చయంగా న్యాయం చేసేవారు, ఎవరైతే ప్రజల మధ్య ఏదైనా తీర్పు చేస్తున్న సందర్భంలో తీర్పులో న్యాయం చేసేవారు. వారి కుటుంబంలో ఇంటి వారిలో అందరిపట్ల న్యాయం చేసేవారు. మరి ఎవరైతే నాయకులుగా ఉండి, జడ్జీలుగా ఉండి న్యాయవాదిగా ఉండి, ఎక్కడ ఏ బాధ్యత ఉందో తన బాధ్యతలు ఉన్నవారి పట్ల న్యాయం చేస్తారో ఇలాంటి వారు ప్రళయ దినాన కరుణామయుడైన అల్లాహ్ యొక్క కుడి వైపున కాంతి యొక్క మింబర్ ల మీద ఆసీనులై ఉంటారు. అల్లాహ్ యొక్క రెండు చేతులు కూడా కుడియే“.

ఈ విధంగా జీవితంలోని ప్రతి వ్యవహారంలో న్యాయం పాటించడం ఎంత గొప్ప విషయమో గమనించండి.

ఇంకా మహాశయులారా! ఎవరైతే తమ యొక్క కోపాన్ని మింగేస్తారో, శక్తి ఉండి కూడా ఎదుటి వానితో ప్రతీకారం తీర్చుకోకుండా వారిని క్షమిస్తారో, అలాంటి వారు కూడా ప్రళయ దినాన ప్రజల అందరి ముంగటి నుండి, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ పిలిచి ఆహ్వానించి, ఇహ లోకంలో నీవు నా తృప్తి కొరకు, నా సంతోషాన్ని పొందడానికి మాత్రమే నీ కోపాన్ని దిగమింగావు. ఈ రోజు నీకు ఇష్టమైన స్వర్గ కన్యలో ఇష్టమున్న వారిని ఎన్నుకోండి అని అంటాడు.

ఇంకా వుదూ చేయడం, నమాజ్ చేయడం. ఇది కూడా చాలా గొప్ప విషయం. ఎవరైతే ప్రతిరోజు ఐదు సార్లు నమాజ్ పాటిస్తూ ఉంటారో, తప్పకుండ వుదూ చేయాల్సింది. ఎవరైతే వుదూ సంపూర్ణంగా చేస్తారో వారి యొక్క వుదూ అవయవాలు, ప్రళయ దినాన మెరుస్తూ ఉంటాయి. వారిని ఆ రకంగా పిలవడం జరుగుతుంది.

ఇంకా ఇలాంటి ఎన్నో సత్కార్యాలు గురించి మనం తెలుసుకుంటూ ఉండాలి. కానీ ముఖ్యమైన కొన్ని విషయాలు తెలపడం జరిగింది. పరలోక దినాన మనం ఆ కష్టాలనుండి దూరం ఉండాలంటే పరలోకాన్ని విశ్వసించాలి. సృష్టికర్త అయిన అల్లాహ్ ను విశ్వసించాలి. ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మార్గాన్ని అవలంభించి ఇస్లాం ప్రకారంగా జీవించాలి. అల్లాహ్ ఈ సత్భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక!

జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వ బరకాతుహు.


పూర్తి భాగాలు క్రింద వినండి 

మరణాంతర జీవితం – పార్ట్ 11: విశ్వాసులలో ఎవరైతే పాపాలు చేసి ఉన్నారో, వారు ప్రళయదినాన ఎలా హాజరవుతారు? [ఆడియో, టెక్స్ట్]

బిస్మిల్లాహ్

మరణాంతర జీవితం – పార్ట్ 11 [ఆడియో]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

పార్ట్ 11. ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [ 22:03 నిముషాలు]

అస్సలామ్ అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలామ్ అలా రసూలుల్లాహ్ అమ్మాబాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.

ఈనాటి శీర్షిక – విశ్వాసులలో ఎవరైతే పాపాలు చేసి ఉన్నారో, వారు ప్రళయదినాన ఎలా హాజరవుతారు? ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే దీని వల్ల మనకు ఇహలోకంలో అలాంటి పాపాలు చేయకుండా జాగ్రత్తపడి ఉండాలన్నటువంటి ఒక జాగృతి కలుగుతుంది.

ఆ పాపాల్లో – అల్లాహ్ ఏ ధనధాన్యాలు మనకు ప్రసాదించాడో వాటిలో ఆయన ఒక నిర్ణీత పరిమాణంలో బీదవాళ్లకు ఇవ్వాలని ఏదైతే ఆదేశించాడో – అంటే జకాత్, విధిదానం అది చెల్లించకపోవడం. వాస్తవానికి మనం చూస్తే బంగారం గాని, వెండి గానీ లేదా మన వద్ద ఉన్నటువంటి కాష్ అమౌంట్ అందులో కేవలం రెండున్నర శాతం మాత్రమే మనం ఇవ్వాల్సింది. అంటే తొంబై ఏడున్నర శాతం మన వద్దనే ఉంటుంది. బీదవాళ్లకు కేవలం రెండున్నర శాతం మాత్రమే. కానీ మనలో ఎంతోమంది ధనవంతులు ఈ రెండున్నర శాతం కూడా పేదవాళ్లకు వారి హక్కు ఇవ్వడం మానుకుంటారు.

దీని మూలంగా ఎప్పుడైతే మనం సమాధుల నుండి లేచి ప్రళయ దినాన ఆ మహా మైదానంలో హాజరు అవుతామో ఈ జకాత్ చెల్లించని వారు ఇలాంటి కష్టాలను ఎదుర్కొంటారు. ఏంటి అది? వారి యొక్క ఆ సొమ్మును ఇనుప పత్రాలుగా తయారు చేసి నరకాగ్నిలో వేడి చేసి, వాటి ద్వారా ఆ మనిషి యొక్క ముఖము ముందటి భాగం, వెనుకభాగం, కుడి, ఎడమ ప్రక్కలలో వాతలు పెట్టడం జరుగుతుంది. ఇలా ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది? వినండి ఈ హదీస్. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు. “ఇలా వాతలు పెట్టడం జరుగుతూ ఉంటుంది. చల్లారినప్పుడల్లా మళ్ళీ వేడి చేయడం, మళ్లీ వాతలు పెట్టడం ఇలా జరుగుతూనే ఉంటుంది. ఆ రోజున ఏ రోజైతే యాబైవేల సంవత్సరాల పరిమాణంలో ఉందో ఎప్పటివరకు జరుగుతుంది? మానవుల మధ్యలో తీర్పు జరిగి పూర్తి అయ్యేంత వరకు. ఆ తరువాత ఇక అతడు స్వర్గవాసుల్లో అవుతాడా? నరకవాసుల్లో అవుతాడా? ఆ నిర్ణయాలు తర్వాత జరుగుతాయి. కానీ ఈశిక్ష ఇలా జరుగుతూనే ఉంటుంది ఆ ప్రళయ దినాన ఎప్పుడైతే సమాధులు నుండి లేచి హాజరవుతారో”.

అలాగే ఒంటెల్లో కుడా జకాత్ ఉంది. ఎవరి వద్దనయితే ఆవులు ఉంటాయో వారు కూడా జకాత్ చెల్లించాలి. కనీసం 5 ఒంటెలు ఉన్న వ్యక్తి జకాత్ చెల్లించాలి. కనీసం 30 ఆవులు ఉన్న వ్యక్తి అతను జకాత్ చెల్లించాలి. కనీసం 120 మేకలు ఉన్న వ్యక్తి ఇందులో నుండి జకాత్ తీయాలి. జకాత్ చెల్లించకుంటే ప్రళయ దినాన ఆ వ్యక్తి హాజరు అవుతాడు. అతని ఆ జంతువులు వస్తాయి. ఆ జంతువులు అతన్ని తమ కాళ్లతో, కొమ్ములతో కొడుతూ వారిని తొక్కుతూ ఈవిధంగా శిక్ష జరుగుతూనే ఉంటుంది ప్రజల మధ్యలో తీర్పు జరిగేంత వరకు. అల్లాహు అక్బర్. అందుగురించి ఈనాటి ఈ జీవితంలో మనం చిన్నపాటి కష్టాన్ని భరించలేక పోతామో, ఇక్కడ ఎవరైనా ఏదైనా సందర్భంలో సహాయానికి రావచ్చు. కానీ అక్కడ ఎవరూ కూడా ఏ సహాయాన్ని పొందలేరు.

ఇంకా రెండవ పాపం – గర్వము, అహంకారము. ఇది కూడా మహా చెడ్డ పాపం. ఎవరిలో ఈచెడ్డ గుణం చోటు చేసుకుంటుందో ఎన్నో సత్యాలను, ధర్మాలను, ఎన్నో మంచి విషయాల్ని తిరస్కరిస్తాడు. అందుగురించి ఎవరైతే ఇహలోకంలో అహంకారానికి గురి అవుతారో వారికి ఇలాంటి శిక్ష ఇవ్వడం జరుగుతుంది అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హెచ్చరించారు. “మైదానే మెహ్ షర్ లో గర్వ అహంకారానికి గురైన వారిని ఎలా తీసుకురావడం జరుగుతుంది? వారు చిన్న చీమలు ఏవైతే ఉంటాయో, వాటి కంటే అధ్వానంగా ఉంటారు. వారు గర్వంలో, అహంకారంలో తమకు తాము ఎంతో పెద్దగా, గొప్పగా చెప్పుకునేవారు. అల్లాహ్ (తఆలా) చూసే వారు కూడా వారిని హీనంగా భావించాలని చీమ కంటే మరీ చిన్నగా. అప్పుడు నలువైపుల నుండి వారిపై అవమానం అనేది కమ్ముకొని ఉంటుంది“. ఎవరైతే అల్లాహ్ ఇహలోకంలో వారికీ ఏ అనుగ్రహం, వరం ప్రసాదించి ఉన్నా దానిపై ఎలాంటి గర్వానికి గురి కాకుండా ఆ అనుగ్రహాన్ని, ఆయన యొక్క విధేయతలో ఉపయోగించే ప్రయత్నం చేయాలి. దాని ద్వారా ప్రజలకు సేవ చెయ్యాలి. అల్లాహ్ పట్ల విశ్వాసం, నమ్మకం బలంగా కలిగి ఉండాలి.

మూడవ రకమైన పాపం – ఇందులో ఎన్నో రకాల పాపాలు వస్తాయి. ఏమిటి శిక్ష? అల్లాహ్ వారిపై ఆగ్రహిస్తాడు ఆ ప్రళయదినాన. వారి వైపున కన్నెత్తి చూడడు, వారితో మాట్లాడడు, వారికి కఠిన శిక్ష విధిస్తాడు. ఎవరు అలంటి వారు? ఎవరికైతే అల్లాహ్ ధర్మ విద్య ప్రసాదించాడో అతడు దానిపై ఆచరిస్తూ, ఇతరులకు సత్య విషయాలు తెలియ జేస్తూ, ధర్మ విషయాలు ప్రజలకు బోధ చేస్తూ, ప్రజలు ఏదైనా విషయం ధర్మానికి సంబంధించింది అడిగినప్పుడు అతనికి తెలిసి ఉంటే ఏమాత్రం దాపరికం, ఏమాత్రం దాన్ని దాచి పెట్టకుండా స్పష్టంగా తెలియజేయాలి. ఎవరైతే దాచి పెడతారో వారితో కూడా అల్లాహ్ (తఆలా) ప్రళయదినాన మాట్లాడడు.

చదవండి ఖురాన్ యొక్క ఆయత్ “మేము స్పష్టమైన ఆధారాలు ఏవైతే అవతరింపజేశామో అవి వారికి చేరినప్పటికీ వాటిని వారు దాచిపెడతారు. ఎవరైతే ఇలాంటి కార్యానికి గురి అవుతారో? ఏమిటి శిక్ష వారికి? ప్రళయదినాన అల్లాహ్ వారి వైపున చూడడు, వారితో మాట్లాడడు.” ఈ రోజుల్లో ఎంతో మంది అల్లాహ్ ఆయతులను ప్రపంచపు యొక్క చిన్నపాటి సామాగ్రి కొరకు అమ్ముకుంటూ ఉంటారు. ప్రజలకు ఇష్టమైన రీతిలో వారి కోరికల ప్రకారంగా వారికి పరిష్కారం తెలిపే ప్రయత్నం చేస్తారు. అల్లాహ్ తో భయపడకుండా అల్లాహ్ అవతరింపజేసిన సత్య విషయాల్ని దాచిపెడతారు. అలాంటి వారికి సూరయే బకరాలోని 174, 175 ఆయతులు వారిలో జాగృతిని తీసుకురావాలి. వారు అలాంటి చెడు అలవాటును మానేయాలి.

మరొక సందర్భంలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలియపరిచారు. “ఎవరైతే విద్య నేర్చుకొని దాన్ని కంఠస్తం చేసి ఉన్నారు. అయినా అది ప్రజలకు తెలియ చేయకుండా మౌనం వహిస్తారు. దాన్ని దాచిపెడతారు. ప్రళయదినాన అతడు హాజరవుతాడు. అతన్ని తీసుకురావడం జరుగుతుంది. అతని నోటికి కళ్లెం వేయబడుతుంది. ఎలాంటి కళ్లెం? నరకానికి సంబంధించిన కళ్లెం“. ఈ హదీస్ ఇబ్నుమాజా లో ఉంది. హదీస్ నెంబర్ 261. ఈవిధంగా అల్లాహ్ ప్రసాదించిన విద్యను ప్రజలకు తెలియ చేయకుండా, ధర్మం వారికి నేర్పకుండా ఉండడం కూడా మనల్ని శిక్షకు గురి చేస్తుంది.

ఇంకా ఎవరి పట్ల అయితే అల్లాహ్ (తఆలా) తన ఆగ్రహం వ్యక్తం పరుస్తాడో, మాట్లాడాడో, వారి వైపు కన్నెత్తి చూడడో మరియు వారికి కఠిన శిక్ష విధిస్తాడో వారిలో ఒకరు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకొని దాన్ని పూర్తి చేయకుండా వాగ్దాన వ్యతిరేకం చేయడం. ఇది కూడా మహా పాపం. అల్లాహ్ ఖురాన్ సూర ఆలె ఇమ్రాన్ ఆయత్ నెంబర్ 77 లో ఇలా తెలిపాడు. “ఎవరైతే అల్లాహ్ పేరున వాగ్దానాలు చేసి ప్రజలతో ఒడంబడికలు చేసుకొని వాటిని పూర్తి చేయకుండా వాగ్దాన వ్యతిరేకం చేస్తారో, అలాంటి వారికి ప్రళయ దినాన ఎలాంటి పుణ్యాల్లో రవ్వంత వారికి భాగం లేదు. అల్లాహ్ వారితో మాట్లాడడు. వారి వైపున చూడడు. వారికి కఠిన శిక్ష విధిస్తాడు“.

ఇంకా మహాశయులారా! ఏ పాపాల వల్లనయితే అల్లాహ్ ఆగ్రహం కురుస్తుందో, అల్లాహ్ వారి వైపున చూడడో, మాట్లాడడో వారిలో మరో మూడు రకాల వారు వస్తారు. వారి గురించి సహీ ముస్లిం షరీఫ్ హదీస్ నెంబర్ 106 లో ఉంది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేసారు. “మూడు రకాల మనుషులు ఉన్నారు. అల్లాహ్ ప్రళయదినాన వారితో మాట్లాడడు. వారి వైపున చూడడు. వారిని శుభ్రపరచడు. వారికి కఠిన శిక్ష విధిస్తాడు“. ఈవిధంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మూడు సార్లు చెప్పారు.

ఇదే మాట అప్పుడు అబూధర్ (రదియల్లాహు అన్హు) ఓ ప్రవక్తా! వారు నాశనం అయిపోయారు. వారు చాలా నష్టంలో పడిపోయారు. ఎవరు వారు? ఎలాంటి పాపాలు చేసినవారు? అని విన్నవించుకున్నారు. అప్పుడు ప్రవక్త చెప్పారు. “తమ వస్త్రాలను చీల మండలాని (ankles) కి క్రిందిగా తొడిగే వారు, ఈ రోజుల్లో మనలో ఎంతో మంది ఈ పాపానికి గురి అవుతున్నారు. మనకు నష్టం ఏముందండి ఒకవేళ మనం చీల మండలానికి పైగా తొడుగుతే? చీల మండలానికి పైగా తొడిగితే ఇంతటి ఘోరమైన శిక్షల నుండి, ప్రళయదినాన సంభవించేటువంటి ఇలాంటి ఘోర బాధల నుండి మనం తప్పించుకోగలుగుతాం కదా!

ఆ ముగ్గురు ఎవరు? ఒకరు చీల మండలానికి క్రింది గా తమ వస్త్రాలు ధరించే వారు. రెండోవారు ఎవరికైనా ఏదైనా ఉపకారం చేసి, వారికి బాధ కలిగించే వారు. మాటిమాటికి గుర్తు చేసి, వారిని మనసు నొప్పించే వారు. మూడో రకమైన వారు తమ యొక్క సామాగ్రిని అసత్యపు ప్రమాణాలతో విక్రయించేవారు. ఈ మూడు రకాల వారికి ఈశిక్ష అని తెలియజేయడం జరిగింది.

ఇలాంటి శిక్షకే గురి అయ్యేవారు మరికొందరు ఉన్నారు. వారి ప్రస్తావన ఈ హదీస్ లో వచ్చి ఉంది. హజరత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా హెచ్చరించారు. మూడు రకాల వారు. అల్లాహ్ ప్రళయదినాన వారి వైపున చూడడు. వారిని శుభ్రపరచడు. వారికి కఠిన శిక్ష, బాధాకరమైన శిక్ష ఉంటుంది. వారిలో ఒకరు దారిలో ఒక బాటసారి నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతనికి దాహం కలిగింది. పక్కనే అక్కడ ఒక వ్యక్తి అతని వద్ద అతని అవసరానికంటే ఎక్కువ నీళ్ళు ఉన్నాయి. అయినా ఒకరికి త్రాగడానికి నీళ్లు ఇవ్వడం లేదు. ఇలాంటి వ్యక్తి కూడా ప్రళయ దినాన అల్లాహ్ కరుణను నోచుకోడు. అల్లాహ్ మాట్లాడడు. అల్లాహ్ కఠిన శిక్ష విధిస్తాడు. రెండో రకమైన వ్యక్తి. తన నాయకుడు అతని చేతిలో చేయి వేసి మాట వాగ్ధానం ఇచ్చి నేను నీకు విధేయుడిగా ఉంటాను అని అంటాడు. కానీ ఇది కేవలం ప్రాపంచిక ఉద్దేశంతో. అతని ద్వారా ప్రపంచ లాభం ఏదైనా కలిగితే అతనితో ఉంటాడు. లేదా అతనికి వ్యతిరేకంగా ఉంటాడు. ఇలాంటి వారికి కూడా ఈ శిక్ష ఉంటుంది. మూడో రకమైన వ్యక్తి అస్ర్ తరువాత నిలబడి తన సామాను అమ్ముకుంటున్నాడు. మాట మాటల్లో అల్లాహ్ సాక్షిగా నేను దీనిని ఇంతకే కొన్నాను అని అబద్దపు ప్రమాణాలు అల్లాహ్ పేరు మీద చేస్తూ ఉంటాడు. మళ్ళీ ఆ తర్వాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సూరయే ఆలె ఇమ్రాన్ ఆయత్ నెంబర్ 77 ఏదైతే మనం ఇంతకుముందు విన్నామో అది పఠించారు, పారాయణం చేశారు.

ఈ హదీత్ సహీ బుఖారీ లో ఉంది. హదీత్ నంబర్ 2358. ఇంకా ఆ ప్రణయ దినాన మహా మైదానంలో ఎలాంటి పాపాలు చేసిన వారికి ఏమి జరుగుతుంది? ఈ హదీత్ వినండి, సహీ ముస్లిం షరీఫ్, అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు. “మూడు రకాల వారు ఉన్నారు. అల్లాహ్ ప్రణయ దినాన వారితో మాట్లాడడు. వారిని శుభ్రపరచడు. వారి వైపునకు చూడడు. వారికి కఠిన శిక్ష ఉంటుంది. ఎవరు వారు? వివాహమైన తరువాత వృద్ధాప్యానికి చేరుకుంటూ కూడా వ్యభిచారానికి గురి అయ్యేవాడు. రెండు రకమైన వ్యక్తి, రాజ్య పీఠానికి అధికారుడు అయ్యాడు. అయినా అబద్దం పలుకుతున్నాడు. అలాంటి వ్యక్తికి కూడా ఈ శిక్ష. మూడో రకమైన వ్యక్తి బీదవాడు, బిచ్ఛం అడుక్కు తినేటటువంటి పరిస్థితి. అయినా గర్వాహంకారానికి గురి అవుతున్నాడు. ఇలాంటి ముగ్గురిని కూడా కఠిన శిక్షకు గురి చేసి అల్లాహ్ వారిని శుభ్రపరచడు, వారితో మాట్లాడాడు. వారి వైపున చూడడు అని చెప్పడం జరిగింది“.

అలాగే ఆ ప్రళయదినాన ఎక్కడైతే అల్లాహ్ క్షణం పాటు మన వైపు చూసి మాట్లాడకుంటే మన యొక్క పరిస్థితి గత ఎపిసోడ్ లలో మనం విని ఉన్నాము. ఎంత ఘోరంగా ఉంటుంది. ఎంత దీర్ఘకాలం ఉంటుంది. అక్కడ ఆ కష్టాలను ఎదుర్కోకుండా ఉండాలంటే ఇహలోకంలో ఇలాంటి పాపాలు మనం విడనాడు కోవాలి.

మరొక హదీత్ లో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరో రకమైన ముగ్గురు గురించి చెప్పారు. అబ్దుల్లా బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తెలిపారు. మూడు రకాల వారి వైపున అల్లాహ్ (తఆలా) ప్రళయదినాన కన్నెత్తి చూడడు. ఒక రకమైన వ్యక్తి, తన తల్లిదండ్రుల పట్ల అవిధేయునిగా ఉండేవాడు. పురుషులు లాంటి దుస్తులు, పురుషులు లాంటి వేషాలు వేసే స్త్రీ. మూడో రకమైన వ్యక్తి తన ఇంట్లో చెడును చూసి కూడా సహిస్తూ ఉండేవాడు. దాన్ని ఆపివేయడం, దాన్ని తీసివేయడం, ఆ చెడు నుండి తన ఇంటి వారిని ఆపడం ఏమాత్రం ప్రయత్నం చేయడం లేదు. అలాంటి వ్యక్తిని దయ్యూస్ అంటారు. ఇలాంటి వారిపట్ల కూడా అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ కన్నెత్తి చూడడు“.

ఇంకా ప్రళయదినాన ఆ మైదానంలో మనం ఆకలి దప్పులకు గురి కాకూడదు అంటే ఇహలోకంలో ఆ పరలోకాన్ని గుర్తు చేసుకోవాలి. బీద వాళ్ళను గుర్తు చేయాలి. విశ్వాస మార్గం మీద ఉండి కేవలం తనను తాను మాత్రమే జీవిస్తున్నాడు అన్నట్లుగా భావించకుండా తానే కడుపు నిండా తినుకుంటూ, ఇతరుల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ఉండకూడదు. ఎందుకంటే ఒక సందర్భంలో ఒక వ్యక్తి కడుపు నిండా తిని బేవులు తీస్తూ ఉన్నాడు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు తెలిపారు. ఇలా బేవులు తీయడం మానుకో, ఇహలోకంలో ఎల్లప్పుడూ కడుపు నిండా తినుకుంటా ఉండేవారు ప్రళయ దినాన దీర్ఘకాలం వరకు ఆకలితో ఉంటారు. అల్లాహు అక్బర్. తిర్మిది యొక్క హదీత్ ఇది.

ఈవిధంగా ప్రజలారా! ప్రళయ దినాన ఇలాంటి పాపాలకు గురి అయ్యే వారికి ఇలాంటి శిక్షలు ఉన్నాయి అని ఎందుకు చెప్పడం జరుగుతుంది? ఆ రోజు రాకముందు మనం ఇహలోకంలో మనల్ని మనం చక్క దిద్దుకోవాలి. విశ్వాస మార్గాన్ని అవలంభించి ఏకైక సృష్టికర్తను ఆరాధిస్తూ, ఆయన ప్రవక్త విధానాన్ని పాటిస్తూ, మనం ఇస్లాం ప్రకారంగా జీవితం గడుపుతూ, సాధ్యమైనంతవరకు పాపాల నుండి దూరం ఉంటూ ఉంటె, ప్రళయ దినం దీర్ఘకాలం ఏదైతే ఉందో, ఎన్నో కష్టాలు, బాధలతో కూడుకొని ఉందో ఆ కష్ట బాధలు మన నుండి దూరమై ఆ కాలం మనకు చాలా తేలికగా, తొందరగా గడవవచ్చు. అల్లాహ్ (తఆలా) అన్ని రకాల పాపాల నుండి మనల్ని కాపాడుగాక.

అయితే మరో రకం అవిశ్వాసులు వారి ప్రస్తావన గడిచింది. విశ్వాసంలో పాపాత్ములు వారి ప్రస్తావన కూడా ఈ రోజు మనం విన్నాము. ఇన్షా అల్లాహ్ తరువాయి భాగంలో పుణ్యాత్ములే పుణ్యాత్ములు. అల్లాహ్ యొక్క ప్రియమైన దాసులు. వారిపై అల్లాహ్ యొక్క కరుణలు ఎలా కురుస్తాయి ప్రళయ దినాన? వాటిని విని అలాంటి వారిలో మనం చేరే ప్రయత్నం చేద్దాము. తరువాయి భాగాన్ని కూడా తప్పకుండా వింటారు అని ఆశిస్తూ మీతో శెలవు తీసుకుంటున్నాను

జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వ బరకాతుహు.


పూర్తి భాగాలు క్రింద వినండి 

మరణాంతర జీవితం – పార్ట్ 10: ప్రళయదినం రోజు అవిశ్వాసులు మరియు వారి పూజించిన మిధ్యా దైవాల మధ్య జరిగే వాదన [ఆడియో, టెక్స్ట్]

బిస్మిల్లాహ్

మరణాంతర జీవితం – పార్ట్ 10 [ఆడియో]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

పార్ట్ 10. ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [ 20:21 నిముషాలు]

అస్సలామ్ అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలామ్ అలా రసూలుల్లాహ్ అమ్మాబాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.

ఆ మహా మైదానంలో ఒక వైపున ఆరాధ్యనీయులు, మరోవైపు ఎవరినైతే ఆరాధించడం జరిగిందో వారి మధ్యలో జరుగుతున్న వివాదాలను మనం వింటున్నాము, తెలుసుకుంటున్నాము. ఏ పుణ్యాత్ములనైతే ఆరాధించడం జరిగినదో వారు ఇలాంటి ఆరాధనతో తమ జీవితంలో ఏమాత్రం ఇష్టపడేవారు కాదు. అలాంటి వారు ఆ మైదానంలో ఎవరినైతే మేము మిమ్మల్ని ఆరాధించాము అని అంటారో, అలాంటి వారికి ఏమి సమాధానం ఇస్తారు? వినండి “షిర్క్ చేసిన వాళ్ళు ఎవరినైతే అల్లాహ్ తో పాటు భాగస్వామిగా కలిపి షిర్క్ చేశారో వారిని చూసినప్పుడు అల్లాహ్ వైపునకు తిరిగి ఓ మా ప్రభువా! వీరు! వీరే, వీరినే మేము నిన్ను కాకుండా భాగస్వామిగా చేసి, నిన్ను వదిలి వీరిని మేము ఆరాధిస్తూ ఉంటిమి. వీరితో మేము దుఆలు చేస్తూ ఉంటిమి, వీరిని మేము అర్థిస్తూ ఉంటిమి. అప్పుడు వారు తిరిగి మాట వారి వైపునకు వేసి, మీరు అసత్యం పలుకుతున్నారు, మీరు అసత్యం పలుకుతున్నారు“. మరోచోట ఆయత్ ఉంది. “మీరు మమ్మల్ని ఆరాధించేవారు కాదు“. ఈ విధంగా పరస్పరం వివాదం జరుగుతుంది. వారు వీరిని తిరస్కరిస్తారు.

ఎవరైనా గాని, ఈ రోజుల్లో ఎందరో కలిమా చదివిన ముస్లిం సోదర సోదరీమణులు కూడా అల్లాహ్ ను కాకుండా ఎవరెవరితో దుఆ చేస్తున్నారు. ఆరాధనకు సంబంధించిన ఎన్నో విషయాలు అల్లాహ్ ను కాకుండా, ఎవరెవరితో ఆ ఆరాధన యొక్క కొన్ని భాగాలు, కొన్ని రకాలు వారి ముందు పాటిస్తూ ఉన్నారు. అయితే పరలోకమున మైదానే మెహ్ షర్ లో వెళ్ళిన తరువాత ఏమి జరుగుతుంది? ఈ ఆయతులను చదివి తెలుసుకొని వీటి ద్వారా గుణపాఠం పొందే ప్రయత్నం చేయాలి.

ఇంకా ఈ ఇహలోకంలో ఆరాధనా సంబంధమైన విషయాల్లోనే కాకుండా జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాల్లో సత్య మార్గాన్ని విడనాడి, సృష్టికర్త పంపినటువంటి సన్మార్గాన్ని వదిలేసి, కొందరి నాయకులను, కొందరి పెద్దలను ఏదైతే అనుసరిస్తూ ఉంటారో, ప్రళయ దినాన, ఆ మహా మైదానంలో వచ్చిన తర్వాత వారిని కూడా వారు తిరస్కరించి, మీరు మమ్మల్ని మీ వైపునకు ఇహలోకంలో లాక్కొనే ప్రయత్నం చేశారు. మీరు మమ్మల్ని ఇహలోకంలో పురికొల్పి, అల్లాహ్ ను వదిలి అల్లాహ్ పంపిన మార్గాన్ని వదిలి మీ వెనుక నడవాలి అని చెప్పారు. కానీ ఏమిటి? ఈ రోజు మాకు ఏమి సహాయం చేయడం లేదు.?

ఒకసారి మీరు సూర సాఫ్ఫాత్ ఆయత్ నెంబర్ పంతొమ్మిది నుండి ముప్పై ఐదు వరకు చదివి చూడండి. ఎంత స్పష్టంగా అల్లాహ్ (తఆలా) అక్కడ జరిగే పరస్పరం వారి యొక్క వాగ్విదానాన్ని, ప్రశ్నోత్తరాలని, వారి మధ్యలో జరిగేటువంటి మాటల్ని ఎంత స్పష్టంగా అల్లాహ్ (తఆలా) తెలియజేసాడు. పరిస్థితి ఇంకా ఎప్పుడైతే ముదిరి పోతుందో, దీర్ఘకాలం అవిశ్వాసానికి గురి అయినందుకు ఆ కాలం మరింత కష్టంగా గడుస్తూ ఉంటుంది. ఇహలోకంలో ఎవరు ఎవరినైతే పూజించడం జరిగిందో, ఎవరెవరి వెనుక నడవడం జరిగిందో, వారందరినీ చూస్తున్నప్పటికీ వారు సహాయానికి రావట్లేదు. మరింత పరిస్థితి ఎప్పుడైతే దారుణంగా మారుతుందో, బలహీనులు, బలహీన వర్గాలు, ఏ బలం ఉన్న వారిని అనుసరించేవారో, ఏ ఏ ప్రజలు తమ నాయకుల్ని అనుసరించేవారో, ఏ ఏ ఆరాధించేవారు తమతమ వారిని ఎవరినైతే ఆరాధించేదో వాళ్ళందరినీ చూస్తూ వారి యొక్క సహాయం ఏమాత్రం పొందని యెడల శాపనార్థాలు కూడా మొదలుపెడతారు ఆ మైదానే మెహ్ షర్ లో, ఆ మహా మైదానంలో. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్.

ఒకసారి సూరయే ఇబ్రహీం ఆయత్ నెంబర్ ఇరవై ఒకటి చూడండి. “వారందరూ అల్లాహ్ ఎదుట స్పష్టంగా హాజరవుతారు. బలహీనులు, బలవంతులతో గర్వంగా తమకు తాము నాయకులుగా అనుకున్న వాళ్ళతో అంటారు. మేము ఇహలోకంలో మీ వెనుక వెనుక ఉంటిమి. మిమ్మల్ని అనుసరించుకుంటూ ఉంటిమి. అయితే, ఈ రోజు మీరు అల్లాహ్ యొక్క శిక్ష నుండి ఏ కొంచెమైనా దూరం చేసేఅటువంటి ఏదైనా అధికారం మీకు ఉందా? అలాంటిది ఏదైనా సహాయం మాకు చేయగలుగుతారా? ఆ నాయకులు, ఆ పెద్ద వారందరూ ఏమంటారు? అల్లాహ్ మాకు మార్గం చూపి ఉండేది ఉంటే, మేము కూడా మీకు మార్గం చూపి ఉండేవారిమి. అస్తగ్ ఫిరుల్లా! అబద్దం ఇది. అక్కడ కూడా అబద్ధం పలుకుతున్నారు. ఇహలోకంలో అల్లాహ్ (తఆలా) సన్మార్గం మనకు స్పష్టం చేసి పంపలేదా? ఇప్పుడు ఇక్కడ మనకు సహనం వహించినా, సహనం వహించక పోయినా అంతా సమానమే“. అనుసరించే వాళ్లు, బలహీనులు, ప్రజలు తమ నాయకులకు ఏ శాపనాలు అయితే కురిపిస్తారో వాటి యొక్క కొన్ని ఉదాహరణలు కూడా ఖురాన్ లో మీరు చూడండి.

సూరయే అహ్ జాబ్ ఆయత్ నెంబర్ అరవై ఆరు నుండి అరవై ఎనిమిది వరకు – “ఆనాడు ఎప్పుడైతే నరకంలో వారి యొక్క ముఖాలు కాల్చుకుంటూ, తిప్పబడుతూ కాల్చడం జరుగుతుందో, అయ్యో! మేము అల్లాహ్ ను, అల్లాహ్ కు విధేయత చూపి, ప్రవక్తకు విధేయత చూపి ఉండేది ఉంటే ఎంత బాగుండును! వారంటారు – ఓ మా ప్రభువా! మేము మా నాయకులను, మా పెద్దవారిని అనుసరిస్తూ వచ్చాము. వారు మమ్మల్ని సన్మార్గం నుండి దూరం చేసి మార్గభ్రష్టత్వం లో పడవేశారు. ఓ ప్రభువా! ఇప్పుడు వారికి రెట్టింపు రెట్టింపు శిక్షలు ఇవ్వు. పెద్ద పెద్ద శాపనార్థాలు వారిపై కురిపించు. ఇలా శపిస్తూ ఉంటారు.

ఇంకా పరిస్థితి ఎంత ఘోరంగా మారుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ రోజుల్లో సన్మార్గం మన వద్దకు వచ్చినప్పటికీ మనం దాన్ని స్వీకరించకుండా ఉంటాము. మా పెద్దలు మమ్మల్ని వద్దంటున్నారు, మా నాయకులు సత్యాన్ని స్వీకరించ వద్దు అంటున్నారు. ఈవిధంగా మనం ఎవరెవరినో అనుసరించి సన్మార్గం నుండి దూరమవుతాము. కానీ ఆనాడు ఎప్పుడైతే పరిస్థితి అంతా స్పష్టంగా మనకు అర్థమవుతుందో శాపనాలు కురిపించడం కూడా సరిపోయినట్లు ఏర్పడదు. మనసుకు శాంతి ఏర్పడదు. ఆ సందర్భంలో అప్పుడు ఏమంటారు? మీరే స్వయంగా చదవండి, గమనించండి, శ్రద్ధగా వినండి.

సూరయే హామీమ్ వస్సజ్దా, ఫుస్సిలత్ అని కూడా దానిని అంటారు. ఆయత్ నెంబర్ ఇరవై తొమ్మిదిలో ఉంది. “ఓ మా ప్రభువా! జిన్నాతులలో, మానవులలో ఎవరెవరైతే మమ్మల్ని మార్గభ్రష్టత్వానికి గురి చేశారో వారందరినీ మాకు చూపించు. మేము వారిని మా కాళ్ళ కింద వేసి త్రొక్కుతాము. వారు నీచులుగా అయిపోవాలి“. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్.

సోదరులారా! ఇంతటి ఘోరమైన పరిస్థితి ఆ రోజు రానుంది. అవన్నీ వివరాలు అల్లాహ్ మనకు తెలియజేశాడు. ఇకనైనా మనం గుణపాఠం నేర్చుకోకూడదా? మహాశయులారా! సోదర సోదరీమణులారా! సమాధుల నుండి లేపబడిన తర్వాత, ఆ మైదానంలో సమీకరింపబడిన తరువాత ఏ పరిస్థితులు దొరుకుతాయి? ఎవరు ఎవరికి ఎలాంటి సమాధానాలు చెప్పుకుంటారు? ఇవన్నీ వివరాలు ఏదైతే మనం వింటున్నామో ఆ కరుణామయుడైన, సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క గొప్ప దయ, కరుణ మనపై ఎంత గొప్పగా ఉందో ఒకసారి ఆలోచించండి. మనం నరకంలో పోకూడదని మనం ఆనాటి ఆ కష్టాలు అన్నిటినీ భరించకూడదని అక్కడ జరుగుతున్న ప్రతి చిన్న చిన్న విషయాల్ని కూడా ఎంత స్పష్టంగా మనకు తెలియచేస్తున్నాడంటే, ఇకనైనా మనం సన్మార్గం వైపునకు రాకుండా ఆ ఏకైక సృష్టికర్త యొక్క మార్గాన్ని అవలంబించకుండా జీవితం గడిపితే ఎంత నష్టంలో కూరుకు పోతామో మీరే ఆలోచించండి. ఈనాడు ఈ మాటలు, పనికిమాలినవి, ఏం లాభం లేవు అని కొన్ని సందర్భాల్లో షైతాన్ ఆలోచన వల్ల ఎవరి మనసులో వచ్చినా ఈ పరిస్థితులు అన్నిటినీ కూడా ఎదుర్కొనేది ఉంది. ఎందుకంటే సృష్టికర్త అయిన ఆ అల్లాహ్ మనకు ఈ విషయాలు తెలిపాడు గనుక తప్పకుండా ఇది సంభవించనున్నాయి.

అల్లాహ్ ను కాకుండా, ఆ సృష్టికర్తను కాకుండా ఎవరెవరినైతే మనం ఈరోజు గొప్పగా భావిస్తున్నామో వారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత చిన్నవాళ్ళుగా అవుతారు. ఆ రోజు సృష్టికర్త ఆకాశాలను తన ఒక చేతిలో చుట్టుకుంటాడు, భూమిని తన పిడికిలిలో పట్టుకుంటాడు. ఆ తరువాత ఎక్కడ ఉన్నారు? ఇహలోకంలో గర్వం, అహంకారంలో పడి తమకు తాము పెద్ద నాయకులుగా భావించేవాళ్ళు ఎక్కడున్నారు? కొన్ని రాష్ట్రాలకు, కొన్ని దేశాలకు రాజు అయినంత మాత్రాన తన రాజ్యాధికారం ఎంత గొప్పది? నన్ను ఎదిరించే వారు ఎవరూలేరుగా భావించేవారు ఎక్కడున్నారు? ఎవరి వైపు నుండి ఏ యొక్క శబ్దం కూడా రాదు. ఎవరి నుండి ఏ మాట వినబడరాదు. అప్పుడు స్వయంగా అల్లాహ్ అంటాడు. “నేను మాత్రమే ఈరోజు రాజును. నాకే సర్వాధికారం ఉన్నది“.

సర్వ సృష్టిలో ప్రవక్తలు, అల్లాహ్ కు అతి ప్రియులైన వారు. ఆ మైదానంలో ఎప్పుడైతే ఒక దీర్ఘకాలం గడిచిపోతుంది. ప్రజలందరూ ఇంకా సృష్టికర్త అయిన అల్లాహ్ తీర్పు చేయడానికి ఎప్పుడు వస్తాడు? అని వేచిస్తూ ఉంటారు. ఆ సందర్భంలో పదండి మనమందరం కలసి ఆదమ్ (అలైహిస్సలాం) వద్దకు వెళ్దాము. ఆయన అల్లాహ్ వద్ద మన గురించి సిఫారసు చేస్తే అల్లాహ్ మనలో తీర్పు చేయడానికి వస్తాడు అని వెళ్తే, ఆదమ్ (అలైహిస్సలాం), ఎవరినైతే అల్లాహ్ స్వయంగా తన చేతులతో శుభ హస్తాలతో సృష్టించాడో, ఆ ఆదమ్ (అలైహిస్సలాం) కూడా చాలా బాధలో ఉంటారు. నాతో జరిగిన తప్పు, ఆయనతో జరిగిన చిన్నపాటి పొరపాటు. కానీ దానికి ఎంత భయపడుతూ ఉంటారంటే ఆ సమయంలో నేను అల్లాహ్ యందు సిఫారసు చేయడానికి ఏమాత్రం హక్కు కలిగి లేను. నేను చేయలేను. మీరు వెళ్ళండి, కావాలంటే ప్రవక్త నూహ్ దగ్గరికి వెళ్ళండి అని అంటారు. కానీ ఆయన స్వయంగా మాట్లాడడానికి కూడా భయపడుతూ ఉంటారు. అలాంటి ఈ మహా మైదానం, అలాంటి అక్కడ జరిగే ఈ పరిస్థితులు ఎవరెవరి మీద మనం ఆశ పెట్టుకుని ఉన్నాము? ప్రవక్త నూహ్, ప్రవక్త ఇబ్రాహీం, ప్రవక్త మోసే, ప్రవక్త యేసు అలైహిముస్సలాం అజ్మయీన్ ఎవరు కూడా అల్లాహ్ ముందు మాట్లాడడానికి ధైర్యం చేయలేకపోతారు. మరి ఈ రోజు స్వర్గాలు రాసి మనకు కొందరు పేపర్లు ఇస్తున్నారు. మీరు చనిపోయిన తర్వాత మీ వారిని తీసుకెళ్ళి ఖననం చేసేటప్పుడు నేను రాసిచ్చిన ఈ సంతకం తో పాటు ఉన్న ఈ పేపర్ ని తీసుకెళ్లి సమాధిలో పెట్టండి. ఎవరు కూడా వచ్చి ప్రశ్నలు అడగరు. ఎవరు కూడా వచ్చి ఏమీ ప్రశ్నించరు. డైరెక్ట్ స్వర్గంలో వెళ్ళిపోతారు. ఇవన్నీ అబద్ధాలు. ఇలాంటి కల్పిత విషయాలలో మన విశ్వాసాన్ని మనం కోల్పోకూడదు. ఆ పరలోక దినం పట్ల మనం భయపడాలి. ఆ పరలోకం పట్ల మన విశ్వాసం బలంగా ఉండాలి. ఆ విశ్వాసమే ఇహలోకంలో మనల్ని ఆయన మార్గంలో నడిపించడానికి ఎంతో దోహద పడుతుంది.

సహీహ్ ముస్లిం షరీఫ్ హదీస్ నెంబర్ ఇరవై తొమ్మిది, అరవై తొమ్మిదిలో హజరత్ అబూ సాయీద్ ఖుద్రి మరియు హజరత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖించిన హదీస్ ఉంది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు. “ఆ మైదానంలో అల్లాహ్ ఒక దాసుడ్ని కలుస్తాడు. అల్లాహ్ ప్రశ్నిస్తాడు. నేను నీకో హోదా, అంతస్తు ఇచ్చి పెళ్లి, పేరంటాలు జరిపించి అన్ని వరాలు ఇహలోకంలో నీకు ప్రసాదించలేదా? గుర్రాలు, ఒంటెలు, ఎన్నో రకాల జంతువులు నీ ఆధీనంలో ఉండే విధంగా నేను చెయ్యలేదా? నీవు కొందరిపై నాయకత్వం వహించి కొందరు నీ మాట వినే విధంగా నీకు పరపతి, హోదా ఇవ్వలేదా? ఆ వ్యక్తి ఇవన్నీ విషయాలని స్వీకరిస్తాడు. అవును అల్లాహ్! నీవు ఇవన్నీ నాకు ప్రసాదించావు. అప్పుడు అల్లాహ్ మరో ప్రశ్న అడుగుతాడు. ఈ రోజు నాతో కలిసే రోజు ఒక రోజు ఉంది అని నీవు నమ్మేవానివా? అప్పుడు అతను సమాధానం పలుకుతాడు – ఓ అల్లాహ్ లేదు. ఇహలోకంలో లభించిన ఈ హోదా, అంతస్తులు, ఇహలోకంలో లభించిన ఈ వరాలు, ఇవన్నిటినీ చూసుకొని మురిసిపోయి ఎక్కడ పరలోకం? ఎక్కడ అల్లాహ్ ను కలుసుకోవడం? ఎక్కడ చనిపోయిన తర్వాత మరోసారి లేవడం? ఈ రోజుల్లో మనం అంటున్నాము కదా! మనలో ఎంతోమంది ఇలాంటి భ్రమకు గురిఅయి ఉన్నాముకదా? లేదు అల్లాహ్ నీతో కలిసే ఒక రోజు ఉంది అని నాకు నమ్మకం లేకుండినది అని అంటాడు. అప్పుడు అల్లాహ్ అంటాడుఇహ లోకంలో నీవు నన్ను ఎలా మర్చిపోయావో ఇక ఇక్కడ కూడా నేను నిన్ను మర్చిపోతాను. అంటే ఇక నా స్వర్గంలో చేరలేవు. ఈ మైదానంలో ఎలాంటి సుఖాలు, వరాలు కొందరు పుణ్యాత్ములకు, విశ్వాసులకు లభించనున్నాయో వాటిలో నీకు ఏభాగము లభించదు. అల్లాహు అక్బర్.

ఈ విధంగా అల్లాహ్ మరో వ్యక్తితో కలుస్తాడు. మూడో వ్యక్తితో కలుస్తాడు. నాలుగు వ్యక్తితో కలుస్తాడు. ఈ మధ్యలో ఒక వ్యక్తి వస్తాడు. అతను ఇహలోకంలో లభించిన వరాలన్నిటినీ కూడా స్వీకరిస్తాడు. ఆ తర్వాత అతను అంటాడు. నేను నిన్ను విశ్వసించాను. నీ ప్రవక్తను విశ్వసించాను. నువ్వు పంపిన గ్రంథాన్ని విశ్వసించాను. నేను నమాజ్ చేశాను. ఉపవాసాలు ఉన్నాను. దానధర్మాలు కూడా చేశాను. సాధ్యమైనంతవరకు ఎంత అతనికి సాధ్యపడుతుందో అంతా తాను చేసిన మంచితనాన్ని అంతా చెప్పుకుంటాడు. అప్పుడు అల్లాహ్ అంటాడు. మా యొక్క సాక్షిని మీ ముందుకు తీసుకు రావాలా? అప్పుడు ఆ వ్యక్తి భయపడతాడు, ఆలోచిస్తాడు. అప్పుడు. ఎవ్వరు నాకు వ్యతిరేకంగా సాక్ష్యం పలకడానికి అని. అప్పుడు అతని మూతి మీద ముద్ర వేయబడుతుంది. ఆ తరువాత అతని తొడ మాట్లాడుతుంది, అతని ఎముకలు మాట్లాడుతూ ఉంటాయి. అప్పుడు ఈ వ్యక్తి వంచకుడు, కపటవిశ్వాసుడు అని స్పష్టం అవుతుంది. కానీ అతను చెప్పుకున్న మంచితనాలన్నీ కూడా ఒక సాకుగా చెప్పుకుంటాడు. ఆనాటి ఆ గాంభీర్య పరిస్థితి నుండి బయటికి వచ్చే ఏదైనా అవకాశం ఉంటుందో ఏమో అని”.

చెప్పే విషయం ఏమిటంటే, చూడడానికి కొందరు కొన్ని సత్కార్యాలు చేసినా పరలోకంపై విశ్వాసం బలంగా లేకుంటే అల్లాహ్ ను కలుసుకునేది ఉన్నది. అల్లాహ్ ఒక్కొక్క విషయం గురించి నన్ను ప్రశ్నించనున్నాడు అన్నటువంటి బలమైన విశ్వాసం, బలమైన నమ్మకంతో ఏ సత్కార్యాలు చేయకుంటే చాలా చాలా నష్టపోతారు.

అల్లాహ్ (తఆలా) మనందరికీ సత్భాగ్యం ప్రసాదించుగాక! ప్రళయ దినాన ఆ తరువాత మజిలీలు ఏమిటి? అక్కడ ఏమి జరగనుంది? ఆ వివరాలు ఇన్షా అల్లాహ్ తరువాయి భాగాలలో మనం వింటూ ఉందాము. అల్లాహ్ (తఆలా) మనందరి పరలోక విశ్వాసాన్ని మరింత బలంగా చేయుగాక. ఇహలోకంలో ఉన్నన్ని రోజులు పరలోక విశ్వాస నమ్మకంతో సత్కార్యాలలో జీవితం గడుపుతూ విశ్వాసమార్గం మీద నడిచేటటువంటి సత్భాగ్యం ప్రసాదించుగాక!

జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వ బరకాతుహు.


పూర్తి భాగాలు క్రింద వినండి 

మరణాంతర జీవితం – పార్ట్ 09: అవిశ్వాసులు ఇహలోకంలో చేసే సత్కార్యాలు, వారి యొక్క విశ్వాసాలు, కర్మలు, వాటి యొక్క ఫలం [ఆడియో, టెక్స్ట్]

బిస్మిల్లాహ్

మరణాంతర జీవితం – పార్ట్ 09 [ఆడియో]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

పార్ట్ 09. ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [ 22:31 నిముషాలు]

అస్సలామ్ అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలామ్ అలా రసూలుల్లాహ్ అమ్మాబాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.

ఈనాటి మన శీర్షిక అవిశ్వాసులు ఇహలోకంలో చేసే సత్కార్యాలు, వారి యొక్క విశ్వాసాలు, వారి యొక్క కర్మలు, వాటి యొక్క ఫలం ఏమిటి?

మహాశయులారా! మనం ఇహలోకంలో ఏమి చేసినా, ఏ రవ్వంత, అంతకంటే మరీ చిన్నది, అణువంత, అంతకంటే తక్కువ ఏ సత్కార్యమైనా, దుష్కార్యమైనా అది విశ్వాసానికి సంబంధించినా, అది నాలుక సంబంధమైన కర్మ అయినా, అది హృదయ సంబంధ కర్మ అయినా, ఏ రకమైనదిగా, ఒకవేళ రవ్వంత ఏ కార్యం అయినా గానీ అల్లాహ్ (తఆలా) దానిని హాజరు పరుస్తాడు.

అందుగురించి ప్రళయ దినాన ఎప్పుడైతే సర్వ మానవులను సమాధుల నుండి లేపి లెక్క తీర్పు జరగడానికి, వారి యొక్క కర్మలు తూకం చేయడానికి ఇంకా ఎన్నో మజిలీలు ఏవైతే ఉన్నాయో, వాటన్నిటి కంటే ముందు ఆ మైదానములో ఎక్కడైతే అందరినీ సమీకరించబడుతుందో, అక్కడ ఇహలోకంలో అవిశ్వాసులు పాటించిన, అవిశ్వాసానికి వారి కర్మలకు స్వయంగా వారు ఎప్పుడైతే వాటిని చూసుకుంటారో వారి యొక్క పరిస్థితి ఏముంటుంది?

అయితే సామాన్యంగా మనిషి పాటించే లేక మనిషి చేసే కర్మలలో ఒకటి విశ్వాసానికి సంబంధించింది ఉంటుంది. ఇక అవిశ్వాసులు సృష్టికర్త అయిన అల్లాహ్ ను నమ్మలేదు గనుక, సృష్టికర్త అయిన ఏకేశ్వరుడ్ని, ఏకేశ్వరుని ఆరాధన, ఏకేశ్వరోపాసనలో తమ జీవితం గడపలేదు గనుక ఇది మహా పాపాల్లో లెక్కించబడుతుంది. దానికి ఏదైనా పుణ్యం దొరకడం దూరం వారికి దాని గురించి భయంకరమైన శిక్ష ఉంటుంది. కానీ అవిశ్వాసులు ఇహలోకంలో తల్లిదండ్రుల సేవలు, అనాధల పట్ల, నిరుపేదల పట్ల ఇంకా ఏ పుణ్యాలు, సత్కార్యాలైతే వారు చేసుకున్నారో, వాటి యొక్క ఫలితం అక్కడ దొరుకుతుందా? లేదా ఆ రోజు వారికి ఎప్పుడైతే స్వయంగా ఆ మైదానంలో హాజరు అవుతారో వారికి, వారి ఆ సత్కార్యాలు ఎలా కనబడతాయి? దాని గురించి ఖురాన్ లో అల్లాహ్ కొన్ని ఉపమానాల ద్వారా ఆ విషయాన్ని విశదీకరించారు.

ఎవరైతే సత్య తిరస్కారానికి గురి అయ్యారో, అవిశ్వాసానికి పాల్పడ్డారో, వారి యొక్క కర్మలు, వారి యొక్క సత్కార్యాలు ఇహలోకంలో వారు ఏదైతే చేస్తున్నారో, దూరం దారిలో మైదానంలో ఎండమావులు ఎలా కనబడతాయో దాహంతో తల్లడిస్తున్న వ్యక్తి దానిని చూసి ఎలాగైతే నీళ్ళు అని భావిస్తాడో అలాగే వీరి పరిస్థితి ఉంటుంది“. వీరు ఏ సత్కార్యాలు అయితే ఇహలోకంలో చేశారో వాటి యొక్క పుణ్యం కనీసం మాకు దొరుకుతుంది కదా! అని అక్కడ వారు ఆశిస్తారు. ఎందుకంటే వారు ఏ అవిశ్వాసానికి పాల్పడ్డారో దాని యొక్క నష్టం ముందే చూసుకున్నారు కదా!

గత భాగాల్లో మీరు విని కూడా ఉండవచ్చు. అయితే ఇప్పుడు ఆ సత్కార్యాల పుణ్యం కనీసం మాకు లభించి మాకు ఏదైనా లాభం కలుగుతుంది అని భావిస్తారు. కానీ ఆ లాభం ఈవిధంగా మారిపోతుంది. ఎలాగైతే ఎండమావులు దాహంతో ఉన్న వ్యక్తికి దూరంగా నీళ్ల మాదిరిగా కనబడుతుందో, అక్కడికి వెళ్ళిన తర్వాత నా యొక్క దాహం తీరుతుంది అని అనుకుంటాడో అలాగే వారి పరిస్థితి అవుతుంది. అయితే ఇక్కడ ఎవరైనా అడగవచ్చు. ఇహలోకంలో కూడా కనీసం ఏదైనా లాభం కలుగుతుందా? ఇహలోకంలో ఏదైనా లాభం కలగవచ్చు! కానీ పరలోకంలో ఈ సత్కార్యాల లాభం కలగడానికి విశ్వాసం, నిజమైన విశ్వాసం ఉండడం, బహు దైవారాధన కు దూరంగా ఉండడం తప్పనిసరి.

అంతేకాదు కేవలం అవిశ్వాసుల విషయమే కాదు. ఎవరైతే తమకు తాము విశ్వాసులమని అనుకుంటారో మరియు మేము ఇస్లాం పై ఉన్నాము అని సంతోషపడుతున్నారో కానీ షిర్క్,, బిదాత్ ఇంకా ఇలాంటి ఘోరమైన పాపాలు, ఏ పాపాలు అయితే వేరే పుణ్యాలను కూడా, సత్కార్యాలను కూడా నాశనం చేసేస్తాయో అలాంటి పాపాలకు పాల్పడి ఉన్నారో వారు కూడా ప్రళయ దినాన ఆ మైదానంలో హాజరైన తరువాత తమకుతాము చాలా నష్టం లో పడి చూసుకుంటారు. తమకు తాము చాలా నష్టం లో పడి ఉన్నట్లుగా చూసుకుంటారు.

సూరయే కహఫ్ ప్రతి జుమా రోజున చదవాలి అన్నట్లుగా ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మనల్ని ప్రోత్సహించారు, ఆదేశించారు. ఆ సూరయే కహఫ్ లో “వారికి తెలియజేయండి. స్వయంగా తాము చేసుకున్న సత్కార్యాలు వాటిని నష్టంలో పడవేసుకున్న వారు ఎవరో మీకు తెలియ చేయాలా? ఎవరి ఆ కష్టాలు అయితే ఇహ లోకంలోనే వృధా అయిపోయాయి. వారు ఏమి అనుకుంటారు. మేము చాలా మంచి కార్యాలు చేస్తున్నాము. మేము చేసే పనులు చాలా ఉత్తమమైనవి అని తమకు తాము భ్రమలో పడి ఉన్నారు“. కానీ ఏ షిర్క్ పనులు అయితే వారు చేస్తున్నారో ఎలాంటి బిదాత్ లకైతే వారు పాల్పడి ఉన్నారో వాటి మూలంగా ఈ సత్కార్యాల పుణ్యం అక్కడ వారికి ఏమాత్రం లభించకుండా ఉంటుంది.

ఆ తరువాత నూట ఐదవ ఆయత్ లో అల్లాహ్ అంటున్నాడు – “ఇలా వారు చేసుకున్న సత్కార్యాలు ఎందుకు వృధా అయ్యాయి. ఎందుకంటే వారు అల్లాహ్ పంపినటువంటి ఆయతులను తిరస్కరించారు. పరలోక దినాన అల్లాహ్ ను కలుసుకునేది ఉన్నది అన్న విషయాన్ని కూడా వారు తిరస్కరించారు“.

గమనించారా! సోదరులారా, సోదరీమణులారా! పరలోక విశ్వాసం ఎంత ముఖ్యం? ఆనాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమేమి జరుగుతుందో ఆ వివరాలు అన్నీ అల్లాహ్ మనకు ఎందుకు తెలియజేసాడు? ఇంతకు ముందే నేను ఒక ఉదాహరణ ఇచ్చాను కదా! నాన్నా!, పరీక్షలు రాబోతున్నాయి కష్టపడి చదువుకుంటేనే ఇక్కడ పాస్ అవుతావు అని ఎలా అయితే మనం పిల్లలకు తెలియచేస్తామో, అంతకంటే గొప్ప మన కరుణామయుడైన, సృష్టికర్త అయిన అల్లాహ్ మనకు ఇలా బోధిస్తున్నాడు. ఎన్నో ఉపమానాలు, ఎన్నో ఉదాహరణలు తెలియజేస్తూ ఇలా సత్కార్యాలు ఎందుకు వృధా అయ్యాయి? అల్లాహ్ పంపిన ఆయతులు, సూచనలు వీటి ద్వారా మన సృష్టికర్త ఒక్కడే మన ఆరాధ్యుడు, ఆరాధ్య నీయుడు ఒక్కడే మరియు మన యొక్క ఆరాధనల్లో మనం ఆయనతో పాటు ఎవరినీ భాగస్వామిగా కలపవద్దు అన్న విషయాలు తెలుసుకునేది ఉంటే, అలా తెలుసుకోలేదు. వాటిని తిరస్కరించారు. చివరికి పరలోక దినం, ఏ దినం అయితే మనకు ఇక్కడ చేసుకున్న సత్ కర్మల ఫలితం లభించాలో దానిని కూడా బలంగా విశ్వసించనందుకు వారి యొక్క సత్కార్యాలు అన్నీ వృధా అయిపోయాయి. “వారి యొక్క సత్కార్యాలు అన్నీ కూడా వృధా అయిపోయాయి. ఇక అవన్నీ వృధా అయిపోయిన తర్వాత తూకం లో ఎప్పుడైతే పెట్టడం జరుగుతుందో అప్పుడు వాటికీ ఏ మాత్రం బరువు ఉండదు“.

ఈ విధంగా మహాశయులారా! మనం ఆ పరిస్థితి రాకముందే మనల్ని మనం చక్కదిద్దుకునే ప్రయత్నం చేయాలి.

మహాశయులారా! సమాధుల నుండి లేపబడిన తర్వాత ఆదిమానవుడు నుండి మొదలుకొని ప్రళయం వరకు వచ్చిన మానవులందరినీ ఒక మైదానంలో ఏదైతే సమీకరించబడుతుందో, అక్కడ ఎవరికి ఎలా పరిస్థితి ఉంటుంది? అనే విషయాలు మనం తెలుసుకుంటున్నాము. అక్కడ యొక్క గాంభీర్యం, అక్కడ అవిశ్వాస స్థితిలో ఎవరైతే చనిపోయారో వారు ఎలా లేసి వస్తారు? వారు చేసుకున్న సత్కార్యాలకు ఉత్తమ ఫలితం లభించాలని ఏదైతే వారు ఆశిస్తారో కనీసం ఆ సందర్భంలో వారి యొక్క గతి ఏమవుతుందో? అలాగే తమకు తాము ముస్లింలు అని భావించి ఇస్లాం పై సరైన విధంగా వారి జీవితం గడవనందుకు వారి యొక్క పరిస్థితి ఏమవుతుంది? మనం తెలుసుకుంటూ వస్తున్నాము.

ఇదే మైదానంలో లేచి హాజరైన తర్వాత పరిస్థితి ఏముంటుంది? ఎవరైతే ఆ సృష్టికర్తను కాకుండా ఇంకెవరినెవరినైతే పూజించారో, ఆరాధించారో, ప్రళయ దినాన అక్కడ హాజరు అయినప్పుడు పరస్పరం వారు ఒకరికి ఒకరు వివాదానికి దిగుతారు. అవునండి! ఈ రోజుల్లో షిర్క్ పై మరియు అల్లాహ్ ఆరాధనను వదిలి ఎంత ఐక్యమత్యం చూపుకోవడం జరుగుతుందో ఎంత పరస్పరం ప్రేమ, ప్రేమాభిమానాలు చూసుకోవడం జరుగుతుందో ఆ ప్రళయ దినాన “ఇహలోకంలో ప్రాణ స్నేహితులుగా ఉన్నవారు కూడా పరలోక దినాన ఏమవుతుంది? విడిపోతారు, దూరం అవుతారు, శత్రువులుగా మారుతారు. ఒకవేళ ఏదైనా స్నేహితం మిగిలి ఉంటే అల్లాహ్ యొక్క విశ్వాసం, అల్లాహ్ యొక్క భయభీతి ఆధారంగా ఏ స్నేహితం జరిగిందో అది మాత్రమే మిగిలి ఉంటుంది“.

అల్లాహ్ ను వదిలి ఎవరెవరినైతే ఆరాధించారో ఆరాధించిన వారు హాజరవుతారు, ఆ ఆరాధ్యనీయులు కూడా, ఎవరినైతే ఆరాధించడం జరిగిందో, వారు కూడా హాజరవుతారు. చదవండి ఖురాన్ యొక్క ఈ ఆయత్ :

అపరాధుల కొరకు నరకాన్ని దగ్గరగా చేయబడుతుంది. మీరు ఎవరిని ఆరాధిస్తూ ఉండేవారు? అని వారిని ప్రశ్నించడం జరుగుతుంది. మీరు అల్లాహ్ ను వదిలి ఎవరినైతే ఆరాధిస్తూ ఉండేవారో వారు మీకు ఈరోజు ఏదైనా సహాయం చేయగలుగుతారా? లేదా స్వయంగా తమకు తాము వారు ఏదైనా సహాయం చేసుకోగలుగుతారా? ఆరాధింపబడిన వారు మరియు ఈ అపరాధులు అందరినీ కలిసి నరకంలో బోర్ల వేయబడటం జరుగుతుంది“.

అల్లాహ్ మనందరిని అలాంటి పరిస్థితుల నుండి కాపాడుగాక.

అల్లాహ్ యొక్క ఆరాధన నుండి దూరం చేసి, ఇతరుల ఆరాధన వైపునకు పురికొల్పిన ఇబ్లీస్ మరియు అతని యొక్క అనుయాయులు, అతని యొక్క సైన్యం అందరినీ కూడా ఆ నరకంలో వేయడం జరుగుతుంది. అప్పుడు వారు పరస్పరం వివాదానికి దిగి ఇలా అంటారు. అల్లాహ్ సాక్షిగా మేము ఇహలోకం లో చాలా స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉంటిమి. మేము అల్లాహ్ ను వదిలి అల్లాహ్ కు, ఆ సర్వ లోకాలకు ప్రభువైన అల్లాహ్ తో పాటు మిమ్మల్ని మేము భాగస్వాములుగా చేశాము. అల్లాహ్ కు చేయునటువంటి ఆరాధన మిమ్మల్ని అల్లాహ్ కు సమానులుగా చేసి, మీకు ఆ ఆరాధనలు చేస్తూ ఉన్నాము“.

ఈవిధంగా ఆ ప్రళయ దినాన ఎప్పుడైతే నరకంలో పోకముందు ఆ మైదానంలో ఒక దృశ్యం ఏదైతే చూపడం జరుగుతుందో దానిని వారు చూసి అక్కడ మేము ఇహలోకంలో ఎంత తప్పు చేసామో కదా! ఆ ఏకైక సృష్టికర్త ఆరాధనలు వదులుకొని మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాము కదా అని అక్కడ వారితో వివాదానికి దిగుతారు. కానీ ఏమి ప్రయోజనం ఉండదు.

అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. అదేమిటంటే ఏ పుణ్యాత్ములు, ప్రవక్తలు, అల్లాహ్ యొక్క భక్తులు వారు ఎవరిని కూడా మమ్మల్ని ఆరాధించండి అని చెప్పలేదు. ప్రజలే స్వయంగా వారికి ఇష్టం లేని ఈ షిర్క్ కార్యం చేస్తూ అల్లాహ్ తో పాటు వారిని ఏదైతే సాటి కల్పించారో అలాంటి పుణ్యాత్ముల్ని నరకంలో వేయడం జరగదు. ఏ ఆరాధ్యనీయులైతే ప్రజల్ని పురిగొలిపి మార్గభ్రష్టత్వం లో పడవేసి అల్లాహ్ ను వదిలి వారిని ఆరాధించాలని, వారి ద్వారా ఆరాధన చేయించుకుంటున్నారో అలాంటి వారినే నరకంలో పంపడం జరుగుతుంది. కానీ ఎవరైతే పుణ్యాత్ములుగా జీవించి, ఏకైక సృష్టికర్తను మాత్రమే ఆరాధిస్తూ ఉండి, ప్రజల్ని స్వయంగా షిర్క్ నుండి ఆపుతూ వచ్చారో అలాంటి పుణ్యాత్ముల్ని నరకంలో వేయడం జరగదు.

అయితే ఆ మైదానంలో ఈ ఆరాధించిన వాళ్ళు హాజరవుతారు. ఎవరినైతే ఆరాధించారో వారిని చూసి మేము మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాము. ఈరోజు మమ్మల్ని కాపాడుకోండి. మాకు సహాయం చేయండి అని అరుస్తారు. కానీ వారు స్పష్టంగా చెప్పేస్తారు. మీరు మమ్మల్ని ఆరాధించేవారు కాదు. మీరు జిన్నులను ఆరాధించేవారు, షైతానులను ఆరాధించేవారు. షైతాను మిమ్మల్ని ఇలాంటి పెడమార్గంలో పడవేసాడు, అతన్ని మీరు ఆరాధిస్తూ ఉన్నారు అని ఎలాంటి సహాయం చేయకుండా వారి నుండి తప్పించుకుంటారు.

చదవండి ఈ ఆయత్. ఎన్నో ఆయత్ లు ఇలాంటివి ఉన్నాయి కానీ ఉదాహరణకు ఒక ఆయత్ నేను చదువుతున్నాను – “ఆ రోజు అల్లాహ్ (తఆలా) ఆ మహా మైదానంలో అందరిని సమీకరిస్తాడు. మళ్ళీ అల్లాహ్ (తఆలా) దైవదూతలతో ప్రశ్నిస్తాడు. ఏమి? వీరు మిమ్మల్ని ఆరాధించేవారా? దైవ దూతలు సమాధానం చెబుతారు. నీవు అన్ని రకాల షిర్క్, బహు దైవారాధన నుండి అతీతునివి. నీవు మాకు సాన్నిహిత్యునివి మరియు నీవు మాకు వలి. ఇలాంటి వారిని ఎవరైతే నీతో పాటు ఇతరులను షిర్క్ చేశారో వారికి మాకు ఎలాంటి సంబంధం లేదు. వారు కాదు మాకు స్నేహితులు. సాన్నిహిత్యానికి మేము నిన్ను వేడుకుంటాము. నీవు అన్ని రకాల షిర్క్ లకు అతీతునివి. వారు జిన్నులను ఆరాధించేవారు. వారిలో అనేకమంది అధిక సంఖ్యలో ఆ జిన్నుల మీదనే వారికి నమ్మకం ఉండింది. వారిపై విశ్వాసం ఉండింది“.

అలాగే ఏసుక్రీస్తు, హజరత్ ఈసా (అలైహిస్సలాం) “మీరు కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండి” అని తెలియజేశారు. కానీ ఈ రోజుల్లో ఆయన్ను కూడా పూజించడం జరుగుతుంది. అయితే ప్రళయ దినాన యేసు క్రీస్తు హాజరవుతారు. ఈసా (అలైహిస్సలాం) హాజరవుతారు. వారిని ఆరాధించిన వారు కూడా హాజరవుతారు. ఏమి జరుగుతుంది అప్పుడు – “అప్పుడు అల్లాహ్ (తఆలా) మర్యమ్ కుమారుడైన ఈసా అలైహిస్సలాం ని ప్రశ్నిస్తాడు. అల్లాహ్ ను వదిలి “నన్ను, నా తల్లిని మీరు ఆరాధ్య దైవంగా చేసుకోండి” అని ఓ ఈసా, ఓ యేసు నీవు ప్రజలకు చెప్పావా? అని అల్లాహ్ (తఆలా) మందలిస్తాడు“. అప్పుడు ఆ సందర్భంలో యేసుక్రీస్తు ఏమంటారు? ఎంతో వినయ వినమ్రతతో ఇలా సమాధానం తెలుపుకుంటారు? “నీవు పవిత్రునివి, అన్ని రకాల బహు దైవారాధనకు అతీతునివి. ఏ మాట పలకడం నాకు ఏ మాత్రం హక్కు లేదో అలాంటి మాట నేను ఎందుకు పలుకుతాను? అలాంటి మాట నేను ఎందుకు చెపుతాను? నేను ఒకవేళ చెప్పి ఉంటె నీకు తెలుసు ఆ విషయం. నేను వారికి చెప్పి ఉంటె నీకు తెలుసు. ఎందుకంటే నా మనసులో ఏముందో నీకు తెలుసు కానీ నీ మనసులో ఏముందో నాకు తెలియదు. నీవు నాకు ఏ ఆదేశం ఇచ్చావో అదే ఆదేశాన్ని నేను వారికి తెలియజేశాను. ఆ ఆదేశం చాలా స్పష్టంగా ఉండింది. అదేమిటి! నా యొక్క ప్రభు, మీ యొక్క ప్రభువు అల్లాహ్ మాత్రమే గనుక మీరు ఆయన్ని మాత్రమే ఆరాధించండి. ఇదే బోధ నేను నా ప్రజలందరికీ చేశాను అని స్పష్టంగా ఏసుక్రీస్తు (అలైహిస్సలాం) తెలియజేస్తారు“.

ఇంకా ఏమి జరగనుంది? ఇన్షా అల్లాహ్ తరవాయి భాగంలో మనం తెలుసుకుందాము.

జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వ బరకాతుహు.


పూర్తి భాగాలు క్రింద వినండి 

మరణాంతర జీవితం – పార్ట్ 08: ప్రళయదినం రోజు ఉండే ఆందోళనకర పరిస్థితి -2 [ఆడియో, టెక్స్ట్]

బిస్మిల్లాహ్

మరణాంతర జీవితం – పార్ట్ 08 [ఆడియో]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

పార్ట్ 08. ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [ 20:41 నిముషాలు]

అస్సలామ్ అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలామ్ అలా రసూలుల్లాహ్.అమ్మాబాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.

ఈనాటి శీర్షికలో ప్రళయ దినాన ఎలాంటి గాంభీర్యం ఉండును?, ప్రజల పరిస్థితి ఆరోజు ఎలా ఉండును? అనే విషయాలు మనం గత భాగంలో నుండి తెలుసుకుంటూ వస్తున్నాము దాని తరువాయి భాగం ఇది.

మహాశయులారా! ఆ ప్రళయ దినాన అక్కడి ఒక్కరోజు ఇహలోకంలోని యాబై వేల సంవత్సరాల పరిమాణం. యాభై వేల సంవత్సరాలు ఇహలోకంలో గడిస్తే అక్కడి ఒక్కరోజు గడిచినట్టు. గమనించండి! అంత దీర్ఘకాలం ఇది ఎప్పుడు, ఎప్పుడైతే మనం సమాధుల నుండి లేపబడి అల్లాహ్ ఎదుట సమీకరింపబడతామో ఆ సమయాన. అల్లాహ్ (తఆలా) ఆ విషయాన్ని సూరతుల్ మఆరిజ్ లో (70:4) ఇలా తెలియపరిచాడు –

تَعْرُجُ الْمَلَائِكَةُ وَالرُّوحُ إِلَيْهِ فِي يَوْمٍ كَانَ مِقْدَارُهُ خَمْسِينَ أَلْفَ سَنَةٍ – 70:4
యాభై వేల సంవత్సరాల పరిమాణం గల రోజున దైవదూతలు మరియు ఆత్మ (జిబ్రయీల్) ఆయన వైపునకు అధిరోహిస్తారు.

యాబై వేల సంవత్సరాల పరిమాణం గల ఆ రోజున దైవదూతలు మరియు రూహ్ (ఆత్మ), అంటే జిబ్రిల్ అమీన్ ఆయన వైపునకు అధిరోహిస్తారు. అందుకే అక్కడికి చేరుకున్న తర్వాత అవిశ్వాసులు, పాపాత్ములు ఇహదినాన్ని గుర్తు చేసుకుంటూ మేము ఒకపొద్దు మాత్రము లేదా ఒక సాయంకాలం మాత్రమే ఇహలోకం లో ఉన్నాము అని భావిస్తారు.

ఈ రోజుల్లో ముప్పై, నలబై, యాబై సంవత్సరాలు జీవిస్తున్నాము. రాత్రి తర్వాత పగలు, పగలు తర్వాత రాత్రి వస్తూ ఉంది. పగలుశ్రమిస్తున్నాము. రాత్రి పడుకుంటున్నాము. ఈ విధంగా జీవితం ఇహలోక వ్యామోహంలో గడిచిపోతూ ఉంది.. పరలోకం గురించి రవ్వంత కూడా మనం ఆలోచించడం లేదు. ఆలోచించండి!, దాని గురించి సిద్ధపడండి! లేదా అంటే ఆ రోజు ఎలాంటి పరిస్థితి అవుతుంది?. ఈ ఆయతులను శ్రద్ధగా విని అర్ధం చేసుకొనే ప్రయత్నం చేయండి. సూరయే యూనుస్ ఆయత్ నెంబర్ నలబై ఐదు లో అల్లాహ్ (తఆలా) ఇలా తెలిపాడు –

وَيَوْمَ يَحْشُرُهُمْ كَأَن لَّمْ يَلْبَثُوا إِلَّا سَاعَةً مِّنَ النَّهَارِ – 10:45
అల్లాహ్‌ వారిని సమీకరించే ఆ రోజు గురించి జ్ఞాపకం చెయ్యి. అప్పుడు వారికి తాము (ప్రపంచ జీవితంలో) దినములో ఒక గడియకాలం ఆగి ఉన్నామేమో!? అనిపిస్తుంది.

“ఎప్పుడు ఏ రోజున అయితే వారిని సమీకరిస్తామో, పోగు చేస్తామో ఆ రోజున వారు ఏమంటారు? పగలు యొక్క కొంత భాగం మాత్రమే మేము ఇహలోకంలో ఉన్నాము”. ఆ అంటే పరలోక దినాన్ని ఎప్పుడైతే వారు తమ కన్నులారా చూస్తారో అప్పుడు ఇహలోకం చాలా సంక్షిప్తమైన జీవితం, పరలోకానికి ఎదుట దీని యొక్క లెక్క ఏ మాత్రం లేకుండా ఉంది అన్నట్లుగా అప్పుడు వారికి అర్థమవుతుంది. అందుగురించి క్షణం పాటు ఈజీవితంలో మన కోరికల్ని తీర్చుకుంటూ, పాపంలో జీవితం గడుపుతూ ఆ శాశ్వత జీవితాన్ని ఎప్పుడూ పాడు చేసుకోవద్దు. అక్కడ ఆ పరిస్థితిని తట్టుకోలేక, ఆ దీర్ఘ కాలాన్ని భరించలేక మనిషి స్వయంగా తనకు అతి ప్రియమైన వారిని, తన బంధువులలో అతి దగ్గరగా ఉన్న వారిని కూడా ఆనాటి శిక్షకు బదులుగా, పరిహారంగా చెల్లించి తాను శిక్ష నుండి తప్పించుకోవాలి అని కోరుతాడు.

సూరయే మఆరిజ్ పదకొండు నుండి పద్నాలుగు వరకు ఆయతులు ఒకసారి మీరు చదవండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి.

يَوَدُّ الْمُجْرِمُ لَوْ يَفْتَدِي مِنْ عَذَابِ يَوْمِئِذٍ بِبَنِيهِ – 70:11
నేరస్థుడు ఆ రోజు (తనకు పడే) శిక్ష నుంచి తప్పించుకోవటానికి పరిహారంగా తన కుమారులను,

وَصَاحِبَتِهِ وَأَخِيهِ – 70:12
తన ఇల్లాలినీ, తన సోదరుణ్ణి,

وَفَصِيلَتِهِ الَّتِي تُؤْوِيهِ – 70:13
తనకు ఆశ్రయమిచ్చిన తన కుటుంబాన్నీ,

وَمَن فِي الْأَرْضِ جَمِيعًا ثُمَّ يُنجِيهِ – 70:14
భూమండలంలోని సమస్త జనులనూ ఇచ్చేసి, తాను మాత్రం బయటపడాలని కోరుకుంటాడు.

كَلَّا ۖ إِنَّهَا لَظَىٰ – 70:15
(కాని ఇది) అసంభవం. నిశ్చయంగా అది జ్వలించే అగ్ని.

అపరాధి ఆ రోజు ఇలా కోరుతాడు – ఆనాటి శిక్షకు బదులుగా, పరిహారంగా చెల్లించాలి ఎవరిని సంతానాన్ని, తన సహవాసిని, ఏ వంశం, ఏ కుటుంబం అతనికి రక్షణ ఇచ్చిందో, శరణ ఇచ్చిందో స్వయంగా వారిని కూడా నరకంలో తోసేయ్యాలి. ప్రపంచంలో ఉన్న వారందరినీ కూడా అతనికి బదులుగా నరకంలో పడ వేయాలి. ఆ తర్వాత అతన్ని అతనికి మోక్షం కలిగించాలి, అతనికి దాని నుండి రక్షణ కలిగించాలి – అని అపరాధి ఆ రోజు కోరుతాడు. సమాధానం ఏమి వస్తుంది అల్లాహ్ వైపు నుండి? “ముమ్మాటికి అలా జరగదు”. అందుగురించి ఆ రోజు రాకముందే మనం సిద్దపడాలి. దానికి సిద్ధమై ఆ రోజు మనపై అంత కష్టంగా గడవకుండా మనం అతి త్వరగా ఆ సమయం మనకు దాటే విధంగా మనం చూసుకోవాలి.

ఇదే సూరయే మఆరిజ్ లో అల్లాహ్ (తఆలా) తెలిపాడు.

إِنَّهُمْ يَرَوْنَهُ بَعِيدًا – 70:6
అది (ఆ శిక్ష) చాలా దూరాన ఉందని వారు భావిస్తున్నారు.

وَنَرَاهُ قَرِيبًا – 70:7
కాని అది మాకు చాలా దగ్గరే కనిపిస్తున్నది.

అవిశ్వాసులకు, సత్యతిరస్కారులకు, అపరాధాలు చేసినవారికి ఆ రోజు అంత దీర్ఘంగా ఏర్పడుతుంది. కానీ, మాకు, విశ్వాసం అవలంభించిన వారికి, సత్కార్యాలు చేస్తున్న వారికి, అల్లాహ్ ఇష్టప్రకారం తమ జీవితం గడుపుతున్న వారికి, అది చాలా తక్కువ సమయంగా, కొన్ని హదీతు లలో చెప్పడం జరిగింది, ఒక ఫర్ద్ నమాజ్ (విధి నమాజ్) చేయడంలో ఎంత సమయం అవుతుందో అంతే వారికి ఏర్పడుతుంది.

ఈ విధంగా మహాశయులారా! ఎన్ని పాపాలు పెరుగుతాయో, ఎన్ని కష్టాలు పెరుగుతాయో, ఎంత మనం అవిశ్వాసానికి ఒడికడతామో, దైవ ధిక్కారానికి, అల్లాహ్ ఏకత్వ ఆరాధనకు దూరంగా ఉంటామో, ఆ రోజు మనకు అంతే దూరంగా, దీర్ఘంగా, పొడుగ్గా ఏర్పడుతుంది. ఎంత మనం అల్లాహ్ కు చేరువుగా ఉంటామో, ఆయనకు విధేయత పాటిస్తూ ఉంటామో, కేవలం ఆయన యొక్క ఆయన ఆరాధనలోనే మన జీవితం గడుపుతామో అది మనకు చాలా తక్కువ సమయంగా ఏర్పడుతూ ఉంటుంది.

ఆ రోజు ప్రజలు మూడు స్థితులుగా ముందుకు వస్తారు. ఒకరు అవిశ్వాసానికి ఒడిగట్టిన వారు. మరొకరు విశ్వాసమార్గాన్ని అవలంబించారు కానీ దానిపై స్థిరంగా నడవలేదు. పాపాలలో కూరుకుపోయి పేరుకు మాత్రమే ఇస్లాంను అవలంబించినట్లుగా జీవితం గడిపేవారు. మూడోవారు పుణ్యాత్ములు, సదాచారణ చేసేవారు, విశ్వాసులు, అల్లాహ్ యొక్క భక్తులు. ఈ ముగ్గురు స్థితులు ఎలా ఉంటాయో, వాటి గురించి ఖురాన్లో ఏ ప్రస్తావన తెలపడం జరిగిందో, ప్రవక్త మహనీయ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి గురించి ఏ విషయాలు తెలిపారో అది ఇన్షా అల్లాహ్ మనం తెలుసుకో బోతున్నాము.

ఎవరైతే అవిశ్వాసానికి ఒడికడతారో, సత్య తిరస్కారానికి పాల్పడతారో వారి యొక్క పరిస్థితి ఏముంటుంది? ఎవరు ఏ స్థితిలో చనిపోయినా, ఎవరు ఎక్కడ దేనికి గురి అయినా, క్రూర జంతువులకు ఆహారంగా అయిపోయినా, నీళ్ళల్లో కొట్టుకుపోయినా, కాల్చబడి బూడిద అయిపోయినా, ఏ స్థితిలో ఎవరు ఉన్నాగాని అల్లాహ్ వారందరినీ వెలికి తీస్తాడు. ఎప్పుడైతే వారు బయటకి వస్తారో, ఆ మహా మైదానంలో సమీకరింపబడతారో అప్పుడు ఆ సందర్భంలో అవిశ్వాసులు –

مُّهْطِعِينَ إِلَى الدَّاعِ ۖ يَقُولُ الْكَافِرُونَ هَٰذَا يَوْمٌ عَسِرٌ – 54:8
తమను పిలిచేవాని వైపు పరుగెత్తుకుంటూ వస్తారు. అప్పుడు అవిశ్వాసులు “ఇది చాలా గడ్డు రోజు” అనంటారు.

అవిశ్వాసులు, సత్య తిరస్కారాలు అంటారు – “ఈ రోజు చాలా కఠినమైనరోజు, చాలా కష్టతరమైన రోజు.” అంతే కాదు ఆనాటి గాంభీర్యాన్ని చూసి తమకుతాము శాపం కురిపించు కుంటూ అయ్యో నా పాడుగాను అనుకుంటూ అరుస్తారు.

సూరయే యాసీన్, ఏ సూరాలోనైతే ప్రళయ దినానికి సంబంధించిన ఎన్నో సత్య విషయాల్ని, ఎన్నో వివరాలను అల్లాహ్ (తఆలా) స్పష్ట పరిచాడో ఆ సూరయే యాసీన్ ను ఈరోజుల్లో బ్రతికి ఉన్న వారు చదివి గుణపాఠం నేర్చుకునే కి బదులుగా దానిని మృత్తులపై చదువుతూ ఉంటారు. ఈ సూరయే యాసీన్ ఈ ఖురాన్ లో అవతరింప చేయటానికి ముఖ్య కారణం బ్రతికి ఉన్నవారికి ఒక హెచ్చరిక, వారు దాని నుండి గుణపాఠం నేర్చుకోవాలి. అయితే అదే సూరాలో ఖురాన్ లో అల్లాహ్ అంటున్నాడు:

وَنُفِخَ فِي الصُّورِ فَإِذَا هُم مِّنَ الْأَجْدَاثِ إِلَىٰ رَبِّهِمْ يَنسِلُونَ – 36:51
మరి శంఖం పూరించబడగానే అందరూ తమ తమ గోరీల నుంచి లేచి, తమ ప్రభువు వైపునకు వడివడిగా వస్తారు

قَالُوا يَا وَيْلَنَا مَن بَعَثَنَا مِن مَّرْقَدِنَا ۜ ۗ هَٰذَا مَا وَعَدَ الرَّحْمَٰنُ وَصَدَقَ الْمُرْسَلُونَ – 36:52
“అయ్యో మా దౌర్భాగ్యం! మమ్మల్ని మా శయనాగారాల నుంచి లేపినదెవరు?” అని వారు వాపోతారు. “కరుణామయుడు (అయిన అల్లాహ్‌) చేసిన వాగ్దానమిదే. ప్రవక్తలు చెప్పింది నిజం” (అని వారితో అనబడుతుంది).

శంఖము ఉదబడినప్పుడు వారు తమ సమాధుల నుండి లేచి పరుగెడుతూ వస్తారు. అయ్యో! మా పాడుగాను అని తమకు తాము శపించుకుంటారు. మా ఈ పడక గదుల నుండి మమ్మల్ని ఎవరు లేపారు? అని అంటారు. అప్పుడు వారితో చెప్పడం జరుగుతుంది. రహ్మాన్ కరుణామయుడైన అల్లాహ్ చేసిన వాగ్దానం ఇది. ఈ రోజు తప్పకుండా మీరు ఆయన ఎదుట సమీకరింపబడతారు. ప్రవక్తలు కూడా ఈనాటి దినం గురించి మీకు ఏదైతే చెప్పారో అది సత్యం జరిగితీరింది. ఇప్పుడు మీరుకు మీరు శపించి కున్నా, మీకు మీరు బాధ పడ్డా అయ్యో! మమ్మల్ని ఎవరు లేపారు? ఎందుకు లేపారు? అని ఎంత మీరు కేకలు పెట్టినా ఏమి లాభం లేదు.

ఎవరైతే ఈ లోకంలో అల్లాహ్ ఆరాధనను ధిక్కరించారో, పుణ్య మార్గంలో నడవడానికి ఇది మాపని కాదు అంటూ పుణ్యాన్ని గురించి, సత్కార్యాల్ని గురించి, మంచిని గురించి బోధించే వారిని అడ్డుకునే వారు. అలాంటి వారి పరిస్థితి ఏమి జరుగుతుంది? సూరయే ఇబ్రాహీం నలబై ఎనిమిది నుంచి యాబై వరకు చదివి చూడండి –

يَوْمَ تُبَدَّلُ الْأَرْضُ غَيْرَ الْأَرْضِ وَالسَّمَاوَاتُ ۖ وَبَرَزُوا لِلَّهِ الْوَاحِدِ الْقَهَّارِ – 14:48
ఏ రోజున ఈ భూమి మరో భూమిగా మార్చివేయబడుతుందో, ఆకాశం సయితం (మారిపోతుందో), అప్పుడు అందరూ సర్వశక్తిమంతుడు, ఒకే ఒక్కడైన అల్లాహ్‌ ముందుకు వస్తారు

وَتَرَى الْمُجْرِمِينَ يَوْمَئِذٍ مُّقَرَّنِينَ فِي الْأَصْفَادِ – 14:49
ఆ రోజు అపరాధులంతా ఒకచోట సంకెళ్ళతో బంధించబడి ఉండటం నువ్వు చూస్తావు.

سَرَابِيلُهُم مِّن قَطِرَانٍ وَتَغْشَىٰ وُجُوهَهُمُ النَّارُ – 14:50
వారి దుస్తులు గంధకంతో చేయబడిన దుస్తులై ఉంటాయి. అగ్నిజ్వాలలు వారి ముఖాలను సయితం ఆవరించి ఉంటాయి.

“ఏ రోజు అయితే భూమి మార్చివేయడం జరుగుతుంది, ఈ భూమి ఉండదు మరియు ఆకాశాలు కూడా అవన్నీ మార్చివేయడం జరుగుతుంది. అందరూ ఆ ఏకైక, మరియు ఎంతో శక్తిశాలి అయినా అందరి పై గెలుపొందినటువంటి ఆ సృష్టికర్త ఎదుటకు హాజరవుతారు, వెలికి వస్తారు. అపరాధులను, అల్లాహ్ ఆరాధనలు దిక్కరించిన వారిని నువ్వు చూస్తావు. వారిని సంకెళ్లలో బంధించబడి తీసుకురావడం జరుగుతుంది. వారి యొక్క దుస్తులు, గంధకం తో చేయబడిన దుస్తులు గా ఉంటాయి మరియు వారిని అగ్ని కమ్ముకొని ఉంటుంది”. అల్లాహ్ ఇలాంటి అన్ని శిక్షల నుండి ఇలాంటి భయంకరమైన ఆ పరిస్థితి నుండి మనందరినీ కూడా కాపాడుగాక!

మరొక బాధకరమైన మరియు ఆశ్చర్యకరమైన, గాంభీర్యం అయిన విషయం మరొకటి ఏమిటంటే, ఆ రోజు సూర్యుడు కేవలం ఒక మీల్ (మైల్) అంత దూరంలోనే ఉంటారు. అల్లాహు అక్బర్! గమనించండి ఈరోజు సూర్యుడు మన నుండి ఎంత దూరంలో ఉన్నాడో దానికంటే కొంచెం దగ్గరయ్యాడంటే మనం కాలి మసి బొగ్గుల్లా మారుతాము. కానీ ఆరోజు వేడి యొక్క, ఆనాటి శిక్ష యొక్క రుచి చూపించడానికి ఈ శరీరాలు భరించేటువంటి అల్లాహ్ (తఆలా) అటువంటి శరీరాలను పుట్టిస్తాడు. మరియు సూర్యుడు ఇంత దగ్గరగా ఉండి, దాని యొక్క తాపం, దాని యొక్క వేడి వల్ల మనిషి పరిస్థితి ఏమవుతుంది? ఆ వేడి వల్ల మరియు ఇహలోకంలో వారి యొక్క కర్మలు ఎలా ఉండెనో దాని ప్రకారంగా వారి నుండి చెమట వెళ్తూ ఉంటుంది, వెళుతూ ఉంటుంది. చివరికి కొందరి పరిస్థితి ఏముంటుంది?

సహీ ముస్లింలో హదీత్ ఉంది – ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు చెప్పారు: సూర్యుడు ఒక మైల్ దూరంలో ఉంటాడు. ఆ రోజు సూర్యుడు సమీపిస్తాడు అది కేవలం పరిమాణం అనేది కేవలం ఒక మైల్ అంత దూరం లో ఉంటుంది“. ఒక ఉల్లేఖనంలో ఉంది – “ఆ రోజు ప్రజలు వారి కర్మల ప్రకారంగా చెమటలో మునిగి ఉంటారు. కొందరు తమ చెమటలో చీలమండలాల వరకు మునిగి ఉంటారు. మరి కొందరు తమ చెమటలో మోకాళ్ళ వరకు మునిగి ఉంటారు. మరికొందరు తమ చెమటలో నడుము వరకు మునిగి ఉంటారు. మరికొందరు తమ చెమటలో పూర్తిగా మునిగి ఉంటారు“.

సూరయే ముతఫ్ఫిఫీన్ ఆయత్ يَوْمَ يَقُومُ النَّاسُ لِرَبِّ الْعَالَمِينَ – 83:6 (ఆ రోజు జనులంతా సర్వలోకాల ప్రభువు ముందు నిలబడతారు) యొక్క వ్యాఖ్యానంలో ఒక సందర్భంలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు చెప్పారు. “ప్రజలు ఆ రోజు తమ కర్మల ప్రకారంగా తమ చెమట లో మునిగి ఉంటారు. కొందరు అయితే ఈ చెవుల మధ్యలో వరకు మునిగి ఉంటారు“.

సహీ బుఖారి మరియు సహీ ముస్లిం లోని హదీత్ లో ఉంది. “ప్రళయ దినాన ప్రజలకు చెమటలు కారుతూ ఉంటాయి. కారుతూ ఉంటాయి. చివరికి వారి చెమట వారి వెనక డెబ్బై గజాల దూరం వరకు కూడా పారుతూ ఉంటుంది“. అల్లాహు అక్బర్! గమనించండి ఇది స్వయంగా మన చెమట. ఆరోజు ఆ పరిస్థితి ఉంటుంది.

ప్రళయ దినాల ప్రజలందరూ కూడా లేచి వచ్చినప్పుడు అల్లాహ్ యొక్క మాటలు ధిక్కరించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క బాటను అవలంబించని వారు, ప్రవక్త బాటకు వ్యతిరేకంగా వారి యొక్క మిత్రులు, వారి యొక్క స్నేహితులు, వారి యొక్క ఫ్రెండ్ వారి మాటలకు ప్రాధాన్యతను ఇచ్చువారు ఎలా వాపోతారో, బాధపడతారో ఈ ఆయతులను విని గమనించండి.

وَيَوْمَ يَعَضُّ الظَّالِمُ عَلَىٰ يَدَيْهِ يَقُولُ يَا لَيْتَنِي اتَّخَذْتُ مَعَ الرَّسُولِ سَبِيلًا – 25:27
ఆ రోజు దుర్మార్గుడైన వ్యక్తి తన చేతులను కొరుక్కుంటూ ఇలా అంటాడు: “అయ్యో! నేను దైవప్రవక్త (సఅసం) మార్గాన్ని అనుసరించి ఉంటే ఎంత బావుందేది!”

يَا وَيْلَتَىٰ لَيْتَنِي لَمْ أَتَّخِذْ فُلَانًا خَلِيلًا – 25:28
“అయ్యో! నా పాడుగాను. నేను ఫలానా వ్యక్తిని స్నేహితునిగా చేసుకోకుండా ఉంటే ఎంత బావుండేది!

لَّقَدْ أَضَلَّنِي عَنِ الذِّكْرِ بَعْدَ إِذْ جَاءَنِي ۗ وَكَانَ الشَّيْطَانُ لِلْإِنسَانِ خَذُولًا – 25:29
“నా వద్దకు ఉపదేశం వచ్చిన తరువాత కూడా వాడు నన్ను అపమార్గం పట్టించాడే! ఎంతయినా షైతాను మనిషికి (అదను చూసి) ద్రోహం చేసేవాడే!”

“ఆ రోజు అపరాధి, దౌర్జన్య పరుడు స్వయంగా తన చేతులను కొరుకుతాడు. మరి అంటాడు – అయ్యో! నా పాడుగాను. నేను ప్రవక్త బాటను అనుసరించి ఉంటే ఎంత బాగుండిపోను, ఓ నా పాడుగాను ఫలానా వ్యక్తిని నేను స్నేహితుడిగా చేసుకోకుంటే బాగుండును. నా దోస్తు, నా ఫ్రెండ్, నా యొక్క మిత్రుడు బోధ నా వద్దకు వచ్చిన తరువాత నన్ను మార్గభ్రష్టత్వం లోకి పడవేశాడు. ఈవిధంగా తీరా సమయం వచ్చినప్పుడు షైతాను మానవుణ్ణి అవమానం పాలు చేస్తాడు”.

అల్లాహ్ (తఆలా) మనందరి సృష్టికర్త ఆ రోజు సంభవించే విషయాల్ని విశదీకరిస్తూ మన గురించి ఇంత గొప్ప మేలు చేసాడో గమనించండి. ఇకనైనా సత్యాన్ని, ధర్మాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారంగా జీవితం గడిపే ప్రయత్నం మనం చేద్దాం. ఈ పరిస్థితి అంతా చూసి అప్పుడు వారికి అర్థమవుతుంది – “ఈ రోజు మనకు ఎవరు సిఫారసు చేసేవాడు లేడు. ఎవరి సహాయం మనకు అందదు. ఈరోజు మనం అల్లాహ్ యొక్క మన్నింపును, అల్లాహ్ యొక్క క్షమాపణను నోచుకోలేము” అన్నటువంటి నిరాశ వారికి అప్పుడు కలుగుతుంది.

సూరయే రూమ్ ఆయత్ నెంబర్ పన్నెండులో అల్లాహ్ చెప్పాడు –

وَيَوْمَ تَقُومُ السَّاعَةُ يُبْلِسُ الْمُجْرِمُونَ – 30:12
ప్రళయం నెలకొన్ననాడు అపరాధులు దిగ్భ్రాంతి చెందుతారు.

ప్రళయం సంభవించిన రోజున అపరాధములు పూర్తిగా నిరాశ చెంది పోతారు – ఇక వారి యొక్క మన్నింపు జరగదు అని, వారు ఇహ లోకంలో చేసుకున్న పుణ్యాలు ఏ మాత్రం పనికి రావు అని. విశ్వాసం లేనిది ఏ పుణ్యము అంగీకరించబడదు. అందుకే ఆ రోజు అవిశ్వాసులు ఇదే కోరుతారు – “నా వద్దనైతే విశ్వాసం లేదు, నా వద్దనైతే సత్కార్యాలు లేవు. నేను అల్లాహ్ కు ఏమని సమాధానం పలకాలి? అయ్యో! ఈరోజు నేను మట్టిని అయిపోయి ఎలాంటి లెక్క ఇవ్వకుండా, ఎలాంటి అల్లాహ్ వద్ద నిలబడేటువంటి పరిస్థితి రాకుండా ఉంటె బాగుండును” అని. కానీ అలాంటి కోరికలు పూర్తి కావు.

ఇలా సూరయే నబాలో ఇలా తెలియపరిచారు.

وَيَقُولُ الْكَافِرُ يَا لَيْتَنِي كُنتُ تُرَابًا – 78:40
అప్పుడు అవిశ్వాసి, “అయ్యో! నేను మట్టినైపోయినా బావుండేదే!” అనంటాడు.

ఆ రోజు అవిశ్వాసుడు అంటాడు – అయ్యో! నేను మట్టిగా మారిపోతే ఎంత బాగుండేది! అని వాపోతాడు. కానీ అతనికి ఏ ప్రయోజనం చేకూర్చదు దానివల్ల. అందుగురించి మహాశయులారా! ఇలాంటి పరిస్థితులు మనకు జరగకూడదు. ఇలాంటి పరిస్థితి మనది కాకూడదు అంటే విశ్వాసమార్గాన్ని అవలంబించి సత్కార్యాలు చేస్తూ ఉండాలి. అల్లాహ్ (తఆలా) మనందరికీ అలాంటి సౌభాగ్యం ప్రసాదించుగాక!

జజాకుముల్లాహు ఖైరా, వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వ బరకాతుహు.


పూర్తి భాగాలు క్రింద వినండి 

మరణాంతర జీవితం – పార్ట్ 07: ప్రళయం సంభవించినప్పుడు ఉండే ఆందోళనకర పరిస్థితి [ఆడియో, టెక్స్ట్]

బిస్మిల్లాహ్

మరణాంతర జీవితం – పార్ట్ 07 [ఆడియో]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

పార్ట్ 07. ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [ 21:32 నిముషాలు]

అస్సలామ్ అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలామ్ అలా రసూలుల్లాహ్.అమ్మాబాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.

ఈనాటి శీర్షిక ప్రళయం సంభవించినప్పుడు ఎలాంటి ఆందోళనకర పరిస్థితి ఉంటుందో దానిని తెలుసుకునే ప్రయత్నం చేస్తాము.

మహాశయులారా! ప్రళయం, పునరుత్థానదినం, పరలోకం మరోసారి అందరూ బ్రతికించబడి అల్లాహ్ యందు సమీకరించబడే రోజు. ఆ రోజు గురించి వెంటనే భయకంపితులై ఆ రోజు రాకముందే దాని గురించి మనం విశ్వాసం, పుణ్యాలతో, సత్కార్యాలతో సిద్ధంగా ఉండేటటువంటి ప్రయత్నం మనలో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా చేయాలి.

ఈ రోజుల్లో మనకు ఎన్నో అనుభవాలు కలుగుతాయి. కొన్ని సందర్భాల్లో, కొన్ని ప్రదేశాల్లో వెళ్తాము లేదా ఏదైనా సంఘటన సంభవిస్తుంది. చాలా బాధకు గురి అవుతాము. అప్పుడు మనం ఒకవేళ ముందు నుండే జాగ్రత్తపడి ఉండేది ఉంటే ఈనాటి రోజు చూసే రోజు కాకపోవచ్చు. ఎలాగైతే రిజల్ట్ వచ్చే సందర్భంలో ఏ స్టూడెంట్ అయితే చదువు కాలంలో సమయాన్ని వృధా చేసి తల్లిదండ్రులు, అటువైపున సార్లు, టీచర్ లు, మరోవైపున శిక్షణ ఇచ్చే వారు ఎన్నో రకాలుగా బోధ చేసినప్పటికీ పెడచెవిన పెట్టి వారి యొక్క బోధనలను ఏ మాత్రం విలువ నివ్వకుండా, సమయాన్ని వృధా చేశాడో రిజల్ట్ వచ్చే రోజు ఎలా పశ్చాత్తాప పడతాడు. ఈ ఉదాహరణలు, ఈ అనుభవాలు మనకు ఎందుకు ఇక్కడ కలుగుతున్నాయి? ఆ పరలోక దినం, అక్కడ పశ్చాత్తాపపడే ఆ రోజు గతాన్ని గుర్తు చేసుకొని బాధపడే ఆ రోజు మనం కూడా అలాంటి దురదృష్టవంతుల్లో కలవకూడదని.

అందుకు మహాశయులారా! ఆ పునరుత్థాన దినం మనమందరము సమాధుల నుండి లేపబడి ఏదైతే అల్లాహ్ ఎదురునకు సమీకరింప బడతామో ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో ఖురాన్ లో చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. దానిని ఈరోజు మనం అర్థం చేసుకొనే ప్రయత్నం చేస్తాము. ఆ రోజును అల్లాహ్ (తఆలా) ఎంతో గొప్ప రోజుగా, గొప్ప దినంగా, ఎంతో గాంభీర్యమైన ఒక దినంగా పేర్కొన్నాడు. ఆ గొప్ప దినాన, ఏ దినాన అయితే ప్రజలందరూ సర్వ లోకాల ప్రభువు ఎదుట నిలబడడానికి వెళ్తారు. మరియు ఆ రోజు అవిశ్వాసుల కొరకు సృష్టికర్త అయిన అల్లాహ్ ని విశ్వసించని వారి గురించి ఎంతో కఠినంగా, ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది.

సూరతుల్ ముద్దస్సిర్ ఆయత్ తొమ్మిది, పదిలో అల్లాహ్ (తఆలా) ఇలా తెలియపరిచాడు: “ఆ రోజు చాలా కష్టతరమైన రోజు. విశ్వాసాన్ని నమ్మని తిరస్కరించిన వారి గురించి అది ఏమాత్రం సులభతరంగా ఉండదు“.

అది ఎంత భయంకరమైన మరియు మన యొక్క ఆలోచనా విధానాన్ని కూడా మార్చి వేసే అంతటి భయంకరమైన రోజు అంటే ఏ తల్లి కూడా ఈ లోకంలో తన పసికందును, పాలు త్రాగే పిల్లని మర్చిపోదు. కానీ ఆ రోజున పరిస్థితి ఏమవుతుంది? సూరతుల్ హజ్ లోని తొలి ఆయత్ లోనే అల్లాహ్ (తఆలా) ఈ విషయాన్ని ఇలా స్పష్టపరిచాడు – “ఓ ప్రజలారా! మీ ప్రభువు తో మీరు భయపడండి. నిశ్చయంగా ఆ ప్రళయ దినం అనేది చాలా భయంకరమైన, చాలా గొప్ప దినం“. ఆనాటి విషయమే చాలా గొప్ప విషయం, భయంకరమైన విషయం. ఆరోజు భూమి కంపించి పోతుంది. అందులో ప్రకంపనలు ఏర్పడతాయి. దాని మూలంగా ఒక ఆందోళన ఏర్పడుతుంది. “ప్రళయ దినాన ఏ ప్రకంపనలు అయితే జరుగుతాయో చాలా గొప్ప విషయం అది. ఆ రోజు ప్రతి పాలిచ్చు తల్లి పాలు త్రాగే తన పసికందును మర్చిపోతుంది. మరియు ప్రతి గర్భిణి స్త్రీ ఆమె యొక్క గర్భం పడిపోతుంది“. గమనించారా! “మరియు ప్రజలు మత్తులో ఉన్నట్లుగా కనబడతారు. ఏదో మత్తు సేవించడం వల్ల ఎలాగైతే సొమ్మసిల్లి పోతారో అందువల్ల కాదు. కానీ ఆరోజు అల్లాహ్ యొక్క శిక్ష చాలా కఠినంగా ఉంటుంది“. అందుగురించి అలాంటి భయంకరమైన ఆ ప్రళయదినం రాకముందే విశ్వాస మార్గాన్ని అవలంబిస్తే ఆరోజు విశ్వాసులకు కొరకు ఎంతో సులభతరంగా గడిచిపోతుంది.

ఆనాటి గాంభీర్యం, ఆనాటి యొక్క ఆ భయంకరం ఎంత గొప్పగా ఉంటుంది అంటే మనిషి పరిస్థితి ఏమవుతుందో సూరయే ఇబ్రాహీం లో అల్లాహ్ (తఆలా) ఈ విధంగా తెలియజేసాడు. మరియు ప్రత్యేకంగా ఎవరైతే ఇహలోకంలో సన్మార్గాన్ని విడనాడి దుర్మామార్గంలో పడి ఉన్నారో, ఏకత్వ మార్గాన్ని వదిలి బహుదైవత్వంలో పడి ఉన్నారో, మరియు ఎవరైతే శాంతి మార్గాన్ని విడనాడి అశాంతి జీవితం గడుపుతున్నారో గమనించండి ఈ ఆయత్ ను: దుర్మార్గులు, దౌర్జన్య పరులు, షిర్క్ చేసేవారు, పాపాల్లో మునిగి తేలాడుతున్న వారు, వారి యొక్క పాపాల్ని వారి యొక్క షిర్క్ పనులను, వారి యొక్క దుర్మార్గాన్ని అల్లాహ్ చూడటం లేదు, అల్లాహ్ కు తెలియదు అన్నటువంటి భ్రమలో మీరు పడి ఉండకండి. అల్లాహ్ (తఆలా) వారికి కొంత వ్యవధిని ఇస్తున్నాడు. ఈ వ్యవధి ఎప్పటివరకు కొందరికైతే ప్రపంచంలోనే గుణపాఠం దొరుకుతుంది. కానీ ఎంతోమంది ఆనాటి వరకు ఏనాడైతే వారి యొక్క చూపులు చాలా క్రిందికి అయిపోతాయి. పరిగెడుతూ ఉంటారు. సమాధుల నుండి లేచిన తర్వాత పరిగెత్తుతారు. వారి తలలు కూడా క్రిందికి వంగి ఉంటాయి. కనురెప్పలు ఎత్తి కూడా చూడడానికి అవకాశం అనేది ఉండదు. అంత భయకంపితులై ఉంటారు. ఆనాటి పరిస్థితిలో అవిశ్వాసంగా ఇక్కడికి చేరుకున్నాము కదా!అని సిగ్గుతో, పశ్చాత్తాపంతో తలఎత్తడం, కళ్ళు ఎత్తి చూడడం అది కూడా వారికి సిగ్గుగా అనిపిస్తుంది మరియు ఆనాటి యొక్క భయంకరం, గాంభీర్యంతో వారి యొక్క హృదయాలు బయటికి వస్తాయా అన్నటువంటి పరిస్థితి ఉంటుంది. మరి కొందరు పాపాత్ములు వారి పరిస్థితి ఇంతకంటే మరీ ఘోరంగా వారి యొక్క హృదయాలు బయటికి వచ్చి పడతాయా? అన్నటువంటి పరిస్థితి ఉంటుంది.

మహాశయులారా!, మరి కొందరి పరిస్థితి ఆనాడు ఎలా ఉంటుందో సూరయే గాఫిర్ ఆయత్ నెంబర్ పద్దెనిమిదిలో అల్లాహ్ (తఆలా) ఇలా తెలియజేసాడు: “అతి సమీపంలో రానున్న ఆ భయంకరమైన రోజు గురించి వారిని హెచ్చరించండి. వారి యొక్క హృదయాలు గొంతు వరకు వస్తున్నాయి. దానిని వారు ఇటు మింగ లేక పోతున్నారు అంటు బయటికి రాలేక పోతుంది”. అంత గాంభీర్యం అయిన పరిస్థితి ఉంటుంది. అంతెందుకండీ చిన్న పిల్లలు, వారు అయితే ఇంకా ఏ పాపం చెయ్యలేదు. వారు చేసేటటువంటి పని వారి గురించి రాయబడదు. అయినా గాని ఆ ప్రళయం సంభవించే రోజు ఎంతటి భయంకరమైన రోజు అంటే ఆ పిల్లల యొక్క వెంట్రుకలు కూడా తెల్ల పడిపోతాయి.

సూరయే ముజ్జమ్మిల్ లో అల్లాహ్ (తఆలా) తెలియపరిచాడు: “మీరు ఒకవేళ ఆ ప్రళయ దినాన్ని నిరాకరిస్తే, తిరస్కరిస్తే మరి ఆ శిక్ష నుండి మీరు ఎలా బయటపడతారు, ఎలా రక్షింపబడతారు. ఆ ప్రళయ దినం నాటి యొక్క భయంకరత్వం ఎలా ఉంది? పిల్లలు సైతం ముసలివారు గా ఏర్పడతారు”. అంతటి గాంభీర్యం.

ఆ రోజు మనిషి యొక్క పరిస్థితి ఎంతవరకు చేరుకుంటుంది అంటే తనను తాను తప్ప మరి ఎవరి గురించి కూడా ఆలోచించలేడు. చివరికి మనిషి అతని యొక్క భార్యను గాని లేదా భార్య తన యొక్క భర్తను గాని, తల్లి కొడుకును గాని, కొడుకు తల్లిని గాని, కూతురు తండ్రిని గాని, తండ్రి కూతురును గాని, సోదరులు పరస్పరం, సోదరీమణులు పరస్పరం ఎవరు కూడా ఎవరైతే ఇహలోకంలో క్లోజ్ ఫ్రెండ్ అని, సుఖదుఃఖాల్లో ఒకరికి ఒకరు తోడుగా ఉండేవాళ్ళు, ప్రాణానికి ప్రాణం ఇచ్చేటటువంటి మాటలు చెప్పుకునేవారు సైతం ఆ ప్రళయదినాన తమను తప్ప మరెవరి గురించి ఆలోచించేటటువంటి పరిస్థితి ఉండదు. ఒకసారి ఖురాన్ లో ఈయొక్క విషయాన్ని ఎలా స్పష్టంగా తెలుపడం జరిగిందో గమనించండి. సూరత్ అబస ఆయత్ నెంబర్ ముప్పై మూడు నుండి ముప్పై ఏడు వరకు: “ఆ ప్రళయదినం సంభవించినప్పుడు మనిషి తన సోదరునితో పారిపోతాడు. తన తల్లిదండ్రులతో కూడా పారిపోతాడు. తన భార్య, స్త్రీ అయితే తన భర్త మరియు సంతానం నుండి పారిపోతారు. ఆ రోజు ప్రతి ఒక్కరికీ స్వయం తన గురించి ఎంత బాధ, ఎంత పశ్చాత్తాపం, ఎంత రంది ఉంటుందో ఇతరుల గురించి ఆలోచించే ఆ పరిస్థితిని రానివ్వదు.”

ప్రవక్త మహనీయ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు. సహీ బుఖారీ లో హదీత్ ఉంది. ప్రళయ దినాన శంకు ఊదబడిన తరువాత అందరూ సమాధుల నుండి లేచి వచ్చినప్పుడు వారి శరీరంపై దుస్తులు ఉండవు, కాళ్ళకు చెప్పులు ఉండవు మరియు పురుషులు ఒడుగులు చేయబడిన స్థితిలో ఖత్న, సున్నతీ లేకుండా లేప బడతారు. అందరూ ఈవిధంగా నగ్నంగా వస్తారు అన్న విషయం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలుపుతూ ఉన్నప్పుడు హజ్రత్ ఆయిషా సిద్దీక (రదియల్లాహు అన్హా) గారు అడిగారు: “ప్రవక్తా! మరి ఆ సందర్భంలో పురుషులు, స్త్రీల యొక్క దృష్టి ఒకరిపై ఒకరికి పడదా?” అంటే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు: “ఆయేషా! ఆనాటి పరిస్థితి అంతకంటే మరీ ఘోరంగా ఉంటుంది. ఎవరికీ ఎవరి గురించి ఏ ఆలోచన ఉండదు. ఇలా దృష్టి ఒకరిపై వేసి చూడాలి అన్నటువంటి ఆ ఆలోచన రానే రాదు”.

ఆ రోజు అవిశ్వాసులు, సత్య తిరస్కారాలు పాపాల్లో కూరుకుపోయి తమ జీవితం సత్కార్యాలు నుండి దూరం ఉంచినవారు నరక శిక్ష గురించి, ప్రళయం యొక్క ఆ గాంభీర్యం గురించి అవన్నీ వారికి ఆ రోజున ఎప్పుడైతే సత్యాలు తెలుస్తాయో వారికి కోరిక ఏముంటుంది? భూమి నిండా బంగారం కానీ, ఇంకా ఏదైనా వారికి లభిస్తే వారు దానిని ఒక పరిహారంగా అల్లాహ్ ఎదుట ఇచ్చి, ఆనాటి గాంభీర్యం, ఆనాటి యొక్క భయంకరత్వం దాని నుండి రక్షించుకోవాలని, తప్పించుకోవాలని ఆలోచిస్తారు. సూరయే యూనుస్ ఆయత్ నెంబర్ యాబై నాలుగులో అల్లాహ్ (తఆలా) తెలిపాడు: ఇహలోకంలో షిర్క్ చేస్తూ, పాపాలు చేస్తూ అల్లాహ్ అవిధేయత లో జీవితం గడిపిన ప్రతి మనిషి భూమి నిండా ధనం అతనికి లభిస్తే అదంతా కూడా ఆనాటి గాంభీర్యం మరియు శిక్ష నుండి తప్పించుకోవటానికి ఒక పరిహారంగా ఇచ్ఛేద్దామా అని ఆలోచిస్తాడు. సూరయే రఆద్ ఆయత్ నెంబర్ పద్దెనిమిదిలో అల్లాహ్ మరి కొందరి గురించి ఏమని తెలిపాడంటే – వారి వద్ద ఈ భూమి కాదు ఈ భూమి యొక్క రెండింతలు ఉన్నాకానీ, ఈ భూమి యొక్క రెండింతలు ఉన్నా కానీ దానిని పరిహారంగా చెల్లించి ఆనాటి శిక్షల నుండి, ఆనాటి ఆందోళనకరల నుండి తప్పించుకుందాం అన్నటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ఇది ఏమాత్రం సాధ్యపడదు. ఆ రోజు ఏ డబ్బు, ఏ ధనము, ఏ బంగారం, ఏ వెండీ, ఏ డైమండ్స్ ఏదీ కూడా చెల్లదు. ఆ రోజు విశ్వాసం మరియు సత్కార్యాల ఆధారంగా తీర్పు జరుగుతుంది. ఎవరు విశ్వాసాన్ని అవలంభించి సత్కార్యాలు చేసి ఉన్నారో వారి కొరకే సుఖాలు, ఐశ్వర్యాలు, అన్ని రకాల లాభాలు, భోగభాగ్యాలు ఉంటాయి. అల్లాహ్ ఎవరి నుండి ధనము, డబ్బు స్వీకరించడు వారిని ఆ శిక్ష నుండి తప్పించడానికి, ఆ శిక్ష నుండి రక్షించడానికి. గమనించండి, సూరయే ఆలె ఇమ్రాన్ ఆయత్ నెంబర్ తొంబై ఒకటిలో అల్లాహ్ (తఆలా) ఇలా తెలియపరిచాడు – “ఎవరైతే సత్యాన్ని తిరస్కరించారో, అవిశ్వాసానికి ఒడిగట్టారో, వారు అ విశ్వాసులుగా ఉన్నప్పుడే వారికి చావు వచ్చిందో భూమి నిండా బంగారం కూడా వారు ప్రాయశ్చితంగా ఇవ్వాలి అని అనుకుంటే అది స్వీకరించబడదు. వారికి ఆ రోజు కఠినమైన శిక్ష ఉంటుంది, బాధాకరమైన శిక్ష ఉంటుంది. ఎవరు కూడా వారికీ ఎలాంటి సహాయం చేసేవారు ఉండరు.” ఇలాంటి ఆయతులతో, ఇలాంటి బోధనలతో గుణపాఠం నేర్చుకొని మనలో వెంటనే మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. అల్లాహ్ ఈ సత్భాగ్యం నాకు మీకు అందరికి ప్రసాదించు గాకా!

సహీ బుఖారీ లో హదీత్ ఉంది ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు – సత్య తిరస్కారిని, అవిశ్వాసిని ప్రళయ దినాన తీసుకురావడం జరుగుతుంది. అతనితో ఇలా ప్రశ్నించడం జరుగుతుంది. ఏమీ! నీ వద్ద ఈభూమి నిండా బంగారం ఉంటే నీవు దానిని పరిహారంగా చెల్లించి ఈ శిక్షల నుండి తప్పించుకుందామని అనుకుంటివా? అతను అంటాడు, అవును. అప్పుడు అతనికి సమాధానం చెప్పడం జరుగుతుంది. నేనైతే ఇహలోకంలో నీవు ఉన్నప్పుడు దీనికంటే ఎంతో తేలికమైన విషయం నీతో నేను కోరాను. విశ్వాసాన్ని అవలంభించు, సత్కార్యాలు చేస్తూపో. ఇదే నీతో నేను కోరబడినది ఇహలోకంలో, కానీ అది మాత్రం చేయలేదు. ఇప్పుడు నీ వద్ద భూమి నిండా బంగారం ఉంటే దాన్ని పరిహారంగా చెల్లించాలి అనుకుంటున్నావు. ఇది ఎక్కడ సాధ్యపడుతుంది?

ఇంకా ఆ ప్రళయదిన గాంభీర్య విషయాలు మరిన్ని తెలుసుకునేటివి చాలా ఉన్నాయి. తరువాయి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేస్తాము.

వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వ బరకాతుహు.


పూర్తి భాగాలు క్రింద వినండి 

%d bloggers like this: