
[3:46 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
క్రింది వీడియో కూడా చూడండి, ఇన్షా అల్లాహ్
దిష్టి తగలకుండా బుగ్గకి నల్ల చుక్క లేదా కాళ్ళకి నల్ల దారం కట్టవచ్చా? [వీడియో]
https://teluguislam.net/?p=13379
తెలుగుఇస్లాం.నెట్ * తెలుగులో ఇస్లాం జ్ఞాన సంపద *
[3:46 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
క్రింది వీడియో కూడా చూడండి, ఇన్షా అల్లాహ్
దిష్టి తగలకుండా బుగ్గకి నల్ల చుక్క లేదా కాళ్ళకి నల్ల దారం కట్టవచ్చా? [వీడియో]
https://teluguislam.net/?p=13379
[5:11 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ధర్మపరమైన నిషేధాలు – 10
10- అల్లాహ్ వద్ద ప్రయోజనం లభించాలన్న ఉద్దేశ్యంతో ఎట్టిపరిస్థితిలో అల్లాహ్ తప్ప మరెవ్వరితో సిఫారసు కోరకు.
నిశ్చయంగా సిఫారసు యొక్క సంపూర్ణ అధికారం అల్లాహ్ వద్దే ఉంది. అందుకు ఎవ్వరితో సిఫారసు కోరకు. అల్లాహ్ కు అతిసమీపంలో ఉన్న దూత అయినా, ఏ ప్రవక్త అయినా మరియు ఏ పుణ్యపురుషుడైనా సరే.
[وَيَعْبُدُونَ مِنْ دُونِ اللهِ مَا لَا يَضُرُّهُمْ وَلَا يَنْفَعُهُمْ وَيَقُولُونَ هَؤُلَاءِ شُفَعَاؤُنَا عِنْدَ اللهِ قُلْ أَتُنَبِّئُونَ اللهَ بِمَا لَا يَعْلَمُ فِي السَّمَاوَاتِ وَلَا فِي الأَرْضِ سُبْحَانَهُ وَتَعَالَى عَمَّا يُشْرِكُونَ] {يونس:18}
ఈ ప్రజలు అల్లాహ్ ను కాదని తమకు నష్టాన్నిగానీ లాభాన్ని గానీ కలిగించలేనివారిని పూజిస్తున్నారు. పైగా ఇలా అంటున్నారుః వారు అల్లాహ్ వద్ద మా కొరకు సిఫారసు చేస్తారు. ప్రవక్తా! వారితో ఇలా అను: ఆకాశాలలోగానీ, భూమిలోగానీ అల్లాహ్ ఎరుగని విషయాన్ని గురించి ఆయనకు మీరు తెలుపుతున్నారా? ఆయన పరిశుద్ధుడు. ఈ ప్రజలు చేసే షిర్కుకు ఆతీతుడూ, ఉన్నతుడూ.
(సూరె యూనుస్ 10: 18).
పుస్తకం & అన్నీ వీడియో పాఠాలు క్రింద వినవచ్చు
ధర్మపరమైన నిషేధాలు
[6:47 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ధర్మపరమైన నిషేధాలు – 7
7- అల్లాహ్ యేతరుల శరణు కోరకు.
నీవు ఏదైనా ప్రాంతము లో మజిలీ చేసినప్పుడు అక్కడ నీలో భయం జనించినప్పుడు అల్లాహ్ తో మాత్రమే శరణు వేడుకో. అల్లాహ్ నే గట్టిగా పట్టుకో, ఆయన శరణే వేడుకో, మరియు అక్కడ ఈ దుఆ చదువుః
“అఊజు బికలిమాతిల్లాహిత్తామ్మాతి మిన్ షర్రి మాఖలఖ వ జరఅ వ బరఅ”.
(أَعُوذُ بِكَلِمَاتِ الله التَّامَّاتِ مِنْ شَرِّ مَا خَلَقَ وَذَرَأَ وَبَرَأَ)
అనువాదం: నేను అల్లాహ్ యొక్క సంపూర్ణ వచనాలతో, అల్లాహ్ శరణలో వచ్చుచున్నాను అల్లాహ్ పుట్టించిన, సృజించిన వాటిలోని కీడు నుండి.
శత్రువు మరియు క్రూర జంతువులతో ప్రకృతి పరమైన భయం వల్ల విశ్వాసంలో ఏ లోపం ఏర్పడదు.
[وَأَنَّهُ كَانَ رِجَالٌ مِنَ الإِنْسِ يَعُوذُونَ بِرِجَالٍ مِنَ الجِنِّ فَزَادُوهُمْ رَهَقًا]
మానవులలో కొందరు జిన్నాతులలోని కొందరిని శరణు వేడుతుండేవారు. ఈ విధంగా వారు జిన్నాతుల గర్వాన్ని మరింత అధికం చేశారు[. (సూరె జిన్న్ 72: 6).
పుస్తకం & అన్నీ వీడియో పాఠాలు క్రింద వినవచ్చు
ధర్మపరమైన నిషేధాలు
[6:19 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
తెలుగులో ఇస్లామిక్ క్విజ్ 77వ భాగం 2వ ప్రశ్న సిలబస్:
ఇస్లామీయ నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు (Muharramat) పుస్తకం నుండి:
మొక్కుబడులు:
అల్లాహ్ ను కాకుండా ఇతరుల పేరున మొక్కుకొనుట షిర్క్ అవుతుంది.
البخاري 6696:- عَنْ عَائِشَةَ رَضِيَ اللَّهُ عَنْهَا، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ : ” مَنْ نَذَرَ أَنْ يُطِيعَ اللَّهَ فَلْيُطِعْهُ، وَمَنْ نَذَرَ أَنْ يَعْصِيَهُ فَلَا يَعْصِهِ “.
ఎవరు అల్లాహ్ యొక్క విధేయత లో ఏదైనా మొక్కుబడి చేసుకుంటారో వారు దానిని పూర్తి చేయాలి మరి ఎవరైతే అల్లాహ్ అవిధేయత లో మొక్కుబడి చేస్తారో వారు దానిని పూర్తి చేయకూడదు
ఈ రోజుల్లో ప్రజలు సమాధిలో ఉన్నవారి పేరున దీపాలు, కొవ్వత్తులు, కోళ్ళు, ఆస్తులు మొదలగునవి ఇస్తానని మొక్కుకుంటారు. అయితే ఇది ఘోరమైన షిర్క్ అన్న విషయం మరచిపోతారు.
జిబహ్ చేయుట:
అల్లాహ్ తప్ప ఇతరుల కొరకు జిబహ్ చేయుట (జంతువును బలి ఇచ్చుట) షిర్క్. అల్లాహ్ ఆదేశం చదవండి:
فَصَلِّ لِرَبِّكَ وَانْحَرْ
నీ ప్రభువు కొరకే నమజు చేయు మరియు ఖుర్బానీ ఇవ్వు (కౌసర్ 108: 2).
అంటే అల్లాహ్ కొరకు మరియు అల్లాహ్ పేరుతో మాత్రమే జిబహ్ చేయి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఆదేశించారు:
لَعَنَ اللهُ مَنْ ذَبَحَ لِغَيْرِ الله
“అల్లాహ్ కు కాక ఇతరుల కోసం జిబహ్ చేయువానిపై అల్లాహ్ శపించాడు”. (ముస్లిం 1978).
జిబహ్ లో రెండు నిషేధాలు ఏకమవుతాయి. (1) అల్లాహ్ కు తప్ప ఇతరుల కోసం జిబహ్. (2) అల్లాహ్ పేరుతో కాకుండా ఇతరుల పేరుతో జిబహ్. ఈ రెండు కారణాల వల్ల ఆ జంతువు మాంసం తినడం యోగ్యం కాదు.
ఈ రోజుల్లో జిన్నుల పేరు మీద జిబహ్ చేసే షిర్క్ ప్రబలి ఉంది. అదేమనగా; ఇల్లు కొనుగోళు చేసినా, నిర్మించినా అందులో ఎక్కడైనా లేదా ప్రత్యేకించి దాని గడప మీద, అలాగే బావి త్రవ్వినా, అక్కడే ఓ జంతువు జిబహ్ చేస్తారు. అది షైతాన్ (భూతాల)కు భయపడి, వాని నష్టం నుండి దూరముండుటకు వాని పేరు మీద జిబహ్ చేస్తారు. (వాస్తవేమిటంటే అల్లాహ్ ను కాక ఇతరులతో భయపడరాదు. ఇలాంటి జిబహ్ చేయరాదు). (తైసీరుల్ అజీజుల్ హమీద్ 158. దారుల్ ఇఫ్తా ముద్రణ).
ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి (6:17 నిముషాలు)
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
తెలుగు ఇస్లామిక్ క్విజ్ (ఆడియో సిరీస్) మెయిన్ పేజీ :
https://teluguislam.net/others/telugu-islamic-quiz
ఇంకా క్రింది పోస్టులు చదవండి:
16 వ అధ్యాయం
అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్ – ఇమామ్ అస్-సాదీ
The famous commentary of Shaykh as-Sa’di of the book Kitab at-Tawhid of Muhammad ibn Abdul Wahhab.
إِذَا فُزِّعَ عَن قُلُوبِهِمْ قَالُوا مَاذَا قَالَ رَبُّكُمْ ۖ قَالُوا الْحَقَّ ۖ وَهُوَ الْعَلِيُّ الْكَبِيرُ
అల్లాహ్ ఆదేశం: (చివరకు దైవదూతల హృదయాల నుండి భయం తొలగిపోయినపుడు, వారు “మీ ప్రభువు ఏమని పలికాడు?” అని అడుగుతారు. వారు, “సత్యం పలికాడు”, ఆయన మహిమాన్వితుడు, మహోన్నతుడు అని అంటారు). (సబా 34:23).
అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా చెప్పారు:
“అల్లాహ్ ఆకాశంలో ఒక ఆదేశం జారి చేసినప్పుడు, ఆయన ఆజ్ఞకు (విధేయులై) దైవదూతలు తమ రెక్కలు కొడుతారు. దాని శబ్దం కొండరాతిపై గొలుసుతో కొట్టినట్లు ఉంటుంది. ఆయన ఆదేశం వారి వరకు చేరుతుంది. చివరకు వారి హృదయాల నుండి భయం తొలగిపోయినప్పుడు, వారు “మీ ప్రభువు ఏమని పలికాడు?” అని అడుగుతారు. వారు, “సత్యం పలికాడు”, ఆయన మహెూన్నతుడు, మహిమాన్వితుడు అని చెబుతారు. ఈ మాటను దొంగలించడానికి షైతాన్ వింటూ ఉంటాడు. షైతానులు ఒకరిపై ఒకరు ఇలా ఉంటారు అని (ఈ హదీసు ఉల్లేఖించేవారిలో ఒకరు) సుఫ్యాన్ బిన్ ఉమయ్య నా తమ అరచేతిని వంచి వ్రేళ్ళ మధ్య వ్యత్యాసముంచి వివరించారు. ఆ షైతాన్ ఒక్క మాట విని, అతని క్రింద ఉన్న షైతాన్ కు ఇస్తాడు. ఇలా ప్రతి ఒకడు తన క్రిందివానికి ఇస్తూ చివరివాడు మాంత్రికునికి, లేక జ్యోతిష్యునికి ఇస్తాడు. ఒకప్పుడు ఆ మాట క్రిందికి చేరక ముందే (అల్లాహ్ ఆకాశంలో నియమించిన) అగ్ని జ్వాల అతడ్ని పట్టుకొని (కాల్చేస్తుంది). ఒకప్పుడు ఆ అగ్నిజ్వాల పట్టుకోక ముందే ఆ మాటను అతడు పంపేస్తాడు. ఆ ఒక్క మాటలో మాంత్రికుడు, లేక జ్యోతిష్యుడు వంద అబద్దాలు కలిపి (ప్రజలకు చెబుతాడు). అతడు చెప్పింది నిజమయేదుంటే, ప్రజలు అతను (మాంత్రికుడు, జ్యోతిష్యుడు) అలా, అలా చెప్పలేదా అని అనుకుంటారు. కాని అందులో నిజమయేది ఆ ఆకాశం నుండి విన్న ఒక్క మాటే”. (బుఖారి).
నవాసుబ్ను సమ్ ఆన్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు:
“అల్లాహ్ ఒక విషయం వహీ (దివ్య సందేశం) పంపాలని కోరినప్పుడు వహీ ద్వారా మాట్లాడుతాడు. అప్పుడు అల్లాహ్ భయంతో ఆకాశాలు కంపించిపోతాయి. ఆకాశవాసులు ఇది విన్నప్పుడు సొమ్మసిల్లి, సజ్దాలో పడిపోతారు. మొట్ట మొదట వారిలో జిబ్రీల్ తలెత్తుతారు. అల్లాహ్ తాను కోరింది వహీ ద్వారా అతనితో మాట్లాడుతాడు. తరువాత జిబ్రీల్ దైవదూతల ముందు వెళ్తారు. ప్రతీ ఆకాశం నుండి వెళ్తున్నప్పుడు ఆ ఆకాశ దైవదూతలు మీ ప్రభువు ఏమన్నాడు? అని అడుగుతారు. “సత్యం పలికాడు. ఆయన మహెన్నతుడు, మహిమాన్వితుడు” అని అతడంటాడు. వారందరు జిబ్రీల్ అన్నట్లు అంటారు. తరువాత జిబ్రీల్ ఆ విషయాన్ని ఎక్కడ చేరవేయాలని అల్లాహ్ చెప్పాడో అక్కడికి చేరవేస్తారు”.
ముఖ్యాంశాలు:
1. ఖుర్ ఆన్ ఆయతు యొక్క భావం (అల్లాహ్ వహీ చేసినప్పుడు దైవ దూతల భయ కంపనాల వివరణ ఉంది).
2. ఇందులో షిర్క్ కు విరుద్ధంగా బలమైన ఋజువు ఉంది. ప్రత్యేకంగా పుణ్యపురుషుల పేరు మీద జరిగే షిర్క్. ఈ ఆయత్ ఆంతర్యాల నుండి షిర్క్ పునాదులను బద్దలు చేస్తుంది అని అనబడింది.
3. “సత్యం పలికాడు, ఆయన మహిమాన్వితుడు, మహోన్నతుడూ” అన్న ఆయతు భావం.
4. వారు ప్రశ్నించింది ఎందుకు అన్నది కూడా తెలుస్తుంది. (అల్లాహ్ భయంతో).
5. ఆ తరువాత జిబ్రీల్ “అల్లాహ్ ఇలా ఇలా చెప్పాడు” అని వారికి బదులిస్తారు.
6. “మొదటిసారిగా తల ఎత్తేవారు జిబ్రీల్ ” అన్న ప్రస్తావన వచ్చింది.
7. ఆకాశవాసులందరు అడిగినందుకు జిబ్రీల్ వారందరికి సమాధానమిస్తారు.
8. ఆకాశవాసులందరూ సొమ్మసిల్లిపోతారు.
9. ఆకాశాలు కంపించేది అల్లాహ్ యొక్క వచనములతో.
10. అల్లాహ్ ఆదేశమిచ్చిన చోటకి వహీ తీసుకెళ్ళేవారు జిబ్రీలె.
11. షైతానులు మాటలను దొంగతనం చేసే ప్రయత్నాలు చేసేవారు.
12. షైతానులు ఒకరిపై ఒకరు ఎక్కుతారు, ఆకాశంలోని మాట అందుకోవటానికి.
13. వారిని తరిమి కొట్టడానికి అగ్నిజ్వాల పంపబడుతుంది.
14. ఒక్కప్పుడు అగ్నిజ్వాల అతన్ని అందుకొని కాల్చేస్తుంది. ఒకప్పుడు అతడు తప్పించుకొని ఆ మాట మాంత్రికుని, లేక జ్యోతిష్యునికి అందిస్తాడు.
15. ఒక్కోసారి మాంత్రికుని, జ్యోతిష్యుని మాట నిజమవుతుంది.
16. మాంత్రికుడు, జ్యోతిష్యుడు ఆ ఒక్క మాటకు వంద అబద్దాలు కలుపుతాడు.
17. అతని అసత్య మాటల్ని ప్రజలు నిజమనుకునేది ఆ ఒక్క ఆకాశ మాట నిజమయినందుకే.
18. అసత్యాన్ని, మిథ్యాన్ని మనుస్సు ఎంత తొందరగా ఒప్పుకుంటుందో చూడండి. ఒక్క మాటను చూస్తారు, కాని వంద అబద్దాలున్నాయని గమనించరు.
19. షైతానులు పరస్పరం ఆమాటను అందుకొని జ్ఞాపకముంచుకుంటారు. ఇతర మాటల్ని నిజమని భావింపజేసే ప్రయత్నం చేస్తారు.
20. ఇందులో అల్లాహ్ గుణవిశేషణాలు రుజువవుతున్నాయి. “అష అరియ్య, ముఅత్తిల” వర్గంవారు వాటిని తిరస్కరిస్తారు. (వాస్తవానికి తిరస్కరించ కూడదు).
21. కంపించుట, సొమ్మసిల్లుట అనేది అల్లాహ్ భయం వలన జరుగుతుంది.
22. దైవదూతలు అల్లాహ్ కు సజ్దా చేస్తారు.
తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ)
ఇందులో కూడా తౌహీద్ విధితం, షిర్క్ తుచ్ఛం అని చెప్పడానికి గొప్ప నిదర్శనం ఉంది. పై మూల వాక్యాల్లో అల్లాహ్ గొప్పతనం, ఔన్నత్యం ప్రస్తావించబడినది. ఆ గొప్పతనం, ఔన్నత్యం ముందు సర్వ సృష్టి యొక్క పెద్దరికాలు మట్టిలో కలిసిపోతాయి. అతని మాట వింటేనే భూమ్యాకాశాల్లో ఉన్న సర్వ దైవదూతల గుండెలు అదిరిపోతాయి. వారందరు ఆయన ఎదుట తల మోకరిల్లి, ఆయన గొప్పతనం, ఔన్నత్యాలను స్తుతిస్తారు. ఆయనతో భయపడుతారు. ఇలాంటి గొప్ప గుణం గల ప్రభువే, ఆరాధనకు అర్హుడు కాగలడు. ఆయన తప్ప మరెవ్వరూ ఆరాధనకు, పొగడ్తలకు, ప్రశంసలకు, కృతజ్ఞతకు అర్హులు కారు.
నుండి: ఏకత్వపు బాటకు సత్యమైన మాట (అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్) – ఇమామ్ అస్-సాదీ [పుస్తకం]
అగోచరం అంటే .. :
భూత భవిష్యత్ కాలాలకు చెందిన ఏ విషయాలైతే జనుల దృష్టికి రావో – కంటికి కానరావో – వాటిని అగోచరాలని అంటారు.
అగోచర జ్ఞానాన్ని అల్లాహ్ తన కొరకు ప్రత్యేకించుకున్నాడు. ఆయన ఇలా సెలవిచ్చాడు :
“అల్లాహ్ తప్ప ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్న వారెవరికీ అగోచర జ్ఞానం లేదు.” (అన్ నమ్ల్ 27: 65)
అల్లాహ్ కొన్ని సందర్భాలలో దైవప్రవక్తలలో కొందరికి, కొన్ని పరమార్థాల దృష్ట్యా తన అగోచర జ్ఞానంలోని కొన్ని విషయాలను తెలియజేస్తాడు. ఆ విషయాన్నే ఇక్కడ ప్రస్తావించటం జరిగింది.
“ఆయన అగోచర జ్ఞానం కలవాడు. తన అగోచర విషయాలను ఆయన ఎవరికీ తెలుపడు – తాను ఇష్టపడిన ప్రవక్తకు తప్ప!” (అల్ జిన్న్ : 26, 27)
అంటే, అల్లాహ్ తనకు స్వంతమైన అగోచర జ్ఞానంలోని కొంత భాగాన్ని తన ప్రవక్తలలో తాను కోరిన వారికి, కొన్ని పరమార్థాల దృష్ట్వా తెలియపరచటం సంభవమే. ఎందుకంటే అతను (ఆ ప్రవక్త) ఆ అద్భుతాలను తన దైవదౌత్యానికి నిదర్శనంగా చూపుతాడు. ఇలాంటి అద్భుతాలలో, అగోచర విషయాలను (భవిష్యవాణి) తెలుపటం కూడా ఒకటి. ఈ అగోచర జ్ఞానంలో మానవ సందేశహరునికి, దైవదూతల సందేశవాహకునికి మాత్రమే ప్రమేయం ఉంటుంది. మూడో వ్యక్తికి ఇందులో ఎలాంటి దఖలు ఉండదు. ఎందుకంటే అల్లాహ్ అగోచర జ్ఞానాన్ని వారిరువురికే పరిమితం చేశాడు. కాబట్టి అల్లాహ్ దృష్టిలో మినహాయింపుకు నోచుకున్న ఆ సందేశహరులు తప్ప వేరెవరయినా తనకు అగోచర జ్ఞానం ఉందని అంటే అతను అసత్యవాది, అవిశ్వాసానికి ఒడిగట్టిన వాడవుతాడు. అతను హస్త సాముద్రికం ఆధారంగా చెప్పినా, తారాబలం చూసి చెప్పినా, క్షుద్రవిద్యలను ఆశ్రయించినా, జ్యోతిష్కం ద్వారా చెప్పినా, మరే వనరుల ఆధారంగా చెప్పినా అతను అబద్ధీకుడే. ఈ యుగంలో కూడా ఇలాంటి నయవంచకులు, మోసగాళ్లకు కొదువలేదు. వారు తమ వాక్చాతుర్యంతో, మాయమాటలతో అమాయక జనులను బుట్టలో వేసుకుని పోగొట్టుకున్న వస్తువుల ఆచూకీ తెలుపుతామని, రోగ కారణాలను తెలుపుతామని అంటుంటారు. ఫలానా వ్యక్తి నీకేదో చేసేశాడని, అందుకే నీవు ఈ విధంగా మంచాన పడ్డావని చెబుతుంటారు. ఈ విషయాలను వారు జిన్నాతుల నుండి, షైతానుల నుండి సేకరిస్తారు. అందుకోసం వారు ఆ పైశాచిక శక్తులను ప్రసన్నుల్ని చేస్తుంటారు. ఎవరయినా మీ వద్దకు క్షుద్రవిద్యను పొందిన మాటలంటే ఖచ్చితంగా వారు మాయలమారులని, మోసగాళ్లని గ్రహించాలి.
షేఖుల్ ఇస్లాం ఇబ్నె తైమియ (రహిమహుల్లాహ్) ఇలా అంటున్నారు : “భవిష్యవాణి (సోదె) చెప్పేవారి పరిస్థితి ఎటువంటిదంటే, వారి వద్ద షైతాన్ సహచరుడు ఉంటాడు. ఆకాశాలలో దొంగచాటుగా. విన్న విషయాలను వాడు వారికి తెలియజేస్తుంటాడు. వాటిలో వారు మరికొన్ని అబద్ధాలను (మిర్చిమసాలాను) జోడించి వివరిస్తారు.”
ఆయన ఇంకా ఇలా అంటున్నారు : “ఈ సోదె చెప్పటంలో కొందరు ఆరితేరిన వారుండేవారు. వారి దగ్గరకు షైతానులు తినే త్రాగే పదార్థాలను కూడా తెచ్చేవారు. ఆ ప్రదేశాలలో లభ్యంకాని పండ్లను, మిఠాయిలను కూడా తెచ్చేవారు. వాటిలో కొన్నింటిని జిన్ను మక్కా లేదా బైతుల్ మఖ్దిస్ లేదా వేరే ఇతర స్థలాలకు తరలించేవాడు.” (మజ్మూ అత్ తౌహీద్ – పేజీ : 797, 801)
అగోచరాలకు సంబంధించి వారు జ్యోతిష్యశాస్త్రం ద్వారా కొన్ని విషయాలు అందజేస్తుంటారు. నక్షత్రాలను, రాసులను చూసి వారు భూమండలంపై సంభవించబోయే దానిని సూచిస్తుంటారు. గాలులు ఎంతవేగంగా వీస్తాయి, వర్షం ఎప్పుడు ఎక్కడ కురుస్తుంది తదితర విషయాలను అంచనా వేస్తారు. నక్షత్రాలు తమ తమ కక్ష్యల్లో చేసే పరిభ్రమణం, వాటి కలయిక, విడిపోవటాలను బట్టి జరిగే సంఘటనలను నిర్ధారిస్తారు. వారిలా అంటారు: ఇతను గనక ఫలానా నక్షత్రం సంచరించే సమయంలో వివాహమాడితే అతనికి ఈ ఈ సమస్యలు ఎదురవుతాయి. అతను గనక ఫలానా నక్షత్రం పొడసూపినపుడు ప్రయాణం చేస్తే ఫలానా ఫలానా గండాలను ఎదుర్కోవలసి ఉంటుంది. అతను ఫలానా నక్షత్రం సమయంలో పుట్టాడు కనుక ఫలానా భాగ్యం వరిస్తుంది లేదా ఫలానా దరిద్రం చుట్టుకుంటుంది. ప్రస్తుతం కొన్ని చవుకబారు పత్రికలు సయితం ఇలాంటి రాశి ఫలాలను ముద్రించి మనుషుల జీవితాలలో సంభవించబోయే వాటిని గురించి విచ్చలవిడి రాతలు రాస్తున్నాయి.
కొంతమంది అజ్ఞానులు, బలహీన విశ్వాసులు జ్యోతిష్కుల వద్దకు వెళుతుంటారు. వారు తమ జీవితాలలో యెదురు కానున్న సంఘటనలను గురించి, ముఖ్యంగా వివాహాది శుభకార్యాల గురించి దర్యాప్తు చేస్తుంటారు.
ఎవడయితే తనకు అగోచర జ్ఞానముందని అంటాడో, మరెవరయితే అలాంటి వారిని సత్యవంతులని ధృవీకరిస్తాడో అతను ముష్రిక్కు, కాఫిర్ అవుతాడు. ఎందుకంటే వాడు అల్లాహ్ యొక్క ప్రత్యేక గుణాలలో తనకు భాగస్వామ్యం ఉందని దావా చేస్తున్నాడు. నిజానికి నక్షత్రాలు అల్లాహ్ కు సంపూర్ణ విధేయతను ప్రకటించే సృష్టితాలు. వాటి అధీనంలో ఏ శక్తీ లేదు. ఒకరి భాగ్యాన్నిగానీ, దరిద్రాన్ని గానీ శాసించే అధికారం వాటికి లేదు. జీవన్మరణాలతో కూడా వాటికి ఎలాంటి సంబంధం లేదు. ఇవన్నీ పైశాచిక చేష్టలు. ఆకాశాలలో దొంగచాటుగా విన్న విషయాలను అవి చేరవేస్తుంటాయి.
ఇది అఖీదా-తౌహీద్ (దేవుని ఏకత్వం) – డా. సాలెహ్ అల్ ఫౌజాన్ [పుస్తకం] నుండి తీసుకోబడింది (పేజీలు 120 – 121)
షేఖ్ ముహమ్మద్ ఇబ్న్ అల్-ఉతైమీన్- రహిమహుల్లాహ్ – చెప్పారు :
‘ప్రజలు షరియా నుండి రెగ్యులర్ దుఆ మరియు జిక్ర్ లను నిర్లక్ష్యం చేయడం ప్రారంభించినప్పుడు, అప్పుడు జిన్నాతులు వారిలో చాలాపెరిగాయి, మరియు అవి వారిని ఎగతాళి చేసి వారితో ఆడుకున్నాయి’
[లికా అల్-బాబ్ అల్-మఫ్ తూహ్ 197]
తెలుగు అనువాదం: teluguislam.net
నుండి: https://followingthesunnah.com/2019/10/18/the-increase-of-jinn/
283. హజ్రత్ అబూ సాలిహ్ సమ్మాన్ (రహ్మతుల్లాహి అలై) కధనం :-
హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రధి అల్లాహు అన్హు) ఓసారి శుక్రవారం నాడు జనావాసానికి దూరంగా వెళ్లి ఒక వస్తువుని ఆసరాగా చేసుకొని ఒంటరిగా నమాజు చేస్తుంటే నేను చూశాను. అంతలో అబూ ముయీత్ సంతానంలో ఒక యువకుడు ఆయన ముందు నుంచి వెళ్ళడానికి ప్రయత్నించాడు. అయితే హజ్రత్ అబూ సయీద్ (రధి అల్లాహు అన్హు) అతని ఛాతి మీద చేత్తో ఓ దెబ్బ చరిచారు. ఆ యువకుడు (అటూ ఇటూ) చూశాడు. కాని హజ్రత్ అబూ సయీద్ (రధి అల్లాహు అన్హు) ముందు నుంచి వెళ్లడం తప్ప మరో మార్గం కన్పించకపోవడంతో అతను మరోసారి ఆయన ముందు నుండి వెళ్ళడానికి ప్రయత్నించాడు. అప్పుడు హజ్రత్ అబూ సయీద్ (రధి అల్లాహు అన్హు) అతని ఛాతి మీద అంతకు ముందుకంటే గట్టిగా చరిచి వెనక్కి నెట్టారు. దాంతో ఆ యువకుడు హజ్రత్ అబూ సయీద్ (రధి అల్లాహు అన్హు) మీద మండి పడి ఏవేవో కూశాడు.
ఆ తరువాత అతను (మదీనా గవర్నర్) మర్వాన్ దగ్గరికెళ్ళి దీన్ని గురించి ఫిర్యాదు చేశాడు. హజ్రత్ అబూ సయీద్ (రధి అల్లాహు అన్హు) కూడా అతని వెనకాలే బయలుదేరి మర్వాన్ దగ్గరికు చేరుకున్నారు. మర్వాన్ ఆయన్ని చూడగానే “మీకు, మీ సోదరుని కొడుకు మధ్య ఈ గొడవేమిటి?” అని అడిగారు. దానికి హజ్రత్ అబూ సయీద్ (రధి అల్లాహు అన్హు) ఇలా సమాధానమిచ్చారు :-
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈవిధంగా ప్రవచించారు : “ఒక వ్యక్తి ఏదైనా వస్తువుని ఆసరాగా చేసుకొని నమాజు చేస్తున్నప్పుడు ఇతరులెవరైనా అతని ముందు నుంచి వెళ్ళడానికి ప్రయత్నిస్తే అతడ్ని నమాజు చేసే వ్యక్తి (చేత్తో) కొట్టి నెట్టివేయాలి. అయినా అతను తన వైఖరి మార్చుకోకపోతే అతను షైతాన్ అని గ్రహించి అతనితో పోరాడాలి.”
[సహీహ్ బుఖారీ : 8 వ ప్రకరణం – సలాత్, 100 వ అధ్యాయం – యరద్దుల్ ముసల్లీ మ మ్మర్ర బైనయదైహి]
నమాజు ప్రకరణం – 48 వ అధ్యాయం – నమాజు చేస్తున్న వారి ముందు నుండి వెళ్ళకూడదు
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్
You must be logged in to post a comment.